AP: విషం తాగిన మహిళను రక్షించిన వలంటీర్‌ 

Volunteer Who Saved Poisoned Woman In Sri Sathya Sai District - Sakshi

పెనుకొండ(శ్రీసత్యసాయి జిల్లా): విషం తాగిన మహిళను వార్డు వలంటీర్‌ దిశ పోలీసుల సాయంతో రక్షించిన ఉదంతం శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుకొండకు చెందిన ఓ మహిళకు ఏడేళ్ల క్రితం నరేష్‌తో వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.  మంగళవారం కూడా  ఘర్షణ జరిగింది.

దీంతో  భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. అదే సమయంలో ఆ ఇంటికి వెళ్లిన వార్డు వలంటీర్‌ అశ్విని వెంటనే అప్రమత్తమై దిశ ఎస్‌వోఎస్‌కు కాల్‌ చేసింది. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న దిశ టీం బాధితురాలిని వలంటీర్‌ సాయంతో  ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వివాహితకు  ప్రాణా­పా­యం లేదని వైద్యులు చెప్పారు.
చదవండి: శభాష్‌ వలంటీర్‌.. వెన్నుచూపలేదు.. వెనక్కి తగ్గలేదు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top