-
వాలంటీర్ గా పని చేయడం గర్వంగా ఉంది
-
ఓటుకు 5-10 వేలు.. టీడీపీ ఎరను తిప్పికొట్టిన వాలంటీర్..
-
వాలంటీర్ల సేవలపై టాలీవుడ్లో సినిమా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పని చేస్తుందో అందరికి తెలిసిందే. ఎక్కడ అవినీతి జరగకుండా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నేరుగా లబ్దిదారులకు అందిచడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వృద్దులకు, వికలాంగులకు నెల నెల వారి గడపవవద్దకే వెళ్లి ఫించన్లు అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే.. స్థానిక రాజకీయనేతలు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరిగాల్సి అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు అర్హత ఉంటే చాలు.. వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి ఆయా పథకాలను అందిస్తున్నారు. ఈ వ్యవస్థపై అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ‘వాలంటీర్’ వ్యవస్థ గురించి చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ వ్యవస్థపై టాలీవుడ్లో ‘వాలంటీర్’ అనే సినిమా కూడా రాబోతుంది. ఈ చిత్రంలో సూర్య కిరణ్ హీరోగా నటించగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ రెడ్డి నిర్మాత. ఈ రోజు(ఏప్రిల్ 12) తిరుపతిలో ఈ సినిమా టైటిల్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘వాలంటీర్ల సేవలపై వస్తున్న ‘వాలంటీర్’ మూవీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రభుత్వానికి తోడుగా ఉంటున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం వాలంటీర్ వ్యవస్థను సమర్థించారు. నిజాయితీగా సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. నిమ్మగడ్డ రమేశ్తో ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్ సేవలను నిలిపివేశారు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల ఇప్పటికే 33 మంది వృద్ధులు, వితంతువులు చనిపోయారు.పేద ప్రజలకు సీఎం జగన్ చేస్తున్న సేవలను చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు’ అని విమర్శించాడు. నిర్మాత, వైఎస్సార్సీపీ నేత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వాలంటీర్లు రియల్ హీరోలు. తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశం మొత్తం ఈ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తుంది. అలాంటి గొప్ప వ్యవస్థపై సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. త్వరలోనే వాలంటీర్ చేస్తున్న సేవలను వెండితెరపై చూస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన.. సినిమాను మాత్రం విడుదల చేసి తీరుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ శ్రీకృష్ణమా చార్యులు, సుమతీ రెడ్డి, సాహితీవేత్త శ్రీదేవి తదితరులు హాజరయ్యారు. -
వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషం.. గదిలో బంధించి!
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు. తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. జనసేన గుండాలపై పోలీసు ఫిర్యాదుకు భాధిత వాలంటీర్లు సిద్ధమవుతున్నారు. చదవండి: పవన్కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు! -
‘పచ్చ’కుట్రలు పటాపంచలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి తలుపుతట్టి ఐదేళ్లుగా పింఛను అందిస్తున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ‘పచ్చ’కుట్రలు పటాపంచలయ్యాయని వైఎస్సార్సీపీ డిప్యూటీ రిజినల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. వలంటీర్ల వ్యవస్థను అడ్డకున్నా సామాజిక పింఛన్లను సకాలంలో అందించి సచివాలయ వ్యవస్థ విజయం సాధించిందని ప్రశంసించారు. ‘వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు సామాజిక పింఛన్ల పంపిణీని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. వలంటీర్ల వ్యవస్థ, సచివాలయాల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా పింఛనుగా అందిస్తూ వస్తోంది. వారి జీవనానికి ఒక భరోసా కల్పించింది. ఈ విధానం అనేక దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలించింది. కొన్ని రాష్ట్రాల్లో అమలుచేయడానికి సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక బృందాలొచ్చి అధ్యయనం చేశాయి. ఇదెక్కడ జగన్మోహన్రెడ్డికి పేరొస్తుందోనన్న అసూయతో చంద్రబాబు కుతంత్రాలకు ఆదిలోనే తెరలేపారు. వలంటీర్ల వ్యవస్థపై బురదజల్లారు. కించపరిచేలా దుర్భాషలాడారు. ఇవేవీ పట్టించుకోకుండా వలంటీర్లు సేవాదృక్ఫథంతో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువచేయడానికి కష్టపడ్డారు. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ఇదే చంద్రబాబు హైదరాబాద్ ప్యాలెస్లో తాళాలేసుకొని కూర్చుంటే వలంటీర్లు ఇక్కడ ప్రభుత్వానికి, అటు ప్రజలకు వారధిగా నిలిచారు. వైద్యసేవలు సత్వరమే అందించడానికి తమ వంతు సహాయసహకారాలు అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రినని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు గత టీడీపీ ప్రభుత్వంలో సృష్టించిన జన్మభూమి కమిటీలు ప్రభుత్వ సేవలందించే ముసుగులో తమ ప్రాణాలు ఎలా తోడేశాయో ప్రజలకు బాగా తెలుసు. అందుకే 2019 సంవత్సరంలో టీడీపీని తరిమికొట్టారు. జన్మభూమి కమిటీలకు ఎంతో భిన్నంగా ఉన్న వలంటీర్లను చూసి చంద్రబాబు కక్ష కట్టారు. నిమ్మగడ్డ రమేష్తో కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారు. వృద్ధులకు, దివ్యాంగులకు పింఛను అందించకుండా వలంటీర్లను దూరం చేశారు. ఇలా ఒక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని కుట్రకు తెరలేపారు. ఇది దురదృష్టకరం. చంద్రబాబు చేష్టలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి కచ్చితంగా బుద్ధి చెబుతారు. జగన్ విజన్కు నిదర్శనం... వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్కు నిదర్శనం. ప్రతి సచివాలయంలో 11 మంది ఉద్యోగులను, గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు, పట్టణాల్లో ప్రతి వంద కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లను పెట్టారు. ప్రభుత్వ సేవలను, పథకాలను పైసా అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా అందించిన వ్యవస్థగా పేరొందింది. దీన్ని చెడగొట్టడానికి చంద్రబాబు కుట్రలకు తెరలేపారు. వృద్ధులు, దివ్యాంగులకు వలంటీర్ల ద్వారా పింఛను ఇంటివద్దనే అందుకోకుండా సైంధవుడిలా అడ్డుపడ్డారు. మండుటెండల్లో రోడ్లపైకి లాగి చంద్రబాబు తనలోనున్న సైకో మనస్తత్వత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఏదిఏమైనా సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం పూర్తి చేయడం హర్షణీయం. సచివాలయ ఉద్యోగులకు అభినందనలు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయాల్లో కల్పించిన దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలను ఇన్నాళ్లూ గుర్తించని చంద్రబాబే ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలన్నారంటేనే ప్రజాసేవ పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో చాటిచెబుతోంది. వలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్న చంద్రబాబే తమ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఖజానాలో డబ్బుల్లేవని, అందుకే పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతోందని దుష్ప్రచారం చేశారు. కానీ లబ్ధిదారులందరికీ సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు అందజేసి జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement