రోడ్డు ప్రమాదంలో వలంటీరు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వలంటీరు మృతి

Aug 10 2023 7:02 AM | Updated on Aug 10 2023 11:20 AM

- - Sakshi

శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో వలంటీరు మల్లెంబాకం శ్రీనివాసులురెడ్డి(29) మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో బుధవారం చోటుచేసుకుంది. రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి పట్టణం, ముత్తరాశిపాళెంకు చెందిన మల్లెంబాకం శ్రీనివాసులురెడ్డి 4వ వార్డు సచివాలయ పరిధిలో వలంటీరుగా పనిచేస్తున్నారు.

 బుధవారం సొంత పనుల నిమిత్తం తన స్నేహితుడు సురేష్‌ను వెంటబెట్టుకుని బసవయ్యపాళెంకు బయలుదేరాడు. తెట్టు కూడలి వద్ద వీరి ద్విచక్ర వాహనం అదుపుతప్పి గంగమ్మ హద్దురాయి మండపాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులురెడ్డి, సురేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే శ్రీనివాసులురెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement