చందాలేసుకుని విద్యా వలంటీర్‌ నియామకం! | Govt not appointing another teacher after transfer: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

చందాలేసుకుని విద్యా వలంటీర్‌ నియామకం!

Nov 3 2024 5:27 AM | Updated on Nov 3 2024 5:27 AM

Govt not appointing another teacher after transfer: Andhra Pradesh

ఉపాధ్యాయుడి బదిలీ అనంతరం మరొకరిని నియమించని ప్రభుత్వం

కూటమి పాలనలో మూడు నెలలుగా చదువుకు దూరమైన పిల్లలు

సొంత నిధులతో నియమించుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు

గూడెంకొత్తవీధి (అల్లూరి సీతారామరాజు జిల్లా)­: తమ పిల్లలకు చదువు చెప్పేందుకు.. విద్యార్థుల తల్లిదండ్రులు సొంతంగా డబ్బులు పోగుచేసి వలంటీరును నియమించుకున్న ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. గూడెంకొత్తవీధి మండలంలోని అమ్మవారి దారకొండ పంచాయతీ తడకపల్లి జీపీఎస్‌ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని కూటమి ప్రభుత్వం ఆగస్టులో బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎవరినీ నియ­మించలేదు.

అప్పటినుంచి విద్యార్థులు బోధనకు దూరమయ్యారు. విషయాన్ని తల్లి­దండ్రులు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసు­­కెళ్లినా వారినుంచి స్పందన లేకుండాపోయింది. దీంతో విసిగిపోయిన వారు చివరకు డబ్బు­లు పోగు చేసుకుని చదువుకున్న ఒక యు­వకుడిని వలంటీర్‌గా నియమించుకున్నా­రు. కనీసం ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవో­లు స్పందించి తమ పాఠశాలకు శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయుడిని నియమించా­లని గ్రామ­స్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement