వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తల దాడి.. 

TDP Workers Attack On Volunteer At Palnadu District Vinukonda - Sakshi

పథకాల గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం 

చేస్తున్నాడని కక్ష.. పల్నాడు జిల్లా వినుకొండలో ఘటన 

వినుకొండ (నూజెండ్ల): ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని కక్షగట్టిన టీడీపీ కార్యకర్తలు వలంటీర్‌పై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో అప్రమత్తంగా ఉండటంతో వలంటీర్‌ స్వల్ప గా­యా­లతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది.

పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండ 5వ వార్డులో వలంటీర్‌ షేక్‌ అష్రాఫ్‌ æరాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీన్ని సహించలేని టీడీపీ కార్యకర్తలు సీఎంను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదని వలంటీర్‌ అష్రాఫ్‌ టీడీపీ కార్యకర్తలకు సూచించాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు అతడితో సోషల్‌ మీడియాలోనే వాగ్వాదానికి దిగారు.  ఆదివారం రాత్రి వలంటీర్‌ అష్రాఫ్, అతడి మిత్రుడు ఇమ్రాన్‌ఖాన్‌ మసీదుకు వెళ్లి వస్తుండగా టీడీపీ కార్యకర్తలు.. ఇమ్రాన్, షఫీ, సిద్ధు, ఫారూఖ్, ఫరీద్, ఖాజాలు అష్రాఫ్‌æపై దాడికి దిగారు. షఫీ  కత్తితో దాడి చేయడంతో వలంటీర్‌కు  గాయాలయ్యాయి. అతడి మిత్రులు అష్రాఫ్‌ను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top