‘సమిష్టి కృషి, సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం’ | TTD Chairman Bhumana On Srivari Brahmotsavam | Sakshi
Sakshi News home page

‘సమిష్టి కృషి, సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం’

Oct 23 2023 4:47 PM | Updated on Oct 23 2023 4:48 PM

TTD Chairman Bhumana On Srivari Brahmotsavam - Sakshi

సాక్షి, తిరుపతి: సమిష్టి కృషి, సమన్వయంతో శ్రీవారి సాలకట్ల మరియు నవరాత్రి రెండు బ్రహ్మోత్సవాలు విజయవంతమైనట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం స్థానిక అన్నమయ్య భవనంలో భూమన కరుణాకరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు..శ్రీవారి కృపతోనే బ్రహ్మోత్సవాలు విజయవంతం చేశామని... భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 

వాహన సేవల్లో ఉత్సవాలు చేసిన భక్తులు మధురానుభూతి పొందారన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లోనే టీటీడీ ఉద్యోగుల కల నెరవేరిందని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగులకు ఇంటి స్టలాలను అందాజేశామన్నారువాహన సేవల ముందు కళ బృందాలు గొప్పగా తమ ప్రదర్శనలు చేశాయని,15 రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక కళా బృందాలు భక్తులను అలరించాయన్నారు. ఉత్సవాలు ఘన విజయం కావడానికి శ్రమించిన ప్రతిఒక్కరికి చైర్మన్ అభినందనలు తెలియజేశారు. హిందూ ధార్మిక వ్యాప్తి, హైందవ ప్రజాహితం కోసం టీటీడీ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement