ఓడలరేవు: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓడలరేవు సముద్ర తీరంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభించగా, మరొకరి ఆచూకీ ఇంకా దొరకలేదు.
అంబాజీపేట మాచవరం గ్రామానికి చెందిన వారిగా సమాచారం. ఆదివారం కావడంతో వారు సముద్ర స్నానానికి వచ్చారు. సముద్రంలో దిగిన కాసేపటికి అలల తాకిడికి వారు గల్లంతయ్యారు. దాంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.


