-
బీచ్కు పోదాం.. పదా.. పదా
జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే అలా.. అనుకుంటూ బీచ్లో అలలపై తేలియాడుతుంటే భలే ఉంటుంది కదూ! సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఆ అంబుధి చెంత నిలబడి.. భానుడి వర్ణాలను చూస్తుంటే కళ్లు తిప్పుకోలేం కదూ! కడలి అందాలకు, మనలోని భావోద్వేగానికి తరతరాల అనుబంధం అది. సముద్రానికి, భారతీయ సంప్రదాయాలకు కూడా అవినాభావ సంబంధం ఉంది. సముద్ర స్నానం వల్ల మానసిక ఆనందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న అపార వనరుల్లో సుదీర్ఘ సముద్ర తీరం ఒకటి. ఇక్కడి మన బీచ్లు ఎంతో ప్రఖ్యాతి పొందాయి. రుషికొండ బీచ్ ప్రపంచ గుర్తింపు సాధిస్తూ బ్లూఫ్లాగ్ను కూడా సొంతం చేసుకుంది. – శ్రీపాద బాలసుబ్రహ్మణ్యం, ఏపీ సెంట్రల్ డెస్క్ జోరుగా.. హుషారుగా.. అద్భుతమైన, 975 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతం. ఇక్కడ ఎన్నో అందమైన బీచ్లు ఉన్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు జనాలతో ఆ బీచ్లు పోటెత్తుతున్నాయి. సూర్యలంక, మైపాడు, పేరుపాలెం, మంగినపూడి తదితర బీచ్లకు ఆదివారాల్లో 50 వేల మందికి పైగా వచ్చి సెలవు రోజును ఎంజాయ్ చేస్తున్నారు. విశాఖ, కాకినాడ లాంటి నగరాల బీచ్లకు పర్యాటకుల సందడి చెప్పనక్కర్లేదు. రోజు రోజుకు పెరుగుతున్న బీచ్ పర్యాటకంతో స్థానిక ప్రజలు ఉపాధి పొందుతున్నారు. దీనికి తగ్గట్లే ప్రభుత్వం కూడా బీచ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తోంది. రిసార్ట్స్ నిర్మిస్తూ.. రోడ్లు వేస్తూ ఈ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. ఆరోగ్య రహస్యాలు ఎన్నో.. సముద్రం నీటిలో సూక్ష్మపోషకాలు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఆ నీరులో ఉండే మెగ్నిషియం, సోడియం, కాల్షియం, క్లోరైడ్, సల్ఫేట్ వంటి సూక్ష్మధాతువులు చర్మానికి సహజ సౌందర్యాన్ని ఇస్తాయి. సొరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మవ్యాధులతో బాధ పడేవారికి ఈ ఉప్పునీరు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. సముద్రనీటిలో ఉండే మెగ్నిషియంమన శరీరంలోని కార్టిసోల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే నాడీవ్యవస్థను కంట్రోల్ చేసి మనలోని మానసిక ఒత్తిడిని నియంత్రిస్తుంది. ♦ ఉప్పునీటి స్నానం శరీరంలోని యాంటీఆక్సిడెంట్స్ ప్రక్రియ సక్రమంగా ఉండేలా నియంత్రిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పును తగ్గించేందుకు సహకరిస్తుంది. సీ వాటర్లో మెగ్నిషియం ఎక్కువగా ఉండటం వల్ల మజిల్స్ రిలాక్స్ అయ్యి.. మంచి నిద్ర పడుతుంది. ♦ ట్రేస్ఎలిమెంట్స్, సూక్ష్మజీవులతో పాటు యాంటీబ్యాక్టీరియల్గా ఉండేవి సముద్రంలో చాలా ఉంటాయి. వీటిని చర్మం గ్రహించడం ద్వారా సహజ యాంటీబయాటిక్స్లా ఉపయోగపడతాయి. ♦ సముద్రంలోని ఉప్పునీరు సైనస్ ఇబ్బందులను తొలగిస్తుంది. సహజ సెలైన్ సొల్యూషన్గా పనిచేసి సైనస్లో పేరుకున్న మ్యూకస్ను క్లియర్ చేస్తుంది. ♦ రెగ్యులర్గా సముద్ర స్నానం చేస్తూ ఈత కొట్టడం వల్ల సహజంగా బరువు తగ్గుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. బ్లూఫ్లాగ్ కోసం.. పరిశుభ్రమైన బీచ్లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ గుర్తింపును ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) అనే అంతర్జాతీయ సంస్థ ఇస్తుంది. 77 దేశాల్లో ఈ సంస్థ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేలా బ్లూఫ్లాగ్ గుర్తింపు రావాలంటే.. ఆబీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా ఉండాలి. 33 అంశాల్లో బీచ్ను అభివృద్ధి చేస్తే దానికి బ్లూఫ్లాగ్ వస్తుంది. మొత్తం 50 దేశాల్లో 4,831 బీచ్లకు ఈ సర్టిఫికెట్ లభించింది. మన దేశంలో 12 బీచ్లకు ఆ సర్టిఫికేషన్ లభించగా.. మన రాష్ట్రంలో రుషికొండ (విశాఖ) బీచ్ ఈ ఘనత సాధించింది. మరిన్ని బీచ్లకు కూడా బ్లూఫ్లాగ్ సాధించాలని రాష్ట్ర పర్యాటక శాఖ కృతనిశ్చయంతో ఉంది. మైపాడు బీచ్కు తరచూ వెళ్తాం నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి బీచ్లకు వెళ్లడం, అక్కడ స్నానం చేయడం అంటే ఎంటో ఇష్టం. సెలవు రోజుల్లో నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్కు ఫ్యామిలీతో పాటు వెళ్తుంటాను. మా పిల్లలు బీచ్లో స్నానాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు. తగిన జాగ్రత్తలతో వారితో పాటు నేను కూడా ఇక్కడ స్నానం చేస్తాను. పని ఒత్తిడితో ఇక్కడికి వస్తే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. సముద్ర స్నానం చేస్తే మంచిదని మా పెద్దలు కూడా చెబుతుండేవారు. – కేఎన్వీ కుమార్, తిరుపతి మూడ్ మారుతుంది ♦ మానసిక ఆరోగ్యానికి బీచ్ల సందర్శనం ఎంతో ఉపయోగపడుతుందని స్విమ్ ఇంగ్లాండ్ సంస్థ అధ్యయనం చెబుతోంది. సముద్రంలో ఈత కొట్టడం వల్ల ఫీల్ గుడ్ మాలిక్యూల్స్ పిలిచే బీటా ఎండార్ఫిన్స్ శరీరంలో పెరుగుతాయని, రెగ్యులర్గా ఈతకొట్టే వాళ్లు అతి తక్కువ సార్లు మానసిక వైద్యుల్ని సంప్రదిస్తున్నారని ఆ సంస్థ నివేదికలు పేర్కొంటున్నాయి. హైడ్రోథెరపీగా కూడా బీచ్బాత్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ♦సముద్రంపై నుంచి వచ్చే గాలి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. బీచ్ వద్దకు వెళితే హ్యాపీ హార్మోన్గా పిలిచే సెరిటోనిన్ మన శరీరంలో పెరిగి, మనం రిలాక్స్ అవుతామని, సముద్ర హోరు, ఆ అనంత జలరాశి దృశ్యం మన మూడ్ను మారుస్తుందని ఆ అధ్యయనాలు పేర్కొన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦మద్యం సేవించి సముద్రంలో స్నానం చేయకూడదు ♦తీవ్రమైన గాయాలు ఉన్నపుడు బీచ్లో స్నానం చేయకుండా ఉంటేనే మంచిది. ♦ఈతలో నైపుణ్యం ఉంటే తప్ప తీరంనుంచి దూరంగా లోపలికి వెళ్లకూడదు. ♦సముద్రంలో పెద్ద రాళ్లు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అలల తాకిడికి తల రాళ్లకు కొట్టుకునే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో తలకిందులుగా డైవ్ చేయడం కూడా ప్రమాదం. ♦అలలు ఎక్కువగా ఉన్నపుడు జాగ్రత్త వహించాలి. బలమైన అలల మధ్య ఇరుకైన ప్రవాహాన్ని రిప్ కరెంట్ అంటారు. ఇవి మనిíÙని ఒక్కసారిగా లోతైన ప్రవాహంలోకి లాగేస్తాయి. ♦ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో సముద్రంలో ఉండటం ప్రమాదం. వెంటనే సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోవాలి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన బీచ్లు ♦రామకృష్ణ బీచ్, రుషికొండ, భీమిలి (విశాఖ) ♦మంగినపూడి (కృష్ణా జిల్లా) ♦పేరుపాలెం (పశ్చిమ గోదావరి) ♦ అంతర్వేది (అంబేడ్కర్ కోనసీమ జిల్లా) ♦ కాకినాడ (కాకినాడ జిల్లా) ♦ మైపాడు (నెల్లూరు జిల్లా) ♦ సూర్యలంక, రామాపురం (బాపట్ల జిల్లా) ♦ కళింగపట్నం, భావనపాడు (శ్రీకాకుళం జిల్లా) -
తీరంలో కరెంట్ తీగలుండవ్.!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు 972 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. తుపానులు వచ్చినప్పుడు ఈ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ఎక్కువగా నష్టపోయేది విద్యుత్ వ్యవస్థ. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లను యధాస్థితికి తెచ్చేందుకు వారాలు పడుతుంది. అంత వరకు ఆ ప్రాంతాల ప్రజలు చీకటిలోనే గడపాలి. ఆ సమయంలో పాములు వంటి విషకీటకాల బారిన పడి జనం ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ బాధల నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మాజనార్దన రెడ్డి తెలిపారు. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ద్వారా తీరం వెంబడి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. భూగర్భ లైన్లు సాధారణంగా దెబ్బతినవని, విద్యుత్ పునరుద్ధరణ కూడా వేగంగా జరుగుతుందని వివరించారు. జాతీయ రోజువారీ విద్యుత్ సరఫరా సగటులో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, 24 గంటల్లో 23.56 గంటలకు తగ్గకుండా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, అభివృద్ధిపై ఆయన అందించిన వివరాలు ఆయన మాటల్లోనే.. తీర ప్రాంతంలో ప్రత్యేక గ్రిడ్ తుపాన్లు, గాలుల వల్ల విద్యుత్ వ్యవస్థకు కలిగే నష్టాన్ని తగ్గించడానికి తీర ప్రాంతంలో గ్రిడ్కు రూపకల్పన చేస్తున్నాం. అంటే దగ్గర్లో ఉన్న 132 కేవీ సబ్స్టేషన్లను డబుల్ సర్క్యూట్ ద్వారా అనుసంధానం చేస్తాం. దీనినే రింగ్ మెయిన్ అంటారు. దీనివల్ల ఒక సబ్ స్టేషన్ దెబ్బతింటే మరో సబ్ స్టేషన్ నుంచి సంబంధిత ప్రాంతాలకు వెంటనే విద్యుత్ అందించొచ్చు. రైతులకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాలు వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లతో పాటు రక్షణ పరికరాలు కూడా ఉచితంగా అందజేస్తాం. డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నాం. ఖర్చుంతా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదు. ఈ మీటర్లకు విదేశాల్లో స్థిరపడ్డవారు కొందరు మినహా మిగతా రైతులంతా రాతపూర్వకంగా అంగీకారం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తున్నాం. గతంలో వ్యవసాయానికి రాత్రి వేళ విద్యుత్ సరఫరా వల్ల పొలాల్లో రైతులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడేవారు. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తోంది. పైగా, స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాల ఏర్పాటు వల్ల రైతులకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు కొత్త వ్యవసాయ సర్వీసులను దరఖాస్తు చేసిన నెల లోపే ఇస్తున్నాం. ఇప్పటివరకు 80 వేల కొత్త సర్వీసులు ఇచ్చాం. ప్రజల చేతిలో బిల్లు నియంత్రణ విద్యుత్ బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ పొరపాట్లు లేవు. విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించిన టారిఫ్ ప్రకారమే చార్జీలు ఉన్నాయి. ప్రజలు విద్యుత్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 263 మిలియన్ యూనిట్లు సరఫరా చేశాం. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ బిల్లు తగ్గించొచ్చు. కెపాసిటర్లు, బ్రేకర్లు నాణ్యమైనవి అమర్చుకోవాలి. ఇంటి లోపల, బయట వాడే బ్రేకర్లు వేర్వేరుగా ఉంటాయి. మాగ్నెటిక్ బ్రేకర్లు వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. ప్రీపెయిడ్ మీటర్లతో ఎవరికి వారు బిల్లును నియంత్రించుకోవచ్చు. అవసరాన్నిబట్టి రీచార్జ్ చేసుకోవచ్చు. వారం వారం విద్యుత్ వినియోగం తెలుసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ, హెచ్టీ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు అందిస్తాం. సరికొత్త సబ్స్టేషన్లు విద్యుత్ సబ్ స్టేషన్లకు స్థలాలు దొరకడంలేదు. దీంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కంటైనర్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రెండింటిని అందుబాటులోకి తెచ్చాం. మరో రెండు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని పెడుతున్న పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో, కనకదుర్గ గుడి దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పవర్ ట్రాన్స్ఫార్మర్లు (పీటీఆర్)లు ఒక్కటి కూడా పాడవకుండా, ఒక్క రోజు కూడా లోడ్ రిలీఫ్ ఇవ్వకుండా ఈ వేసవిని సమర్ధంగా ఎదుర్కొన్నాం. 30 ఏళ్లు పైబడిన లైన్లు, కండక్టర్లు, బ్రేకర్లను మారుస్తున్నాం. దీనివల్ల సాంకేతిక నష్టాలు తగ్గుతాయి. -
సాగర తీరంలో కయాకింగ్ క్వీన్
ఆ యువతి పడవ నడపగలదు.. ఒడుపుగా లంగరు సైతం వేయగలదు. తండ్రినే గురువుగా భావించి.. సాగర సంగమ తీరాన్నే శిక్షణ కేంద్రంగా ఎంచుకుని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ క్రీడలో రాణిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆ యువతి ప్రపంచ ఒలింపిక్స్లో రాణించి భారత్ తరఫున పతకం అందుకోవాలని తహతహలాడుతోంది. నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక సాగర సంగమ తీరానికి చెందిన నాగిడి గాయత్రి గ్రామీణులకు పెద్దగా పరిచయం లేని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ జలక్రీడలో రాణిస్తోంది. ఏడేళ్ల వయసులోనే తండ్రి వెంట నది బాటపట్టిన గాయత్రి చేపల వేట నేర్చుకుంది. జల క్రీడల్లో రాణించాలనే ఆ చిన్నారి తపనను గమనించి తండ్రి నాగబాబు కృష్ణా నదిలో ఈత నేర్పించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివిన గాయత్రి కరాటేలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. విజయనగరం జిల్లా గరివిడి వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చేసింది. నాటు పడవతోనే నదిలో సాధన చేసి గత ఏడాది గుజరాత్లో జరిగిన 36వ జాతీయస్థాయి కయాకింగ్ అండ్ కెనోయింగ్ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో రజత పతకం 18 సంవత్సరాల నాగిడి గాయత్రి కరాటే, రోయింగ్, కయాకింగ్ అండ్ కనోయింగ్ పోటీల్లో పలు పతకాలు సాధించింది. 2017లో ఢిల్లీలో జరిగిన 33వ నేషనల్ తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం పొందింది. 2021లో రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీల్లో బంగారు పతకం కైవశం చేసుకుంది. గత ఏడాది అక్టోబర్లో గుజరాత్లో జరిగిన జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో నాలుగో స్ధానంలో నిలవగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న భోపాల్లో జరిగిన 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో రజత పతకం కైవశం చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్లో గోవాలో జరిగే 37వ జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలకు గాయత్రి అర్హత సాధించింది. దాతల సహాయం, మెరుగైన శిక్షణ అందిస్తే ప్రపంచ ఒలింపిక్ పోటీల్లో పతకం సాధిస్తానని గాయత్రి ధీమా వ్యక్తం చేస్తోంది. చేపల వేటలో సాయపడుతూ.. తండ్రి నాగిడి నాగబాబుకు చేపల వేటలో గాయత్రి సహాయపడుతోంది. తండ్రితో పాటు రాత్రివేళలో బోటుపై సాగర సంగమ ప్రాంతానికి వెళ్లి వల, గాలం ద్వారా చేపల వేట సాగిస్తోంది. పురుషులకు దీటుగా పడవ నడుపుతూ.. లంగరు కూడా వేస్తోంది. చేపల వేటలో తలపండిన మత్స్యకారులు చేయలేని పనులను సైతం గాయత్రి సునాయాసంగా చేస్తుంది. గాలానికి రొయ్య గుచ్చడంలో గాయత్రి దిట్ట. ఒడుపుగా గుచ్చకపోతే రొయ్య ముళ్ళు చేతిలో దిగి తీవ్రంగా బాధిస్తుంది. నాగాయలంకలో 40 చేపల వేట బోట్లు ఉండగా.. వీటిపై ముగ్గురు మాత్రమే గాలానికి ఒడుపుగా రొయ్య గుచ్చేవారు ఉంటే.. అందులో గాయత్రి ఒకరు కావడం విశేషం. నాగిడి నాగబాబు పెద్ద కుమార్తె గౌతమి స్మిమ్మింగ్లో, కుమారుడు రాజేష్ తైక్వాండోలో, నాగబాబు సోదరి లక్ష్మీకుమారి కుమారులు కన్నా కుమార్, ఈశ్వర్ తైక్వాండో, కయాకింగ్లో, నాగబాబు సోదరుడు సాంబశివరావు కుమార్తె భార్గవి రోయింగ్లో, కుమారుడు శ్యాం కయాకింగ్లో రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకోవడం విశేషం. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తా మా కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. మా నాన్న ఎంతో కష్టపడి శిక్షణ ఇప్పిస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ అకాడమీ సెక్రటరీ శివారెడ్డి ప్రోత్సాహం మరువలేనిది. కోచ్లు శ్రీనివాస్, నాగబాబు, చిన్నబాబు శిక్షణ నన్ను ఈ స్థాయికి తెచ్చాయి. ప్రపంచ ఒలింపిక్స్ వాటర్ స్పోర్ట్స్ క్రీడల్లో పాల్గొని బంగారు పతకం సాధించాలని ఉంది. దాతల ప్రోత్సాహం, మరింత మెరుగైన శిక్షణ అందిస్తే ఇంకా రాణిస్తాను. – నాగిడి గాయత్రి, కయాకింగ్ క్రీడాకారిణి -
విశాఖ బీచ్లో విషాదాలు ఉండవిక.. రాకాసి అలలపై నజర్!
సాక్షి, విశాఖపట్నం: సాగర తీరంలో కవ్వించే అలలతో పోటీ పడుతూ.. సరదాల్లో మునిగి తేలే పర్యాటకుల్ని అమాంతం పొట్టన పెట్టుకుంటున్నాయి రాకాసి అలలు. రిప్ కరెంట్గా పిలిచే ఇలాంటి రాకాసి అలలు కడలి మాటున దాగి ఉంటూ వేటు వేస్తుంటాయి. చీలిక ప్రవాహాలుగా పేర్కొనే వీటినుంచి సందర్శకుల్ని రక్షించేందుకు విశాఖ పోలీసులు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. రిప్ కరెంట్పై ముందస్తు సమాచారం అందించే వెబ్సైట్ ద్వారా ఆయా బీచ్లలో హెచ్చరికలు జారీ చేసి, సందర్శకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. రిప్ కరెంట్ అంటే.. బలమైన అలల మధ్య ఇరుకైన ప్రవాహాన్ని రిప్ కరెంట్ అంటారు. ఇవి మనిషిని ఒక్కసారిగా లోతైన ప్రవాహంలోకి లాగేస్తాయి. సముద్ర గర్భంలోని సుదూర ప్రాంతంలో గాలి ద్వారా ఏర్పడిన అలలు.. నీటి అడుగున బలమైన ప్రవాహంగా తీరం వైపు దూసుకొస్తాయి. తీరానికి వచ్చేసరికి అవి రాకాసి అలలుగా మారిపోతాయి. అల ఒక్కసారిగా తీరాన్ని తాకినప్పుడు సముద్రం అడుగున అత్యంత బలమైన ప్రవాహం ఏర్పడుతుంది. ఈ కెరటాలు తిరిగి వెళ్లేటప్పుడు తీరానికి వచ్చే కొద్దీ వేగం అధికమై తరంగాలు ఏర్పడుతుంటాయి. రిప్ కరెంట్ వేగం సెకనుకు 2 నుంచి 8 అడుగుల వరకూ ఉంటుంది. ఇలాంటి అల చీలికతో ఒడ్డుకు సమాంతరంగా 10 నుంచి 290 అడుగుల వెడల్పుతో ఏర్పడుతుంది. ఈ ప్రవాహంలో ఎవరు ఉన్నా.. రెప్పపాటులో సముద్రంలోపలికి వెళ్లిపోతారు. కొన్ని సందర్భాల్లో గజ ఈతగాళ్లు కూడా దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. విశాఖ తీరంలో ఎన్నో విషాదాలు విశాఖ సాగర తీరంలో 2018లో 55 మంది, 2019లో 51 మంది, 2020లో 64 మంది, 2021లో 63 మంది మృత్యువాత పడగా.. గతేడాది 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తెన్నేటి పార్క్, సాగర నగర్, రుషికొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్దపెద్ద రాళ్లు ఉండటంతో వాటిపై నిలబడి సాగర అందాలను వీక్షిస్తుంటారు. కొంతమంది అక్కడే సరదాగా స్నానాలు చేసేందుకు దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తీరం నుంచి ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లడంతో అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు. విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండటంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్ కరెంట్ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్ కరెంట్ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్నవారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్గార్డ్స్ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడటం అసాధ్యం. సందర్శకుల భద్రతకు పెద్దపీట ఎంవోఎస్డీఏసీ డాట్ జీవోవీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో రిప్ కరెంట్ సమాచారం ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలతో లభిస్తుంది. ఇలా వచ్చే ముందస్తు సమాచారం ద్వారా రిప్ కరెంట్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకవేళ రిప్ కరెంట్ ప్రభావం లేనిపక్షంలో సముద్రంలోకి వెళ్లేందుకు అనుమతిస్తాం. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విశాఖ నగరానికి వచ్చే ప్రతి పర్యాటకుడి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. – సీహెచ్ శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ -
సముద్రం సాక్షిగా... మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్
మౌనంగా కనిపించే సముద్రం ఒక మహా విద్యాలయం. అక్కడ ప్రతి కెరటం ఒక పాఠం నేర్పుతుంది. ఒక ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న క్రమంలో దేవ్లీనా భట్టాచార్జీ మత్స్యకారుల జీవితాలను దగ్గరి నుంచి చూసింది. సముద్రం సాక్షిగా మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్ గురించి ఆలోచించింది. ‘న్యూమర్8’ రూపంలో ఆమె కల సాకారం అయింది... యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇఎస్ఎ)లో ఒక ప్రాజెక్ట్లో భాగంగా పనిచేస్తున్నప్పుడు దేవ్లీనా భట్టాచార్జీకి మత్య్సకారుల జీవన విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. మత్స్యకారుల సంక్షేమం కోసం డాటాసైన్స్ను ఎలా ఉపయోగించవచ్చు... అనే కోణంలో మేధోమథనం చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అది ‘న్యూమర్8’ పేరుతో స్టార్టప్కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది. వాతావరణ సూచనల నుంచి మార్కెట్ సూచనల వరకు ఎన్నోరకాలుగా మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్ ఇది. బెంగళూర్ యూనివర్శిటీలో ఎంసీఏ చేసినా లీనాకు రకరకాల సమస్యలకు సంబంధించి సృజనాత్మక పరిష్కారాల గురించి ఆలోచించడం అంటే ఇష్టం. ఎవరి సహాయం లేకుండానే తన పొదుపు మొత్తాలతో ‘న్యూమర్ 8’ను మొదలుపెట్టింది. డాటా సైంటిస్ట్లు, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జిఐఎస్) నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రతిభావంతురాలైన నందిని కార్తికేయన్ను సీటీవోగా నియమించింది. సీయీవోగా లీనా స్టార్టప్కు సంబంధించిన రోజువారి వ్యాపారవ్యవహారాలను పర్యవేక్షిస్తే, సీటీవోగా నందిని సాంకేతిక విషయాల బాధ్యతలను చూస్తుంది. ‘న్యూమర్ 8’లోని ‘వోఫిష్’ యాప్లో అడ్వైజరీ, మార్కెట్ లింకేజి, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ విషయాలలో మత్స్యకారులకు ఉపయోగపడే ఫీచర్లు ఉన్నాయి. ‘వోఫిష్’ శాటిలైట్ ఇమేజ్ డాటా ఎనాలసిస్ అనేది మత్య్సకారులకు చేపల వేటలో ఉపయోగపడుతుంది. వేటకు ఎక్కువ సమయం తీసుకోకపోవడమే కాదు, ఇంధనాన్ని పొదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. ‘వోఫిష్’లోని మార్కెట్ లింకేజ్ ఫీచర్తో మత్స్యకారులకు అవసరమైన వలలు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల ఏర్పాటుకు వీలవుతుంది. దీంతోపాటు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మత్స్యకారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముకోవచ్చు. ‘న్యూమర్8’ తాజాగా సముద్రపు నాచుపై దృష్టి పెట్టింది. ఔషధ, ఆహార, రసాయనిక పరిశ్రమలలో ప్రపంచవ్యాప్తంగా సముద్రపు నాచుకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్రలోని ‘మహిళా ఆర్థిక్ వికాస్ మహామండల్’ అనే స్వచ్ఛందసంస్థ భాగస్వామ్యంతో మత్య్సకారుల కుటుంబాలకు చెందిన మహిళలకు సముద్రపు నాచు ఉత్పత్తుల ద్వారా ఉపాధి కల్పించే ప్రణాళికను న్యూమర్ 8 సిద్ధం చేసింది. చదవండి: Expiry Date: ఎక్స్పైరీ డేట్ ఎందుకు? ఆ తర్వాత వాడితే ఏమవుతుందో తెలుసా!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement