తిరుమల: సర్వదర్శనానికి 18 గంటల సమయం | Tirumala Tirupati Devasthanams Crowd For Darshan Updates Today - Sakshi
Sakshi News home page

తిరుమల: సర్వదర్శనానికి 18 గంటల సమయం

Aug 29 2023 7:44 AM | Updated on Aug 29 2023 3:04 PM

Tirumala Tirupati Devasthanam Crowd Darshan Updates Today - Sakshi

శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు నేటితో ముగియనున్ననేపథ్యంలో.. 

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. దీంతో రేపటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తారు.

ఇక నిన్న(సోమవారం, ఆగష్టు 28) 68,263 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లుగా తేలింది.తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 28, 355గా తేలింది.

ద్వారకాతిరుమలలో పవిత్రోత్సవాలు
ఏలూరు:
నేటి నుంచి ద్వారకాతిరుమలలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. 30వ తేదీన పవిత్రాదివాసం, 31వ తేదీన పవిత్రావరోహణ నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement