తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం | Tirumala Laddu Counter Fire Accident Details Here | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం

Jan 13 2025 12:07 PM | Updated on Jan 13 2025 4:37 PM

Tirumala Laddu Counter Fire Accident Details Here

తిరుపతి, సాక్షి: తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. 

లడ్డూ కౌంటర్లలో 47వ నెంబర్‌ కౌంటర్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్‌లోని కంప్యూటర్‌ యూపీఎస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్‌ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే. అయితే.. 

ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు.

తిరుమల లడ్డూ కౌంటర్లో మంటలు

Advertisement
 
Advertisement
Advertisement