సాక్షి,అనంతపురం: తాడిపత్రి పెద్దవడగూరులో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ రోజు ( బుధవారం) మండల వైఎస్సార్సీపీ కార్యాలయానికి జేసీ వర్గీయులు తాళాలు వేశారు. ఈ వ్యవహారం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోగా తాళం తీసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్నారు. టీడీపీ గుండాలకు పోలీసులు సహకరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


