సాక్షి, విజయవాడ: విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శాంతియుతంగా జరుగుతున్న నిరసనను భంగపరిచేందుకు టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమం వద్దకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న అనుచరులు చేరుకుని నినాదాలు చేశారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనను భంగపరిచేందుకు, వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. మళ్లీ గొడవలు సృష్ఠించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షించారు.



