అక్టోబర్‌లో నంది నాటకోత్సవాలు | Nandi drama festivals in October | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో నంది నాటకోత్సవాలు

Jul 11 2023 3:53 AM | Updated on Jul 11 2023 5:02 AM

Nandi drama festivals in October - Sakshi

సాక్షి, అమరావతి: నంది నాటకోత్సవాలను అక్టోబర్‌ నెలలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్‌ అఫి­షియో సెక్రటరీ, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ తుమ్మా విజయ్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది నంది నాటకోత్సవాల్లో (రంగస్థల పురస్కారాలు) భాగంగా ఐదు విభాగాల్లో 73 అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

సోమవారం విజయవాడ ఆర్టీసీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నంది నాటకోత్సవాల నిర్వహణపై నాటక రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల లఘు నాటి­క, కళాశాల లేదా యూనివర్సిటీ లఘు నాటిక (ప్లేలెట్స్‌) అనే ఐదు విభాగాల్లో అవార్డులు అందజేయాలని నిర్ణయించామన్నారు.

ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇచ్చామని, అనంతరం వారం రోజులు దరఖాస్తుల ఉపసంహరణకు కేటాయించామని తెలిపారు. అందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతాన్ని నంది నాటకోత్సవాలకు వేదికగా ఎంపిక చేస్తామని తెలిపారు.  

ప్రదర్శితమైన నాటకాలకే అవకాశం 
రాష్ట్రవ్యాప్తంగా 2018 నుంచి 2022 వరకు వివిధ నాటక సమాజాల ద్వారా ప్రదర్శించి­న నాటకాలను ఈ ఏడాది నంది నాటకోత్సవాల్లో ఎంట్రీలకు అవకాశం కల్పిస్తున్న­ట్టు విజయ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంట్రీలను న్యాయ నిర్ణేతల ద్వారా పరిశీలించి తుది పోటీలకు 10 పద్య నాటకాలు, 6 సాంఘిక నాటకాలు, 12 సాంఘిక నాటి­కలు, 5 బాలల నాటికలు, 5 కళాశాల లేదా యూని­వ­ర్సిటీ యువత నాటికలను ఎంపిక చేస్తామన్నారు.

దరఖాస్తుల సంఖ్యను బట్టి వీటి సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తామ­ని తెలి­పా­రు. బాలలు, యువతకు సంబంధిం­చిన నాటకాలకు సంబంధించి ఈ ఏడా­ది కొత్తగా ప్రదర్శించిన వాటిని కూడా పరిగణలోకి తీ­సు­కుంటామన్నారు. ప్రదర్శన, ఎంపిక సమ­యంలో నాటకరంగ కళాకారులుండే ప్రాంతానికే వచ్చి తమ జ్యూరీ బృందం పరిశీలిస్తుందన్నారు.

సరికొత్త కథాంశాలతో మన సంస్కృతి సంప్రదాయాలను, మానవతా విలువలను, ఉన్నతమైన జీవనాన్ని ప్రతి­బింబించే అంశాలకు కళాకారులు ప్రా­ధా­న్యత ఇవ్వాలన్నారు. చివరిసారిగా 2017­లో నంది నాటకోత్సవాలు నిర్వహించామని, అనంతరం కరోనా విపత్కర పరిస్థితులతో నిర్వహిం­చలేకపోయామన్నారు. కళా­కా­రు­లకు ఆర్టీసి చార్జీల్లో రాయితీ ఇచ్చే విషయమై సంబంధిత విభాగంతో చర్చిస్తామన్నారు.

రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్‌ డెవ­లప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జీఎం ఎంవీఎల్‌ఎన్‌ శేషసాయి, కళారాధన సమితి కార్యదర్శి రవికృష్ణ నంద్యాల, సినీ రచయిత బుర్రా సా­యిమాధవ్‌ మాట్లాడారు. సమావేశం అనం­తరం ‘తెలు­గు పద్య­నా­టక రంగం– సాంకేతికత–సమకా­లీన అధ్యయనం’ అంశంపై ఆర్‌.నిరుపమ సు­నే­త్రి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement