
సాక్షి,తిరుపతి: మయూరీ గ్రూప్ అధినేత జయరాం చౌదరిపై తిరుపతి పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కోల్కతాలో రూ.8కోట్ల చీటింగ్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ .. జయరాం చౌదరికి చెందిన రూ.500 కోట్లను అటాచ్ చేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో మయూరీ జయరాంను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.8కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నామని,హైకోర్టు ఆదేశాల ప్రకారం 18శాతం చెల్లించామని జయరాం అన్నారు.