సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాప్తాడు మండలం గంగులకుంట వద్ద రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రేమ జంట మృతికి పెళ్లికి అంగీకరించకపోవడం కారణమా లేదా మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఆప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి.


