
జిల్లా విద్యార్థినికి ఎడెన్బర్గ్ వర్సిటీలో సీటు
కడప సెవెన్రోడ్స్ : నగరానికి చెందిన విద్యార్థిని యూకూలో సీటు సాధించి భళా అనిపించింది. కడప నగరానికి చెందిన పూర్ణిమ నిమ్మకాయల యునైటెడ్ కింగ్ డమ్లోని ప్రపంచ ప్రఖ్యాత ఎడెన్బర్గ్ యూనివర్సిటీలో సీటు సాధించి అందరినీ అబ్బుర పరిచారు. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె గ్రామానికి చెందిన రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రవిశంకర్ రెడ్డి, కె.అనితల కుమార్తె పూర్ణిమ ఒకటో తరగతి నుంచి 3వ తరగతి వరకు కడప వికాస్ హైసూ్కల్, 4 నుంచి 10వ తరగతి వరకు కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇంటర్మీడియేట్ హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాదు పబ్లిక్ స్కూల్లోనూ చదివారు.
ఆ తర్వాత పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో బీఎస్సీ(ఆనర్స్) చేశారు. అనంతరం యునైటెడ్ కింగ్డమ్లోని ఎడెన్బర్గ్ యూనివర్శిటీలో ఎంఎస్ మేథమ్యాటికల్ ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్కు దరఖాస్తు చేశారు. ఎడెన్బర్గ్ యూనివర్శిటీ యాజమాన్యం ఈ మేరకు ఆమెకు ఐడీ నెంబరు 2858866కు జారీ చేసి జులై 28న అడ్మిషన్ పొందాలని సమాచారం పంపింది.
క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025లో ఎడెన్బర్గ్ వర్శిటీ 27వ స్థానంలో ఉంది.చార్లెస్ డార్విన్, అలెగ్జాండర్ గ్రహంబెల్, ప్రఫుల్ల చంద్రరే, ప్రకాశ్ కారత్, ఓలివర్ గోల్డ్స్మిత్, డేవిడ్ హ్యూమ్, వాల్టర్ స్కాట్ తదితర వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు ఈ యూనివర్శిటీలో చదివారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఐఈఎల్టీఎస్లో 8 పాయింట్లు సాధించి ప్రతిష్ఠాత్మక ఎడెన్బర్గ్ వర్శిటీలో పూర్ణిమ సీటు సాధించారు.
అంతేగాక యూకేలోని బ్రిష్టల్ యూనివర్శిటీలోనూ ఎంఎస్లో ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ మేథమ్యాటిక్స్లోనూ, లండన్లోని కింగ్స్ కాలేజీలో ఫైనాన్షియల్ మేథమ్యాటిక్స్ అండ్ మేథమ్యాటిక్స్ ప్రవేశానికి కూడా పూరి్ణమ అర్హత సాధించారు. ఈ ఘనత సాధించిన ఆమెను పలువురు అభినందించారు.