తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం | Huge Devotees Rush At Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

May 26 2024 8:07 AM | Updated on May 26 2024 8:08 AM

Huge Devotees Rush At Tirumala

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో  వేచి ఉన్న భక్తులు. నిన్న 83,866 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 44,479 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 

శ్రీవారి హుండీ ఆదాయం రూ4.15 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది
 

Advertisement
 
Advertisement
Advertisement