అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం

Published Wed, Oct 18 2023 2:34 AM

Dussehra celebrations in Vijayawada - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ):  విజయవాడ ఇంద్రకీలాద్రి­పై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదుర్గా మల్లేశ్వర స్వా­మి వార్ల దేవస్థానంలో మంగళవారం అమ్మ­వారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భక్తు­లు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకున్నారు.

ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన విశేష ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామ­చంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా దుర్గమ్మకు అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానం నుంచి పట్టువ్రస్తాల­ను సమర్పించారు.

అన్నవరం దేవస్థాన ఈవో, దుర్గగుడి దసరా ఉత్సవాల ఫెస్టివల్‌ ఆఫీసర్‌ ఎస్‌ఎస్‌.చంద్రశేఖర్‌ ఆజాద్‌ అమ్మవారికి సమర్పిం­ంచేందుకు పట్టువ్రస్తాలను తీసుకురాగా, దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో కేఎస్‌ రామారావు సాదరంగా స్వాగతం పలి­కా­రు. ఉత్సవాల ఏర్పాట్లను సీపీ టీకే రాణా పర్యవేక్షించగా, ఆలయ ప్రాంగణంలో డీసీపీ విశాల్‌గున్ని క్యూలైన్లను పర్యవేక్షించారు. సాయంత్రం ఆది దంపతుల నగరోత్సవం కన్నుల పండువగా సాగింది. నగరోత్సవంలో ఆలయ చైర్మన్‌ రాంబాబు, ఈవో కెఎస్‌ రామారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement