Chandrayaan-3: ISRO team at Tirupati Temple with miniature model of launch vehicle to offer prayers - Sakshi
Sakshi News home page

చంద్రయాన్-3: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇస్రో శాస్త్రవేత్తలు

Published Thu, Jul 13 2023 12:12 PM

Chandrayaan 3: Isro Team At Tirupati Temple With Model Of Launch Vehicle - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

చంద్రయాన్-3 యొక్క సూక్ష్మ నమూనాలను శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్‌–3 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్‌ లాంచ్‌ వెహికల్‌ ఎంకే–3(ఎల్‌వీఎం–3) రాకెట్‌ శ్రీహరి కోటలోని సతీశ్‌ ధావన్‌  అంతరిక్ష కేంద్రం(షార్‌) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.
చదవండి: బాహుబలి రాకెట్‌ చంద్రయాన్‌ 3

ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా  సంస్థ(ఇస్రో) సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రయోగం ఎట్టిపరిస్థితుల్లోనూ గురి తప్పకూడదన్న లక్ష్యంతో శ్రమిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎల్‌వీఎం–3 రాకెట్‌పైనే కేంద్రీకృతమై ఉంది. చంద్రయాన్‌–3 మిషన్‌లో భాగంగా ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను చందమామ వద్దకు మోసుకెళ్లే ఈ రాకెట్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 

Advertisement
Advertisement