విమాన ప్రమాదం పట్ల వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి | Air India Plane Crash: YS Jagan Express Deep Shock Extend Condolences | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదం పట్ల వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Jun 12 2025 4:33 PM | Updated on Jun 12 2025 5:53 PM

Air India Plane Crash: YS Jagan Express Deep Shock Extend Condolences

సాక్షి, తాడేపల్లి: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ  సానుభూతి తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

గురువారం మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిరిండియా విమానం(Air India AI-171 flight).. టేకాఫ్‌ అయిన కాసేపటికే సమీపంలోని కుప్పకూలి పేలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ప్రయాణికులు, పైలట్లు, సిబ్బంది మొత్తం 242 మంది ఉన్నారు. వీటికి తోడు విమానం జనావాసాలపై కూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement