
సాక్షి, తాడేపల్లి: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
గురువారం మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు వెళ్తున్న ఎయిరిండియా విమానం(Air India AI-171 flight).. టేకాఫ్ అయిన కాసేపటికే సమీపంలోని కుప్పకూలి పేలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ప్రయాణికులు, పైలట్లు, సిబ్బంది మొత్తం 242 మంది ఉన్నారు. వీటికి తోడు విమానం జనావాసాలపై కూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.
I am deeply shocked to know about the tragic crash of Air India AI-171 flight with 242 passengers near Ahmedabad airport. I extend my heartfelt condolences to the families of passengers, crew members and casualties at the crash site. I pray for strength and healing for everyone…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 12, 2025