ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందించిన తర్వాతే కుప్పం వరకు నీళ్లు తరలించాలి. రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నఫలంగా పనులన్నీ ఆపేశారు. ఆంధ్ర సీఎంతో మాట్లాడి పనులు నిలిపినట్లు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు సాక్ష్యం.
– బోయ గిరిజమ్మ, జెడ్పీ చైర్పర్సన్


