ఇటీవల దొడ్డహళ్లి–పావడగ వరకు రైలు మార్గం తనిఖీ కూడా పూర్తి చేశారు. దాదాపు రెండు నెలల గడిచిపోతున్నా నేటి వరకు పావగడ వరకు రైలు నడపడం లేదు. ప్రస్తుతం కదిరిదేవరపల్లి వరకు తిరుపతి రైలును నడపుతున్నారు. రాయదుర్గం మీదుగా రైలుమార్గం పూర్తయిన దొడ్డహళ్లి, పావడగ వరకూ కొత్త రైలు నడిపితే రైలు మార్గం దెబ్బతినకుండా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర కర్ణాటక లేదా ఆంధ్రాలోని ముఖ్యమైన నగరాల నుంచి మరొక రైలు నడిపితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఆ దిశగా నేటికీ ప్రజాప్రతినిధులుగాని, రైల్వేశాఖ ఉన్నతాధికారులు గాని ఏమాత్రం ఆలోచించడం లేదు.


