పరవాడ: గ్రామ దేవతలకు ఆషాఢ మాసంలో సారె సమర్పించడం ద్వారా హిందూ సనాతన ధర్మం, సంప్రదాయాలను పరిరక్షించవచ్చని సమరసత సేవా ఫౌండేషన్ ఉత్తరాంధ్ర ధర్మ ప్రచారక్ ఆడారి గంగాధర్ అన్నారు. స్టీల్ప్లాంట్ సమీపంలోని కణితి కాలనీలో కొలువుదీరిన పరదేశిమాంబ అమ్మవారికి గ్రామ మహిళలు, పెద్దలు శుక్రవారం ఊరేగింపుగా వెళ్లి ఆషాఢ మాస సారె సమర్పించారు. జిల్లా మహిళా కన్వీనర్ పెదపాటి కృష్ణవేణి, మండల కన్వీనర్ బొద్దపు నూకరత్నం, పూర్ణ, పి. మంగ, చౌదరి రోజా, ధనలక్ష్మి, లక్ష్మి, ఇందిరా, గాయత్రి పరివార్ సభ్యుల పాల్గొన్నారు.


