గిరిజన ప్రాంతాల్లో పండించే పసుపుకు మంచి నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన చాయ ఉంటుంది. దీంతో మైదాన ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు వారపు సంతలకు వచ్చి పసుపును కొనుగోలు చేస్తున్నారు. పసుపు సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం గిరిజన రైతులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలి. దీనివల్ల గిరిజన రైతులు ఆర్థికంగా మరింత బలపడే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ కల్పించాలి.
– కిల్లో లక్కు, పసుపు రైతు,
పనస, ముంచంగిపుట్టు మండలం


