Telangana Draft Bill
-
క్లైమాక్స్కు చేరిన తెలంగాణ బిల్లు
-
సమస్య ప్రజల మధ్య కాదు: జేపీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఉత్పన్నమయ్యే సమస్యలకు కేంద్ర ప్రభుత్వమే పరిష్కారం చూపాలని లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. విభజన అనంతర సమస్యలకు ముందే పరిష్కారం చూపాల్సిన అవసరముందన్నారు. గతం కంటే భవిష్యత్ బాగుంటుందన్న భరోసా కలిగించాలన్నారు. విడిపోయాక అన్ని ప్రాంతాల ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే అందరికీ న్యాయం జరిగేలా పరిష్కారం సాధ్యమేనని చెప్పారు. తాము సూచించిన రోడ్మ్యాప్లో రెండు ప్రతిపాదనలే కేంద్రం పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో తాము ప్రతిపాదించిన సూచనలను యుద్ధప్రాతిపతికన ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలుగా గుర్తించాలని కోరామన్నారు. బిల్లుకు సంబంధించి అన్ని పార్టీలకు 5 అంశాలతో లేఖలు రాశామన్నారు. ప్రస్తుత సమస్య తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య కాదన్నారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని జేపీ విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. -
అడ్డుకోవాల్సిన బాధ్యత టి.మంత్రులదే: కేటీఆర్
హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం కిరణ్ ప్రవేశపెట్టిన విభజన బిల్లు తీర్మానానికి ఎలాంటి నైతికత లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సీఎం బ్లాక్మెయిల్కు స్పీకర్ నాదెండ్ల మనోహర్ లొంగిపోయారని ఆరోపించారు. బీఏసీలో చర్చించకుండా విభజన విభజన బిల్లు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారని తెలిపారు. స్పీకర్, ముఖ్యమంత్రి కుమ్మక్కై దొడ్డిదారిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో నెగ్గించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ తీర్మానాన్ని ఢిల్లీకి పంపించకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులపై ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా అన్ని పార్టీల నాయకులను కలిసి తెలంగాణకు మద్దతు కోరతామని కేటీఆర్ చెప్పారు. విభజన బిల్లు తీర్మానంతో శాసనసభలో ఒక ప్రహసనం ముగిసిందని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. ఈ తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని కొట్టి పారేశారు. -
తిరస్కార తీర్మానం అడ్డంకి కాదు: మొయిలీ
-
తిరస్కార తీర్మానం అడ్డంకి కాదు: మొయిలీ
న్యూఢిల్లీ: విభజన బిల్లు తిరస్కార తీర్మానంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు వీరప్ప మెయిలీ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తిరస్కార తీర్మానం తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకి కాబోదని మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే కోరామని తెలిపారు. ఓటింగ్ గాని, తీర్మానం గాని కోరలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు సవరణలు చేసి పార్లమెంట్లో పెడతామని వీరప్ప మెయిలీ తెలిపారు. అసెంబ్లీ తెలంగాణ బిల్లు ఓడిపోలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. -
'నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు'
-
బిల్లు ఓడినా నష్టం లేదు: కోదండరామ్
నల్గొండ: తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీలో ఓడిపోతే నష్టమేమీ లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని చెప్పారు. శాసనసభలో సీఎం కిరణ్ వైఖరి ప్రజలను ఆవేశానికి గురిచేసిందన్నారు. అయినా తెలంగాణ ప్రజలు ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు ఖయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో జేఏసీ పాత్ర ఉంటుందన్నారు. కాగా విభజన బిల్లు తిరస్కార తీర్మానం ఆమోదం పొందడంతో హైదరాబాద్ నిజాంకాలేజీ హాస్టల్లో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు సీఎం కిరణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అసెంబ్లీని ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
'నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు'
హైదరాబాద్: శాసనసభలో ఒక ప్రహసనం ముగిసిందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో జరిగిందంతా పైశాచిక చర్య మాత్రమేనని అన్నారు. దీనివల్ల ఒరిగేదేమీలేదని ఆయన వ్యాఖ్యానించారు.. స్పీకర్, ముఖ్యమంత్రి కుమ్మక్కై దొడ్డిదారిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో నెగ్గించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో శాసనసభ పాత్ర నామమాత్రమేనని ఆయన అన్నారు. సభలో జరిగినదానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఫిబ్రవరిలో రెండో వారంలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు వస్తుందన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి వచ్చేనెలలో రాజకీయ సన్యాసం తప్పదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదన్నారు. దీన్ని తమ గెలుపుగా చెప్పుకుంటే అంతకన్నా అమాయకత్వం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆగదని... తెలంగాణ ప్రజల ఆశలను మూటకట్టుకుని కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని... చివరి దశలో కూడా టీఆర్ఎస్ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేని టీఆర్ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. స్పీకర్ నాదేండ్ల మనోహర్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించారని ఆరోపించారు. విభజన బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత ఆమోదించిన తిరస్కార తీర్మానం చెల్లదని చెప్పారు. -
విభజనను క్రికెట్తో పోల్చొద్దు: విజయమ్మ
-
విభజనను క్రికెట్తో పోల్చొద్దు: విజయమ్మ
హైదరాబాద్: రాష్ట్ర విభజనను క్రికెట్తో పోల్చవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కోరారు. రాబోయే ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. విభజన బిల్లు తిరస్కార తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. తాము కోరినట్టుగా సమైక్య తీర్మానం ప్రవేశపెట్టి, ముందే ఓటింగ్ జరిపి ఉంటే విభజన బిల్లు ఇంతవరకు వచ్చేది కాదన్నారు. తమతో పాటు రాజీనామాలు చేయమంటే ఏ ఒక్క ఎమ్మెల్యే స్పందించలేదని గుర్తు చేశారు. బిల్లులో తప్పులున్నాయని సీఎం అంటున్నారని, బిల్లు వచ్చినప్పుడు సమగ్రంగా చూడక పోవడం సీఎం కిరణ్ బాధ్యతారాహిత్యమేనని విమర్శించారు. విభజన బిల్లుకు కిరణ్, చంద్రబాబే కారణమన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా 3 సార్లు నోటీసు ఇచ్చామని గుర్తుచేశారు. చంద్రబాబు ప్యాకేజీ కోరడం దురదృష్టకరమన్నారు. అప్పులు పంచితే రెండు ప్రాంతాలకు నష్టం జరుగుతుందన్నారు. సమైక్యాంధ్రతోనే రాష్ట్రం ముందుకు వెళుతుందన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. త్వరలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామన్నారు. రాష్ట్రం కలిసే ఉండాలని వైఎస్ఆర్ కోరుకున్నారని తెలిపారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధికి వైఎస్ఆర్ కృషి చేశారని చెప్పారు. అందరం కలిసిఉంటేనే అభివృద్ధి సాధ్యమని వైఎస్ విజయమ్మ అన్నారు. -
టి.బిల్లు పెడితే రాజకీయ సన్యాసం-కిరణ్
-
రాజకీయాల నుంచి తప్పుకుంటా: కిరణ్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలనల వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి పంపిన బిల్లు ఉన్నది ఉన్నట్టు పార్లమెంట్లో ప్రవేశపెడితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. బిల్లుపై హోంశాఖ రాష్ట్రపతిని మోసం చేసినట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్టప్రతి నుంచి వచ్చే బిల్లులో లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత హోంశాఖపై ఉందన్నారు. బిల్లులోని లోపాలను సరిచేయమని కోరడం లేదు బిల్లును తిరస్కరిస్తున్నట్టు అసెంబ్లీలో తీర్మానం చేయమని కోరుతున్నామని వివరించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏకాభిప్రాయంతోనే గతంలో రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. విభజనకు కారణాలు, లక్ష్యాలు ఉన్న విభజన బిల్లు కావాలన్నారు. ఇదే బిల్లు పార్లమెంటులో పెట్టాలని సవాల్ చేశారు. ఇదే బిల్లు పార్లమెంటుకు పంపితే అస్సలు అడ్మిట్ కాదని చెప్పారు. ఒకవేళ అది జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సభకు అధికారం లేనప్పుడు ఓటింగ్పై నాయకులు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బిల్లుపై మళ్లీ పొడిగింపు అడగడంలో తప్పులేదన్నారు. బిల్లపై క్లాజులవారీగా చర్చ జరిపి తిరస్కరిస్తామన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో నిలిచిన రెబల్ అభ్యర్థులను ఉపసంహరించుకోమని చెప్పామని సీఎం తెలిపారు. -
ఓటింగ్ పెట్టాలనే సీఎం నోటీసిచ్చారు: బొత్స
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని రాష్ట్ర మంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులంతా విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. విభజన బిల్లుపై ఓటింగ్ పెట్టాలనేదే సీఎం కిరణ్ ఇచ్చిన తిరస్కార నోటీసు సారాంశమని ఆయన వెల్లడించారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన విభజన బిల్లు తిరస్కార నోటీసును అనుమతించొద్దని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ను తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ప్రభుత్వంలో తాము భాగస్వాములుగా ఉన్నప్పటికీ తమను సంప్రదించకుండా కిరణ్ నోటీసు ఇచ్చారని, అలాంటప్పుడు అది ప్రభుత్వ నోటీసు ఎలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీఎం ఇచ్చిన నోటీసును ఆమోదించాలని సీమాంధ్ర ప్రతినిధులు కోరుతున్నారు. సీఎం అన్నివిధాలా ఆలోచించే తిరస్కార నోటీసుయిచ్చారని వెనకేసుకొస్తున్నారు. -
'తిరస్కార తీర్మానాన్ని అనుమతించొద్దు'
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తిరస్కార తీర్మానాన్ని అనుమతించరాదని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు తెలంగాణ మంత్రులు లేఖ ఇచ్చారు. ప్రభుత్వంలో తాము భాగస్వాములైనప్పటికీ తమను సంప్రదించకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీర్మానం ఇచ్చారని తెలిపారు. కాబట్టి దీన్ని ప్రభుత్వ తీర్మానంగా పరిగణించరాదని కోరారు. సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానంగానే పరిగణించాలని సూచించారు. కాగా శాసనసభ, శాసనమండలి ఈ ఉదయం ప్రారంభమైన వెంటనే అరగంట వాయిదా పడ్దాయి. విభజన బిల్లును తిప్పి పంపాలని సీమాంధ్ర సభ్యులు, వద్దని తెలంగాణ సభ్యులు పోటీపోటా నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి. -
రాష్ట్ర పునర్విభజన బిల్లు ఓ పద్ధతి ప్రకారం పంపలేదు
-
డ్రామాలాడిస్తున్న బాబు, కిరణ్: గడికోట
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మొదట్నుంచి శాసనసభలో సమైక్యతీర్మానం కోసం పట్టుబట్టిందని రాయచోటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు. చంద్రబాబు, కిరణ్ ఇద్దరూ ఇరుప్రాంతాల నాయకులతో డ్రామాలాడిస్తున్నారని ఆయన విమర్శించారు. బీఏసీ సమావేశాలకు హజరుకాని చంద్రబాబు, తెలంగాణ బిల్లును ముసాయిదాగా ప్రకటించిన సీఎం కిరణ్ మొదటి నుంచి సమైక్య తీర్మానానికి కట్టుబడి ఉంటే ప్రయోజనం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణ బిల్లు చర్చకు వచ్చిందని ఆరోపించారు. చంద్రబాబు, కిరణ్లకు సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి లేదని శ్రీకాంత్రెడ్డి అన్నారు. -
‘సీఎం తీరు రాజ్యాంగ విరుద్ధం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును తిరిగి పంపించాలని ముఖ్యమంత్రి కిరణ్ నోటీసు ఇవ్వడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్ధమని తెలంగాణ జేఏసీ విమర్శించింది. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, నేతలు దేవీ ప్రసాద్, అద్దంకి దయాకర్, వి.శ్రీనివాస్గౌడ్ తదితరులు శనివారంనాడిక్కడ జేఏసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లుపై 42 రోజులు చర్చించిన తర్వాత కిరణ్కు ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటు ఉద్యమం, విభజన ప్రక్రియ అంతా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నదన్నారు. వారి ప్రకటనలో ముఖ్యాంశాలు... రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఎం తీరు దేశభద్రతకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం. తెలంగాణ మంత్రులు, ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకొని ప్రజల్లో అయోమయం తొలగించాలి. ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై గౌరవం ఉన్న అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులు సీఎం తీరును తప్పుబట్టాలి. సీఎం కిరణ్ అజ్ఞానం, ఆయనకు రాజ్యాంగంపై ఉన్న చులకనభావం ఈ చర్యతో వెల్లడైంది. పార్టీల మధ్య అధిపత్య పోరుతో రోజుకో కొత్త నాటకంతో సీఎం కిరణ్ బయటపడుతున్నారు. సీమాంధ్రులు ఈ బిల్లును రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యతిరేకిస్తున్నారు. -
కిరణ్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీ-ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో బుధవారం సాయంత్రం గందరగోళం రేగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగం మొదలు పెట్టగానే టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. విభజన బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని సీఎం ప్రకటింగానే సభలో గందరగోళం మొదలయింది. చరిత్రను వక్రీకరిస్తూన్నారని ఆరోపిస్తూ సీఎం ప్రసంగానికి టీ-ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సీఎం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే సభా నాయకుడి హోదాలో బిల్లును వ్యతిరేకిస్తున్నా లేక వ్యక్తిగతంగా చెప్పారా అనేది స్పష్టం చేయాలని జానారెడ్డి కోరారు. మరోవైపు టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవడం సమంజసం కాదంటూ స్పీకర్ నాదండ్ల మనోహర్ నచ్చచెప్పినా వారు పట్టువీడలేదు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. జానారెడ్డి మరోసారి కలుగ జేసుకోవడంతో పరిస్థితి సద్దు మణిగింది. తర్వాత సీఎం ప్రసంగం కొనసాగించారు. -
'ఒక్కోప్రాంతానికి ఒక్కో మాట మాట్లాడిస్తున్నారు'
హైదరాబాద్: విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడిఉన్నానని రాష్ట్ర మంత్రి బాలరాజు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించేముందు సీమాంధ్రులకు ఏం కావాలో అడిగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్కోప్రాంతానికి ఒక్కో మాట మాట్లాడిస్తున్న చంద్రబాబుది రాజకీయ కాంక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. తాము రెండు రాష్ట్రాలకూ సుముఖంగా ఉన్నామని చంద్రబాబు లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. విభజన ప్రకటన వెలువడగానే కొత్త రాష్ట్రానికి చంద్రబాబు రూ. 5 లక్షల కోట్లు అడిగారంటే ఆయన విభజనకు అంగీకరించినట్టు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అడుగుతున్న న్యాయం ఏంటో చెప్పాలని బాలరాజు డిమాండ్ చేశారు. -
గడువు పెంచితే ఊరుకోం: దేవీప్రసాద్
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించడానికి గడువు పొడిగిస్తే ఊరుకునేది లేదని, ఈ ప్రాంత ప్రజల ఆగ్రహం కట్టలు తె ంచుకుంటుందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చరించారు. నల్లగొండలో మంగళవారం జరిగిన టీఎన్జీవో-2014 డైరీ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ చర్చకు గడువు పొడిగించాలనడం అప్రజాస్వామికమని చెప్పారు. ఒకవేళ గడువు పొడిగిస్తే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశమై ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యమిచ్చి అసెంబ్లీలో చర్చ జరిపితే, తామే గడువు కావాలని అడిగేవాళ్లని పేర్కొన్నారు. ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు, సూచనలు చెప్పాల్సింది పోయి, ఓటింగ్ కోసం పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులను చూసి, వీళ్లేనా నాయకులు? అని ముక్కు మీద వేలు వేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను, పెన్షనర్లను విభజించాలని డిమాండ్ చేశారు. విభజన పేరుతో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే మళ్లీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఏపీఎన్జీఓలు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతివ్వడాన్ని దే వీప్రసాద్ తప్పుబట్టారు. తెలంగాణవాదులు ఎటువ ంటి ర్యాలీలు, కార్యక్రమాలు చేపట్టేందుకు ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే తమపై దేశద్రోహం, రైల్వే కేసులు పెట్టిన ప్రభుత్వం.. తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడినా అశోక్బాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? 60 రోజుల సీమాంధ్ర ఉద్యమంలో ఒక్కరినైనా అరెస్టు చేశారా? అని ప్రశ్నిం చారు. మరికొన్ని రోజుల్లో సీఎంవి 100 తప్పులు పూర్తవుతాయని, ఆ తర్వాత తప్పుకోక తప్పదని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి బీజేపీపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, కలెక్టర్ చిరంజీవులు, ఏపీఎన్జీఓల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్డ్డ్రి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడారు. -
విభజన వెనుక రాజకీయ కుట్ర: బాబురావు
-
విభజన వెనుక రాజకీయ కుట్ర: బాబురావు
హైదరాబాద్: తెలంగాణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. విభజన వెనుక రాజకీయ కుట్ర దాగివుందని ఆరోపించారు. టీ-బిల్లును కేంద్రం హడావుడిగా శాసనసభకు పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలుగుజాతి వల్లే యూపీఏకు రెండుసార్లు అధికారం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తెలుగుజాతిని యూపీఏ ప్రభుత్వం రెండు ముక్కలు చేస్తోందని మండిపడ్డారు. -
కొత్తపార్టీ వస్తే భంగపాటు తప్పదు: బొత్స
హైదరాబాద్: రాజ్యసభ ఆశిస్తున్నవారి జాబితాను హైకమాండ్కు పంపుతామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. అభ్యర్థుల కసరత్తు కోసం తాము త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్టు చెప్పారు. అభ్యర్థులను ఖరారు చేసేది మాత్రం అధిష్టానమేనని మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ చెప్పారు. సమైక్య ఉద్యమానికి మద్దతుగా కొత్త పార్టీ వస్తే మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల కోసమే సమైక్య ముసుగులో కొత్తపార్టీ వస్తే భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు. పార్టీ మారాలనుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఇతర పార్టీ అభ్యర్థులకు ఓటువేయొచ్చన్నారు. టి.బిల్లుపై చర్చకు అసెంబ్లీ గడువు మరో నెలరోజులు పెంచాలన్నారు. -
విభజన కుట్రకు సాక్షులం కాలేం
* అసెంబ్లీలో విజయమ్మ స్పష్టీకరణ * సభ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రమనే నినాదం ముసుగులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కలిసి చేస్తున్న విభజన కుట్రలో తాము ప్రత్యక్ష సాక్షులుగా పాల్గొనలేమని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ స్పష్టంచేశారు. ‘‘విభజన బిల్లుకు సభ అనుకూలమా? వ్యతిరేకమా? అని నిగ్గు తేల్చే విధంగా శాసనసభలో ఓటింగ్ పెట్టాలి. కానీ మేం ఎన్ని విధాలుగా అడిగినా సమాధానాలు లభించనందున సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం’’ అని ఆమె ప్రకటించారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సమైక్య నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలు సభ ప్రారంభమైన వెంటనే.. బిల్లుపై ఓటింగ్ కోసం పట్టుపడుతూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు చేశారు. సభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో ఐదు నిమిషాల్లో అసెంబ్లీ వాయిదా పడింది. రెండోసారి 10.30 గంటలకు మొదలయినప్పుడు కూడా సభలో ఇదే దృశ్యం పునరావృతమైంది. వైఎస్సార్ సీపీ సభాపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ మనోహర్ చెప్పడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాంతించి తమ స్థానాల్లో కూర్చున్నారు. నిరసన వ్యక్తం చేయడానికి విజయమ్మకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... * ఎన్నిసార్లు సీఎంకు విన్నవించినా, బీఏసీలో మా పార్టీ విధానం చెప్పినా.. దురదృష్టవశాత్తూ విభజన ప్రక్రియ ముందుకు సాగుతోంది. బిల్లు ఉద్దేశాలు, కారణాలు చెప్పకుండా, ఆర్థికపరమైన సమాచారం ఇవ్వకుండా బిల్లును సభకు పంపించారు. * విభజన బిల్లును తిరస్కరించడానికి సభలో ఓటింగ్ నిర్వహిస్తారా? నిర్వహించరా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలి. సభానేతగా ముఖ్యమంత్రి అయినా స్పష్టత ఇవ్వాలి. * ఓటింగ్ ఉంటే ఎలా ఉంటుంది? క్లాజుల వారీ లేదా షెడ్యూళ్ల వారిగానో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్పాలి. * ఎలాంటి స్పష్టత లేకుండా బిల్లు మీద ఎందుకు చర్చ జరగాలి? ఈ విషయాలను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోంది? * ‘విభజన వద్దు. అడ్డుకుందాం...’ అనేది మా పార్టీ విధానం. ఈమేరకు అఫిడవిట్ల రూపంలో రాష్ట్రపతికి చెప్పాం. 164 నిబంధన కింద మా ఎమ్మెల్యేల అభిప్రాయాలను పిటిషన్ల రూపంలో సమర్పించాం. బిల్లులోని అన్ని క్లాజులను తొలగించాలని సవరణ ప్రతిపాదనలు ఇచ్చాం. * విభజన ఎలా జరగాలన్న చర్చలో భాగస్వాములం కాదల్చుకోలేదు. * సమైక్యం ముసుగులో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కలిసి చేస్తున్న విభజన కుట్రలో ప్రత్యక్ష సాక్షులుగా పాల్గొనబోం. అదే సమయంలో.. రాష్ట్రపతి అడిగిన మేరకు మా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తాం. * రాష్ట్ర విభజన 10 కోట్ల మందికి సంబంధించిన అంశం. కాంగ్రెస్ ఇంటి విధానం కాదు. వారి (కాంగ్రెస్) స్వార్థం కోసం తెలుగుజాతిని బలిపెట్టద్దని కోరుతున్నాను. * సమైక్యంలోనే అభివృద్ధి సాధ్యమని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. 1972లో ఇందిరాగాంధీ కూడా చెప్పారు. 60 సంవత్సరాలుగా కలిసున్న రాష్ట్రాన్ని ఎందుకు విడదీయాలి? 2,700 సంవత్సరాలు కలిసున్న తెలుగు జాతి ఎందుకు విడిపోవాలి? బ్రిటిష్, నిజాం కాలంలో విడిపోవాలనుకోలేదు. ఇప్పుడెందుకు విడిపోవాలి? * విభజనకు శాసనసభ అనుకూలమా?వ్యతిరేకమా? అని చెప్పడానికి ఓటింగ్ నిర్వహించాలి. మా అభిప్రాయం చెప్పమన్నప్పుడు మా ఎమ్మెల్యేలు వచ్చి చెప్తారు. సమైక్యం మా విధానం, నినాదం. -
విభజన బిల్లును వ్యతిరేకిస్తూ... అభిప్రాయాలు మళ్లీ చెబుతాం
* చర్చలో పాల్గొనం వైఎస్సార్సీపీ * జగన్తో పార్టీ ముఖ్యనేతల భేటీ * అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ * ఓటింగ్ జరిగితే వ్యతిరేకంగా ఓటేస్తామన్న భూమన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని రెండుగా చీల్చడానికి ఉద్దేశించిన విభజన బిల్లుపై శాసనసభలో జరిగే చర్చలో తాము పాల్గొనబోమని, అయితే రాష్ట్రపతి సూచనల ప్రకారం బిల్లుపై తమ అభిప్రాయాలను మాత్రం మళ్లీ కచ్చితంగా చెబుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు భూమన కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ బిల్లుపై ఓటింగ్ జరిపితే అందులో తమ ఎమ్మెల్యేలందరూ పాల్గొని వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పారు. ఇప్పటికే తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా అందజేశామని, విభజనకు వ్యతిరేకంగా మళ్లీ అవే అభిప్రాయాలను వెల్లడిస్తామే కానీ చర్చలో పాల్గొనబోమని విస్పష్టంగా తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఎంవి మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, వైవీ సుబ్బారెడ్డి, దాడి వీరభద్రరావు సహా పలువురు ముఖ్యనేతలు, కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమై శుక్రవారం నుంచి పునఃప్రారంభం కానున్న శాసనసభ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. శాసనసభలో బిల్లుపై ఓటింగ్ జరిగేలా ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం కరుణాకర్రెడ్డి పార్టీ శాసనసభాపక్షం ఉపనేత భూమా శోభానాగిరెడ్డి, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. మెజారిటీ ప్రజలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ సమక్షంలో సభలో జరిగే చర్చలో పాల్గొనే ప్రసక్తే లేదని చెప్పారు. సమైక్యవాదం ముసుగులో సీఎం కిరణ్, రాష్ట్రాన్ని విభ జించాలని లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇద్దరూ కుమ్మక్కయి విభజన బిల్లుపై చర్చ సజావుగా పూర్తి చేసి కేంద్రానికి పంపడానికి ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్నీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కోర్ కమిటీలోనూ, ఆ తరువాత సీడబ్ల్యూసీలోనూ రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం తీసుకున్నపుడు భాగస్వామిగా ఉన్న సీఎం అప్పుడు గంగిరెద్దులా తలూపి వచ్చారని, ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలకు భయపడి పది రోజుల తరువాత బయటకు వచ్చి తాను విభజనకు వ్యతిరేకమంటూ సన్నాయి నొక్కులు నొక్కి పదవిలో కొనసాగుతున్నారని విమర్శించారు. సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నపుడు ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించుకుని మాట్లాడి ఆ ఉద్యమంపై కిరణ్ నీళ్లు చల్లారన్నారు. తీర్మానం ద్వారా బిల్లును ఓడిద్దామని, రకరకాలుగా ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి.. చివరకు విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకే సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు. సభలో బిల్లును ప్రవేశపెట్టేటపుడు ఉద్దేశ్యపూర్వకంగా సభకు రాకుండా, బీఏసీ సమావేశాలకు గైర్హాజరవుతూ బయట మాత్రం సమైక్యవాదినని పత్రికల్లో రాయించుకున్నారని ఆరోపించారు. ఇక బాబు 2008లో ప్రణబ్ కమిటీకి తెలంగాణ ఏర్పాటు చేయాలని లేఖ నివ్వడంతో పాటుగా 2009లో అప్పటి హోంమంత్రి చిదంబరంతో జరిగిన సమావేశంలో కూడా విభజనకు అనుకూలమని స్పష్టంగా చెప్పారని భూమన గుర్తుచేశారు. అంతటితో ఆగకుండా షిండేతో జరిగిన సమావేశంలో సైతం రాష్ట్రాన్ని త్వరగా విడగొట్టాలని చెప్పారని, అయితే సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూశాక ఇపుడు ఆ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలతో నాటకాలాడిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ద్వారా వచ్చిన బిల్లుపై తమ పార్టీ వంద శాతం అభిప్రాయాలు వ్యక్తీకరిస్తుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ నెల 11న ఏకాదశి నాడు తిరుమలలో విచ్చలవిడిగా వీఐపీ పాసుల జారీపై ప్రశ్నించినందుకు సామాన్య భక్తులపై క్రిమినల్ కేసులు పెట్టడాన్ని తమ పార్టీ ఖండిస్తోందన్నారు. -
మరో 10 రోజులు
* తెలంగాణ బిల్లును పంపించేందుకు గడువును పెంచే అవకాశం * గత సంప్రదాయాల్ని రాష్ట్రపతి పాటించవచ్చు న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ కోరితే.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును తిరిగి పంపించడానికి శాసనసభకు ఇచ్చిన గడువును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గరిష్టంగా మరో 10 రోజుల పాటు పొడిగించవచ్చని బుధవారం అధికార వర్గాలు తెలిపినట్టు పీటీఐ వార్తా సంస్థ కథనం. గతంలో అలా పొడిగించిన దృష్టాంతాలు ఉన్నందున, గత సంప్రదాయాలను పాటిస్తూ.. రాష్ట్రపతి పొడిగింపు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అప్పటి రాష్ట్రపతి మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఇచ్చిన గడవును పొడిగించిన విషయాన్ని గుర్తుచేశాయి. విభజన బిల్లును అసెంబ్లీకి పంపిస్తూ.. చర్చకు ఆరు వారాల సమయమిచ్చి, జనవరి 23లోగా తిప్పి పంపించాలని రాష్ట్రపతి కోరారు. అయితే, తెలంగాణ అనుకూల, ప్రతికూల సభ్యుల ఆందోళనల మధ్య సభలో బిల్లుపై చర్చ సజావుగా జరగలేదు. అసెంబ్లీకి ఇచ్చే గడువును రాష్ట్రపతి పొడిగిస్తే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పాస్ చేసేందుకు కేంద్రానికి తక్కువ సమయం లభిస్తుంది. వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం ఫిబ్రవరి రెండోవారంలో పార్లమెంటు సమావేశం కానుంది. అప్పుడు 15 రోజులు లేక 10 పనిదినాల పాటు పార్లమెంటు పనిచేస్తుందని.. సమావేశాల అజెండాను ఇంకా ఖరారు చేయలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ ఇటీవల చెప్పారు. అసెంబ్లీ అభిప్రాయంతో సంబంధం లేకుండా విభజన ప్రక్రియను పార్లమెంటు పూర్తి చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. -
'విభజన బిల్లును తగలబెట్టడంలో తప్పు లేదు'
విశాఖపట్టణం: ప్రజలు వ్యతిరేకిస్తున్న తెలంగాణ ముసాయిదా బిల్లును భోగి మంటల్లో తగలబెట్టడంలో తప్పు లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర రాజధానిలోని ట్యాంక్బండ్పై విగ్రహాలను ధ్వంసం చేస్తే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ నాయకుడు స్పందించలేదన్నారు. విభజన బిల్లు ప్రతులను దగ్ధం చేస్తే తెలంగాణ నేతలకు ఎందుకు కోపం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. విభజనను నిరసిస్తూ విశాఖ కలెక్టరేట్ వద్ద భోగిమంటల్లో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను సమైక్య జేఏసీ నాయకులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమష్బాబు పాల్గొన్నారు. -
బిల్లు దహనం.. రాజ్యాంగ ఉల్లంఘనే
టీ ముసాయిదా బిల్లు దహనంపై తెలంగాణ నేతల ఆగ్రహం వారిని అరెస్టు చేయాలి: హరీష్రావు దేశబహిష్కరణ చేయాలి: శ్రీనివాస్గౌడ్ రాజ్యాంగాన్ని కాల్చినట్లే: దిలీప్కుమార్ విభజన గీత గీయాల్సిందే: గౌరీశంకర్ న్యూస్లైన్ నెట్వర్క్: సీమాంధ్ర నేతలు తెలంగాణ ముసాయిదా బిల్లును భోగి మంటల్లో వేసి తగులబెట్టడంపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలను అవమానపర్చడంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కె.దీలీప్కుమార్, టీఆర్ఎల్డీ సెక్రటరీ జనరల్ చెరుకూరి శేషగిరిరావులు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ, బిల్లును కాల్చడం.. రాజ్యాంగాన్ని కాల్చడమే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, పోరాట ఫలితాన్ని కాల్చి బూడిద చేసిన సీమాంధ్ర నేతలను వెంటనే అరెస్టు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్రావు డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ బిల్లును భోగిమంటల్లో దహనం చేసి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అవమానించిన అక్కడి నేతలు ఇప్పుడు పండుగను కూడా అపవిత్రం చేశారన్నారు. వారు తమ విచక్షణను, జ్ఞానాన్ని కూడా అదే భోగి మంటల్లో కాల్చి బూడిద చేసుకున్నారని వ్యాఖ్యానించారు. బిల్లు ప్రతులను దహనం చేసిన వారిని వెంటనే దేశ బహిష్కరణ చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్లో డిమాండ్ చేశారు. ఇది సీమాంధ్రుల దురహంకారానికి నిదర్శనమన్నారు. ఒక ప్రాంత ప్రజల ఆంక్షాలను కాల్చివేసి కలిసుందాంరా అనే సమైక్య నినాదం పైశాచికత్వంగా కనిపిస్తుందని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జూలూరు గౌరిశంకర్ ఒక ప్రకటనలో ఖండించారు. భోగి మంటల సాక్షిగా రెండు ప్రాంతాల మధ్య విభజన గీతలు గీయాల్సిందేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన అశోక్బాబుపై తెలంగాణ సాధన సమితి అధ్యక్షుడు వెంకటనారాయణ నల్లగొండ జిల్లా కోదాడ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బిల్లును తగులబెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
'హైదరాబాద్లో పాగా వేస్తామన్న వారిని పాతరేస్తాం'
మహబూబ్నగర్: భోగి మంటల్లో తెలంగాణ బిల్లు ప్రతులు దగ్దం చేయడం రాజ్యాంగాన్ని అవమానించినట్టేనని తెలంగాణ రాజకీయ జేఏసీ కో- ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విభజనను భోగి మంటల్లో దగ్ధం చేసిన ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర నేతలపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో పాగా వేస్తామన్న సీమాంధ్ర నేతలను పాతరేస్తామని ఆయన హెచ్చరించారు. 90 రోజుల్లో తెలంగాణ ఏర్పాటు అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. - సీమాంధ్రుల కబంధహస్తాల్లో బందీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పించేవరకు పోరాటం కొనసాగుతుందని అతంకుముందు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణను అడ్డుకునే శక్తుల జాబితాను తయారుచేస్తున్నామని, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత వారి భరతం పడతామని హెచ్చరించారు. తెలంగాణపై అసెంబ్లీలో చర్చ మొదలైందని, అల్లరిచేస్తూ చర్చ జరగకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు. -
'జైపాల్ వ్యాఖ్యలను ఖండించిన అశోక్బాబు'
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు సీమాంధ్రుల పాలిట మరణశాసనమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్బాబు అన్నారు. విభజన బిల్లును రేపు భోగి మంటల్లో వేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రం ఎందుకు కలిసుండాలే పల్లె పల్లెకు వెళ్లి చెబుతామన్నారు. శాసనసభలో విభజన బిల్లును ఓడించేందుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకు 17, 18న సీమాంధ్ర బంద్కు పిలుపిచ్చామని చెప్పారు. సీమాంధ్రులను కించపరిచేలా వున్న కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి వ్యాఖ్యలను అశోక్బాబు ఖండించారు. సీనియర్ రాజకీయవేత్తగా ఆయన హోదాకు ఇవి తగవన్నారు. గాదె వెంకటరెడ్డిపై అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని కూడా ఆయన ఖండించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు శుంఠలు పుట్టారని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి కేంద్రమంత్రి ఎస్ జైపాల్రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
ఫిబ్రవరిలో పార్లమెంట్కు తెలంగాణ బిల్లు: షిండే
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును ఫిబ్రవరిలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రపతి నుంచి బిల్లు తమకు చేరిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడతామని తెలిపారు. సమయం సరిపోతుందా అన్న ప్రశ్నకు చూద్దామంటూ ఆయన సమాధానం దాటవేశారు. మొదట బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామన్నారు. తెలంగాణ బిల్లు పంపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రపతి జనవరి 23వరకు సమయం ఇచ్చారని గుర్తు చేశారు. తమకున్న సమాచారం ప్రకారం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని షిండే తెలిపారు. విచారణ ఎదుర్కొకోకుండా కేసులు ఎదుర్కొంటున్న వారి విషయంతో రాష్ట్రాలు సమీక్ష కమిటీలు వేయాలని సూచించారు. తొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామన్నారు. -
ఫిబ్రవరిలో పార్లమెంట్కు తెలంగాణ బిల్లు: షిండే
-
విభజన చర్చలో తిట్ల పురాణం
సాక్షి, హైదరాబాద్: తోడు దొంగలు... వెన్నుపోటుదారుడు... మోసకారి... గజదొంగ... సిగ్గులేదు... లూటీచేశారు... ఇవీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై చర్చ సందర్భంగా వినిపించిన తిట్ల పురాణం. ఆవేశకావేశాలు, దూషణలు, ఆరోపణలు, ఉద్రిక్త పరిస్థితులతో శాసనసభ గురువారం దద్దరిల్లింది. టీడీపీ, టీఆర్ఎస్ సభ్యుల మధ్య యుద్ధవాతావరణం ఏర్పడింది. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సభను శుక్రవారానికి వాయిదా వేశారు. చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విభజన బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతూ... చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికి వీల్లేదని... వెనుకబడిన ప్రాంతమని ప్రస్తావించాలంటూ అప్పటి మంత్రి దాస్యం ప్రణయ్భాస్కర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారని ఆరోపించడంతో సభలో గందరగోళానికి తెరలేచింది. తెలుగుదేశం పార్టీ సభ్యులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెల్లోకి దూసుకుని వచ్చారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్రావుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ‘‘కాంగ్రెస్-టీఆర్ఎస్ తోడుదొంగలు.. చంద్రబాబును దెబ్బతీయాలని కలసి పనిచేశాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ైవె ఎస్ 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కావాలంటూ సంతకాలు చేయించి పంపారు. 2004 ఎన్నికల్లో ఇద్దరూ కలసి చంద్రబాబును దింపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపు తెలంగాణ ఇస్తామని చెప్పి.. పదేళ్లయినా ఇవ్వలేదు. వెయ్యిమంది విద్యార్థుల చావుకు కారణం వీరే. చంద్రబాబు 2008లో రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చారు. ఆ లేఖను వెనక్కి తీసుకోలేదు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నారు. కాంగ్రెస్కు సిగ్గులేదు.. మీ సీఎం ఏం మాట్లాడుతున్నారో చెప్పండి’’ అంటూ దయాకర్రావు విరుచుకుపడ్డారు. తోడుదొంగలు వ్యాఖ్యపై ఆగ్రహంతో వెల్లోకి దూసుకొచ్చిన టీఆర్ఎస్ సభ్యులు చంద్రబాబును దూషించడంతో టీడీపీ సభ్యులు సైతం వెల్లోకి దూసుకొచ్చారు. ఇరు పార్టీల సభ్యులు పరస్పరం తీవ్రంగా దూషించుకున్నారు. ఒక దశలో టీడీపీ సభ్యుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, టీఆర్ఎస్ సభ్యుడు నల్లాల ఓదెలు నువ్వెంతంటే నువ్వెంత? అంటూ హైదరాబాద్ను లూటీ చేశారు... దోచుకున్నారంటూ తిట్లపురాణం ఎత్తుకున్నారు. ఇరుపార్టీల నేతలు వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. ఈ దశలో డిప్యూటీ స్పీకర్ కల్పించుకుని... సభ సజావుగా సాగడానికి సూచనలు ఇవ్వాలే తప్ప.. రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు.. కేవలం సూచనలే చేయండని సూచించారు. ఆ తరువాత టీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు మాట్లాడుతూ... ‘‘తోడుదొంగలు అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నా. రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరికాయలు, ఆపరేషన్, ఇద్దరు పిల్లల సిద్ధాంతాలు ఎవరివి? ఎన్డీఏ హయాంలో తెలంగాణ రాకుండా అడ్డుకున్నామని చెప్పలేదా? స్పీకర్గా యనమల ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికి వీల్లేదని రూలింగ్ ఇవ్వలేదా? పార్లమెంట్లో బిల్లు పెట్టమని మీ నాయకుడు ఎందుకు చెప్పరు? వెన్నుపోటుదారుడు, మోసకారి, గజదొంగ అన్న మారు పేర్లు చంద్రబాబునాయుడుకు ఉన్నాయి...’’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. దీంతో టీడీపీ సభ్యులు ఒక్కసారిగా పోడియంలోకి దూసుకెళ్లి హరీశ్రావు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ దశలోనే సభను డిప్యూటీ స్పీకర్ శుక్రవారానికి వాయిదా వేశారు. -
బిల్లును యుద్ధ విమానంలో పంపడమేంటి?
హైదరాబాద్: రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికే సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. అన్నదమ్ముల్లాంటి ప్రజల మధ్య వైషమ్యాలు రేపారన్నారని విమర్శించారు. మూడేళ్లయినా శ్రీకృష్ణ కమిటీని పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోవడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. విభజన బిల్లును హైదరాబాద్కు యుద్ధవిమానంలో పంపించడంలో ఔచిత్యం ఏమిటని నిలదీశారు. 371డీ అంశాన్ని రాజ్యాంగ నిపుణులు తేల్చాల్సిందే నని చెప్పారు. రాష్ట్రం మైక్యంగానే ఉంటేనే ఆర్థిక, రాజకీయ, సామాజిక, పారిశ్రామిక ప్రగతి సాధ్యమన్నారు. అయితే సోనియాపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం రేగింది. -
మేము తప్పు చేస్తే దిద్దుకుంటాం: వట్టి
హైదరాబాద్: రాష్ట్ర విజభన జరిగితే కోస్తాంధ్ర 50 ఏళ్లు వెనక్కి పోతుందని మంత్రి వట్టి వసంతకుమార్ అన్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టినట్టినట్లు కనబడుతుందన్నారు. సమాఖ్య స్ఫూర్తిపై కేంద్రానికి గౌరవం ఉన్నట్టు లేదన్నారు. శాసనసభ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజనపై కేంద్రం అత్యుత్సాహం ఎందుకు కనబరుస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఏళ్ల తరబడి విదర్భ డిమాండ్ ఉన్నా పట్టించుకోలేదని తెలిపారు. తాము, తమ పూర్వీకులు తప్పు చేసినట్టు నిరూపిస్తే సరిదిద్దుకుంటామన్నారు. హైదరాబాద్తో సమానమైన రాజధానికి నిర్మాణానికి నిధులెవరిస్తారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతాన్ని బలవంతంగా తెలంగాణలో కలిపారనడం సబబు కాదన్నారు. ఈ బిల్లును చూస్తే కొత్త రాష్ట్రం ఎలా బతికి బట్టకడుతుందో అర్థం కావడం లేదన్నారు. తమపై దోపిడీ ఆరోపణలు తప్పని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని తెలిపారు. తీర్మానం తప్పనిసరి అని సర్కారియా కమిషన్ కూడా చెప్పిందన్నారు. శాసనసభ తీర్మానాన్ని కేంద్రం పొందలేదు కాబట్టి బిల్లును వ్యతిరేకిస్తున్నామని వట్టి వసంతకుమార్ చెప్పారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సరైన ప్రాతిపదిక, విధానం అవలంభించాలని సూచించారు. -
అభిప్రాయమే, ఓటింగ్ ఉండబోదు: దిగ్విజయ్
-
అభిప్రాయమే, ఓటింగ్ ఉండబోదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో చర్చ ప్రారంభం కావడం చాలా సంతోషకర పరిణామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ ప్రారంభమైందని ఆయన తెలిపారు. బిల్లును కేవలం అభిప్రాయం కోసమే పంపామని ఆయన వెల్లడించారు. ఆమోదం కోసమో, తిరస్కారం కోసమో కాదని ఆయన స్పష్టం చేశారు. బిల్లుపై ఓటింగ్ ఉండబోదన్నారు. బిల్లును తిరస్కరించే అధికారం అసెంబ్లీకి లేదని దిగ్విజయ్ చెప్పారు. తీవ్ర గందరగోళం, వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల ‘సమైక్య’ ఆందోళన మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ బుధవారం శాసనసభలో చర్చ ప్రారంభించారు. -
నేనేంటో అసెంబ్లీలో చూపిస్తా: సీఎం కిరణ్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పష్టమైన అభిప్రాయాలు తెలపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. అసెంబ్లీ నిర్ణయంపైనే రాష్ట్రపతిగానీ, కేంద్రం గానీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అభిప్రాయం చెప్పకుండా బిల్లు పంపిస్తే వ్యతిరేక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాబట్టి బిల్లుపై ప్రతి ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని అసెంబ్లీలో స్పష్టం చేయాల్సిన అవసరముందన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఈ సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. బిల్లుపై చర్చ ద్వారా ప్రజాభిప్రాయాన్ని చెప్పొచ్చని అన్నారు. బిల్లుపై చర్చ జరగకపోతే విభజనను అంగీకరించినట్టేనని చెప్పారు. అసెంబ్లీ భిన్నాభిప్రాయాలు తెలిపిన తర్వాత దేశంలో ఎక్కడా రాష్ట్రాల విభజన జరగలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకునేందుకే బిల్లును కేంద్రం ఇక్కడకు పంపించిందని వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్ కోసం ఆలోచించడం లేదని సీఎం కిరణ్ అన్నారు. సమైక్యవాదం తమ నినాదం కాదు, తమ విధానమన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి రావాలని మిగతా పార్టీలను కోరారు. సీఎంగా తన అధికారాలెంటో తనకు తెలుసునని అన్నారు. బిల్లుపై తానేం చేస్తానో అసెంబ్లీలో చూస్తారని అంటూ ముక్తాయించారు. -
'తెలంగాణ ఎంపీలపై ఒత్తిడి తెస్తాం'
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లులో సవరణలను ప్రతిపాదించి ఎప్పటికప్పుడు ఢిల్లీలో టి.ఎంపీలపై ఒత్తిడి తెస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, టీజేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. సంపూర్ణ తెలంగాణ సాధిస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాల వలే తెలంగాణ ఏర్పడాలని వారు డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణలోని పార్టీలు స్వలాభాలు పక్కనపెడితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమవుతుందని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణను అడ్డుకునే శక్తి లేదన్నారు. -
సినీ హీరోగానే ఇక్కడికి వచ్చా: చిరంజీవి
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ జరిగితే మంచిదేనని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు చర్చకు వస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. విభజన అనివార్యమైతే బిల్లులో రెండు సవరణలు కోరతామన్నారు. హైదరాబాద్ను యూటీ చేయాలి, భద్రాచలంను సీమాంధ్రలో కలపాలని డిమాండ్ చేస్తామన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ప్రవాస భారతీయ దినోత్సవం(పీబీడీ)లో ఆయన పాల్గొన్నారు. కేంద్రమంత్రి కాకుండా సినీ హీరోగానే ఈ కార్యక్రమానికి హాజరైయ్యానని తెలిపారు. ప్రజారాజ్యం పార్టీని పునరుద్దరించే అవకాశాల్లేవని చిరంజీవి స్పష్టం చేశారు. -
తెలంగాణ బిల్లుపై చర్చ జరగాలి
మిర్యాలగూడ, న్యూస్లైన్ : తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో సంపూర్ణ చర్చ జరగాలని, కాంగ్రెస్, టీడీపీ నాయకులు అడ్డుకోవడం సరైంది కాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. మిర్యాలగూడలో సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ప్రాంతాల్లో రెండు రకాల ఉద్యమాలు చేస్తున్నాయని, వారి నైజం బయట పడుతుందనే ఉద్దేశంతోనే చర్చను ఆయా పార్టీల నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు. రాష్ట్రపతి పంపిన ముసాయిదా బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ పాలనను నెంబర్ వన్గా పేర్కొన్న సంస్థ పనికిమాలినదని అన్నారు. దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆ పార్టీ సామన్యులకు న్యాయం చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఎం శాసనసభా పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కర్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి, నాయకులు గట్టికొప్పుల రాంరెడ్డి, డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సచార్ కమిటీ నివేదికను అమలు చేయాలి మిర్యాలగూడ టౌన్ : సచార్ కమిటీ నివేదికను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డ్డి కోరారు. ఆదివా రం స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన డివిజన్ ఆవాజ్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో పెరుగుతున్న మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ఈనెల 7న మతతత్వానికి వ్యతిరేకంగా నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభను అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. ఆవాజ్ కమిటీ పట్టణ అధ్యక్షుడు ఎంఎం ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంఏ ఘని, మహ్మద్ బిన్ సయీద్, ఎస్కే బాబు, ఎండీ వహీద్ తదితరులు పాల్గొన్నారు. -
బిల్లుపై.. అభిప్రాయాల ఫార్మెట్ ఖరారు చేసిన బొత్స
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో విభజన బిల్లుపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చెప్పే అభిప్రాయాల ఫార్మాట్ను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం ఖరారుచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరడం, అంతేకాక విభజన బిల్లును వ్యతిరేకిస్తూ సభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రసంగించడం వంటివి తమ ఫార్మెట్లో బొత్స సత్య నారాయణ పొందపరిచినట్టు తెలిసింది. దీనికి సంబంధించి సభ్యులకు ఒక పేజీ ఫార్మాట్ను బొత్స సత్యనారాయణ పంచినట్టు సమాచారం. -
`శాఖ మార్పు.. సమైక్యాంధ్ర కోసం కాదు`
విశాఖపట్నం: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును తప్పించడంపై తెలంగాణలో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్బాబు శాఖ మార్పు అంశం ఇరు ప్రాంతాల్లో భావోద్వేగాలు పెంచడానికే తప్ప సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి చేసింది కాదని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ విమర్శించారు. సమైక్య తీర్మానం అసెంబ్లీ చేయాల్సిందేనని కొణతాల పేర్కొన్నారు. కాగా, శ్రీధర్బాబు శాఖను మార్చి వాణిజ్య పన్నుల శాఖ అప్పగించడాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా వ్యతిరేంచిన సంగతి తెలిసిందే. -
అసంబద్ధంగా తెలంగాణ బిల్లు: హరిబాబు
నెల్లూరు: తెలంగాణ ముసాయిదా బిల్లులో సీమాంధ్ర అభివృద్ధి అంశాలు లేవని బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు అన్నారు. పూర్తి అసంబద్ధంగా తెలంగాణ బిల్లును రూపొందించారని ఆయన విమర్శించారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలని సూచించారు. సీమాంధ్రకు న్యాయం జరగకుండా ఉంటే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని తమ అధిష్టానాన్ని కోరుతామని చెప్పారు. విభజన బిల్లు సీమాంధ్రులకు అన్యాయం చేసేదిగా ఉందని అంతకుముందు హరిబాబు అన్నారు. పోలవరానికి న్యాయం జరగాలంటే కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ప్రమేయం లేకుండా ప్రాజెక్టు డిజైన్ ఉండాలన్నారు. ఇంతవరకూ ఏ రెండు రాష్ట్రాలకు ఒకే ప్రాంతం ఉమ్మడి రాజధానిగా లేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఆయా పార్టీల అవసరాల మేరకు పొత్తు పెట్టుకుంటాయని స్పష్టం చేశారు. -
బిల్లును గట్టెక్కించేందుకు టీ.నేతల వ్యూహం
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీలో గట్టెక్కించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు కసరత్తు ప్రారంభించారు. మినిస్టర్ క్వార్టర్స్ క్లబ్ హౌస్లో శుక్రవారం తెలంగాణ ప్రజాప్రతినిధులు సమావేశమైయ్యారు. తెలంగాణ బిల్లులో తెలంగాణపై విధించిన ఆంక్షలను ఎత్తివేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరైయ్యారు. తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని చెప్పారు. అంతేకాక ఇప్పటికీ విభజనకు టీడీపీ కట్టుబడే ఉందని అన్నారు. తమపార్టీ నేతల్ని విమర్శించకుండా కలుపుకుని పోవాలని ఎర్రబెల్లి చెప్పారు. మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ బిల్లును గట్టెక్కించేంతవరకూ ఐక్యంగా ఉందామని చెప్పారు. అయితే అసెంబ్లీలో తెలంగాణ బిల్లును గట్టెక్కించేందుకు ఫ్లోర్ కో ఆర్డినేషన్ అవసరమని నేతలందరూ ఈ భేటీలో భావించినట్టు తెలుస్తోంది. దీనిపై మంత్రి శ్రీధర్బాబుకు బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. -
`తెలంగాణ బిల్లు అడ్డుకునే హక్కు లేదు`
వరంగల్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో తెలంగాణ, సీమాంధ్రలో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చపై అభిప్రాయం చెప్పే హక్కు మాత్రమే ఉందని, అడ్డుకునే హక్కులేదని తెలంగాణ రాజకీయ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. శుక్రవారం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలలో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో చర్చ సందర్భంగా చెప్పిన అభిప్రాయాలను కేంద్ర పరగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. -
'తెలంగాణను అడ్డుకునే వ్యక్తులపై తిరుగుబాటు'
-
'తెలంగాణను అడ్డుకునే వ్యక్తులపై తిరుగుబాటు'
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును ఆపుదామనే ప్రయత్నంలోనే తన శాఖ మార్చారని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగదన్నారు. తెలంగాణను అడ్డుకునే వ్యవస్థలు, వ్యక్తులపై తిరుగుబాటు కొనసాగుతుందన్నారు. తాను పదవులు కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నందునే మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకు ఇదంతా చేశారన్నారు. ఇది మూమ్మాటికీ అధికార దుర్వినియోగమే అన్నారు. తన రాజీనామాతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలకు కనువిప్పు కలగాలన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి ముందు తన రాజీనామా చాలా చిన్నదన్నారు. -
`ఆయన అనుమతితోనే సమైక్య పోరాటం`
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు రానున్న కీలక తరుణంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నేతల్లో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. దీంతో ఇరుప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎంపీలు తమ పార్టీ అధినేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుమతితోనే సమైక్యం కోసం పోరాడుతున్నామని తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ తాము రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తామని చెప్పారు. కాగా, 2008లో తెలంగాణపై ఇచ్చిన లేఖకు కాలం చెల్లిందంటూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు విమర్శించారు. -
`అవకాశవాద పార్టీతో మతోన్మాదపార్టీ వెళ్తుంది`
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరగనున్న నేపథ్యంలో బీజేపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తెలంగాణపై నయవంచన చేసిందంటూ నారాయణ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవకాశవాద పార్టీతో మతోన్మాదపార్టీ కలిసి వెళ్తొందంటూ ఘాటుగా విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధంతాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాడుకోవలనుకుంటున్నారని నారాయణ విమర్శించారు. ప్రస్తుతం పెరిగిన కరెంట్, గ్యాస్ ధరల పెంపుపై ఆందోళన చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. -
తెలంగాణ బిల్లులోని లోపాలను ఎండగడతా: డొక్కా
విజయవాడ: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో చర్చ వాడీవేడిగా సాగుతోంది. కేంద్ర పంపిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో చాలా లోపాలున్నాయని మంత్రి డొక్కా మాణిక్కవరప్రసాద్ వ్యాఖ్యానించారు. తన వరకు వస్తే తెలంగాణ బిల్లులోని లోపాలను ఎండగడతానని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. ఏదైనా శాస్త్రీయంగా జరగాలన్నారు. అయితే తెలంగాణ బిల్లులో ఆ శాస్త్రీయత లేదని డొక్క విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల భవిష్యత్త్ గురించి విభజన బిల్లులో లేదని డొక్కా మాణిక్కవరప్రసాద్ ఆరోపించారు. -
టీ-బిల్లుపై చర్చించాలి..
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్లైన్ : జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుపై చర్చ జరపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. పట్టణంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్లో సోమవారం సీపీఎం జిల్లా విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతి అసెంబ్లీకి పంపిన తెలంగాణ బిల్లుపై అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించడానికి చర్చ జరగాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలు వారి అభిప్రాయాలు చెప్పకుండా అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడుతోందని ఆరోపించారు. బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడాన్ని సీపీఎం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్పై ఉన్న వ్యతిరేకతతోనే బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని అన్నారు. రానున్న ఎన్నికలకు సీపీఎం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యకర్తల్లో మనోధైర్యం పెంచేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు సాయిబాబు, లంకా రాఘవులు, పార్టీ జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
23 తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై జనవరి 23 వరకు వేచి చూద్దామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సీమాంధ్ర ప్రాంత నేతలకు చెప్పారు. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడిద్దామని, బిల్లుపై చర్చలో సీవూంధ్ర ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తే కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయులేదని వారికి నచ్చజెప్పారు. చర్చ ముగిసిన తర్వాత బిల్లు రాష్ట్రపతికి, అక్కడి నుంచి కేంద్రానికి, పార్లమెంటుకు చేరుతుందని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని గురువారం తనను కలసిన సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సీఎం అన్నారు. మాజీ మంత్రులు జేసీ, పాలడుగు, ఎమ్మెల్యే విజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ శివరావుకృష్ణారావు తదితర నేతలు సచివాలయంలో సీఎంను వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా విభజన బిల్లు ప్రస్తావనకొచ్చింది. సీమాంధ్ర నేతలంతా చర్చలో పాల్గొనడమే కాకుండా బిల్లుకు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పాలని సీఎం సూచించారు. అసెంబ్లీలో ఓటింగ్కు తెలంగాణ నేతలు అంగీకరించకపోవచ్చని, అటువంటి అవకాశం ఉండకపోతే పరిస్థితి ఏమిటని సీనియర్ నేతలు సీఎంను అడిగారు. ఏ బిల్లుపైనైనా ఓటింగ్కు మెజార్టీ సభ్యులు పట్టుబడితే సభాపతి చేపట్టక తప్పకపోవచ్చని సీఎం పేర్కొన్నారు. బిల్లుపై కనుక ఓటింగ్కు అవకాశం లేదని తేలితే అప్పుడు విభజన వ్యతిరేక తీర్మానాన్ని ప్రతిపాదిద్దామని సీఎం చెప్పినట్టు నేతలు వివరించారు. సభలో పునర్వ్యవస్థీకరణ బిల్లును ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తారో, లేదో? చర్చ సందర్భంగా గైర్హాజరవుతారో అని నేతలు సంశయుం వ్యక్తంచేయగా అలాంటి పరిస్థితి ఉండదని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. -
పార్టీలకతీతంగా సమైక్యానికి అఫిడవిట్లు ఇవ్వాలి
* అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు జగన్ పిలుపు * కిరణ్, చంద్రబాబు ఏం చెప్పినా మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి * రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించాలి * ముసాయిదా బిల్లుపై చర్చలో పాల్గొంటే విభజనకు అంగీకరించినట్లే * ముందుగా సమైక్య తీర్మానం చేయటం కోసం అందరూ పట్టుపట్టాలి * సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి, పార్లమెంటుకు పంపించాలి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలందరూ తమ మనస్సాక్షి ప్రకారం తామంతా సమైక్యానికి కట్టుబడి ఉన్నామని, సమైక్యానికి మద్దతుగా రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏం చెప్తారన్న విషయాన్ని పక్కనపెట్టాలని సూచించారు. ‘‘వీరేం చెప్పినా.. ప్రజాప్రతినిధులంతా తమ మనస్సాక్షికి అనుగుణంగా సమైక్య రాష్ట్రం కోసం రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇవ్వాలి. అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకించాలి. అప్పుడే పార్లమెంటులో మన బలం పెరుగుతుంది. కోర్టుల్లోనూ మన వాదనకు బలం చేకూరుతుంది’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజనకు ముసాయిదా బిల్లు పంపి.. దానిపై చర్చించమనటం ఏరకమైన పద్ధతి అని ప్రశ్నించారు. బిల్లుపై చర్చలో పాల్గొనట మంటే విభజనకు అంగీకరించినట్లే అవుతుందన్నారు. ముందుగా సభ్యులంతా సమావేశమై సమైక్య తీర్మానం కోసం గట్టిగా పట్టుపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విడగొడితే ఏ రకమైన అన్యాయాలు జరుగుతాయో.. ఎంతటి దారుణ పరిస్థితులు ఉత్పన్నమవుతాయో తెలియజేస్తూ ఒక నోట్ విడుదల చేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ నోట్ ఇచ్చి, సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేయాలని గట్టిగా పట్టుపడతామని తెలిపారు. వైఎస్ జగన్ గురువారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి.. హైదరాబాద్లో విడిది చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అఫిడవిట్లు సమర్పించారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని.. తామిచ్చిన అఫిడవిట్లలోని ప్రతి విషయాన్నీ పరిశీలించారని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ చెప్పిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... సమైక్యం కోసం అఫిడవిట్లు సమర్పించాం... ‘‘మా పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో సహా.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అఫిడవిట్లు సమర్పించాం. గతంలోఅవిశ్వాస తీర్మానం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసి అనర్హతకు గురైన 15 మంది ఎమ్మెల్యేలలో 13 మంది మాతో పాటే విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చారు. విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచినందుకు వారు అప్పట్లో అవిశ్వాస తీర్మానానికి ఓట్లేశారు. ఆ రోజు వారిని వెంటనే అనర్హులుగా చేసి ఉంటే ఉప ఎన్నికలు జరిగి, తద్వారా గెలిచి శాసనసభలో సమైక్యానికి తోడుగా నిలబడేవారు. అయితే ఒక కుట్రతో పథకం ప్రకారం మూడు నెలలు సాగదీసి ఆ తర్వాత అనర్హత వేటు వేశారు. సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపు గడువుండగా ఈ అనర్హత వేటు వేసి.. ఆ స్థానాలకు ఉపఎన్నికలు రాకుండా కుట్ర చేశారు. ఆ విషయాలన్నింటినీ ఈ రోజు రాష్ట్రపతికి తెలియజేస్తూనే.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారంతా అఫిడవిట్లు ఇచ్చారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు లండన్ పర్యటనలో ఉన్నందువల్ల అఫిడవిట్ ఇవ్వలేకపోయారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యే వనిత కూడా సమాచారం లేనందువల్ల అఫిడవిట్ ఇవ్వలేకపోయారు. త్వరలోనే వారివీ రాష్ట్రపతికి పంపుతాం. వారూ మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి ‘‘మేం చేసినట్లుగా మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీలకతీతంగా ముందుకువచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అఫిడవిట్లు ఇవ్వాలని మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నా. ఇలా కోరాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. తన పార్టీ ఎమ్మెల్యేలు అఫిడవిట్లు ఇవ్వడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కచ్చితంగా అంగీకరించరు. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సమైక్యానికి అఫిడవిట్లు ఇచ్చి, బాబు ఇవ్వకపోతే ప్రజలు ఆయనవైపు వేలెత్తిచూపుతారన్న భయంతో అఫిడవిట్లు ఇవ్వకుండా ఆయన అందరినీ ఆపే కార్యక్రమం చేస్తారు. బాబు గతంలో కూడా సమైక్యంకోసం లేఖ ఇవ్వలేదు. ఏపీఎన్జీవోలు కలిసినప్పుడు సమైక్యానికి అనుకూలంగా, విభజనకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వాలని బతిమిలాడితే.. ‘నేనివ్వను పో’ అని నిర్దయగా చెప్పిపంపారు. ముఖ్యమంత్రి కిరణ్ కూడా ప్రతి రోజూ ఏదో ఒకటి చెప్పి మభ్య పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఒకవైపు చర్చ జరగాలంటున్న కిరణ్.. ఇప్పుడు ఉద్యోగుల వివరాలు సమర్పించాలంటూ 56 ప్రభుత్వశాఖలకు నోట్ పంపారు. విభజనకు సంబంధించి కార్యదర్శుల స్థాయి నుంచి శాఖలన్నింటి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కిరణ్ ఏమి చెప్పినా.. బాబు ఏమి చెప్పినా.. ప్రతి ఎమ్మెల్యే వారి మనస్సాక్షిని అడగమని కోరుతున్నా. ఆ మనస్సాక్షి ప్రకారం రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చి.. తద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో తోడ్పాటునందించాలని ప్రార్థిస్తున్నా. ఏదోలా బిల్లును ముందుకుతోయాలనే వారి తొందర అత్యధిక ఎంపీ సీట్లు గెలిపించి కేంద్రంలో అధికారంలో కూర్చోబెడితే వాళ్లే రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా రెచ్చగొట్టి.. ఇక కొట్టుకుచావండి అనే పద్ధతిలో నాయకత్వం ఉండకూడదు. ఒకవైపు విభజన మీద అసెంబ్లీలో చర్చ జరగాలంటారు. ఇంకొకవైపు కనీసం విభజనకు సంబంధించిన సమాచారం వీళ్ల దగ్గరలేదు. ఇంకొకళ్లకి ఇవ్వరు. సమాచారం ఇవ్వకుండానే చర్చ జరిగిపోవాలట. ఏదో ఒకటి చర్చ జరిపి, ఏదో ఒకటి చెప్పి ముందుకు తోసేయాలని ముఖ్యమంత్రి కిరణ్, స్పీకర్ మనోహర్లు చాలా తొందర పడుతున్నారు. యూపీ నుంచి ఉత్తరాఖండ్ను విడగొట్టినపుడు ఎలా చేశారన్న కనీస అవగాహన స్పీకర్కు ఉందా? ఉత్తరాఖండ్ను విడగొట్టినపుడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాతే విభజనపై ముందుకెళ్లారు. కానీ ఇక్కడ మాత్రం అసెంబ్లీ తీర్మానం సంగతి పట్టించుకోకుండా ఏకంగా ముసాయిదా బిల్లును అసెంబ్లీకి పంపారు. అక్కడికీ, ఇక్కడికీ తేడా ఎంతుందో ఇప్పటికైనా అర్థమవుతోందా? ఈ రకంగా అడ్డగోలుగా విభజించటం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు విభజనను అడ్డుకోకపోతే చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డిలే కాదు స్పీకర్తో సహా అంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కుట్రను బట్టబయలు చేయాల్సింది పోయి... టీడీపీతో సహా కుట్రపూరిత రాజకీయ నేతలంతా చర్చకు మొగ్గుచూపుతూ ఉన్నారు. అసలు విభజనపై సభలో అభిప్రాయం తీసుకోకుండా బిల్లుపై చర్చ జరగటంలో అర్థమేమైనా ఉందా? అసెంబ్లీలో ముందుగా తీర్మానం లేకుండా ముసాయిదా బిల్లుపై చర్చ జరగటం అంటే విభజనకు అంగీకరించినట్లు కాదా? మొదట అందరూ సమావేశమై సమైక్య తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన తర్వాత దానిని కేంద్రానికి పంపాలి. అది చూసి కూడా రాష్ట్రాన్ని విడగొట్టండి అని ముసాయిదా బిల్లు పంపితే.. దానిపై చర్చ జరగాలి. కానీ.. తీర్మానం లేకుండానే విభజనకు అనుకూలంగా బిల్లు పంపిచేశారు. దానిపై చర్చించండి అని మనపై రుద్దుతూ ఉన్నారు. మన కళ్లెదుటే ఈ కుట్ర కనపడుతూ ఉంటే.. దానిని అడ్డుకోవాల్సింది పోయి, బట్టబయలు చేయాల్సింది పోయి.. మనమే నాలుగడుగులు ముందుకేసి అంగీకారం తెలిపితే ఎలా? సమైక్య తీర్మానం చేసి దానిని పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు పంపించటం ద్వారా ఈ కుట్రను అడ్డుకోవాలి.’’ అంత ‘గొప్ప’ మనస్తత్వం ఆ పత్రికకే ఉంది... ‘‘అసలు ఏపీఎన్జీవో అనేది ఒక ఉద్యోగుల సంఘం. మొత్తం 800 ఓట్లు. పులివెందులలో 4 ఓట్లు ఉన్నాయి. అందులో మీరు రాజకీయాలు చూపిస్తారు. ఆంధ్రజ్యోతిలో రాస్తారు.. అసలు ఒక తరంగా...ని పేపర్ అది. ‘జగన్కు ఝలక్...’ అట. (ఆ పత్రిక ప్రతినిధిని ఉద్దేశించి) వాహ్వా.. ఏమి హెడ్డింగ్ పెట్టావయ్యా! పులివెందులలో మొత్తం రెండు లక్షల ఓట్ల ప్రజానీకానికి సంబంధించి నాలుగు ఓట్లకు తెచ్చారు. అక్కడా రాజకీయం చేయదల్చుకున్నారు. ఎవరి గురించైతే పత్రికలో రాశారో అదే దుర్గాప్రసాద్ విలేకరుల సమావేశం పెట్టి ఆంధ్రజ్యోతి పేపర్ను కడిగేశారు. వైఎస్ కుటుంబానికి పూర్తిగా విధేయులుగా ఉన్నామని చెప్పారు. అసలు ఏపీఎన్జీవో అనేది ఉద్యోగుల సంఘం. వాళ్ల ఎన్నికలు వాళ్లు చేసుకుంటున్నారు. అందులో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు.. అనే విషయాలతో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నా స్థాయిలో ఉన్న వ్యక్తికి పనేముంటుంది? నాకు తెలిసినంత వరకూ ఏ రిజిస్టర్డ్ పార్టీ కూడా ఈ రకంగా 800 ఓట్లు ఉన్న ఒక ఉద్యోగ సంఘం రాజకీయాలను పెద్దది చేయాలని అనుకోదు. ఇలాంటి వాటిలో కూడా రాజకీయాలు చేయాలనే గొప్ప మనస్తత్వం ఎవరికైనా ఉందంటే అది ఒక్క ఆంధ్రజ్యోతి దినపత్రికకు, ఇంకా ఏబీఎన్ అనే చానల్కు మాత్రం ఉంది.’’ (మీడియా సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జగన్ పై విధంగా స్పందించారు. -
చర్చించి.. వ్యతిరేకించాల్సిందే
ఏపీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు అశోక్బాబు విజయనగరం/విశాఖపట్నం, న్యూస్లైన్: రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో పూర్తిస్థాయి చర్చ జరిపి వ్యతిరేకించాల్సిందేనని, అప్పుడే ఆ బిల్లు పార్లమెంటులో వీగిపోతుందని ఏపీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. విజయనగరం, విశాఖలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐక్యకార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 28న హైదరాబాద్లో అఖిలపక్షాల సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. సమైక్య తీర్మానం చేయాలని కోరుతూ ఎమ్మెల్యేల నుంచి ప్రత్యక్షంగా అఫిడవిట్లు స్వీకరించలా, లేక వ్యక్తిగతంగా తీసుకోవాలా అనే దానిపై ఈ సదస్సులో నిర్ణయిస్తామన్నారు. ప్రతి పంచాయతీలో సమైక్య తీర్మానం చేయించి ఆ ప్రతులను రాష్ర్టపతి, స్పీకర్, గవర్నర్లకు పంపిస్తామని చెప్పారు. ఉద్యోగులు చేస్తున్న సమైక్య ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సీమాంధ్రుల మనోభావాలను కించపర్చే విధంగా వ్యవహరించిన కేంద్రమంత్రులు, ఎంపీల రాజకీయ భవిష్యత్ను సమాధి చేస్తామని హెచ్చరించారు. కాగా, ఉద్యోగ సంఘాల్లో కొంత అసంతృప్తి ఉండడం సర్వసాధారణమని, ఏపీఎన్జీవో అసోసియేషన్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతున్నాయని అశోక్బాబు అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఐక్యంగా పోరాడతామని, దీనికోసం వాదనలు, అభిప్రాయాలను పక్కన పెట్టాల్సిదేనని స్పష్టంచేశారు. నాయకుడు ఎవరైనా సమైక్య ఉద్యమం కొనసాగుతుందన్నారు. -
`చంద్రబాబు అడ్రస్ బీజేపీ కార్యాలయంగా మారింది`
ఖమ్మం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు బలహీన పడ్డారంటూ ఘాటుగా విమర్శించారు. గురువారం ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన సీపీఐ సభలో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు చంద్రబాబు అడ్రస్ బీజేపీ కార్యాలయంగా మారిందంటూ ఎద్దెవా చేశారు. విభజన నిర్ణయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని నారాయణ అన్నారు. దీంతో కాంగ్రెన్ నుంచి భారీగా వైఎస్ఆర్సీపీ, టీడీపీలకు దరఖాస్తులు వెళ్తున్నాయని నారాయణ చెప్పారు. -
సమైక్య తీర్మానమే రాష్ట్రానికి రక్ష
-
సమైక్య తీర్మానమే రాష్ట్రానికి రక్ష
* ‘సాక్షి’తో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ఉద్ఘాటన * రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన ప్రక్రియ * తీర్మానం కోరకుండా నేరుగా ముసాయిదా బిల్లు పంపడం చట్టసభలను అవమానించడమే * అసెంబ్లీ విభజనకు అనుకూలమా? ప్రతికూలమా ముందు తేలాలి * ఈ అంశంపై సీఎం అనుబంధ తీర్మానం ప్రతిపాదించొచ్చు * సమైక్య రాష్ట్రంపై చిత్తశుద్ధిలేనివారే సమైక్య తీర్మానానికి పట్టుబట్టరు * విభజనపై సభల అభిప్రాయం తీసుకోకుండా డ్రాప్టుపై చర్చకు అర్థం లేదు * ముసాయిదాపై చర్చకు అంగీకరించడమంటే.. విభజనకు అంగీకరించినట్లే! * తీర్మానానికి అసెంబ్లీలో పట్టుబట్టాలేగాని.. సభనూ ఎవరూ బాయ్కాట్ చేయకూడదు * బాయ్కాట్ చేస్తే టీ సభ్యులు చెప్పిందే సభ అభిప్రాయంగా కేంద్రానికి పంపే ప్రమాదముంది * జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్ర విభజనపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రను కాంక్షిచేవారందరూ.. సమైక్య రాష్ట్ర తీర్మానం చేయాల్సిందిగా అసెంబ్లీలో పట్టుబట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, సమైక్యాంధ్రను కాంక్షించేవారు అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ను విభజించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ (రాష్ట్రాల విభజన, కలపడం, సరిహద్దుల మార్పు) విషయంలో చట్టసభలకున్న అధికారాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇది చట్టసభలను (ప్రజలను) అవమానించడమే. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం సుమోటోగా విభజన బిల్లు రూపొందించి శాసనసభ అభిప్రాయాల (వ్యూస్) కోసం పంపింది. ఇందులో కూడా రాష్ట్రాన్ని విభజించాలా? కలిపి ఉంచాలా? అనే ఆప్షన్ లేదు. అందువల్ల దీనిపై చర్చలో పాల్గొనడమంటే సూత్రప్రాయంగా రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లే అవుతుంది. అందువల్ల దీనిపై చర్చను అడ్డుకుని సమైక్య తీర్మానం కోసం సభ్యులు పట్టుబట్టాల్సిందే’ అని లక్ష్మణరెడ్డి స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి మొదట నుంచి చేసిన డిమాండు ఇదే కదా! రాష్ట్రానికి కేంద్రం నుంచి ముసాయిదా బిల్లు రాకముందే సమైక్య రాష్ర్టం కోసం అసెంబ్లీలో తీర్మానం చేద్దామని అన్ని రాజకీయ పక్షాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా ముందే విజ్ఞప్తి చేశారు. అప్పట్లో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక తరఫున ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కలిసి ఇదే ప్రతిపాదన చేశాను. రాష్ట్ర పునర్విభజనపై తీర్మానం కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఎటూ ప్రతిపాదన పంపుతుందని, అప్పుడూ వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ద్వారా తీర్మానం పంపితే బాగుంటుందని సీఎం చెప్పారు. కేంద్రం నుంచి ప్రతిపాదన రాకముందే మనం సుమోటోగా తీర్మానం పంపినా పక్కన పడేసే అవకాశం ఉందని సీఎం చెప్పడంతో ఆనాడు సంతృప్తి చెందాం. తర్వాత దిగ్విజయ్సింగ్, షిండేతోపాటు ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం చెప్పాల్సిందిగా ఒకసారి తీర్మానం కోరతారని, మరోసారి ముసాయిదా బిల్లు వస్తాయని ప్రకటించారు. ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీర్మానాన్ని కోరకుండా నేరుగా ముసాయిదా బిల్లునే పంపింది. ఇందులో కూడా రాష్ట్ర విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అనే క్లాజు లేదు. ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉంది. ఆర్టికల్ 3 కింద రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం కేంద్ర ప్రభుత్వానిదే కదా? రాష్ట్రాలను అడ్డగోలుగా విభజించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించలేదు. రాష్ట్ర విభజనకు రెండు విధానాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం పంపితే దానిని కేబినెట్ ఆమోదించి తర్వాత ముసాయిదా బిల్లు రూపొందించి పంపడం ఒక విధానం. కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రాల పునర్విభజన కమిటీ(ఎస్ఆర్సీ) తరహాలో నిపుణుల కమిటీని వేయడం. ఆ కమిటీ నివేదికను పార్లమెంటులో చర్చించి పార్లమెంటు చేసే సవరణల ప్రకారం ముసాయిదా బిల్లును రూపొందించడం. మన రాష్ట్రం విషయంలో ఇవి రెండూ జరగలేదు. నేరుగా కేంద్రం తనకు నచ్చినట్లు ముసాయిదా బిల్లు రూపొందించింది. చట్టసభలు రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటే ఆర్టికల్ -3 ద్వారా దానిని అమలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మామూలుగా కూడా చట్టసభలు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే దాన్నిఅమలు చేసే అధికారం ప్రభుత్వానికి (కార్యనిర్వాహక వ్యవస్థకు) ఉంటుంది. ఆర్టికల్ -3 సవరించాలనే డిమాండుపై.. కేంద్రం ప్రభుత్వమంటే అధికారపక్షమే. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్న ప్రస్తుత అధికార పక్షం తనకు అనుకూలించే రాజకీయ ధ క్పథంలో ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించే ప్రయత్నం చేస్తోంది. అందువల్లే రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఆంధ్రను కేంద్రం విభజిస్తున్న విషయాన్ని, ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరం గురించి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ పార్టీల నేతలను కలిసి వివరించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం జగన్ చొరవ వల్ల ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆంధ్రను విభజిస్తే అంగీకరించబోమని, పార్లమెంటులో వ్యతిరేకిస్తామని వివిధ రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు చెప్పారు. మరిప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ముందున్న పరిష్కారమార్గం ఏమిటి? రాష్ట్ర విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అనే అంశంపై సభ అభిప్రాయం తీసుకుని ఓటింగ్ నిర్వహించాలని సభా నాయకుడైన సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రతిపాదించొచ్చు. సభలో ఎవరైనా అంశంపై ప్రైవేటు తీర్మానం ప్రతిపాదించినా స్పీకరు ఆమోదించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజనకు సంబంధించి తీర్మానం చట్టసభల నుంచే రావాలి. అయితే మన రాష్ట్ర విభజనకు సంబంధించి అటు పార్లమెంటులో గానీ, ఇటు అసెంబ్లీలోగానీ తీర్మానం జరగలేదు. కేంద్ర ప్రభుత్వమే సుమోటోగా ముసాయిదా బిల్లును రూపొందించి రాష్ట్రంపై రుద్దింది. ఇది చట్టసభలను అగౌరవపరచడమే. ఈ నేపథ్యంలో మన చట్టసభకు ఉన్న అధికారాన్ని వినియోగించుకునేందుకు సమైక్య తీర్మానం కోరుతూ సభ్యులు నోటీసు ఇస్తే స్పీకరు అనుమతించాల్సిందే. లేకపోతే మన సభ గౌరవాన్ని మన సభాపతే మంటగలిపినట్లు అవుతుంది. సభ గౌరవాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్న స్పీకరు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించలేరు. రాష్ట్రపతి పంపిన ముసాయిదాకు ప్రాధాన్యం అంటున్నారు? అసలు ఇది రాష్ట్రపతి పంపినది కాదు. కేంద్ర హోంశాఖ రూపొందించి పంపిన ముసాయిదా బిల్లు మాత్రమే. ప్రొసీజర్లో భాగంగా రాష్ట్రపతికి వెళ్లి వస్తుంది. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాలు వెళ్లిన తర్వాత కేబినెట్ మళ్లీ దానిని రాష్ట్రపతికి పంపితే రాష్ట్ర విభజన బిల్లు ప్రతిపాదించాలా? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుని కేబినెట్కు పంపుతారు. అయితే రాష్ట్ర విభజనపై సభ అభిప్రాయాలు తెలియకుండా విభజనవల్ల తలెత్తే అంశాలపై సభలో ఎలా చర్చిస్తారు? ముందు విభజనకు అనుకూలమా? ప్రతికూలమా? అనే అంశం తేల్చాలి. విభనకు సభ అనుకూలమని (మెజార్టీ సభ్యుల అభిప్రాయాలే(వ్యూస్) సభ అభిప్రాయాలుగా పరిగణిస్తారు) సభ అభిప్రాయపడితే విభజన బిల్లుపై చర్చించవచ్చు. రాష్ట్రాన్ని విభజించవద్దని సభ అభిప్రాయపడితే తదుపరి ముసాయిదా బిల్లుకే విలువ ఉండదు. క్లాజుల వారీ ముసాయిదా బిల్లుపై చర్చించాలని సీఎం అంటున్నారు? అది అర్థరహితం. సీమాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. సీమాంధ్ర శాసనసభ్యులు కూడా రాజ్యాంగ విరుద్ధంగా, చట్టసభల తీర్మానం లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు పంపిందని, దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని బయట చెబుతున్నారు. ఇలాంటప్పుడు విభజన బిల్లుకు సంబంధించి క్లాజులపై ఎలా చర్చిస్తారు? చర్చను అంగీకరించడమంటే.. రాష్ట్ర విభజనను సూత్రప్రాయంగా అంగీకరించినట్లే కదా? ఇప్పుడు చర్చలో పాల్గొంటే .. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లును పంపిందని సుప్రీంకోర్టులో ఎలా వాదిస్తారు? రాజ్యాంగ విరుద్ధమైతే చర్చలో ఎలా పాల్గొన్నారని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే కేసు బలహీనపడుతుంది. అందువల్ల బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లో చర్చకు అంగీకరించరాదు. రాష్ట్ర విభజన గురించి కేంద్రం ప్రకటించగానే సీమాంధ్ర రాజధాని కోసం రూ. 4 లక్షల కోట్లు ఇవ్వాలని డిమాండు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు సమన్యాయం అంటూ తప్పించుకు తిరుగుతున్నారు.. సీఎం మాత్రం విభజనకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ క్లాజులవారీగా ముసాయిదా బిల్లుపై చర్చించాలంటున్నారు.. దీనిని ఏమనుకోవాలి? అందుకే రాష్ట్ర విభజనకు అనుకూలమా? ప్రతికూలమా? అనే అంశంపై సభలో చర్చించాలని పట్టుబడితే సమన్యాయం అనేవారు, విభజనను అడ్డుకుంటామంటూ పరోక్షంగా సహకరించే వారి బండారం బయటపడుతుంది. విభజనకు వ్యతిరేకంగా నిలిచిందెవరో? ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా విభజనకు సహకరించేదెవరో ఓటింగ్లో తేలిపోతుంది. వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. అందుకే రాష్ట్ర విభజనను బహిరంగంగా వ్యతిరేకించకుండా గూడు పుఠాణి చేసేవారే, సమైక్య రాష్ట్రంపై చిత్తశుద్ధి లేనివారే తీర్మానం కోసం పట్టుబట్టకుండా వెనుకంజ వేస్తారు. బహిష్కరించవద్దు సమైక్య తీర్మానం కోసం సభ్యులు పట్టుబట్టాలేగానీ స్పీకరు అనుమతించకపోతే బాయ్కాట్ చేయరాదు. స్పీకరు సస్పెండు చేస్తే తప్ప సీమాంధ్ర సభ్యులెవరూ బాయ్కాట్ చేయరాదు. బాయ్కాట్ చేస్తే తెలంగాణ సభ్యులే అనుకూలంగా మాట్లాడి సభ అభిప్రాయం కింద కేంద్ర ప్రభుత్వానికి పంపే ప్రమాదం ఉంది. ఒక వేళ స్పీకరు సస్పెండ్ చేస్తే ఆ విషయం రికార్డు అవుతుంది. అప్పుడు సభ్యులంతా సమైక్యానికే కట్టుబడి ఉన్నట్లు అఫిడవిట్లు సమర్పించవచ్చు. మమ్మల్ని సభ నుంచి బహిష్కరించి అతి తక్కువమంది అభిప్రాయాన్నే సభ అభిప్రాయం కింద పంపారని వాదించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాన్ని రాష్ట్రపతితోపాటు కోర్టులు కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. -
అడ్డుకోవడం సీమాంధ్రుల తరం కాదు: ఈటెల
కరీంనగర్: అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ ప్రెస్భవన్లో తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్ (టీఆర్టీయూ) రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఈటెల రాజేందర్ బుధవారం ఆవిష్కరించిన ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ ఇప్పటికే మొదలైందని.. అది జరిగినా.. జరగకపోయినా ముసాయిదా బిల్లు ఢిల్లీకి వెళ్లి ఆమోదం పొందుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం సీమాంధ్రుల తరం కాదన్నారు. రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. అలాగే, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా 15 రోజుల్లోగా విడుదల చేయని పక్షంలో టీఆర్ఎస్ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఈనెల 30లోపు ఉద్యోగ, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్కార్డుల విషయంలో జారీ చేసిన 174,175,176 జీవోలు అసంబద్ధంగా ఉన్నాయునీ, వీటిని సవరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ అసెంబ్లీలో కాంగ్రెస్, టీడీపీ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. -
'చివరి బంతి ఎప్పుడో కిరణ్కు బాగా తెలుసు'
న్యూఢిల్లీ: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి క్రికెటర్ కాబట్టి చివరి బంతి ఎప్పుడు అనేది ఆయనకు బాగా తెలుసునని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లు 2014 ఎన్నికల్లోపు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందిని చెప్పారు. తెలంగాణ బిల్లులో లోపాలు నాకు తెలియదని దిగ్విజయ్ అన్నారు. అయితే టీఆర్ఎస్ విలీనానికి, విభజనకు ఎలాంటి సంబంధం లేదని, తాము రాజకీయాలను పరిపాలనతో ముడిపెట్టమని దిగ్విజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ అనేది ప్రజలకిచ్చిన వాగ్దానమని ఆయన అన్నారు. అన్ని రాజకీయపక్షాలు ఆమోదం తర్వాతే తెలంగాణను ప్రకటన చేశామని, విభజనపై తాము వెనక్కి వెళ్లలేమని దిగ్విజయ్ తేల్చిచెప్పారు. -
`విభజన జరిగినా కాంగ్రెస్ నుంచే పోటీచేస్తాం.. గెలుస్తాం`
విశాఖపట్నం: తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో.. సమైక్యంపై ముగ్గురు మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై అవాస్తవ కథనాలు ఇస్తున్నారని మంత్రి కోండ్రు మురళీ వ్యాఖ్యానించారు. విభజన జరిగిన సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగదని కోండ్రు అన్నారు. విభజన జరిగినా.. తాము కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తాం.. గెలుస్తామని మంత్రి కోండ్రు మురళీ స్పష్టం చేశారు. కొత్త పార్టీ అనే ప్రచారమంతా మీడియా కుట్రేనని కోండ్రు తెలిపారు. కాగా, అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రజలు ఉద్యమించాలని టీజీ వెంకటేశ్ చెప్పారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరిగితే మంత్రులుగా తామే అబాసుపాలవక తప్పదని టీజీ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి చెప్పారు. -
బిల్లుపై చర్చను బహిష్కరించండి
సమైక్యాన్ని కోరుకునే ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు చర్చలో పాల్గొంటే విభజనకు సహకరించినట్టే అవుతుంది మీ వాదనను మీరే వ్యతిరేకించినట్టు అవుతుంది: జస్టిస్ లక్ష్మణరెడ్డి విభజనను వ్యతిరేకించేవారంతా సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టాలి సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రాన్ని కోరుకునే ప్రజాప్రతినిధులంతా అసెంబ్లీలో విభజన బిల్లుపై జరిగే చర్చను బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. కేవలం విభజన కోసం ఉద్దేశించిన ఈ బిల్లుపై చర్చలో పాల్గొనడమంటే విభజనకు అంగీకరించినట్టే అవుతుందని స్పష్టం చేశారు. తీర్మానంపై ఓటింగ్ అంటూ ముఖ్యమంత్రి చెబుతున్న మాటలన్నీ బూటకమని మండిపడ్డారు. కావాలంటే విభజన కావాలా.. వద్దా అంటూ ఒక తీర్మానం తీసుకువచ్చి ముందు దానిపై ఓటింగ్ చేపట్టాలని, అందులో మెజారిటీ సభ్యులు విభజనకు అంగీకరిస్తే అప్పుడు బిల్లుపై చర్చ చేపట్టాలని సూచించారు. విభజనను వ్యతిరేకించే ఎమ్మెల్యేలంతా సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టాలన్నారు. వేదిక సభ్యుడు పి.రాంబాబుతో కలిసి సోమవారం హైదరాబాద్లోని తెలుగు ప్రజావేదిక కార్యాలయంలో లక్ష్మణరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘బిల్లుపై ఓటింగ్ పెడతామని ముఖ్యమంత్రి చెబుతోందంతా నాటకమే. ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్న నాటకమని మేం భావిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రాన్ని కలిపి ఉంచాలా, విడదీయాలా అన్న క్లాజు ఈ బిల్లులో ఎక్కడైనా ఉందా? అలా ఉంటే దానిపై ఓటింగ్ పెట్టినా, సవరణలు పెట్టినా అర్థం ఉంటుంది. కానీ అలాంటిదేమీ లేదు కాబట్టి చర్చలో పాల్గొంటే ఆత్మహత్యాసదృశమే అవుతుంది. విభజన ఎలా జరపాలన్నదే ఈ ముసాయిదా బిల్లు ముఖ్య ఉద్దేశం. అసెంబ్లీల్లో తీర్మానం లేకుండా రాష్ట్రాలను విభజించే హక్కు కేంద్రానికి లేదు అని వాదిస్తున్నప్పుడు చర్చలో పాల్గొనడమంటే అది విభజనకు అంగీకరించినట్లే అవుతుంది. బిల్లు తయారీతో చట్టసభలకు జరిగిన అవమానాన్ని ఎత్తిచూపకుండా.. బిల్లు గురించి చర్చించడమంటే అర్థమేంటి? అలా చేస్తే బిల్లుకు సహకరించినట్టే అవుతుంది. మీ వాదన బలహీనపడుతుంది. విభజనే అంగీకారయోగ్యం కాదన్నప్పుడు బిల్లుపై చర్చించడం అంటే మీ వాదనను మీరే వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంటుంది’’ అని లక్ష్మణరెడ్డి అన్నారు. ముసాయిదా బిల్లుపై జరిగే చర్చను సమైక్యవాదాన్ని బలపరిచే శాసనసభ్యులందరూ బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమైక్యవాద తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి గెలిపించుకోవటానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. ‘‘విభజన కావాలా వద్దా అని తీర్మానం తీసుకురండి. కావాలంటే దానిపై ఓటింగ్ పెట్టండి. ఆ తీర్మానంలో మెజారిటీ సభ్యులు విభజనకు అంగీకరిస్తేనే అప్పుడు చర్చలో పాల్గొనవచ్చు. అలా లేకుండా నేరుగా బిల్లుపై చర్చలో పాల్గొనడమంటే అంత కంటే విడ్డూరం ఏమైనా ఉంటుందా? ఒకవేళ ఇప్పుడు విభజన చర్చలో పాల్గొని రేప్పొద్దున సుప్రీంకోర్టులో ఏమని వాదిస్తారు?’’ అని నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రజల అభిమతానికి అనుగుణంగా నడుచుకోవాలి ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గ ప్రజల మనోభావాలకు అనుగుణంగా అసెంబ్లీలో సమైక్యవాణిని వినిపించాలని లక్ష్మణరెడ్డి కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ ప్రజల అభిమతానికి అనుగుణంగా శాసనసభలో నడుచుకోవాలన్నారు. ‘‘మనం ఇటీవలే ఢిల్లీలో చూశాం. అక్కడ బీజేపీ, కాంగ్రెస్లను ఓడించారంటే అది అక్కడున్న 5 లక్షల మంది తెలుగువారి ధృ డమైన అభిప్రాయం వల్లే సాధ్యమైంది. ఇక్కడుండే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రతినిధులు కూడా దీన్ని గమనించి ఇక్కడి ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకోవాలి. అప్పుడే వారికి భవిష్యత్తు ఉంటుంది’’ అని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలే సుప్రీం అన్నారు. ‘‘చట్టసభలే సుప్రీం. ఎగ్జిక్యూటివ్ (కార్యనిర్వాహక వ్యవస్థ) కాదు. ఏ చట్టసభలో తీర్మానంపై చర్చించకుండా విభజనపై నిర్ణయం తీసుకునే ప్రభుత్వానికి అధికారం లేదన్నదే మా వాదన. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో చెబుతాం’’ అని స్పష్టం చేశారు. 3 నుంచి సమైక్య కళాభేరి విభజనతో కలిగే నష్టాలను సామాన్య ప్రజలకు వివరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి సీమాంధ్రలో సమైక్య కళాభేరిలను నిర్వహిస్తున్నట్లు లక్ష్మణరెడ్డి తెలిపారు. అన్ని మం డల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామన్నారు. 120 మంది కళాకారులతో కూడిన 13 కళా బృందాలు కోలాటం, జానపదం, నృత్యనాటికలు, వీధి నాటికలతో పలు కళారూపాలను ప్రదర్శించనున్నాయని తెలిపారు. -
సీఎం కిరణ్ శైలిపై ఎందుకు చర్య తీసుకోరు: బాలినేని
ప్రకాశం: కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శైలిపై ఎందుకు చర్య తీసుకోదని బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో.. సమైక్య ముసుగులో కాంగ్రెస్, టీడీపీలు మోసం చేస్తున్నాయని బాలినేని ఆరోపించారు. సమైక్య రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అఫిడ్విట్ ఇవ్వకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తే లాభం ఏంటీ ? అని ఆయన ప్రశ్నించారు. కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తేనే ఆయన్నుపార్టీ నుంచి బయట పంపిన కాంగ్రెస్ హైకమాండ్.. మరీ ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శైలిపై ఎందుకు చర్య తీసుకోరని బాలినేని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. -
తెలంగాణ బిల్లుపై చర్చ జరగాల్సిందే: మంత్రి డొక్కా
హైదరాబాద్: విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగాల్సిందేనంటూ మంత్రి డొక్కా మాణిక్కవరప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ బిల్లులో అనేక లోపాలున్నాయని ఆయన అన్నారు. సభలో మాట్లాడే అవకాశం వస్తే తెలంగాణ బిల్లులోని లోపాలను తెలపుతానని డొక్కా స్పష్టం చేశారు. విభజనతో సంబంధం లేకుండా.. 2011 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే నియోజకవర్గాలు పెంచాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. -
కిరణ్ ఎందుకిలా చేస్తున్నారు?
హైదరాబాద్: శాసనమండలిలో సీఎం కిరణ్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష ఉపనేత శోభానాగిరెడ్డి మండిపడ్డారు. విభజన విషయంలో బీహార్, యూపీ సంప్రదాయాలను పాటించాలని చెబుతున్న సీఎం- ఇక్కడెందుకు వాటిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అక్కడ విభజన తీర్మానంపై చర్చ జరిగాకే బిల్లు పెట్టారని గుర్తు చేశారు. మరిక్కడ ఎందుకిలా చేస్తున్నారని నిలదీశారు. సీఎంగా మీ బాధ్యతలేంటో మీరు నిర్వహించాలని సూచించారు. సమైక్య ముసుగులో సోనియా గాంధీ ఆదేశాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిద్దామని గతంలో చెప్పిన సీఎం - శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) సమావేశంలో ఎందుకు మౌనంగా ఉన్నారని అంతకుముందు ఆమె ప్రశ్నించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
చంద్రబాబుకు పోస్టులో చీరలు, గాజులు
ఆదిలాబాద్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. టీఆర్ఎస్ నాయకులు పోస్టు ద్వారా చీర, గాజులను చంద్రబాబుకు పంపి, బాబుకు, టీడీపీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సాజిదొద్ధిన్, బండారి సతీష్, మేకల ఆనంద్, ఆంజనేయులు పాల్గొన్నారు. -
ఐకమత్యంతో ‘టీ’ బిల్లును అడ్డుకోవాలి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్లైన్: సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాడాలని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ కూడలి వద్ద వేదిక ప్రతినిధులు బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దీక్షా శిబిరం వద్దకు చేరుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేదిక గౌరవ అధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలంతా పార్టీల జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నాయకులు ఒకరిపై ఒకరు బురద జల్లుకోకుండా ఐక్యంగా ఉండి టీ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. టీ బిల్లు అసెంబ్లీకి చేరిన నాటినుంచి ప్రతి ఎమ్మెల్యే వ్యవహారశైలిని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఏఒక్కరు ఉద్యమంలోకి రాకపోయినా భవిష్యత్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పకతప్పదన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ వ చ్చి సీమాంధ్ర నేతలను బుజ్జగించి వెళ్లారని, ఈ బుజ్జగింపులకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎట్టిపరిస్థితుల్లోనూ లొంగకూడదన్నారు. వేదిక చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు అధిష్టానం ఒత్తిడికి లొంగి సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జెడ్పీ కన్వీనర్ కె.నారాయణరావు మాట్లాడుతూ తుపాన్ను అడ్డుకోలేకపోయినప్పటికీ రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చెప్పారని, తీరా టీ బిల్లు అసెంబ్లీకి వచ్చే నాటికి ఆయనతోపాటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా లేకపోవడం శోచనీయమన్నారు. విభజన జరగకముందే హైదరాబాద్లో రౌడీయిజం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశార. వేదిక ప్రతినిధి ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతోందని తెలిసి కూడా అన్ని పార్టీల నాయకులు ఎందుకు ఐకమత్యం కాలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. కార్యక్రమానికి ముందుగా వైఎస్ఆర్ కూడలి వద్ద నుంచి సమైక్యవాదులంతా పాలకొండ రోడ్డు, డే అండ్ నైట్ కూడలి, రామలక్ష్మణ, సూర్యమహల్,అరసవల్లి మీదుగా పొట్టిశ్రీరాములు జంక్షన్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పరిరక్షణ వేదిక ప్రతినిధులు బమ్మిడి నర్సింగరావు, బెండి జనార్దనరావు, పి.జయరాం, ఎం.ఆర్.కె.దాస్, పూజారి జానకిరాం, ఆర్.వేణుగోపాల్, శోభారాణి, విజయ్కుమార్, శ్రీనివాసరావు, వై.ఉమామహేశ్వరరావు, గొలివి నర్సునాయుడు, పి.రవీంద్రకుమార్, అధిక సంఖ్యలో ఎన్జీవో ఉద్యోగులు పాల్గొన్నారు. -
సభను వాయిదా వేస్తే ఊరుకోం: హరీష్రావు
హైదరాబాద్: వాయిదాలతో శాసనసభ నడపటం అప్రజాస్వామికమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. టీడీపీ డబుల్ గేమ్ ఆడటం సరైందికాదన్నారు. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్లో విభజన బిల్లుపై రెండ్రోజుల్లోనే చర్చ ముగించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించడానికి 42 రోజులు అవసరమా అని ప్రశ్నించారు. నెలాఖరులోగా చర్చ పూర్తిచేసి బిల్లు రాష్ట్రపతికి పంపాలని డిమాండ్ చేశారు. బిల్లుపై చర్చ పూర్తిచేయించే బాధ్యత తెలంగాణ మంత్రులదే అన్నారు. బిల్లుపై చర్చ జరగనీయకుండా సభను వాయిదా వేస్తే ఊరుకోబోమని హరీష్రావు హెచ్చరించారు. బిల్లులో తమకు కూడా కొన్ని అభ్యంతరాలున్నాయని తెలిపారు. వాయిదాలు వేసి తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని కోరారు. స్పీకర్ ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. చర్చను అడ్డుకునే సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఆయ పార్టీల నాయకులు కట్టడి చేసుకోవాలన్నారు. -
‘టీ’ బిల్లుపై నిరసనల వెల్లువ
సాక్షి, కాకినాడ : అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. టి-బిల్లును నిరసిస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఇచ్చిన రెండ్రోజుల విద్యా సంస్థల బంద్ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు తొలిరోజు మూతపడ్డాయి. పలుచోట్ల విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. జేఎన్టీయూకే పరిధిలో మంగళవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. అలాగే టి-బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, తెలంగాణ ప్రజాప్రతినిధులు సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రమైన కాకినాడలో వివిధ శాఖల ఉద్యోగులు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసెంబ్లీలో టి-బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏలేశ్వరంలో విద్యార్థులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. మామిడికుదురులో సమైక్యాంధ్రకు మద్దతుగా వందలాది మంది విద్యార్థులు 216 జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్లో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ కో-ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపాలరావు, మండల కన్వీనర్ చంటిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో అన్నవరంలో గడపగడపకూ వైఎస్ఆర్ సీపీ సమైక్యనాదం పాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి అన్ఎయిడెడ్ కళాశాలల అసోసియేషన్ (రూకా) ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులు శ్యామలానగర్ రామాయలం సెంటర్ లో విద్యార్థి గర్జన నిర్వహించారు. నక్సలిజం ధోరణిలో టి.ప్రజాప్రతినిధులు కాకినాడ సిటీ : తెలంగాణ ప్రజాప్రతినిధులు నక్సలిజం ధోరణిలో వ్యవహరిస్తున్నారని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టి.బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై జరిపిన భౌతిక దాడులను నిరసిస్తూ వివిధ శాఖల ఉద్యోగులు మంగళవారం కాకినాడలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద నిరసన శిబిరం నుంచి జెడ్పీ సెంటర్ మీదుగా.. తిరిగి కలెక్టరేట్ వరకు ర్యాలి చేపట్టారు. సమైక్యాంధ్ర నినాదాలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా టి.బిల్లు ప్రతులను, సోనియా, దిగ్విజయసింగ్ ఫ్లెక్సీలను దహనం చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ చట్టసభలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులపై తెలంగాణ ప్రజాప్రతినిధులు భౌతిక దాడులకు పాల్పడడం దారుణమన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి అసెంబ్లీలో మంత్రులు, శాసనసభ్యులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. సోనియా, దిగ్విజయ్సింగ్లకు అమ్ముడుపోవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కన్వీనర్ పితాని త్రినాథ్, వివిధ సంఘాల నాయకులు అనిల్ జాన్సన్, ఉదయ్భాస్కర్, ముల్లు సత్యనారాయణ మూర్తి, గెద్దాడ రామ్మోహన్రావు, పసుపులేటి శ్రీనివాస్, సరెళ్ల చంద్రరావు, కేఎస్వీ సుబ్బారావు పాల్గొన్నారు. -
నేడు బీఏసీ సమావేశం
భేటీలో తేదీ ఖరారయ్యాకే విభజన బిల్లుపై చర్చ సీమాంధ్ర నేతలకు స్పీకర్ నాదెండ్ల స్పష్టీకరణ .. సభ తీరు నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్య ప్రశ్నోత్తరాల తర్వాత బీఏసీ.. సాయంత్రం మండలి బీఏసీ చర్చ మొదలైందన్న శ్రీధర్ తీరుపై సీమాంధ్ర నేతల అసంతృప్తి ప్రసంగాన్ని పరిశీలించిన సీఎం, మంత్రులు తెలంగాణ ముసాయిదా బిల్లుపై సోమవారం అసెంబ్లీలో చర్చ ప్రారంభమైందా, లేదా అన్న అంశంపై పార్టీలకు అతీతంగా సీమాంధ్ర, తెలంగాణ శాసనసభ్యులు, నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం సాగుతున్న నేపథ్యంలో... సభలో చర్చ ఇంకా ప్రారంభం కాలేదని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పినట్టు సమాచారం. సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో తేదీని నిర్ణయించాకే దానిపై చర్చను చేపట్టాల్సి ఉంటుందని ఆయన వివరించారని తెలిసింది. ఈ వ్యవహారంపై సీమాంధ్ర మంత్రులు తదితర నేతలు స్పీకర్ను సంప్రదించారు. దాంతో ఆయన అధికారులతో సభ రికార్డులు పరిశీలింపజేశారని, చర్చ ప్రారంభం కాలేదని తేల్చారని సమాచారం. ‘‘బీఏసీ సమావేశంలో తేదీని నిర్ణయించాకే చర్చ ప్రారంభమవుతుంది. మంగళవారం ఉదయం సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత బీఏసీని నిర్వహిస్తున్నాం’’ అని వారికి స్పీకర్ వివరించినట్టు సమాచారం. అంతేగాక సోమవారం మధ్యాహ్నం సభలో జరిగినవన్నీ నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయని కూడా ఆయన అన్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి నివాసంలో జరిగిన సీమాంధ్ర మంత్రుల సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగింది. సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ స్పీకర్ మల్లు భటి ్ట విక్రమార్క సభాపతి స్థానంలో కూర్చుని సభను నిర్వహించినప్పుడు ఆయన, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు చేసిన ప్రసంగాలను కూడా కిరణ్, మంత్రులు పరిశీలించారు. తెలంగాణ బిల్లుపై చర్చను ప్రారంభిస్తున్నట్టుగా కాకుండా, ‘బిల్లుపై చర్చను ప్రారంభించాలా, లేదా అన్న అంశంపై అభిప్రాయాలు తెలుసుకొనే రీతిలోనే’ సభ సాగిందని తేల్చారు. అంతేగాక బీఏసీని సమావేశపరచకుండానే చర్చను ఎలా చేపడతారని కూడా మంత్రులు ప్రశ్న లేవనెత్తారు. దీనిపై శ్రీధర్బాబు తీరును పలువురు సీమాంధ్ర మంత్రులు తప్పుబట్టారు. బిల్లుపై చర్చ ప్రారంభం కాలేదని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ‘‘ముసాయిదా బిల్లుపై చర్చను చేపట్టే అంశంలో సభ్యులను డిప్యుటీ స్పీకర్ అభిప్రాయాలు అడిగారు. అందులో భాగంగానే శ్రీధర్బాబు మాట్లాడారు. బీఏసీ పెట్టి బిల్లుపై చర్చ తేదీని ఖరారు చేయాలని కూడా శ్రీధర్బాబే తన ప్రసంగంలో చెప్పారు. దీన్ని బిల్లుపై చర్చగా ఎలా భావిస్తారు?’’ అంటూ ప్రశ్నించారు. మంత్రి శైలజానాథ్ కూడా బిల్లుపై చర్చ జరిగిందనడాన్ని ఖండించారు. ‘‘చర్చ ఎక్కడ జరిగింది? కనీసం బిల్లును టేబుల్ చేయకుండానే చర్చను ఎలా ప్రారంభిస్తారు? బిల్లును ఈ రోజే ఇచ్చి, సభ్యులు చదవకుండానే చర్చను ప్రారంభిస్తారా? ఇదేం పద్ధతి?’’ అంటూ మండిపడ్డారు. మరోవైపు మంగళవారం సాయంత్రం శాసనమండలి బీఏసీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. -
నిరసనల మధ్య అసెంబ్లీ రేపటికి వాయిదా
-
సభ్యుల నిరసనల మధ్య అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్: సభ్యులు గందరగోళ పరిస్థితుల మధ్య అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు వేరు వేరుగా నినాదాలు చేసి ఆందోళనలు కల్గించడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టి ముట్టి ఆందోళనకర పరిస్థితులు సృష్టించారు. తొందర పాటు చర్యలు పాల్పడకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత బుధవారం జరిగిన బీఏసీలో బిల్లుపై వారం రోజులు చర్చించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు సభకు సెలవు కావడంతో తిరిగి అసెంబ్లీ సోమవారం ఆరంభమైంది. గందరగోళం నడుమ తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు స్వాగతించగా, సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేయక తప్పలేదు. -
మొహం చాటేసిన కిరణ్, బాబు: శోభా నాగిరెడ్డి
హైదరాబాద్: విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు చూసుకుందామన్న సీఎం కిరణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనేత శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వస్తే కిరణ్, చంద్రబాబు మొహం చాటేశారని విమర్శించారు. వారం రోజులుగా ప్రెస్మీట్లు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడెక్కడ అని అడిగారు. కిరణ్, చంద్రబాబు కలిసి డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. సోనియా అజెండాను బాబు, కిరణ్ కలిసి అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని పార్టీల నేతలు ఐక్యంగా రావాలని వైఎస్ జగన్ చెప్పారని తెలిపారు. విభజనపై టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. టి.టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్పై అవిశ్వాస నాటకమాడుతున్నారని శోభా నాగిరెడ్డి అన్నారు. -
మొహం చాటేసిన కిరణ్, బాబు: శోభా నాగిరెడ్డి
-
రాష్ట్రం విడిపోయిన తర్వాత రక్షణ ఉంటుందా?
తెలంగాణ ముసాయిదా బిల్లు శాసనసభ, శాసనమండలిలో చిచ్చు రేపింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా అసెంబ్లీ, మండలిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణ, సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల పోటాపోటీ నినాదాలు, వాగ్వాదాలతో అసెంబ్లీ ప్రాంగణం అట్టుడికింది. పెద్దల సభలోనూ ఇలాంటి వాతావరణమే కనిపించింది. మీడియా పాయింట్ అయితే పరిస్థితి రణరంగాన్ని తలపించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీధి రౌడీల్లా తోపులాటలకు దిగారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు-2013ను గందరగోళ పరిస్థితుల మధ్య రెండు సభల్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇరు సభల్లో సభాకార్యకలాపాలు స్తంభించాయి. రెండు సభలు వాయిదా పడిన తర్వాత బయటకు వచ్చిన ప్రజా ప్రతినిధులు ప్రవర్తించిన తీరు చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. ముఖ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేలు భౌతిక దాడులకు దిగడం సీమాంధ్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. తమ ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకపోతే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై తెలంగాణ నేతలు దాడికి పాల్పడ్డారు. గండ్ర వెంకటరమణారెడ్డి, గంగుల కమలాకర్ రెడ్డి కూడా సీమాంధ్ర నేతలపై దాడికి యత్నించారు. తెలంగాణ మీడియా ప్రతినిధులు కూడా దాడిలో పాలుపంచుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అటు మండలి మీడియా పాయింట్ వద్ద జరిగిన తోపులాటలో టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కింద పడిపోయారు. టీడీపీ ఎమ్మెల్సీ సతీష్రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ దురుసుగా ప్రవర్తించారు. సతీష్రెడ్డి బిల్లు ప్రతులను చించేందుకు ప్రయత్నించగా అడ్డుకుని, ఆయనపై దాడి చేసినంత పని చేశారు. పోలీసులు కల్పించుకోవడంతో ఆయన శాంతించారు. రాష్ట్రం విడిపోక ముందే పరిస్థితి ఇలా ఉంటే తర్వాత ఏమవుతుందోనని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో తమకే రక్షణ లేకపోతే సామాన్య సీమాంధ్ర ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రజల మనోభావాలను అసెంబ్లీ వేదికగా తెలిపితే దాడి చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులను తామెప్పుడూ అడ్డుకోలేదని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తమకు రక్షణ ఉంటుందా అని ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్రుల భద్రతకు పూర్తి భరోసా ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రక్రియపై ముందుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. -
9 నుంచి 11 గంటల వరకు ఉద్రిక్తత
-
9 నుంచి 11 గంటల వరకు ఉద్రిక్తత
హైదరాబాద్: గందరగోళం నడుమ తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు స్వాగతించగా, సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీలో ఈ ఉదయం 9 నుంచి 11 గంటలకు వరకు చోటు చేసుకున్న సంఘటనల వరుస క్రమమిది. * ఈ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం * సభ ప్రారంభంకాగానే ఇరు ప్రాంతాల సభ్యుల నినాదాలు * స్పీకర్ పోడియం వద్ద సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల ఆందోళన * సభను గంట పాటు వాయిదా వేసిన స్పీకర్ * 10 గంటలకు తిరిగి సమావేశమయిన అసెంబ్లీ * గందరగోళం నడుమ విభజనను బిల్లును సభలో ప్రవేశపెట్టిన స్పీకర్ * బిల్లును శాసనసభ వెబ్సైట్లో పెట్టినట్టు వెల్లడించిన స్పీకర్ * బిల్లును చదివి వినింపించిన అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం * తర్వాత సభను అర గంట వాయిదా వేసిన స్పీకర్ * బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో సభలో లేని సీఎం, చంద్రబాబు * సభ వెలుపల మీడియా పాయింట్ వద్ద ఉద్రికత్త * బిల్లు ప్రతులను చించేసిన టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ * ఉమను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల యత్నం * బిల్లు ప్రతులను తగులబెట్టిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు * వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై పోలీసుల సాక్షిగా టీఆర్ఎస్ నేతల దాడి * మీడియా పాయింట్ వద్ద ఆందోళన కొనసాగించిన వైఎస్సార్ సీపీ సభ్యులు -
'సీఎం జ్వరంతోనే ఉండాలని కోరుకుంటున్నాం'
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందేందుకు సహకరించాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలను టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు కోరారు. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టినందుకు స్పీకర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లుపై అభిప్రాయాలు సేకరించి రాష్ట్రపతికి పంపాలన్నారు. బిల్లుపై ఓటింగ్ అవసరం లేదన్నారు. కిరణ్ అడ్డుపడితేనే బిల్లు మూడు రోజులు ఆగిందని ఆరోపించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందే వరకు సీఎం పూర్తిగా జ్వరంతోనే ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ కారణంగానే కేంద్రం తెలంగాణ ఇచ్చిందని ఎర్రబెల్లి తెలిపారు. విభజన కోసం రెండుసార్లు లేఖ ఇచ్చామని చెప్పారు. తెలంగాణ రావడం టీడీపీ విజయమన్నారు. విద్యార్థుల త్యాగాల ఫలితమే తెలంగాణ అన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అమరవీరులకు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
పోటాపోటీ నినాదాలతో హోరెత్తిన అసెంబ్లీ
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో గంట పాటు సభను స్పీకర్ వాయిదా వేశారు. సీమాంధ్ర, తెలంగాణ ఎమ్మెల్యేల పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది. స్పీకర్ పోడియం వద్ద ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ముసాయిదా బిల్లును వెంటనే సభలో ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రాంత సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సీమాంధ్ర సభ్యులు సమైక్యాంధ్రకు మద్దతుగా గళం విప్పారు. సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళం తలెత్తింది. చేసేదిలే్క స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను గంటపాటు వాయిదా వేశారు. కాగా, విపక్షాల వాయిదా తీర్మానాలన్నింటిని స్పీకర్ తిరస్కరించారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో జగన్ భేటీ
హైదరాబాద్: విభజన బిల్లు రాష్ట్ర శాసనసభకు చేరిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఈ ఉదయం 7 గంటలకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విభజన బిల్లుపై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశం నిర్వహించే అవకాశాలున్న నేపథ్యంతో జగన్ పార్టీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. కాగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్, టీడీపీల ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా శాసనసభలో సమైక్య తీర్మానం కోసం గట్టిగా పట్టుపట్టాలని వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అంతకుముందు పిలుపునిచ్చారు. శాసనసభకు విభజన బిల్లు వచ్చిన తరుణంలో ముందుగా సమైక్య తీర్మానం చేయడం చాలా అవసరమని ఉద్ఘాటించారు. -
టీడీపీ-బీజేపీ పొత్తు ఊహాగానమే: నాగం
హైదరాబాద్: టీడీపీతో బీజేపీ పొత్తు ఊహాగానమేనని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి కొట్టిపారేశారు. టీడీపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై రేపటి నుంచే శాసనసభలో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీ స్పీకర్ చొరవ తీసుకోవాలని కోరారు. వీలైనంత త్వరలో కేంద్రానికి బిల్లు పంపాలని సూచించారు. తెలంగాణ ముసాయిదా బిల్లును ఆమోదించేందుకు అన్ని పార్టీలు సహరించాలని నాగం విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక సమావేశాలు పెట్టించైనా సరే.. తెలంగాణ బిల్లు పాసయ్యేలా బీజేపీ ఒత్తిడి తెస్తుందని చెప్పారు. -
ఓటమిని ఒప్పుకోను : వైఎస్ జగన్
-
వైఎస్ఆర్జిల్లాలో ప్రారంభమైన సమైక్యశంఖారావ సభ
వైఎస్ఆర్జిల్లా: రాష్ట్ర విభజనపై కేంద్రం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో అందోళనలు మొదలైయ్యాయి. రాష్ట్రవిభజన విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కడపలో వైఎస్సార్ సర్కిల్ లో శనివారం సమైక్యశంఖారావ సభ ప్రారంభమైంది. ఈ సమైక్యశంఖారావ సభలో జిల్లా కన్వీనర్ సురేశ్ బాబు, ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓటమిని ఒప్పుకోను : వైఎస్ జగన్
హైదరాబాద్ : తాను ఓటమిని ఒప్పుకోనని, గెలిచేవరకు పోరాడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కేంద్రం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరించిన వైఖరిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంత కాలం రాష్ట్రాన్ని మోసం చేస్తారని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని జగన్ చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టి నినాదంతో దాదాపు ప్రతి రాష్ట్రానికీ వెళ్లామని అన్నారు. ఆర్టికల్ 3 పై వివిధ రాష్ట్రాలకు వెళ్లి నేతలను కలిశామని చెప్పారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరామన్నారు. ఆర్టికల్ 3ని మార్చేందుకు నెలరోజులుగా ప్రయత్నిస్తున్నామన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తున్నారని కూడా చెప్పామన్నారు. అసెంబ్లీ తీర్మానం లేనిదే రాష్ట్రాన్ని ఎవరూ విడగొట్టలేరని జగన్ తెలిపారు. పార్లమెంటులో కొన్ని పార్టీలచేత వాయిదా తీర్మానాలుకూడా ఇప్పించామని చెప్పారు. అంతేకాకుండా మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంమీద ఇతరరాష్ట్రాలతో మాట్లాడించడంలో సఫలీకృతం అయ్యామన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై దేశంమొత్తం గమనించేలా చూడగలిగామని జగన్ చెప్పారు. కాని రాష్ట్రంలోని పరిణామాలు బాధకలిగిస్తున్నాయని జగన్ ఆవేధన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ రాష్ట్రాన్ని విడగొడుతున్నారని చెప్పామన్నారు. జూలై 30న సీడబ్ల్యూసీ, తర్వాత జీవోయమ్, తర్వాత డ్రాఫ్టు బిల్లు, దాన్ని రాష్ట్రపతి పంపించడం జరిగిందని, కీలకమైన పరిణామాలన్నీ జరిగాయని తెలిపారు. మన కాళ్లకింద నీళ్లు వచ్చినప్పుడు.. కిరణ్ మోసం చేసేలా మాట్లాడారని చెప్పారు. తర్వాత ఉద్యోగుల సమ్మెను విరమింపచేశారని అన్నారు. ఇప్పుడు నీళ్లు పీకలదాకా వచ్చాయని జగన్ తెలిపారు. ఇవాళ కూడా 371(డి) పేరిట మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు. గురువారం రాత్రి స్పెషల్ ఫ్లైట్లో డ్రాఫ్టు బిల్లు వచ్చిందని, 17 గంటల్లో యుద్ధ ప్రాతిపదికన అందరి అధికారులకూ పంపారన్నారు. ఈ బిల్లును అసెంబ్లీకికూడా కిరణ్కుమార్ పంపించారని ఆయన తెలిపారు. చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు.. మేలుకోండని కిరణ్కు చెప్తున్నా అని జగన్ అన్నారు. విభజనకు కిరణ్ పూర్తిగా సహకరిస్తున్నారని, చంద్రబాబునాయుడిని చూస్తే మరింత బాధ కలుగుతుందని చెప్పారు. టీడీపికి ఆరుగురు ఎంపీలు ఉంటే.. నలుగురు మాత్రమే అవిశ్వాస తీర్మానంలో సంతకాలు చేశారని, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కనిపించడమే లేదని జగన్ అన్నారు. దేశం మొత్తం చూస్తుండగానే టీడీపీ ఎంపీల్లో 4 ఎంపీలు ఒకవైపు, ఇద్దరు మరోవైపు ఉన్నారన్నారు. వారంరోజులుగా చంద్రబాబు ప్రెస్మీట్ పెడుతున్నా... ఒక్కరోజు కూడా సమైక్యమన్న మాటే అనలేదని జగన్ విమర్శించారు. ఇవాళ దేశం మొత్తం చూస్తోందని, అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలకు జగన్ విజ్క్షప్తి చేశారు. సమైక్యానికి తీర్మానంచేయాలంటూ అంతా పట్టుబట్టాలిని, అంతేకాక ఓటింగ్ జరిపించి సమైక్య తీర్మానం చేసి... అంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని జగన్ కోరారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఈ పనిచేయలేరని, జగన్మోహన్రెడ్డికి మీ మద్దతు కావాలని కోరారు. చంద్రబాబు, కిరణ్లు ఇద్దరూ చరిత్ర పుటల్లో హీనులుగా మిగిలిపోతారని జగన్ దుయ్యబట్టారు. సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేయాలని కోరారు. ఒక్కసారి విభజిస్తే.. తొమ్మిదో స్థానంకోసం ఒక రాష్ట్రం, 14వ స్థానంకోసం మరో రాష్ట్రం పోటీపడుతుందని జగన్ అన్నారు. విభజిస్తే మహానగరం, ఒకవైపు, సముద్రం మరోవైపు ఉంటుందని, అఖరికీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రానికి వస్తుందంటూ జగన్ హెచ్చరించారు. విభజన ఆగేవరకూ తమ పోరాటం ఆగదని చెప్పారు. ఒకసారి విభజన మొదలయితే మళ్లీ అదే డిమాండ్ తలెత్తుందన్నారు. భవిష్యత్తులో అన్నిప్రాంతాలకు ఇదే పొంచి ఉందని జగన్ హెచ్చరించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనను సమర్ధిస్తున్నారని తెలిపారు. విభజనను వ్యతిరేకిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజించే వారికి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు. అలాంటి చంద్రబాబు నిందలు వేయడానికి సిగ్గుండాలన్నారు. తమ వైపు వేలు చూపించే బదులు.. ఇప్పటికైనా సమైక్యం కోరుతూ చంద్రబాబు ఎందుకు లేఖ ఇవ్వటలేదంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఇలాంటి నిందలు వేసేముందు అంతరాత్మను ప్రశ్నించుకోవాలని చెప్పారు. చంద్రబాబు కుప్పం వెళ్తే అక్కడి రైతులు, విద్యార్థులు చొక్కా పట్టుకుని నిలదీస్తారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబును అడుగుతున్నాం... సమైక్యానికి లేఖ ఇమ్మని కోరుతున్నామన్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో.. అలాంటి వారికే ప్రధానిగా మద్దతు ఇస్తామని లక్షలమంది సమక్షంలో తాము స్పష్టంగా చెప్పామని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ సాక్షిగా రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, సీఎం కిరణ్ ఏం చెప్పినా శాసనసభ్యులు సమైక్యభావం వీడొద్దన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల వచ్చేది ఏమి ఉండదన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టడం ఒక్కటే మార్గం అన్నారు. -
తెలంగాణ బిల్లు పాసయ్యేలా బీజేపీ ఒత్తిడి తెస్తుంది: నాగం
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో బీజేపీ నేతలతో ఏర్పాటు చేసిన తెలంగాణ జేఏసీల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వచ్చేలా బీజేపీ ఒత్తడి తేవాలని కోరుతూ తెలంగాణ జేఏసీ, బీజేపీ నేతలకు వినతి సమర్పించినట్టు చెప్పారు. ప్రత్యేక సమావేశాలు పెట్టించైనా సరే.. తెలంగాణ బిల్లు పాసయ్యేలా బీజేపీ ఒత్తడి తెస్తుందని నాగం జనార్థన్ రెడ్డి తెలిపారు. -
గాంధీభవన్లో దిగ్విజయ్ను కలిసిన తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణ మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్లుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తారని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్టు తెలంగాణ మంత్రులు తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని సీఎం కిరణ్ గౌరవిస్తారంటూ మంత్రులు డీకే అరుణ, సునీత, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీకి ఇవాళ తెలంగాణ బిల్లు రాకపోవడం వెనుక సీఎం కిరణ్ హస్తమేమీ లేదని దిగ్విజయ్ అన్నట్టు మంత్రులు తెలపారు. సోమవారం బీఏసీ భేటీలో బిల్లు చర్చకు వస్తుందిని, మంగళవారం నుంచే బిల్లుపై సభలో చర్చించేలా పట్టుబడతామని తెలంగాణ మంత్రులు డీకె అరుణ, సునీత, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. -
త్వరలో సమైక్య పొలిటికల్ జేఏసీ ఏర్పాటు: అశోక్బాబు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను ప్రజాసంఘాలకు ఇవ్వాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు డిమాండ్ చేశారు. తాము సాగిస్తున్న సమైక్య ఉద్యమానికి ఏపీఎన్జీవో రాష్ట్ర కమిటీ ఎన్నికలు అడ్డురావన్నారు. రాజకీయ పక్షాలు ఏపీఎన్జీవోను ప్రభావితం చేయలేవని దీమా వ్యక్తం చేశారు. త్వరలో సమైక్య పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. వైఎస్ జగన్ను కలిసి అఖిలపక్షానికి ఆహ్వానిస్తామని తెలిపారు. సమావేశానికి వచ్చేది, లేనిది.. వైఎస్ జగన్ ఇష్టమన్నారు. రాజకీయ లబ్ధికోసమే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చారని ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రణాళిక ప్రకారం అసెంబ్లీని ముట్టడిస్తామని అశోక్బాబు తెలిపారు. -
'బిల్లుపై స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలపొచ్చు'
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఇచ్చిన హామీకి తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ప్రకటించారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్ని విభజనకు ఒప్పుకున్నాకే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని అన్నారు. తెలంగాణ నాయకులతో కలిసి గాంధీ భవన్లో ఈ సాయంత్రం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత తెలంగాణ ముసాయిదా బిల్లు ఇప్పడు అసెంబ్లీకి వచ్చిందన్నారు. బిల్లును అసెంబ్లీ స్వీకరించిన తర్వాత బీఏసీ సమావేశం ఉంటుందన్నారు. బిల్లుపై చర్చ సమయాన్ని సోమవారం నాడు బీఏసీ నిర్ణయిస్తుందని తెలిపారు. సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలపొచ్చని చెప్పారు. బిల్లులోని అన్ని క్లాజుల మీద అన్ని అంశాలపై చర్చించాలని సూచించారు. బిల్లుపై చర్చ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీలోని సభ్యులందరూ చర్చలో పాల్గొవచ్చన్నారు. విభజన తర్వాత ఇరు ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. భూ సేకరణ చట్టం ప్రకారమే పోలవరం ప్రాజెక్టు స్థలం సేకరించారని చెప్పారు. గోదావరి, కృష్ణా నదీ జలాల పంపిణీని ప్రత్యేక బోర్డు చేపడుతుందని వెల్లడించారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివాసం, ఆస్తులు సమకూర్చకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు. హైదరాబాద్లో నివసించే అన్ని ప్రాంతాల ప్రజలకు బాధ్యతకు ప్రభుత్వం హామీయిస్తుందన్నారు. ఆస్తులు, ఉద్యోగాలకు ఎలాంటి అభద్రతా ఉండదని భరోసాయిచ్చారు. వెనుకబడిన ప్రాంతాల్లో పన్నుల మినహాయింపు ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నేతపై ఉందని దిగ్విజయ్ అన్నారు. -
మంగళయాన్ స్పీడులో బిల్లు పంపిస్తాం: కిరణ్
హైదరాబాద్: విభజన బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి తెలిపారు. ఆర్టికల్ 371(డీ) రాజ్యాంగ సవరణ అవసరమని రాష్ట్రపతి ఇచ్చిన నోట్లో వుందని మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో ప్రతి క్లాజ్పైనా శాసనసభలో ఓటింగ్, అభిప్రాయం అవసరమని పేర్కొన్నారు. విభజన బిల్లును కేంద్రం జెట్స్పీడులో రాష్ట్రానికి బిల్లు పంపితే, మంగళయాన్ స్పీడులో తిరిగి పంపిస్తామని ఆయన చమత్కరించారు. నీటి పంపకాల విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. కేంద్రం పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లు ఇంగ్లీషులో ఉందని, దీన్ని తెలుగులోకి అనువదించాల్సిన అవసముందని అభిప్రాయపడ్డారు. మరో రెండు గంటల్లో సభ్యులందరికీ ముసాయిదా బిల్లు ప్రతులు అందజేయనున్నట్టు మీడియాతో కిరణ్ చెప్పారు. -
సచివాలయానికి చేరుకున్న తెలంగాణ ముసాయిదా బిల్లు
-
5 బండిళ్లలో తెలంగాణ ముసాయిదా బిల్లు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సురేష్ కుమార్ బీఎస్ఎఫ్ ప్రత్యేక విమానంలో దీన్ని తీసుకొచ్చారు. మొత్తం 5 బండిళ్లలో ఉన్న ముసాయిదా బిల్లు ప్రతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మొహంతికి అందజేశారు. సచివాలయంలో మొహంతిని కలిసి సురేష్ కుమార్ దీన్ని అందజేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రధాన కార్యదర్శి- ముఖ్యమంత్రికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం బిల్లు ప్రక్రియ కొనసాగనుంది. ప్రధాన కార్యదర్శి కి బిల్లు ముసాయిదా అందజేయడమే తన పని సురేష్ కుమార్ తెలిపారు. కాగా, బిల్లు రేపు శాసనసభ ముందుకు వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బిల్లుపై చర్చించి, అభిప్రాయాలను తెలియజేయడానికి రాష్ట్ర అసెంబ్లీకి జనవరి 23 వరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లు మీద ఇప్పటికే సీమాంద్ర ప్రాంత నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఓ తీర్మానం చేయాలని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరింది. -
రాష్ట్రపతి భవన్కు టీ-బిల్లు?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు - 2013 శుక్రవారం రాత్రి రాష్ట్రపతి భవన్కు చేరినట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించకపోయినా ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు.. శుక్రవారం రాత్రి విభజన బిల్లుతో కూడిన ఫై లు కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి సచివాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. గురువారం రా త్రి హోంమంత్రి షిండే విలేకరులతో మాట్లాడుతూ.. శుక్ర, శనివారాల్లో బిల్లును రాష్ట్రపతికి పంపిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హోంశాఖ వర్గాలను సంప్రదించగా.. విభజన బిల్లుకు సంబంధించిన ఫైలును రాష్ట్రపతి కార్యాలయానికి చేర్చినట్లు తెలిసింది. అయితే.. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ శుక్రవారం మధ్యాహ్నమే 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ బయల్దేరి వెళ్లారు. శుక్ర, శని, ఆదివారాల్లో బెం గాల్ పర్యటన ముగించుకుని ఆది వారం మధ్యాహ్నానికి ఢిల్లీకి తిరిగిరానున్నారు. ఆ వెంటనే బిల్లును పరిశీలిస్తారని, దానిపై వెంటనే నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎప్పుడు పంపుతారు? ఎంత గడువిస్తారు? విభజన బిల్లుపై ఎలాంటి అభ్యంతరం లేకపోతేనే శాసనసభ అభిప్రాయానికి పంపిస్తారు. బిల్లును అసెం బ్లీకి ఎప్పుడు పంపాలి, శాసనసభ అభిప్రాయం తెలి యజేయటానికి ఎన్ని రోజుల సమయం ఇవ్వాలి అనే అంశాలపై ప్రణబ్ నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీకి 10 - 15 రోజుల గడువు ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతున్నా.. గతంలోని సంప్రదాయాన్ని పాటిస్తే 40 రోజుల గడువు ఇచ్చే వీలుంది. అదే జరిగితే ఈ శీతాకా ల సమావేశాల్లో బిల్లు పెట్టటం కుదరకపోవచ్చు. అ ప్పుడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహిం చటం అనివార్యమవుతుంది. కాగా బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పెట్టటానికి ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్తున్నారు. -
నేడు జీవోఎం తుది భేటీ
* నివేదిక, టీ ముసాయిదా బిల్లుకు లాంఛనంగా ఆమోదం * రేపు లేదా ఎల్లుండి కేబినెట్ పరిశీలన? * జీవోఎం నివేదికపై సర్వత్రా ఉత్కంఠ * ‘రాయల’కు మొగ్గితే బిల్లుకు ఆమోదం కష్టమేనంటున్న కాంగ్రెస్ ముఖ్యులు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తుది విడతగా మంగళవారం భేటీ కానుంది. ఢిల్లీలోని నార్త్బ్లాక్లో గల హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే సారథ్యంలో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశంలో.. విభజనపై తమకిచ్చిన విధివిధానాల మేరకు ఇప్పటికే రూపొందించిన నివేదిక, విభజన ముసాయిదా బిల్లును సభ్యులు పరిశీలిస్తారు. న్యాయశాఖ పరిశీలనకు వెళ్లి కామెంట్లతో తిరిగివచ్చిన నివేదిక, ముసాయిదా బిల్లును హోంశాఖ ఉన్నతాధికారులు పరిశీలించి జీవోఎం ముందు ఉంచడానికి అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేశారని సమాచారం. గత వారం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో తీసుకున్న రాజకీయ నిర్ణయాల మేరకు.. నివేదిక, బిల్లులో చేయాల్సిన చివరి మార్పుచేర్పులు పూర్తిచేసి జీవోఎం సభ్యులు వాటిని లాంఛనంగా ఆమోదిస్తారని హోంశాఖ అధికారులు పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్కు సమర్పించాల్సిన విభజన నివేదికపై సభ్యులందరూ సంతకాలు చేయటంతో జీవోఎంకు అప్పగించిన పని పూర్తవుతుందని, ఆ తర్వాత ఈ నివేదిక కేబినెట్ ముందుకు వెళ్తుందని వారు చెప్పారు. సిఫారసులు ఎలా ఉంటాయో..! జీవోఎం ఆమోదించనున్న నివేదికలో రాష్ట్ర విభజనపై సిఫారసులు ఎలా ఉంటాయనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిపత్తి, ఉమ్మడి రాజధాని పరిధి, ఆర్టికల్ 371డీ, ఈ, నీటి సమస్యల పరిష్కారం అంశాలతో పాటు రాయల తెలంగాణ విషయమై జీవోఎం సిఫారసులు ఫలానా విధంగా ఉన్నాయని కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న పలు కథనాలతో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిఫారసుల అసలు స్వరూపం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. జీవోఎం లాంఛనంగా ఆమోదించేవరకు నివేదికలోని ఏ అంశాన్నయినా ఫైనల్ అని పేర్కొనటం కుదరదని, రాజకీయ నిర్ణయం ప్రకారం ఆఖరి క్షణాల్లో ఏ మార్పులైనా జరగవచ్చని హోంశాఖ వర్గాలు సోమవారం ‘సాక్షి’కి వివరించాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో మొత్తం 69 పేజీలుంటాయని ప్రచారం జరుగుతోంది. చివరి క్షణాల్లో జరిగే మార్పులతో ఈ బిల్లు స్వరూపం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. రేపు లేదా ఎల్లుండి కేబినెట్? జీవోఎం ఆమోదముద్రతో విభజన నివేదిక, బిల్లును కేంద్ర కేబినెట్ బుధ లేదా గురువారం జరిపే సమావేశంలో పరిశీలించవచ్చని తెలుస్తోంది. కేబినెట్ భేటీ 4వ తేదీన బుధవారం ఉంటుందని షిండే కొద్ది రోజుల కింద చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. తాజా సమాచారం ప్రకారం బుధవారం కేబినెట్ సమావేశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రతివారం ఆనవాయితీగా గురువారం కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నందున ఈసారి కూడా 5వ తేదీ గురువారమే కేబినెట్ను సమావేశపరుస్తారని చెప్తున్నారు. ఏ రోజున కేబినెట్ భేటీ జరిగినా తప్పకుండా జీవోఎం నివేదిక, విభజనపై ముసాయిదా బిల్లును అందులో చర్చించి ఆమోదం తెలుపుతారని అధికార వర్గాలతో పాటు కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాలూ గట్టిగా చెప్తున్నాయి. కేబినెట్ ఆమోదం లభించిన తర్వాత ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి, అటు నుంచి రాష్ట్ర శాసనసభకు వెళ్తుంది. ‘రాయల’కు మొగ్గితే ఆమోదమెలా? విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ప్రకారం రాయల తెలంగాణ ఏర్పాటుకు జీవోఎం సిఫారసు చేస్తుందా? లేదా తెలంగాణ, రాయల తెలంగాణ రెండు ప్రతిపాదనలనూ కేబినెట్ ముందుంచి చేతులు దులుపుకుంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. జీవోఎం ఒకటి కాకుండా రెండు ప్రతిపాదనలతో నివేదిక సమర్పించిన పక్షంలో కేబినెట్ సమావేశంలో గరంగరం చర్చ తప్పదని తెలుస్తోంది. కేబినెట్ హోదా మంత్రుల్లో జైపాల్రెడ్డి, కిశోర్చంద్రదేవ్లు రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. యూపీఏ భాగస్వామ్యపక్షాలకు చెందిన మంత్రులు కూడా రాయల తెలంగాణకు అనుకూలంగా లేరని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ రాయల తెలంగాణవైపే మొగ్గితే పార్లమెంటులో విభజన బిల్లుకు ఆమోదం సాధించడం ఎలాగన్నది కాంగ్రెస్ వ్యూహకర్తలకు తలనొప్పిగా మారింది. యూపీఏ నుంచి అనేక పార్టీలు, మరీ ముఖ్యంగా డీఎంకే నిష్ర్కమించిన దరిమిలా పార్లమెంటు ఉభయసభల్లో ప్రభుత్వానికి మెజారిటీ కొరవడి ఎలాగో నెట్టుకొస్తున్న తరుణంలో విభజన బిల్లు వంటి అతి ముఖ్యమైన బిల్లుకు, అందునా ఇతర పక్షాలు వ్యతిరేకించే అంశాలతో ఉన్న బిల్లుకు ఆమోదం పొందటం తేలిక కాదన్నది వారి అంతరంగంగా ఉన్నట్లు ఏఐసీసీ కీలక నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుకే ఆమోదం కష్టమనుకుంటున్న తరుణంలో రాయల తెలంగాణగా మారిస్తే ఉభయసభల సమ్మతి సంపాదించడం గగనమేనని, ఈ బిల్లు కూడా పెండింగ్ జాబితాలో చేరిపోయే ప్రమాదముందని వారు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. -
ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు డౌటే!
తెలంగాణపై ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు పార్లమెంటుకు విభజన బిల్లుపై అనుమానాలు కాంగ్రెస్ కోర్ కమిటీ మల్లగుల్లాలు అసాధ్యమన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ శీతాకాల సమావేశాల్లోనే వస్తుందన్న అహ్మద్ పటేల్ వ్యూహాత్మక ఎత్తుగడే అంటున్న ఏఐసీసీ పెద్దలు 3నే కేబినెట్ భేటీ: షిండే న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహారం ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగా సాగుతోంది. తెలంగాణ ముసాయిదా బిల్లు, జీవోఎం నివేదిక పూర్తిగా సిద్ధమయ్యాయని, వాటిని కేబినెట్ ముందు పెట్టడమే తరువాయి అని నిన్నటిదాకా చెప్పిన కాంగ్రెస్ పెద్దలు, వాటన్నింటినీ శీతాకాల సమావేశాల్లోగా పూర్తి చేయలేమన్న సంకేతాలిస్తూ తాజాగా మళ్లీ గందరగోళానికి తెర తీశారు. అంతా అయిపోతుందని ఒక నాయకుడు, ఎలా అవుతుందంటూ మరో నాయకుడు శుక్రవారం పరస్పరం గందరగోళపరిచే వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతల భేటీలు, జీవోఎం సభ్యుల సమాలోచనలు, కోర్కమిటీ భేటీ... ఇలా రోజంతా హస్తినలో ఎక్కడికక్కడ సమావేశాలు జరిగినా అవేవీ ఏ అంశంపైనా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. అన్ని చోట్లా పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు, అంచనాలతో మొత్తం వ్యవహారాన్ని మరింత చిక్కుముడిగా మార్చారు. డిసెంబర్ 5 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయని తెలిసి కూడా, ఇంతకాలంగా చేస్తూ వచ్చిన హడావుడిని కూడా తీరా సమయం సమీపిస్తున్న ఈ తరుణంలో అధిష్టానం నెమ్మదింపజేసింది. పలు అంశాల సాధ్యాసాధ్యాలపై శుక్రవారం హడావుడిగా తర్జనభర్జనలు సాగించింది. ఒకవైపు పార్లమెంటులో బిల్లు పెట్టడంపై మల్లగుల్లాలు పడుతూనే, మరోవైపు రాయల తెలంగాణ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి, దానివల్ల రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లొస్తాయా అని మరోసారి బేరీజు వేసుకుంది. ‘రాయల’ను సీరియస్గా పరిశీలిస్తున్నామని ఒకవైపు అంటూనే, మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టడం సాధ్యం కాదన్న సంకేతాలను పంపింది. ప్రధాని మన్మోహన్సింగ్ నివాసంలో సోనియాగాంధీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కాంగ్రెస్ కోర్కమిటీ సమావేశంలోనూ రాయల తెలంగాణ, శీతాకాల సమావేశాల్లో బిల్లు అంశాల పైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో మరింత లోతుగా చర్చించే బాధ్యతను జీవోఎంపై పెట్టారని, రాబోయే కేబినెట్లో కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చారని సమాచారం. 70 నిమిషాలు జరిగిన కోర్కమిటీ సమావేశం వీటిపై ఎటూ తేలకుండానే ముగిసినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని మాత్రం డిసెంబర్ 4న కాకుండా 3నే జరపాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. తెహల్కా వివాదం, నరేంద్ర మోడీపై స్నూప్ గేట్ గొడవలతో పాటు పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అవకాశమున్న ధరల పెరుగుదల తదితరాలు కూడా కోర్ కమిటీలో చర్చకు వచ్చాయని సమాచారం. బిల్లుపై పలు మాటలు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందా, రాదా అన్నదానిపై కోర్కమిటీ భేటీలో పాల్గొన్న నేతల మధ్యే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సాయంత్రం 5.45 గంటలకు జరిగిన ఈ భేటీలో మన్మోహన్, సోనియాలతో పాటు కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్కుమార్షిండే, చిదంబరం, అహ్మద్పటేల్ హాజరయ్యారు. కోర్ కమిటీ సభ్యుడు కాని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ను కూడా భేటీకి ప్రత్యేకంగా పిలిపించారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు సాధ్యాసాధ్యాలపైనే చర్చించినట్టు పార్టీ అత్యున్నత వర్గాలు వెల్లడించాయి. భేటీలో దాదాపు 40 నిమిషాలు పాల్గొన్న కమల్నాథ్ మాత్రం శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టడం అసాధ్యమన్నట్టు తెలిసింది. ‘‘సమావేశాలు మరో వారం రోజుల్లో మొదలవనున్నాయి. విభజన బిల్లు ఇంకా కేబినెట్ ఆమోదమే పొందలేదు. అదయ్యాక రాష్ట్రపతికి, అటు నుంచి అసెంబ్లీకి, తిరిగి రాష్ట్రపతి ద్వారా పార్లమెంటుకు బిల్లు రావాల్సి ఉంటుంది. ఇదంతా పూర్తవడానికి కనీసం నెల రోజులైనా అవసరం. గతంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన బిల్లుల ప్రక్రియ ఇంతకంటే ఎక్కువ సమయమే తీసుకుంది. కాదని ఇప్పుడు హడావుడిగా బిల్లు తీసుకొస్తే ఇటు పార్లమెంటులో, అటు న్యాయస్థానంలో రాజ్యాంగపరమైన విమర్శలు తప్పకపోవచ్చు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. కానీ సోనియా మాత్రం శీతాకాల సమావేశాల్లోనే బిల్లును తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అన్ని మార్గాలనూ అన్వేషించాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16 తరవాత బిల్లును పార్లమెంటులో పెట్టేలా ఇటీవల రూపొందించిన ప్రణాళికను అమలు చేయాలని సూచించినట్టు సమాచారం. కానీ భేటీ నుంచి మధ్యలోనే బయటికొచ్చిన కమల్నాథ్ను కొందరు విలేకరులు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందా అని అడగ్గా, ఎలా సాధ్యమవుతుందని బదులిస్తూ వెళ్లిపోయారు. అహ్మద్పటేల్ మాత్రం భేటీ తర్వాత తన వద్దకు వచ్చిన కొందరు విలేకరులతో శీతాకాల సమావేశాల్లోనే బిల్లు వస్తుందని చెప్పారు! గందరగోళ వ్యూహమే! పార్లమెంటు శీతాకాల సమావేశాల గడువు తక్కువున్న తరుణంలో విభజన బిల్లు పార్లమెంటు ముందుకు రావడం సాధ్యమేనా అనే ధర్మ సందేహం సర్వత్రా విన్పిస్తుండటం తెలిసిందే. ఇలాంటి సమయంలో, ఒకవైపు విభజన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు జీవోఎం పేరిట హడావుడి చేస్తున్న అధిష్టానం పెద్దలు మళ్లీ రాయల తెలంగాణను తెరపైకి తేవడం పార్టీ నేతలను గందరగోళంలో పడేసింది. పెద్దల వ్యూహం వెనుక పలు రాజకీయ కోణాలున్నట్టు కోర్కమిటీ సభ్యులకు సన్నిహితంగా మెలిగే కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. విభజన విషయంలో హైదరాబాద్, రాయల తెలంగాణ, భద్రాచలం వంటివి తమకు సమస్యే కాదని కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే రెండ్రోజుల క్రితమే చెప్పిన విషయాన్ని ఇంకా మరువక ముందే రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో దిగ్విజయ్సింగ్, జైరాం రమేశ్ చర్చించ డంతో, అధిష్టానం కొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తోందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కేబినెట్ భేటీపైనా అస్పష్టత ! ఇక కేంద్ర కేబినెట్ తదుపరి సమావేశం ఎప్పుడన్న విషయంలోనూ అస్పష్టత ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం అది డిసెంబర్ 4న జరగాల్సి ఉంది. తెలంగాణ బిల్లుతో పాటు జీవోఎం నివేదికను ఆమోదించడమే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతుందని గురువారం జీవోఎం సభ్యులు చెప్పుకొచ్చారు. అయితే షిండే శుక్రవారం ఉదయం కొందరు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ డిసెంబర్ 3న జీవోఎం సమావేశంతోపాటు కేబినెట్ భేటీ కూడా జరగవచ్చని చెప్పారు. జైరాం మాత్రం 3న జీవోఎం భేటీ, 4న కేబినెట్ భేటీ జరుగుతాయని చెప్పారు. కోట్ల నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ ఒకవైపు కాంగ్రెస్ కోర్కమిటీ సమావేశమవుతున్న సమయంలోనే రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి నివాసంలో కేంద్ర మంత్రులు చిరంజీవి, జేడీ శీలం సమావేశమయ్యారు. రాయల తెలంగాణపై సీమాంధ్ర కేంద్ర మంత్రుల మధ్య ఏకాభిప్రాయం తెచ్చే అంశంపైనే చర్చించినట్టు తెలిసింది. హైదరాబాద్ను పదేళ్లపాటు కేంద్రపాలిత ప్రాంతం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉండాలని కూడా నిర్ణయించినట్టు నేతలు పేర్కొన్నారు. -
ఉమ్మడి రాజధానిపై స్పష్టతనివ్వనున్న జీవోఎం
-
రాజధాని చుట్టూ.. రామయ్య పై బెట్టు
తెలంగాణ, సీమాంధ్ర కేంద్రమంత్రులు, సీఎంతో భేటీలు టీ బిల్లు ముసాయిదాలో మార్పుచేర్పులపైనే జీవోఎం దృష్టి హైదరాబాద్, భద్రాచలం అంశాలపైనే ప్రధాన చర్చలు హెచ్ఎండీఏ పరిధిని యూటీ చేస్తే, భద్రాచలం ఇచ్చేస్తే విభజనకు ఒప్పుకునే దిశలో సీమాంధ్ర కేంద్రమంత్రులు వంద రోజులకు పైగా సాగుతున్న ఉద్యమాన్ని పట్టించుకోని నేతలు.. తాయిలాలిస్తే విభజనకు తలూపేందుకు సిద్ధం భద్రాచలాన్ని వదులుకోక తప్పదని సందేహిస్తున్న తెలంగాణ కేంద్రమంత్రులు.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకే పరిమితమయ్యేలా పట్టుపట్టాలని ఆలోచన రాష్ట్ర కాంగ్రెస్ నేతల ప్రతిపాదనలకు అనుగుణంగా తెలంగాణ బిల్లు ముసాయిదాలో మార్పులు జరిగేనా? 21న కేంద్ర మంత్రిమండలి భేటీకి ముందే ఉమ్మడి రాజధానిపై స్పష్టతనివ్వనున్న జీవోఎం రాష్ట్ర విభజనపై ఢిల్లీ కసరత్తు క్లైమాక్స్కు చేరుకుంది. కేంద్ర హోంశాఖ ఇప్పటికే సిద్ధం చేసిన తెలంగాణ ముసాయిదా బిల్లులో స్వల్ప మార్పుచేర్పులపైనే ఇప్పుడు కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) దృష్టి సారించింది. హైదరాబాద్ను యూటీ చేయాలన్న డిమాండ్, ఉమ్మడి రాజధాని పరిధి, అక్కడ శాంతిభద్రతల పర్యవేక్షణ, భద్రాచలం డివిజన్ను ఎటువైపు ఉంచటం.. ఈ కీలకాంశాలు పీటముడిగా మారటంతో వీటిని పరిష్కరించేందుకు తుది కసరత్తుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, సీమాంధ్ర కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో జీవోఎం సోమవారం వేర్వేరుగా భేటీ కానుంది. మొన్నటివరకూ సమైక్యగళం వినిపించిన సీమాంధ్ర కేంద్రమంత్రులు.. పార్టీ అధిష్టానం ఎజెండాను అమలులోకి తెస్తూ సీమాంధ్రకు ప్యాకేజీలంటూ స్వరం మార్చిన విషయం తెలిసిందే. వంద రోజులకు పైగా సమైక్య రాష్ట్రం కోసం కొనసాగుతున్న ప్రజా ఉద్యమాన్ని విస్మరించి మరీ.. ప్యాకేజీలు, తాయిలాలు ఇస్తే విభజనకు సరేనంటూ సిద్ధమవుతున్నారు. అలాగే సీఎం కిరణ్కుమార్రెడ్డి కూడా ఒకవైపు సమైక్యవాదన వినిపిస్తూ.. మరోవైపు అధికారికంగా విభజనకు తోడ్పాటునందిస్తున్న విషయం విదితమే. విభజన బిల్లులోనే హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటంతో పాటు సీమాంధ్రకు ప్యాకేజీ ప్రకటించాలని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కానీ.. తెలంగాణ ప్రాంత రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కేవలం హైదరాబాద్ రెవెన్యూ పరిధిని మాత్రమే.. అదికూడా ఉమ్మడి రాజధానిగా మాత్రమే గుర్తించాలని పట్టుపడుతున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిని ఉమ్మడి రాజధానిగా చేయటానికి కూడా తెలంగాణ నేతలు అంగీకరించటం లేదు. అలాగే.. భద్రాచలం మాదంటే మాదని ఇరువైపుల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో జీవోఎం దాన్ని కూడా అత్యంత కీలకంగా భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్ రెవెన్యూ పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేస్తే భద్రాచలం విషయంలో పట్టువిడుపులు తప్పవన్న భావన కొందరు టీ-కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సోమవారం జరిగే జీవోఎం భేటీల్లో ఈ రెండు అంశాలపై ఒక స్పష్టతకు రావటం.. తదనుగుణంగా ముసాయిదా బిల్లులో మార్పుచేర్పులు చేయటంపై కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే సారథ్యంలోని జీవోఎం దృష్టి సారిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. కీలకమైన అంశాలపై ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి వేర్వేరుగా వినిపించే వాదనలను జీవోఎం కొంతమేరకు పరిగణనలోకి తీసుకుంటుంది తప్ప వారు చెప్పే విభజన అనుకూల, వ్యతిరేక వాదనలకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదని తెలుస్తోంది. వీరిచ్చే నివేదికల ఆధారంగా.. హైదరాబాద్ను యూటీ చేయటం, లేదా ఢిల్లీ తరహాలో పాక్షిక కేంద్ర పాలిత ప్రాంతం, లేదంటే ఒకే గవర్నర్ కింద రెండు రాష్ట్రాల రాజధానులను నడిపించటానికి ఉన్న అవకాశాలు, కేంద్రం పరిధిలోకి తీసుకోవటం వంటి ప్రతిపాదనలపై జీవోఎం కసరత్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు చెప్తున్నారు. ఉమ్మడి రాజధాని పరిధిపై ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత హైదరాబాద్లోని సీమాంధ్ర ప్రజల భద్రత, హక్కులు వంటి అంశాలను బిల్లులో చేరుస్తారని సమాచారం. మరోవైపు.. వనరుల పంపిణీ, నీటిపారుదల, ఉద్యోగులు, విద్య తదితర అంశాలకు సంబంధించి విభజన బిల్లులో పూర్తి సమాచారంతో సమగ్రంగా చేర్చకుండా.. దేనికదే ప్రత్యేక బోర్డులు, కేంద్ర ప్రభుత్వం నియమించే కమిటీలు పరిష్కారం చూపుతాయని మాత్రమే బిల్లులో చెప్తారని తెలుస్తోంది. ఇక ఆర్టికల్ 371 (డి) విషయంలో జీవోఎం ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చలు జరపగా.. చిన్న సవరణతో ఇరు ప్రాంతాల్లో దాన్ని కొనసాగించడానికే ఎక్కువ అవకాశాలున్నట్లు చెప్తున్నారు. ఈ నెల 21న కేంద్ర మంత్రిమండలి ముందు తెలంగాణ ముసాయిదా బిల్లు పెట్టే అవకాశాలున్నందున.. సోమవారం నాటి సమావేశాల అనంతరం ముసాయిదా మార్పుచేర్పుల పనుల్లో జీవోఎం తుది కసరత్తు పూర్తి చేస్తుందని సమాచారం. జీవోఎంతో చర్చలపై విడివిడిగా కసరత్తులు... విభజన కసరత్తు క్లైమాక్స్కు చేరిన దశలో జరుగుతున్న కీలక భేటీలు కావటంతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, నేతలు జీవోఎంకు తమ వాదన వినిపించడానికి నివేదికల రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఇరు ప్రాంతాల కేంద్రమంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు జీవోఎం ముందు హాజరుకానున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు ఉదయం 11.30 గంటలకు జీవోఎం ఎదుట హాజరవుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు ఎస్.జైపాల్రెడ్డి, సర్వే సత్యనారాయణల నివాసాల్లో ఆ ప్రాంత మంత్రులు, పలువురు రాష్ట్ర నేతలు సమావేశమై.. జీవోఎంకు నివేదించాల్సిన అంశాలపై చర్చించి నివేదికను రూపొందించారు. జీవోఎం కీలకంగా భావిస్తున్న అంశాల్లో ఒకటైన భద్రాచలం విషయంలో వీరు వెసులుబాటు కల్పించే రీతిలో ఈ నివేదికలో పొందుపరిచినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు సీమాంధ్ర కేంద్రమంత్రి ఎం.ఎం.పళ్లంరాజు సమక్షంలో సీమాంధ్ర నేతలు సమావేశమై జీవోఎం వద్ద సీమాంధ్రకు కోరాల్సిన ప్యాకేజీలపై ప్రధానంగా చర్చించి ఆ మేరకు నివేదిక రూపొందించారు. అధికారులతో నివేదిక సిద్ధం చేయించిన సీఎం జీవోఎం ముందు హాజరుకావటానికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సోమవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన జీవోఎం ముందు హాజరై నివేదిక సమర్పిస్తారు. నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యుత్, ఉద్యోగుల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తయారు చేయించిన నివేదికను ఆయన జీవోఎంకు సమర్పించబోతున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గత అసెంబ్లీ సమావేశాల్లో, శాసనమండలిలో స్పష్టంగా చెప్పిన కిరణ్కుమార్రెడ్డి ఆ తర్వాత పార్టీ కోర్ కమిటీ ముందు కూడా అదే వైఖరి ఉద్ఘాటించారు. ఆనంతర పరిణామాల్లో సీఎం సీమాంధ్ర సమస్యలు లేవనెత్తుతున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం పెద్దలు వాటికి పరిష్కారం చూపిస్తామని, సీమాంధ్రకు న్యాయం చేస్తామని చెప్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చే నివేదికలో.. ప్రధానంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను యూటీ చేయడమా, చేయకపోవడమా, ఒకవేళ చేసినా దాని పరిధి.. ఇలాంటి అంశాలపై సూచనలను కొంతమేరకు పరిగణనలోకి తీసుకుంటారని చెప్తున్నారు. ఆర్టికల్ 371 (డి) విషయంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నందున దానితో పాటు మిగిలిన అంశాలన్నింటిపైనా జీవోఎం ఇప్పటికే స్పష్టతకు వచ్చిందని, పైగా విభజన వల్ల ఇరు ప్రాంతాల్లో తలెత్తే సమస్యలను క్రోడీకరించే క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నివేదికను ఉపయోగిస్తారని తెలుస్తోంది. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే జీవోఎం ముందు ఒక నివేదిక సమర్పించిన విషయం పత్రికల్లో వచ్చిందే. ఎవరి వాదన వారిదే... తెలంగాణ ముసాయిదా బిల్లును ఇప్పటికే సిద్ధం చేసిన జీవోఎం దానికి తుదిరూపమిచ్చే పనిలో నిమగ్నం కాగా.. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటికీ విభజన అంశంపై ఎవరి అభిప్రాయాలు వారివన్నట్లుగానే మాట్లాడుతున్నారు. విభజన అంశాన్ని సీమాంధ్ర ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడమే కాకుండా వంద రోజులకు పైగా ఉద్యమం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విభజనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్తూ వచ్చారు. సీమాంధ్రకు భారీ ప్యాకేజీలు కావాలని కోరుతున్నప్పటికీ.. తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంత నేతలు విభజనపై ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇటు తెలంగాణ నేతలదీ అదే పరిస్థితి. మరోవైపు విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయించే బాధ్యతను హైకమాండ్ ఆదేశాల మేరకు నెత్తికెత్తుకున్న సీఎం కిరణ్ సైతం తప్పనిసరి పరిస్థితుల్లో సీమాంధ్ర సమస్యలు లేవనెత్తాల్సి వస్తోందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సంక్లిష్టమైన పరిస్థితుల్లో జీవోఎం ముందు ఏం చెప్పినా విభజన విషయంలో బయట ఎవరివాదన వారు వినిపించుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నేటి జీవోఎం భేటీలు ఇలా... ఉదయం 10:30కు: తెలంగాణ కేంద్రమంత్రులు ఎస్.జైపాల్రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్లతో భేటీ ఉదయం 11:30కు: సీమాంధ్ర కేంద్రమంత్రులు వి.కిశోర్చంద్రదేవ్, ఎం.ఎం.పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి, పనబాక లక్ష్మి, డి.పురందేశ్వరి, జె.డి.శీలం, కిల్లి కృపారాణిలతో భేటీ మధ్యాహ్నం 12:30కు: సీఎం కిరణ్తో సమావేశం