`తెలంగాణ బిల్లు అడ్డుకునే హక్కు లేదు`

`తెలంగాణ బిల్లు అడ్డుకునే హక్కు లేదు`


వరంగల్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో తెలంగాణ, సీమాంధ్రలో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చపై అభిప్రాయం చెప్పే హక్కు మాత్రమే ఉందని, అడ్డుకునే హక్కులేదని  తెలంగాణ రాజకీయ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు.



శుక్రవారం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలలో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అసెంబ్లీలో చర్చ సందర్భంగా చెప్పిన అభిప్రాయాలను కేంద్ర పరగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top