
'తెలంగాణ ఎంపీలపై ఒత్తిడి తెస్తాం'
తెలంగాణ ముసాయిదా బిల్లులో సవరణలను ప్రతిపాదించి ఎప్పటికప్పుడు ఢిల్లీలో టి.ఎంపీలపై ఒత్తిడి తెస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, టీజేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లులో సవరణలను ప్రతిపాదించి ఎప్పటికప్పుడు ఢిల్లీలో టి.ఎంపీలపై ఒత్తిడి తెస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, టీజేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. సంపూర్ణ తెలంగాణ సాధిస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాల వలే తెలంగాణ ఏర్పడాలని వారు డిమాండ్ చేశారు.
కాగా, తెలంగాణలోని పార్టీలు స్వలాభాలు పక్కనపెడితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమవుతుందని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణను అడ్డుకునే శక్తి లేదన్నారు.