breaking news
subham
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటీ రిలీజ్ కాలేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఏకంగా 22 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటిలో తొమ్మిది వరకు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. వీటిలో ఏస్, ఎలెవన్, శుభం, జింఖానా తదితర చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ ఉండటం విశేషం. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?(ఇదీ చదవండి: ‘దేవికా అండ్ డానీ’ రివ్యూ : ఆత్మలతో మాట్లాడే టీచరమ్మ!)ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 13)అమెజాన్ ప్రైమ్బ్లైండ్ స్పాట్ - తెలుగు సినిమాఏస్ - తెలుగు డబ్బింగ్ మూవీఎలెవన్ - తెలుగు సినిమాఇన్ ట్రాన్సిట్ - హిందీ సిరీస్అమెరికన్ థండర్ - ఇంగ్లీష్ సినిమాద ట్రైటర్స్ - హిందీ రియాలిటీ షోడీప్ కవర్ - ఇంగ్లీష్ సినిమానెట్ఫ్లిక్స్కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్రానా నాయుడు 2 - తెలుగు సిరీస్ఫ్యూబర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఫ్లాట్ గర్ల్స్ - థాయ్ మూవీగ్రేస్ అనాటమీ సీజన్ 21 - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 14)హాట్స్టార్కేసరి ఛాప్టర్ 2 - హిందీ సినిమాశుభం - తెలుగు మూవీఅండర్ డాగ్స్ - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 15)సోనీ లివ్అలప్పుళా జింఖానా - తెలుగు డబ్బింగ్ మూవీఆహాసిన్ - తెలుగు సినిమాసన్ నెక్స్ట్డియర్ ఉమ - తెలుగు మూవీజీ5డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ - తెలుగు డబ్బింగ్ సినిమాఆపిల్ ప్లస్ టీవీఎకో వ్యాలీ - ఇంగ్లీష్ మూవీనాట్ ఏ బాక్స్ - ఇంగ్లీష్ సిరీస్మనోరమ మ్యాక్స్సూపర్ గర్ల్స్ - మలయాళ సిరీస్(ఇదీ చదవండి: లైఫ్ అంతా అల్లు అర్జున్కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు) -
ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్
మరో వారం వచ్చేసింది. లెక్క ప్రకారం ఈ వీకెండ్లో రావాల్సిన 'హరిహర వీరమల్లు' వాయిదా పడటంతో థియేటర్లన్నీ ఖాళీగానే ఉండనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోకి ఏకంగా 20కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని చూడదగ్గవి ఉండటం విశేషం. (ఇదీ చదవండి: గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. సమంత 'శుభం', ఎలెవన్ అనే తెలుగు మూవీస్తో పాటు 'జింఖానా' అనే డబ్బింగ్ సినిమాతో పాటు 'రానా నాయుడు' సీజన్ 2 సిరీస్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (జూన్ 9 నుంచి 15 వరకు)నెట్ఫ్లిక్స్ద క్రియేచర్ కేసెస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 09ఫ్యామిలీస్ లైక్ అవర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10ట్రైన్ రెక్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 10అనీలా (పోలీష్ సిరీస్) - జూన్ 11ఛీర్ టూ లైఫ్ (పోర్చుగీస్ మూవీ) - జూన్ 11కొకైన్ ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 11అవర్ టైమ్స్ (స్పానిష్ సినిమా) - జూన్ 11టైటాన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 11ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 13ఆహాఎలెవన్ (తెలుగు సినిమా) - జూన్ 13అమెజాన్ ప్రైమ్ద ట్రైటర్స్ (హిందీ రియాలిటీ షో) - జూన్ 12ఇన్ ట్రాన్సిట్ (హిందీ సిరీస్) - జూన్ 13హాట్స్టార్పడక్కలమ్ (మలయాళ సినిమా) - జూన్ 10ద రియల్ హౌస్వైవ్స్ ఆఫ్ మియామి సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12శుభం (తెలుగు మూవీ) - జూన్ 13అండర్ డాగ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 15సోనీ లివ్జింఖానా (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 13ఆపిల్ ప్లస్ టీవీఎకో వ్యాలీ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 13నాట్ ఏ బాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 13మనోరమ మ్యాక్స్కర్ణిక (మలయాల సినిమా) - జూన్ 09(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ) -
ఓటీటీలో 'సమంత' సినిమా.. ట్రైలర్ విడుదల
టాలీవుడ్ నటి సమంత నిర్మాతగా తెరకెక్కించిన మొదటి సినిమా 'శుభం' ఓటీటీలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణంలోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. తన తొలి ప్రయత్నంలోనే కొత్తతరం నటులతో తెరకెక్కించడమే కాకుండా ఆమె ఇందులో మాయ అనే అతిథి పాత్రలోనూ మెప్పించారు. మే 9న విడుదలైన శుభం మూవీని ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. హర్షిత్రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, వంశీధర్ గౌడ్, శ్రియ కొంతం, శర్వాణి లక్ష్మీ, షాలిని కొండెపూడి తదితరులు నటించారు. జియో హాట్స్టార్ వేదికగా జూన్ 13 నుంచి శుభం చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే, తాజాగా ఓటీటీకి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. వైజాగ్లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల చుట్టూ ఈ సినిమా కథ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్నే రాబట్టింది. -
ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సమంత నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం శుభం(Subham). ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి నటించారు. మే 09న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో మెరిసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 13 నుంచి జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ పోస్టర్ను షేర్ చేసింది. శుభం కథేంటంటే..వైజాగ్లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. ఫస్ట్నైట్ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్ చూస్తుంది.ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసుంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. This June 13th, katha aarambham on JioHotstar 💫 Chacchina choodalsindhe 👀 #SubhamOnJioHotstar #Subham @Samanthaprabhu2 @TralalaPictures #JioHotstar pic.twitter.com/If7zN9utiY— JioHotstar Telugu (@JioHotstarTel_) June 1, 2025 -
‘శుభం’ మూవీ సక్సెస్ మీట్ లో సమంత సందడి (ఫొటోలు)
-
అదే మా ‘ట్రాలాలా’ లక్ష్యం: సమంత
‘‘శుభం’ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరిలో నవ్వులు, సంతోషం కనిపిస్తున్నాయి. ఇదే అసలైన విజయం. ఇలాంటి ఆనందం చూడటానికే నిర్మాతలు ఇంకా ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటారు’’ అని హీరోయిన్, నిర్మాత సమంత చె΄్పారు. హర్షిత్ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియా కొంతం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో సమంత మాట్లాడుతూ– ‘‘శుభం’ చూస్తే నా వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. మమ్మల్ని సినిమాలకు తీసుకు వెళ్లేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఓ మూవీని మా ఫ్యామిలీ అంతా కలిసి చూసిన రోజులన్నీ మళ్లీ గుర్తుకొచ్చాయి. ‘శుభం’తో అందర్నీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాం. ఇలాంటి మంచి చిత్రాలను తీసి కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. మీ తీపి జ్ఞాపకాల్ని మళ్లీ గుర్తు చేస్తూనే ఉంటాం... అదే మా ట్రాలాలా లక్ష్యం. సినిమా రిలీజ్కు ముందు మూడు రోజులు మా టీమ్లోని ఏ ఒక్కరూ నిద్ర΄ోలేదు. ఇప్పుడు వస్తున్న ప్రేమ, అభిమానం, ప్రశంసలన్నింటికీ వాళ్లే కారణం. నాకు సపోర్ట్గా నిలిచిన మైత్రి శశి, సురేష్బాబుగార్లకు థ్యాంక్స్. అభిమానులే నా ప్రపంచం. ‘శుభం’ని ముందుకు తీసుకెళ్తున్న ఫ్యాన్స్కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ– ‘‘సమంతగారు లేక΄ోతే ‘శుభం’ని ఎవరు చూస్తారు? ఆమె వల్లే ఈ సినిమా జనాల్లోకి వెళ్లింది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు వస్తాయి’’ అన్నారు. నటీనటులు శ్రియా కొంతం, శ్రావణి, షాలినీ, వంశీధర్, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్, రచయిత వసంత్, సహ నిర్మాత హిమాంక్, ‘మైత్రీ’ మూవీస్ శశి, ్ర΄÷డక్షన్ డిజైనర్ రామ్, క్యాస్ట్యూమ్ డిజైనర్ పూజిత, రాగ్ మయూర్ మాట్లాడారు. -
Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
రాజ్ భుజంపై వాలిన సమంత.. దర్శకుడి భార్య పోస్ట్ వైరల్!
దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru), హీరోయిన్ సమంత(samantha) ప్రేమలో ఉన్నారనే వార్త గతకొంత కాలంగా నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటో ఒకటి ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ఆమె నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ సక్సెస్ సెలెబ్రేషన్స్లో భాగంగా చిత్రబృందం రాజ్ నిడిమోరుతో కలిసి ఫోటోలు దిగింది. వాటిని సమంత తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా..అవికాస్త వైరల్గా మారాయి. రాజ్ భుజంపై వాలిన సమంత ఫోటోపై నెటిజన్లు రకరకాలు స్పందించారు. వారిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతారని, ఈ విషయాన్ని చెప్పడానికే సమంత ఆ ఫోటోని షేర్ చేసిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేశారు. వారిద్దరు డేటింగ్లో ఉన్నారనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజ్ సతీమణి శ్యామాలి(Shhyamali De) తాజాగా ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.నా గురించి ఆలోచించి, విని, మాట్లాడేవారితోపాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసే వారందరికీ ప్రేమతో ఆశీస్సులు పంపుతున్నాను’అని అమె ఇన్స్టాలో రాసుకొచ్చారు. కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న శ్యామాలి సమంత ఫోటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఇలాంటి పోస్ట్ పెట్టడంతో ఆమెను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. శ్యామాలి ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టారనేది తెలియదు కాని..నెటిజన్స్ మాత్రం సమంత,రాజ్ల గురించే ఈ పోస్ట్ పెట్టారని కామెంట్ చేస్తున్నారు. కాగా, రాజ్, శ్యామాలిల వివాహం 2015లో జరిగింది. వీరిద్దరి ఒక పాప కూడా ఉన్నారు. పెళ్లికి ముందు శ్యామాలి బాలీవుడ్ దర్శకులు రాకేశ్ ఓం ప్రకాశ్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ దర్శకురాలిగా పనిచేశారు. వివాహం తర్వాత రాజ్ రూపొందించిన చిత్రాలకు సంబంధించి ఆమె క్యాస్టింగ్లో సాయం చేస్తుండేవారు. అయితే గతకొంత కాలంగా రాజ్, శ్యామాలి మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే వారిద్దరు అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. -
సమంత కొత్త జర్నీ.. సక్సెస్ అయినట్లేనా?
స్టార్ హీరోయిన్ సమంత(samantha) కొత్త జర్నీ ప్రారంభించింది. ఇన్నాళ్లు తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు నిర్మాతగా మారి మంచి సినిమాలను ప్రేక్షకులను అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ స్థాపించి, ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు మంచి టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.మూడు రోజుల్లో 5.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్తో పోలిస్తే..ఇది మంచి నెంబరనే చెప్పాలి. ఓవరాల్గా ఈ చిత్రానికి రూ. 3.5 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. రిలీజ్కి ముందే సమంత తనకున్న పలుబడితో టేబుల్ ప్రాఫిట్ని పొందినట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ హక్కులను మంచి రేటుకే అమ్మేసిందట. షూటింగ్కి ముందే ‘జీ’ సంస్థతో డీల్ కుదుర్చుకుందట సమంత. సినిమా మొత్తం ఓ సీరియల్ చుట్టు తిరుగుతుంది.. అది జీ టీవీలో ప్రసారం అయ్యే సీరియల్గా చూపిస్తామని ‘బ్రాండింగ్’మాట్లాడుకున్నారట. ఆ తర్వాత అదే సంస్థ ఓటీటీ, శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. నిజానికి ఇలాంటి చిన్న సినిమాకి రిలీజ్ ముందే బిజినెస్ జరగడం చాలా అరుదు. పెద్ద పెద్ద సినిమాలకే ఓటీటీ బిజినెస్ కావడం లేదు. సమంత ఉంది కాబట్టే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రిలీజ్కి ముందే సేల్ అయ్యాయి. ఇక రిలీజ్ తర్వాత మంచి టాక్ రావడం.. వసూళ్లు రోజు రోజుకి పెరగడంతో ‘శుభం’తో సమంతకు మంచి లాభాలే వచ్చేశాయి. మొత్తానికి సమంత కొత్త జర్నీ లాభాలతోనే ప్రారంభం అయింది. భవిష్యత్తులో ఆమె బ్యానర్ నుంచి మరిన్ని క్వాలిటీ సినిమాలు, బలమైన కథలతో వస్తే, 'సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్'గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. -
వరస సినిమాలతో అలరిస్తున్న రాగ్ మయూర్
'సివరపల్లి' సక్సెస్ తర్వాత వైవిధ్యమైన పాత్రల్లో ఒదిగిపోతూ తనదైన నటనతో రాగ్ మయూర్ మెప్పిస్తున్నాడు. రీసెంట్గా సమంత నిర్మించిన 'శుభం'లోనూ రాగ్ మయూర్ పాత్రకు చాలా మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఈ విషయమై మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ తో అస్సలు నటించను: టాలీవుడ్ హీరో) నేను ఇంతకు ముందు చేసిన 'సినిమా బండి' ఎంత మంచి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. అందులో నేను పోషించిన మరిడేష్ బాబు పాత్రకు కొనసాగింపుగా శుభం సినిమాలో నా రోల్ ఉంటుంది. నా పాత్రను దర్శకుడు ప్రవీణ్ చాలా సరదాగా డిజైన్ చేశారు. ఆయన కథ నెరేట్ చేసిన తర్వాత నా రోల్లోని కామెడీ ప్రేక్షకులను మెప్పిస్తుందని అర్థమైంది. అందుకే 'శుభం' అవకాశాన్ని కాదనలేకపోయాను. నా నమ్మకం నిజమైంది. నా పాత్రకు చాలా మంచి స్పందన వస్తోంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సమంత, ప్రవీణ్ కి థాంక్స్. సినిమా చాలా మంచి విజయాన్ని సొంతం చేసుకోవటం సంతోషంగా ఉందని అన్నాడు. ప్రవీణ్ కండ్రేగుల తీస్తున్న మూడో సినిమా 'పరదా'లోనూ రాగ్ మయూర్ నటిస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్తో కలిసి కనిపించబోతున్నాడు. 'పరదా'లో పూర్తి నిడివి పాత్ర చేశానని చెప్పాడు. జీఏ2 తీస్తున్న బడ్డీ కామెడీ చిత్రంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీస్తున్న గరివిడి లక్ష్మి సినిమాలోనూ మయూర్ నటిస్తున్నాడు.(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) -
సమంత 'శుభం' తొలిరోజు కలెక్షన్ ఎంతంటే?
చాన్నాళ్ల తర్వాత సమంత ఓ తెలుగు సినిమా చేసింది. అదే 'శుభం'. దీనికి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఓ చిన్న పాత్రలో కూడా నటించింది. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా లేవనే చెప్పాలి.శుభం సినిమాకు తొలిరోజు రూ.1.5 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చాయని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే గత కొన్నిరోజులుగా ఈ మూవీ ప్రచారంలో పాల్గొన్న సామ్.. చాలా కష్టపడింది. కానీ ఈమె ప్రభావం బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం పనిచేయలేదా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్)ఎందుకంటే 'శుభం'తో పాటు శ్రీ విష్ణు '#సింగిల్' (రూ.4.15 కోట్లు), చిరంజీవి క్లాసిక్ మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' (రూ.1.75 కోట్లు) థియేటర్లలోకి వచ్చాయి. కానీ సమంత సినిమాకు మిగతా వాటి వల్ల కాస్త మైనస్ అయింది. వసూళ్లలో దెబ్బ పడ్డట్లు అనిపిస్తుంది. మరి వీకెండ్ అయ్యేసరికి సమంత మూవీ లాభాల్లోకి వెళ్తుందా లేదా అనేది చూడాలి?శుభం విషయానికొస్తే.. కేబుల్ ఆపరేటర్ శ్రీను (హర్షిత్).. శ్రీవల్లి (శ్రియ)ని పెళ్లిచేసుకుంటాడు. అయితే శ్రీవల్లి ఫస్ట్ నైట్ ని కూడా పక్కనబెట్టి ఓ సీరియల్ కి అతుక్కుపోతుంది. అడ్డొచ్చిన భర్తకు వార్నింగ్ ఇస్తుంది. తన స్నేహితులిద్దరిదీ ఇదే బాధ. వీళ్లకే కాదు ఆ ఊరిలో అందరూ రాత్రి 9 అయితే వింతగా ప్రవర్తిస్తుంటారు? దీనికి కారణమేంటి? ఈ మొత్తం ఎపిసోడ్ లో సమంత పాత్ర ఏంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?) -
Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ
స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్లో సమంత పాల్గొనడం..వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ఆసక్తికర విషయాలు చెప్పడంతో ‘శుభం’పై బజ్ క్రియేట్ అయింది. ఓ మోస్తరు అంచనాల మధ్య నేడు(మే 09) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. ఫస్ట్నైట్ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్ చూస్తుంది. ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసుంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..సందేశం ఇవ్వాలంటే కథను సీరియస్గానే చెప్పాలా? లేదంటే ఇదిగో మేం ఈ మంచి మేసేజ్ ఇస్తున్నాం అని తెలిసేలా సన్నివేశాలను తీర్చిదిద్దాలా? అలా చేయకుండా, నవ్విస్తూ కూడా ఓ మంచి విషయం చెప్పొచ్చు అనేది ‘శుభం’ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల. సీరియల్ పిచ్చి అనే కాన్సెప్ట్ని తీసుకొని.. అందులోనే పురుషాధిక్యత ఎత్తిచూపుతూ మహిళల అణచివేత, ఆత్మాభిమానం లాంటి సున్నితమైన అంశాలను జోడించి, కథను నడిపించిన తీరు చాలా బాగుంది. చిన్న చిన్న సన్నివేశాలతోనే మంచి సందేశం ఇచ్చాడు. ఓ హారర్-కామెడీ చిత్రంలో ఇలాంటి మంచి విషయం చెప్పడం ‘శుభ’ పరిణామం. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే కామెడీ-హారర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో హారర్ నేపథ్యం అంతగా ఆకట్టుకోలేదు. కామెడీ కొన్ని చోట్ల మాత్రమే నవ్వులు పూయిస్తుంది. అయితే ఈ హారర్ కానీ, కామెడీ కానీ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఇంతకు మంచి కామెడీ-హారర్ కథలను మనం చూశాం. ఉన్నంతలో కొత్తదనం ఏదైన ఉందంటే.. సీరియల్కి ముడిపెడుతూ నిజ జీవిత వ్యక్తులను హారర్ యాంగిల్లో చూపించడమే. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. పెళ్లి చూపులు, పెళ్లి, ఫస్ట్నైట్ వరకు కథనం రొటీన్గా సాగుతుంది. ఫస్ట్నైట్ రోజు శ్రీవల్లీ ఇచ్చే ట్విస్ట్తో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆ ఆసక్తిని మరింత పెంచుతుంది. అయితే సెకండాఫ్కి వచ్చేసరికి మాత్రం కథనం కాస్త గాడి తప్పుతుంది. సమస్యను పరిష్కరించుకునేందుకు శ్రీనుబృందం చేసే ప్రయత్నం సాగదీతగా అనిపిస్తుంది. ఇక లాజిక్ గురించి ప్రస్తావించకపోవడమే మంచింది. దర్శఖుడు తన ‘సినిమా బండి ’టీమ్ని ఈ కథకు వాడుకున్న విధానం బాగుంది. అయితే సీరియల్ సమస్యను క్లోజ్ చేసే సన్నివేశాలు కూడా సీరియల్గా సా..గడంతో కథ అక్కడడక్కడే తిరిగినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా కథను తీర్చిదిద్దారు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం కొత్త నటీనటులతోనే తెరకెక్కించారు. అయినా కూడా ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కేబుల్ ఆపరేటర్గా హర్షిత్ రెడ్డి, అతని స్నేహితులుగా గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ బాగా నటించారు. ఇక ఈ ముగ్గురి భార్యలుగా శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి తమదైన నటనతో కొన్ని చోట్ల భయపెడుతూనే నవ్వించారు. ముఖ్యంగా శ్రీవల్లీగా శ్రీయ కొంతం తనదైన నటనతో ఆకట్టుకుంది..సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని కథకు తగ్గట్లుగా ఉంది. సమంత నిర్మించిన తొలి చిత్రం కాబట్టి నిర్మాణ విలువలు రిచ్గా ఉన్నాయని చెప్పలేం కానీ.. సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘సింగిల్’కాల్లో అతనికి ‘శుభం’ చెప్పేశా: సమంత పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ సమంత(samantha) నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీస్ పిక్చర్స్లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’(subham movie) మే 9న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సమంత ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్ని తన భుజాన వేసుకొని ముందుకు సాగుతోంది. వరుస ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్కి తన స్నేహితులను కూడా వాడుకుంటుంది. తాజా వెన్నెల కిశోర్తో కలిసి ఓ ఫన్ వీడియో కూడా చేసింది. ఈ వీడియోలో సమంత ‘ నా శుభం మూవీ ప్రీమియర్స్కి రావట్లేదా’ అని అడుగుతుంది. వెన్నెల కిశోర్ ఏమో తన నటించిన ‘సింగిల్’(#single) మూవీ కూడా అదే రోజు(మే 9) రాబోతుందని చెప్పాలనుకుంటాడు. కానీ సమంత అతన్ని మాట్లాడనీయకుండా.. ‘నువ్వు, నీ ఫ్యామిలీ తప్పకుండా వస్తారు కదా? నేను నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది తప్పుకుండా రావాలి’ అంటూ గబగబా మాట్లాడేస్తుంది. చివరికి నువ్వు కచ్చితంగా వస్తున్నావు అని కట్ చేసేస్తది. ఈ వీడియోని సమంత తన ఇన్స్టాలో షేర్ చేస్తూ.. సింగిల్ ఫోన్ కాల్లో వెన్నెల కిశోర్కి శుభం చెప్పేశా.. మే 9న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
‘శుభం’ మూవీ దెయ్యం బయట ఇంత అందంగా ఉందా? (ఫోటోలు)
-
'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత
గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. తర్వాత విడాకులు తీసుకుంది. ఇది జరిగి దాదాపు నాలుగేళ్లు గడిచిపోయాయి. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది. కానీ గత కొన్నిరోజుల క్రితం సమంత పెళ్లి గురించి రూమర్స్ వినిపించాయి. ఇప్పుడదే దర్శకుడితో మళ్లీ కనిపించడం, ఆ ఫొటోలని పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.విడాకుల తర్వాత సమంత.. తాను మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాననే విషయాన్ని బయటపెట్టింది. మధ్యలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేసింది. ఇది తప్పితే మరో మూవీ చేయలేదు. మధ్యలో ఓ వెబ్ సిరీసులో నటించిందంతే.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక) సరే అసలు విషయానికొస్తే.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రెండో సీజన్ లో సమంత నటించింది. ఈ సిరీస్ చేసిన దర్శకుల్లో ఒకరైన రాజ్ తో రీసెంట్ టైంలో సమంత ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూనే ఉంది. కొన్నిరోజుల క్రితం ఇద్దరూ కలిసి తిరుపతి కూడా వెళ్లొచ్చారు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వినిపించాయి. సామ్ నుంచి రెస్పాన్స్ లేదు కాబట్టి ఇది రూమర్ గానే మిగిలిపోయింది.తాజాగా న్యూ బిగినింగ్స్ అని ఓ పోస్ పెట్టింది. ఇందులో తన త్రలాలా నిర్మాణ సంస్థ గురించి, తాను నిర్మించిన శుభం మూవీ గురించి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులోనూ రాజ్ తో సమంత దిగిన కొన్ని ఫొటోలు కనిపించాయి. దీంతో బయట వినిపిస్తున్న రూమర్స్ ని ఏమైనా నిజం చేస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
'శుభం' కోసం తెగ కష్టపడుతున్న సమంత (ఫొటోలు)
-
గుడి కట్టిన అభిమాని.. సమంత ఏమన్నారంటే..
స్టార్ హీరోయిన్ సమంతకు ఓ అభిమాని గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీపంలో 2023లో ఓ చిన్నపాటి విగ్రహంతో ఈ గుడిని నిర్మించారు. ఇటీవల ఆ గుడిలో గోల్డెన్ కలర్ సామ్ విగ్రహాన్ని పెట్టి.. సమంత బర్త్డే(ఏప్రిల్ 28) నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు అనాథ పిల్లలకు సదరు అభిమాని.. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా గుడి విషయంపై సమంత స్పందించారు. గుడి కట్టిన విషయం తెలియగానే హ్యాపీగా ఫీలయ్యా కానీ..ఇలాంటి ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ.. అభిమాని గుడి కట్టిన విషయంపై స్పందించారు. అభిమాని నా పట్ల ఇంత ప్రేమ చూపించడం తెలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అయితే, నేను ఇలాంటి చర్యలను ప్రోత్సహించను. అభిమానులు తమ ప్రేమను సానుకూల మార్గాల్లో, సమాజానికి మేలు చేసే విధంగా చూపించాలని కోరుకుంటాను," అని అన్నారు. సమంత ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇక శుభం విషయానికొస్తే.. సమంత నిర్మించిన ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జీవితంలో ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడను: సమంత
సమంత పేరు చెప్పగానే చాలామందికి ఆమె విడాకుల అంశమే గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేసింది. అప్పట్లో చైతూ కంటే సామ్ పై ఎక్కువ విమర్శలు వచ్చాయి. కాలక్రమేణా ఆ విషయం గురించి అందరూ మర్చిపోయారు.తర్వాత కాలంలో అప్పుడప్పుడు సామ్.. బయట మాట్లాడినప్పుడు కావొచ్చు, ఇన్ స్టాలో పోస్ట్ చేసే స్టోరీల వల్ల కావొచ్చు చిన్నపాటి ట్రోలింగ్ ఫేస్ చేస్తూ ఉంటుంది. ఇదంతా సమంతకు తెలియంది ఏమి కాదు. ఇక విడాకుల తర్వాత మయోసైటిస్ వ్యాధి గురించి బయటపెట్టడం, దాని చికిత్స కారణంగా చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు 'శుభం' చిత్రాన్ని సిద్ధం చేసింది.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)సమంత నిర్మాతగా మారి తీసిన మొదటి సినిమా ఇది. మే 09న థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా రీసెంట్ గానే వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇప్పుడు మంగళవారం హైదరాబాద్ లో విలేకరులతో సినిమా విశేషాలు మాట్లాడింది. అలానే తన వ్యక్తిగత జీవితం గురించి ఇకపై మాట్లాడనని, ఈ మేరకు తాను డిసైడ్ అయినట్లు చెప్పుకొచ్చింది.ఎందుకంటే సమంత నుంచి విడాకులు తీసుకున్న నాగచైతన్య.. హీరోయిన్ శోభితని గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు సామ్ కూడా 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడమోరుతో రిలేషన్ లో ఉందనే కామెంట్స్ వినిపించాయి. పెళ్లి రూమర్స్ కూడా వస్తున్నాయి గానీ ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!) -
విశాఖ బీచ్ లో సమంత ‘శుభం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
శుభం సినిమా ట్రైలర్ రిలీజ్.. అతిథి పాత్రలో సమంత
-
ట్రైలర్: సీరియల్స్ చూస్తున్నంతసేపు దెయ్యంగా.. కాపాడనున్న సమంత!
హీరోహీరోయిన్లు ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ చూస్తున్నారు. నాని ఇటీవలే నిర్మాతగా కోర్టు మూవీతో విజయం అందుకున్నాడు. తాజాగా హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) కూడా ప్రొడ్యూసర్గా సత్తా చూపించేందుకు సిద్ధమైంది. ఆమె కొత్తగా ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ను స్థాపించింది. ఈ బ్యానర్లో శుభం అనే సినిమా తెరకెక్కింది. కొత్తవారితో కలిసి చేసిన ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రెగుల దర్శకత్వం వహించాడు.సీరియల్స్ చూస్తున్నంతసేపు ఒంట్లో దెయ్యంఆదివారం (ఏప్రిల్ 27) నాడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆడవాళ్లు సీరియల్స్కు బానిసైపోతారు. ఏం చేస్తున్నా సరే సీరియల్ టైం అవగానే టీవీ ముందు కూర్చుంటారు. వాళ్లను డిస్టర్బ్ చేశారంటే వాళ్ల పని అధోగతే! సీరియల్స్ చూస్తున్నప్పుడు వారి శరీరంలోకి ఓ దెయ్యం వచ్చినట్లే ప్రవర్తిస్తున్నారు. దీంతో మగవాళ్లు చివర్లో ఓ మాతను కలుస్తారు. ఇక్కడ మాత స్థానంలో ఉన్నది మరెవరో కాదు సమంత. ఊర్లో ఉన్న మగవాళ్లందరినీ కాపాడమని వాళ్లు ఆమె శరణు కోరతారు.మే 9న రిలీజ్మరి సమంత ఏం చేసింది? వాళ్లను కాపాడిందా? లేదా? అన్నది తెలియాలంటే మే 9న ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే! ఈ విచిత్రమైన కథను చచ్చినట్లు చూడాల్సిందే అని ట్రైలర్లోనే నొక్కి చెప్పారు. ఏదేమైనా ఈ మూవీలో సమంతను చూసి అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తున్న సామ్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి -
సమంత నిర్మాతగా తొలి మూవీ.. టీజర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత.. సినిమాల్లో నటించి చాలా రోజులైపోయింది. చివరగా 'ఖుషి'లో కనిపించింది. తర్వాత ఒకటి రెండు వెబ్ సిరీసులు చేసిందంతే. మరోవైపు నిర్మాణ సంస్థ స్థాపించింది. ఇప్పుడు అందులో నిర్మించిన సినిమాని ఇప్పుడు విడుదలకు సిద్ధం చేసేసింది కూడా.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)పలువురు చిన్న నటీనటులతో తీసిన ఈ సినిమాకు శుభం టైటిల్ ఫిక్స్ చేశారు. కొన్నిరోజుల క్రితం దీని గురించి బయటపెట్టగా.. ఇప్పుడు ఉగాది సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే ఇది ఫన్నీగా ఉంది. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది. మీరు కూడా టీజర్ పై ఓ లుక్కేయండి. (ఇదీ చదవండి: పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ) -
సమంత కొత్త జర్నీ.. 'బంగారం' కంటే 'శుభం' ముందు
చాన్నాళ్ల నుంచి సమంత తెలుగు సినిమాలు చేయట్లేదు. చివరగా విజయ్ దేవరకొండ 'ఖుషి'లో నటించిన సామ్.. ఆ తర్వాత 'సిటాడెల్' వెబ్ సిరీస్ చేసింది. అది తప్పితే కొత్త ప్రాజెక్టులేం చేయలేదు. దీంతో సమంత ఇక కొత్త చిత్రాలకు స్వస్తి చెప్పేసిందనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు 'శుభం'తో కొత్త ప్రయాణం ప్రారంభించింది. ఈ మేరకు కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ))ఇప్పటివరకు సమంత అంటే మనకు తెలిసింది హీరోయిన్ మాత్రమే. కానీ ఇకపై నిర్మాతగానూ వరస సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఉంది. ఈ క్రమంలోనే తొలి ప్రాజెక్టుగా 'శుభం' ప్రకటించింది. పలువురు యువ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.సమంత.. త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో గతంలోనే 'నా ఇంటి బంగారం' అని ఓ మూవీ ప్రకటించింది. కానీ అది ఇప్పుడు ఏ దశలో ఉందో.. అసలు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికే 'శుభం' షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సన్గ్రేస్ను గెలిపించిన శుభ్, అస్లామ్
సాక్షి, హైదరాబాద్: బౌలింగ్లో శుభ్ అగర్వాల్ (4/8), మొహమ్మద్ అస్లామ్ (4/8) చెలరేగడంతో ఎ- డివిజన్ వన్డే లీగ్లో సన్గ్రేస్ జట్టు విజయం సాధించింది. శనివారం సెయింట్ సాయి జట్టుతో జరిగిన మ్యాచ్లో 5 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్గ్రేస్ జట్టు 21.5 ఓవర్లలో 51 పరుగుల అల్ప స్కోరుకే ఆలౌటైంది. విక్రాంత్ చౌదరీ (19) టాప్ స్కోరర్. సెయింట్ సాయి బౌలర్లలో నిఖిల్ 3 వికెట్లు పడగొట్టగా... లలిత్, తేజ, సన్నీ తలా రెండు వికెట్లతో రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన సెయింట్ సాయి జట్టు శుభ్ అగర్వాల్, అస్లామ్ ధాటికి 26.2 ఓవర్లలో 46 పరుగులకే కుప్పకూలింది. రిలయన్స, యూనివర్సల్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో రిలయన్స జట్టు ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన యూనివర్సల్ జట్టు 22.4 ఓవర్లలో 67 పరుగులకు ఆలౌటైంది. హర్ష (23) రాణించాడు. రిలయన్స బౌలర్లలో కౌస్తుబ్ 5 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రిలయన్స జట్టు 7.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసి గెలిచింది. అఖిల్ (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.