breaking news
Saransh Jain
-
అతడి బౌలింగ్లో పసలేదు.. ఇలా అయితే కష్టమే: గవాస్కర్
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారత అరంగేట్ర స్పిన్నర్ సారాంశ్ జైన్ ఆశించిన స్దాయిలో రాణించలేకపోయాడు. కుల్దీప్ యాదవ్ స్ధానంలో జట్టులోకి వచ్చిన ఈ ఆఫ్ స్పిన్నర్ తన పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు."తొలి మ్యాచ్ ఆడుతున్న ఆందోళన, ఒత్తిడి సారాంశ్లో స్పష్టంగా కనిపించాయి. శ్రమించి బౌలింగ్ ప్రయత్నించినప్పటికీ, అతడు ప్రభావం చూపలేకపోయాడు. అంతర్జాతీయ స్థాయి బ్యాటర్లను ఇబ్బంది పెట్టేంత వైవిధ్యం అతడి బౌలింగ్లో లేదు.బ్యాటర్లను బోల్తా కొట్టించే డ్రిఫ్ట్ లేదా ఫ్లైట్ డెలివరీలను అతడు వేయలేకపోయాడు. పూర్తిగా పిచ్ నుంచి లభించే సహకారంపైనే ఆధారపడటంతో లంక బ్యాటర్లు అతడి బౌలింగ్ను సులువుగా ఎదుర్కొన్నారు" అని గవాస్కర్ ‘మిడ్-డే’లోని తన కాలమ్లో రాసుకొచ్చారు.కాగా ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఆటలో శ్రీలంకను ఆలౌట్ చేయలేక భారత బౌలర్లు చేతులెత్తేశారు. లంక యువ ఆటగాడు సోనాల్ దినుష విరోచిత పోరాటంతో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. టెయిలాండర్లతో కలసి మ్యాచ్ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: గంభీర్ సంచలన నిర్ణయం.. డేంజర్లో శ్రేయస్ అయ్యర్ ప్లేస్! -
IND vs SL: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆల్రౌండర్
టీమిండియాతో టెస్టుల్లో శ్రీలంక ప్రదర్శన ఎలా ఉన్నా.. ఆ జట్టు ఆల్రౌండర్ సొనాల్ దినుష మాత్రం అదరగొడుతున్నాడు. గాలె వేదికగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోట సొనాల్ దినుష సెంచరీ (100)తో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ 84 పరుగులతో ఆకట్టుకున్నాడు.భారత్ భారీ స్కోరుఅదే విధంగా.. భారత్తో రెండో టెస్టులోనూ సొనాల్ దినుష అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కొలంబో వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి... 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక టాపార్డర్ను భారత బౌలర్లు కుప్పకూల్చారు. ఓపెనర్లు లాహిరు ఉదార (1), కమిల్ మిశారా (19)లను ప్రసిద్ కృష్ణ పెవిలియన్కు పంపగా.. వన్డౌన్లో వచ్చిన ప్రభాత్ జయసూరియ (2)ను మానవ్ సుతార్ అవుట్ చేశాడు.పసిందు పోరాటంఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోగా పసిందు సూరియబండారా (80), కమిందు మెండిస్ (32) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీళ్లిద్దరు అవుటైన తర్వాత శ్రీలంక నామమాత్రపు స్కోరుకే ఆలౌట్ అవుతుందని భావించగా.. సొనాల్ దినుష నేనున్నానంటూ మరోసారి ఆపన్నహస్తం అందించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ ఆల్రౌండర్ శతక్కొట్టాడు.సెంచరీ చేశాడు.. కానీమొత్తంగా 162 బంతులు ఎదుర్కొన్న సొనాల్ దినుష.. 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు. పసిందుతో కలిసి 34, కేశారా నువాంతతో కలిసి 57, లాహిరు కుమారతో కలిసి 58 పరుగులు జోడించి.. జట్టు పరువును కాపాడగలిగాడు. అయితే, ఫాలో ఆన్ గండం నుంచి మాత్రం తప్పించలేకపోయాడు. కొలంబోలో నాలుగో రోజు ఆటలో భాగంగా భారత స్పిన్నర్ సారాంశ్ జైన్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి సొనాల్ దినుష పదో వికెట్గా వెనుదిరిగాడు.సరికొత్త చరిత్ర అయితే, తన అద్భుతమైన ఆట తీరుతో 25 ఏళ్ల సొనాల్ దినుష శ్రీలంక తరఫున సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టుల్లో బ్యాటింగ్ ఆర్డర్లో ఆరు లేదంటే అంతకంటే దిగువ స్థానంలో వచ్చి అత్యధిక సెంచరీలు బాదిన తొలి లంక ఆటగాడిగా రికార్డు సాధించాడు. గాలె, కొలంబో టెస్టుల్లో శతకాలు బాది ఈ ఘనత సాధించాడు. కాగా దినుష గతేడాది జూన్లో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. లంకను 290 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 213 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో లంకను ఫాలో ఆన్ ఆడిస్తోంది. కాగా గాలె టెస్టులో శ్రీలంక టీమిండియా చేతిలో 165 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.టీమిండియాతో టెస్టుల్లో ఆరు లేదంటే అంతకంటే దిగువ స్థానంలో వచ్చి అత్యధిక సెంచరీలు బాదిన శ్రీలంక క్రికెటర్లుసొనాల్ దినుష- 2 శతకాలుదినేశ్ చండిమాల్-1 శతకంతిలక్రత్నె దిల్షాన్-1 శతకంప్రసన్న జయవర్దనె-1 శతకంఅర్జున రణతుంగ-1 శతకంతిలాన్ సమరవీర-1 శతకంహషాన్ తిలకరత్నె-1 శతకం.A STAR IN THE MAKING! ⭐ Against all odds, Sonal Dinusha stood tall with a brilliant century to keep Sri Lanka’s hopes alive. 💪 Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/YoMY8T0h3I— Sony Sports Network (@SonySportsNetwk) August 26, 2026చదవండి: టెస్టు క్రికెట్లో ఫాలో ఆన్ అంటే? -
శ్రీలంక ఆలౌట్.. ఫాలో ఆన్ ఆడిస్తున్న టీమిండియా
టీమిండియాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 290 పరుగులకు ఆలౌట్ అయింది. పసిందు సూరియబండారా భారీ అర్ధ శతకం (80)తో రాణించగా.. సొనాల్ దినుష శతక్కొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన దినుష 162 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు. అయితే, మిగతా వారంతా విఫలం కావడంతో శ్రీలంకకు ఫాలో ఆన్ గండం తప్పలేదు.కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దేవదత్ పడిక్కల్ (117) శతక్కొట్టగా.. ధ్రువ్ జురెల్ అజేయ శతకం (115) సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (63), కెప్టెన్ శుబ్మన్ గిల్ (50) హాఫ్ సెంచరీలతో అలరించగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 45 పరుగులతో రాణించాడు.ఫలితంగా సోమవారం నాటి రెండో రోజు ఆటలో భారత్ 503-9 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రభాత్ జయసూరియ, కేశారా నువాంత చెరో రెండు వికెట్లు తీశారు. లాహిరు కుమారకు ఒక వికెట్ దక్కింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన లంక రెండో ఆటలో రెండు వికెట్ల నష్టానికి కేవలం ఎనిమిది పరుగులే చేసింది. ఈ క్రమంలో 8/2 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంకకు పసిందు ఊపిరిలూదాడు. మొత్తంగా 133 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. అయితే, రవీంద్ర జడేజా బౌలింగ్లో బౌల్డ్ కావడంతో అతడి ఇన్నింగ్స్కు తెరపడింది.మిగతా వారిలో కమిందు మెండిస్ (32) ఓ మోస్తరుగా రాణించగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ (8), వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా (0) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో సొనాల్ దినుష పట్టుదలగా నిలబడ్డాడు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేయగలిగింది.ఇక బుధవారం నాటి నాలుగో రోజు ఆటను 265/8తో మొదలుపెట్టగా.. సారాంశ్ జైన్ లాహిరు కుమార (12)ను వెనక్కి పంపాడు. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న దినుషను సైతం సారాంశ్ పెవిలియన్కు పంపడంతో లంక ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. సారాంశ్ జైన్కు రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలకు తలా ఒక వికెట్ దక్కాయి. ఫాలో ఆన్ అంటే?టెస్టు క్రికెట్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు కంటే తొలి ఇన్నింగ్స్లో కనీసం 200 లేదా అంతకంటే ఎక్కువ ఆధిక్యంలో ఉంటే.. ఫాలో ఆన్ ఆడిస్తుంది. అంటే.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఆలౌట్ కాగానే మళ్లీ బ్యాటింగ్ చేయమని కోరుతుంది. మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC)లోని 14.1.1 నిబంధన ప్రకారం తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంలో ఉన్న జట్టుకు ఈ హక్కు లభిస్తుంది. భారత్- శ్రీలంక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. లంకను 290 పరుగులకు ఆలౌట్ చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్లో 213 పరుగుల ఆధిక్యం సాధించింది. కాబట్టి ఫాలో ఆన్ ఆడిస్తోంది. అసలే ఈ మ్యాచ్కు వాన ముప్పు ఉంది. మరోవైపు ఆట ఇప్పటికే నాలుగో రోజుకు చేరుకుంది. దీంతో టీమిండియా ఫాలో ఆన్కు మొగ్గుచూపింది. కాగా తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.చదవండి: భువీ విజృంభణ -
IND vs SL: ‘అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు’
శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ముందుగా ఊహించినట్లుగానే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో యాజమాన్యం అతడితో అరంగేట్రం చేయించింది. ఈ నేపథ్యంలో కుల్దీప్ను ఉద్దేశపూర్వకంగానే తప్పించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఘాటుగా స్పందించాడు.అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుకొలంబో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన సితాన్షు కొటక్.. కుల్దీప్ యాదవ్ విషయంలో తమకు అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదన్నాడు. అతడు అనారోగ్యంతో ఉన్నాడని.. అందుకే శ్రీలంకతో రెండో టెస్టు ఆడటం లేదని స్పష్టం చేశాడు. ఈ మేరకు.. ‘‘కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ గురించి మీరు అడిగిన ప్రశ్న అసంబద్ధమైనది.నిజంగానే జ్వరం వచ్చిందిగాలె నుంచి బయల్దేరినపుడే అతడు వైరల్ ఫీవర్తో ఉన్నాడు. నిజంగానే అతడికి జ్వరం వచ్చింది. జట్టుకు స్పిన్నర్ అవసరమైన వేళ.. అతడు ఆడలేని పరిస్థితిలో ఉంటే.. యాజమాన్యానికి అతడి గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే అతడు ఆడగలిగే పరిస్థితిలో లేకుంటే.. సెలక్షన్కు ఎలా అందుబాటులో ఉండగలడు?పొద్దున బాలేడు.. సాయంత్రానికి కోలుకున్నాడుకుల్దీప్ విషయంలో మీరిలా ఆలోచించడం ఎంతమాత్రం సరికాదు. ఏదేమైనా అతడు త్వరగానే కోలుకున్నాడు. ఈరోజు సాయంత్రం (ఆదివారం) అతడిని నేరుగా కలిశాను. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు. ఉదయం మాత్రం మ్యాచ్ ఆడే పరిస్థితిలో లేడు.మరో విషయం.. తుదిజట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు లేదంటే ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలనుకుంటే.. శ్రీలంక టాపార్డర్లో దాదాపు నలుగురు లెఫ్టాండర్లే ఉన్నారు. అలాంటపుడు ఆఫ్ స్పిన్నర్ను ఆడించడం సరైందే కదా’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. తద్వారా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా కుల్దీప్ను తప్పించి.. సారాంశ్ జైన్ను ఆడిస్తున్నామని చెప్పకనే చెప్పాడు. ప్రయాణ బడలిక వల్లేఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్ గురించి బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే మాట్లాడుతూ.. ప్రయాణంలో అలసిపోయిన కారణంగానే అతడు రెండు రోజుల పాటు నెట్ సెషన్కు రాలేకపోయాడని తెలిపాడు. సితాన్షు కొటక్ మాత్రం వైరల్ ఫీవర్ అని చెప్పడం గమనార్హం. కాగా.. గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత్ శ్రీలంకపై 165 పరుగుల తేడాతో గెలిచింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు కొలంబోలో ఆదివారం మొదలైంది. ఇక తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 25 ఓవర్ల బౌలింగ్లో 103 పరుగులు ఇచ్చి కేవలం ఒకే వికెట్ తీశాడు.చదవండి: ఇమ్రాన్ ఖాన్ కోసం మాజీ కెప్టెన్లు! -
అరంగేట్రంతోనే అరుదైన రికార్డు.. ఎవరీ సారాంశ్?
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా టీమిండియా తరఫున సారాంశ్ జైన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కాగా 21వ శతాబ్దంలో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతిపెద్ద వయస్కుడిగా సారాంశ్ జైన్ నిలిచాడు. సారాంశ్ ప్రస్తుత వయస్సు 33 ఏళ్ల 145 రోజులు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో ఢాకాలో బంగ్లాదేశ్పై 32 ఏళ్ల 362 రోజుల వయస్సులో అరంగేట్రం చేసిన సబా కరీం రికార్డును సారాంశ్ అధిగమించాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడ ఆటతీరును ప్రదర్శిస్తున్న సారాంశ్ జైన్కు ఎట్టకేలకు టీమిండియాకు ఆడే అవకాశం లభించింది. ఇన్ఫెక్షన్ కారణంగా టెస్టుకు దూరమైనట్లు పేర్కొన్నప్పటికీ, తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే అతడి స్థానంలో సారాంశ్ జైన్ను తుదిజట్టులోకి తీసుకున్నారు. జడేజా చేతుల మీదుగా సారాంశ్ జైన్ టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్ ఆడకుండానే డెబ్యూసారాంశ్ జైన్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. ఐపీఎల్లో ఆడకుండానే జాతీయ జట్టుకు ఎంపికైన మూడో ఆటగాడిగా సారాంశ్ నిలిచాడు. గతంలో మురళీ విజయ్ (2008 నాగ్పూర్ టెస్టు వర్సెస్ ఆస్ట్రేలియా), మొహమ్మద్ షమీ (2013 ఢిల్లీ వన్డే వర్సెస్ పాకిస్తాన్) ఈ ఫీట్ సాధించారు.Photo Credit: BCCI Twitterఎవరీ సారాంశ్ జైన్?తన ఆఫ్ స్పిన్ బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టగల సారాంశ్ జైన్ బ్యాటింగ్ చేయడంలోనూ సమర్ధుడు. దేశవాళీ క్రికెట్లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్.. రెండు విభాగాల్లోను తాను ఆడిన జట్లకు విలువైన సహకారం అందిస్తూ వచ్చాడు. అయితే గాయం కారణంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. దీంతో బీసీసీఐ సెలెక్లర్ట బృందం సుందర్ స్థానంలో సారాంశ్ జైన్ను టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. లంకతో టెస్టు సిరీస్కు ముందే లంక-ఏ జట్టుతో ఆడిన తొలి అనధికారిక టెస్టులోనే సారాంశ్ జైన్ తన ప్రతిభను చాటాడు. రెండో టెస్టులో ఆరు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో అజేయంగా 70 పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. Photo Credit: BCCI Twitterఇక 2025-26 రంజీ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో సారాంశ్ జైన్ ఒకడు. ఆ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున ఏడు మ్యాచ్లాడిన సారాంశ్ 57.55 సగటుతో 518 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లోనూ సారాంశ్ 20.43 సగటుతో 30 వికెట్లు పడగొట్టి ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు.A new chapter begins. 🧢 Saransh Jain receives his maiden Test cap from Ravindra Jadeja in the #TeamIndia huddle ✨ Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/sXTILXMIOg— Sony Sports Network (@SonySportsNetwk) August 23, 2026 The feeling of making your Test Debut ✨#TeamIndia all-rounder Ravindra Jadeja presents the Test cap to Saransh Jain 👏👏Updates ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/6H6KrUdSkU— BCCI (@BCCI) August 23, 2026చదవండి: టాస్ గెలిచిన టీమిండియా.. సారాంశ్ జైన్ అరంగేట్రం -
IND vs SL: ప్రాక్టీస్ కూడా చేయలేదు.. రెండో టెస్టుకు డౌటే!
శ్రీలంకతో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ జరుగుతోంది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తప్పించి.. అతడి స్థానంలో సారాంశ్ జైన్ను ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు యాజమాన్యానికి సూచిస్తున్నారు. మ్యాచ్ వేదికైన కొలంబోలో ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉంటుంది గనుక సారాంశ్ను ఆడించడమే ఉత్తమమని మహ్మద్ కైఫ్ వంటి మాజీ ప్లేయర్లు అభిప్రాయపడుతున్నారు.అతడొక మ్యాచ్ విన్నర్ఈ నేపథ్యంలో భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే మాత్రం కుల్దీప్ యాదవ్కు అండగా నిలిచాడు. ‘అతడు చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. గాలేలోని పరిస్థితుల నేపథ్యంలో అతడి బాధ్యతలు వేరేవి. నా దృష్టిలో అతడొక మ్యాచ్ విన్నర్. మా ప్రణాళికల్లో అతడు కీలకం. ఒక్క మ్యాచ్ ద్వారానే అతడి ప్రతిభను అంచనా వేయడం సరైంది కాదు’ అని పేర్కొన్నాడు. కాగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 25 ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్... 103 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.అదరగొట్టిన మానవ్మరోవైపు.. కెరీర్లో రెండో టెస్టు మ్యాచ్ ఆడిన మానవ్ సుతార్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టగా... సీనియర్ రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు తీశాడు. నిజానికి శ్రీలంక స్పిన్నర్లు కూడా బంతిని గింగిరాలు తిప్పిన చోట కుల్దీప్ యాదవ్ ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. ఫలితంగా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.ప్రాక్టీస్ కూడా చేయలేదు.. రెండో టెస్టుకు డౌటే!ఇదిలా ఉంటే.. రెండో టెస్టు కోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కుల్దీప్ యాదవ్ మైదానానికి వచ్చినప్పటికీ.. ప్రాక్టీస్ చేయకుండానే వెనుదిరిగాడు. అటు బౌలింగ్ కానీ.. ఇటు బ్యాటింగ్ కానీ ప్రాక్టీస్ చేయలేదు. మరోవైపు.. సారాంశ్ జైన్ కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేవాడు. ఈ నేథ్యంలో బహుతులే మాత్రం.. కుల్దీప్ విశ్రాంతి తీసుకుంటున్నాడని.. అందుకే ప్రాక్టీస్ చేయలేదని తెలపడం విశేషం. ఏదైమైనా కుల్దీప్నకు కోచ్ అండగా నిలిచినప్పటికీ.. కొలంబో పిచ్ పరిస్థితుల కారణంగా అతడిపై వేటు తప్పదనే సంకేతాలు ఇచ్చినట్లు అయింది.అతడి ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయిఇదిలా ఉంటే.. గాలె టస్టులో ఇక తొలి టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్న యువ స్పిన్నర్ మానవ్ సుతార్పై బహుతులే ప్రశంసలు కురిపించాడు. ‘దేశవాళీల నుంచి సుతార్ను గమనిస్తున్నా. అతడు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. విభిన్న పరిస్థితుల్లో ఎలా రాణించాలో సుతార్కు బాగా తెలుసు. ఎలాంటి పిచ్పై ఎలాంటి బంతులు వేసి ఫలితం రాబట్టాలి... ఏ బ్యాటర్కు ఎలాంటి ఫీల్డ్ ప్లేస్మెంట్తో బౌలింగ్ చేయాలి... ఇలా అతడి ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉంటాయి. దీంతో అతడు జట్టుకు అదనపు బలంగా మారాడు’ సాయిరాజ్ బహుతులే వెల్లడించాడు. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య ఆదివారం (ఆగష్టు 23) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక. చదవండి: కెరీర్ విషయంలో అర్జున్ టెండుల్కర్ కీలక నిర్ణయం! -
పడిక్కల్ ఎందుకు బౌలింగ్ చేశాడు.. అతడిపై వేటు తప్పదు!
శ్రీలంక పర్యటనను టీమిండియా ఘనంగా ఆరంభించింది. గాలె వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక ఇరుజట్ల మధ్య ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక.అతడి గురించే నా ఆందోళనఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘నేను ఓ ఆటగాడి గురించి బాగా ఆందోళన చెందుతున్నా. అతడు మరెవరో కాదు కుల్దీప్ యాదవ్.పడిక్కల్ ఎందుకు బౌలింగ్ చేశాడు?శ్రీలంకతో రెండో టెస్టులో అతడు ఆడకపోవచ్చు. తన చేతికి బంతిని ఇస్తున్నారు. కానీ లాంగ్ స్పెల్స్కు అవకాశం ఇవ్వడం లేదు. నిజానికి తొలి టెస్టులో బ్యాటర్, పార్ట్ టైమ్ స్పిన్నర్ దేవదత్ పడిక్కల్ ఎందుకు బౌలింగ్ చేయాల్సి వచ్చింది?ఎందుకంటే.. జట్టులో సరైన ఆఫ్ స్పిన్నర్ లేడు. కాబట్టి రెండో టెస్టులో టీమిండియా.. కుల్దీప్ యాదవ్ను తప్పించి ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్కు పిలుపునివ్వవచ్చు. ఇద్దరు లెఫ్టాండర్ బ్యాటర్లు క్రీజులో ఉన్నపుడు ఆఫ్ స్పిన్నర్ను రంగంలోకి దింపితే ప్రయోజనకరంగా ఉంటుంది.సారాంశ్ అరంగేట్రం పక్కాకాబట్టి కుల్దీప్ యాదవ్ను కాదని యాజమాన్యం సారాంశ్ జైన్ వైపు మొగ్గుచూపుతుందనిపిస్తోంది. కొలంబోలో సారాంశ్ అరంగేట్రం దాదాపు ఖాయమైపోయినట్లే’’ అని పేర్కొన్నాడు. ఈ ఒక్కటి తప్ప తుదిజట్టులో మార్పులు ఉండబోవని కైఫ్ అభిప్రాయపడ్డాడు.కాగా గాలెలో జరిగిన తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్లో 14 ఓవర్ల బౌలింగ్లో 65 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్లో 11 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు.. పడిక్కల్ లంక రెండో ఇన్నింగ్స్లో ఒక ఓవర్ వేసి.. ఐదు పరుగులు ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్కే రహానే మద్దతుఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే మాత్రం కైఫ్తో విభేదించాడు. ‘‘కొలంబోలో కూడా గాలె మాదిరి పిచ్ ఉంటే.. నేను కుల్దీప్ యాదవ్నే ఆడించాలని చెప్తాను. అతడు అత్యద్భుతమైన నైపుణ్యాలున్న బౌలర్. మ్యాచ్ విన్నర్ కూడా. సరైన సమయంలో వికెట్లు తీయగల సత్తా అతడికి ఉంది. చాన్నాళ్ల తర్వాత అతడిని తుదిజట్టులోకి తీసుకున్నారు. మరొక్క అవకాశం ఇస్తే బాగుంటుంది’’ అని రహానే పేర్కొన్నాడు. కాగా గాలె టెస్టులో టీమిండియా ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వీరిలో కుల్దీప్ స్పెషలిస్టు స్పిన్నర్ కాగా.. జడేజా, మానవ్ ఆల్రౌండర్లు.గాలె టెస్టులో ఆడిన భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: ‘జడేజా పనైపోయింది.. అతడితో పోల్చవద్దు’ -
లంకతో రెండో టెస్టు.. స్టార్ ప్లేయర్పై వేటు..?
శ్రీలంకతో రెండో టెస్టుకు భారత జట్టు సిద్ధమవుతున్న వేళ తుది జట్టులో కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 23 నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ప్రారంభం కానున్న రెండో టెస్టులో మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ సరాన్ష్ జైన్కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.33 ఏళ్ల సరాన్ష్కు ఇటీవలే భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ రెండో టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో సరాన్ష్ను జట్టులోకి తీసుకున్నారు.సరాన్ష్ కుడిచేతి ఆఫ్స్పిన్నర్తో పాటు ఎడమచేతి వాటం బ్యాటర్. 2014లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అతడు, దశాబ్దానికి పైగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించాడు. ఫస్ట్క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 181 వికెట్లు, 2223 పరుగులు సాధించాడు.సరాన్ష్ తుది జట్టులోకి వస్తే ఎడమచేతి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై వేటుకు అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. గాలేలో జరిగిన తొలి టెస్టులో కుల్దీప్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. 25 ఓవర్లు వేసి 103 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు.మరోవైపు తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు.ఈ నేపథ్యంలో కొలంబోలో పరిస్థితులకు అనుగుణంగా స్పిన్ విభాగాన్ని మార్చాలని భారత జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సరాన్ష్ జైన్కు తుది జట్టులో చోటు దక్కితే, దాదాపు 12 ఏళ్ల దేశవాళీ ప్రస్థానం తర్వాత అతడి భారత టెస్టు అరంగేట్రం సాకారం అవుతుంది. -
తొలి టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లతో.. సర్ఫరాజ్కు చాన్స్!
శ్రీలంకతో గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాలే పిచ్ తొలి రెండు రోజులు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని, ఆ తర్వాతి మూడు రోజులు స్పిన్నర్లకు ఉపయుక్తంగా ఉంటుందని పిచ్ రిపోర్ట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. మ్యాచ్కు ఒక్కరోజు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ, తుదిజట్టు ఇంకా ఖరారు కాలేదు. గాలే పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఈ లెక్కన కుల్దీప్ యాదవ్తో పాటు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ లేదా సారాంశ్ జైన్లో ఒకరు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చోటు దక్కించుకోనున్నారు. ఇక సిరాజ్, గుర్నూర్ బ్రార్ లేదా ప్రసిధ్ క్రిష్ణలు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో తొలి ఐదు స్థానాల్లో (జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, గిల్, పంత్) ఎలాంటి మార్పు లేనప్పటికీ, ఆరో స్థానంపై తెగ చర్చ నడుస్తోంది. ఆరో స్థానంలో జురెల్ లేదా సర్ఫరాజ్ల్లో ఒకరికే చాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే సీనియార్టీ ప్రకారం జురెల్ కంటే సర్ఫరాజ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీంతో సర్ఫరాజ్ లంకతో తొలి టెస్టులో ఆడడం దాదాపు ఖాయమైనట్లే.టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్: జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవద్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ ( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్/సారాంశ్, సిరాజ్, గుర్నూర్/ప్రసిధ్ క్రిష్ణ.🚨 NOT A TURNER ❌ - Galle pitch is likely to be batting friendly in first 2 days. [Sahil Malhotra from TOI]India likely to field 2 quicks & 3 spinners for depth and balance. pic.twitter.com/vx6k5h5aLy— Johns. (@CricCrazyJohns) August 14, 2026Read: వీవీఎస్ లక్ష్మణ్కు బీసీసీఐ అత్యున్నత పదవి? -
పిలుపు ఊహించాం
గాలె: నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తే ఏదో ఒక రోజు భారత జట్టు నుంచి పిలుపు వస్తుందని ఆశించినట్లు... జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ పేర్కొన్నాడు. దేశవాళీల్లో దుమ్మురేపిన ఆకిబ్ గత రెండు రంజీ సీజన్లలో ఏకంగా 104 వికెట్లు పడగొట్టాడు. 2025–26 సీజన్లో జమ్మూకశ్మీర్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ నెగ్గడంలో నబీ కీలకపాత్ర పోషించాడు. అతడి నిలకడైన పేస్ బౌలింగ్ వల్లే ఆ జట్టు సుదీర్ఘ చరిత్ర గల టోర్నమెంట్లో మొదటిసారి చాంపియన్గా అవతరించింది. దీంతో చాన్నాళ్లుగా అతడికి భారత జట్టులో చోటు దక్కుతుందని భావించగా... తాజాగా శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు అతడు ఎంపికయ్యాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ సిరీస్కు దూరం కావడంతో అతడి స్థానంలో ఆకిబ్కు జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘దేశవాళీల్లో నిలకడగా రాణించడంతో ఏదో ఒక రోజు టీమిండియాకు ఎంపికవుతానని బలంగా విశ్వసించాను. నా కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని నమ్మకంగా ఉన్నా. మొత్తానికి ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. సరైన స్థానంలో బంతులు వేస్తూ వికెట్లు పడగొట్టడమే నా కర్తవ్యం. జట్టు ఎంపిక అనేది నా చేతుల్లో లేని పని. తొలిసారి భారత జట్టుకు ఎంపికైనట్లు తెలియగానే చాలా సంతోషించా. కుటుంబ సభ్యులు ఎంతో గర్వించారు. దీని కన్నా గొప్పది మరొకటి ఉండదు’ అని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఆకిబ్ పేర్కొన్నాడు. శ్రీలంకతో పర్యటనకు తొలుత ఎంపిక చేసిన భారత జట్టులో నబీకి చోటు దక్కలేదు. దీంతో అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ప్రత్యేక శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఆకిబ్కు టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఈ సమాచారం అందింది. ‘బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్లో ఉన్న సమయంలో నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావు అని అడిగారు... ప్రాక్టీస్ కోసం బెంగళూరు వెళ్తున్నానని సమాధానమిచ్చా... ఆ అవసరం లేదు నేరుగా శ్రీలంకకు వచ్చేయ్. నువ్వు భారత జట్టుకు ఎంపికయ్యావు’ అని చెప్పారు. దీంతో మొదట నమ్మలేకపోయా. కానీ బుమ్రా స్థానంలో తీసుకున్నారని ఆ తర్వాత తెలిసిందని నబీ వివరించాడు.సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం మరోవైపు 33 ఏళ్ల వయసులో టీమిండియాకు ఎంపికైన స్పిన్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ కూడా తన ప్రదర్శనకు దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. 2021–22 సీజన్లో రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సభ్యుడైన సారాంశ్... దశాబ్దానికి పైగా దేశవాళీల్లో రాణిస్తున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో శ్రీలంకతో తొలి టెస్టుకు దూరం కాగా... అతడి స్థానంలో సారాంశ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ‘టెస్టు క్రికెట్ ఆడాలంటే ఓపిక కావాలి. అందులోనూ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలంటే అది మరింత ఎక్కువ ఉండాలి. నేను 2014–15 సీజన్లో రంజీ ట్రోపీలో అరంగేట్రం చేశాను. ఎన్నో త్యాగాలు, మరెంతో శ్రమతో ఇన్నాళ్లుగా ఆటలో కొనసాగుతున్నా. ఏదో ఒక రోజు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాననే నమ్మకం మాత్రం కోల్పోలేదు. మా నాన్న కూడా రంజీ ఆటగాడే. ఓపికతో ఎదురుచూస్తే తప్పక అవకాశం వస్తుందని చెప్పారు. అదే నిజమైంది. గుడికి వెళ్తున్న సమయంలో భారత జట్టుకు ఎంపికయ్యాననే వార్త తెలిసి చాలా సంతోషించా’ అని సారాంశ్ చెప్పాడు. ప్రస్తుతం భారత జట్టులోని ఆటగాళ్లతో గతంలో దేశవాళీ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉండటంతో అందరితో త్వరగానే కలిసిపోయానని సారాంశ్ వెల్లడించాడు. -
స్పిన్నర్లతో తలనొప్పి.. కుల్దీప్ యాదవ్కు నో ఛాన్స్?!
శ్రీలంకతో టెస్టు సిరీస్కు టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ను భారత జట్టు సద్వినియోగం చేసుకుంది. సమిష్టిగా రాణించి విజయం సాధించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.ఈ నేపథ్యంలో గాలె వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో పాల్గొనే భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఎవరికి చోటు దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా శ్రీలంకలోనూ టర్నింగ్ పిచ్లు ఉంటాయి.అదరగొట్టిన జడ్డూ, మానవ్ఇక వార్మప్ మ్యాచ్లో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ అద్భుతంగా రాణించారు. లంక తొలి ఇన్నింగ్స్లో చెరో రెండు వికెట్లు తీసిన వీరిద్దరు.. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ రాణించారు. తొలి ఇన్నింగ్స్లో జడ్డూ 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా.. మానవ్ 41 పరుగులు సాధించాడు.తేలిపోయిన సారాంశ్ఇక లంక రెండో ఇన్నింగ్స్లో జడ్డూ రెండు వికెట్లు తీయగా.. మానవ్ పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయలేకపోయాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జడ్డూ 22 పరుగులు, మానవ్ 4 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగారు. అయితే, ఈ మ్యాచ్లో మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ వికెట్లు తీయలేకపోయాడు. పెద్దగా పరుగులు కూడా రాబట్టలేకపోయాడు.మరోవైపు.. లంక తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం బౌలింగ్కు రాలేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టు తుదిజట్టులో ఈ నలుగురిలో ఎవరికి అవకాశం వస్తుందన్న అంశంపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులె స్పందించాడు.కుల్దీప్నకు నో ఛాన్స్?!‘‘గాలెకు చేరుకుని పిచ్ను పరిశీలించిన తర్వాతే తుదిజట్టుపై నిర్ణయం జరుగుతుంది. అయితే, మా జట్టులోని నలుగురు స్పిన్నర్లు ఎవరికి వారే ప్రత్యేకం. జడ్డూ అనుభవజ్ఞుడు. మానవ్ సుతార్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు.ఇక సారాంశ్ జైన్ దేశీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టుకు ఎల్లప్పుడూ మణికట్టు స్పిన్నర్ అవసరం ఉంటుంది. మా నలుగురు స్పిన్నర్లు వైవిధ్యమైన బౌలర్లు. అయితే, పరిస్థితులకు తగ్గట్లే గాలెలో నిర్ణయం తీసుకుంటాం’’ అని సాయిరాజ్ బహుతులె తెలిపాడు.అందుకే బౌలింగ్ చేయలేదుఅదే విధంగా.. వార్మప్ మ్యాచ్లో లంక రెండో ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయకపోవడంపై సాయిరాజ్ వివరణ ఇచ్చాడు. ‘‘అతడు మెరుగ్గా ఆడాడు. వికెట్లు తీశాడు. అయితే, తనే విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. మిగిలిన వారికి కూడా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భావించాడు. కుల్దీప్ దాదాపు 20 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. కాబట్టి రెస్ట్ తీసుకున్నాడు’’ అని సాయిరాజ్ తెలిపాడు. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు మొదలుకానుండగా.. ఇందుకు గాలె వేదిక.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.చదవండి: గిల్, అభిషేక్ కాదు.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడే! -
వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్
టీమిండియా కీలక సిరీస్కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సీజన్లో భాగంగా శ్రీలంకతో రెండు మ్యాచ్లు ఆడనుంది. అయితే, అంతకంటే ముందు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీలంక ఎలెవన్తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా ఆతిథ్య శ్రీలంకను 2-0 తేడాతో వైట్వాష్ చేయాల్సిందే. ఇక ఈ సిరీస్ కంటే ముందు డబ్ల్యూటీసీలో భాగంగా సౌతాఫ్రికాతో స్వదేశంలో రెండు టెస్టులు ఆడిన గిల్ సేన.. ప్రొటిస్ జట్టు చేతిలో దాదాపు పాతికేళ్ల తర్వాత 2-0తో క్లీన్స్వీప్ అయిన సంగతి తెలిసిందే.దీంతో హెడ్కోచ్ గౌతం గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇటీవల గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా వరుస టీ20 సిరీస్లలో వైట్వాష్లు ఎదుర్కొంది. ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్కు శ్రీలంక టెస్టు సిరీస్ అగ్నిపరీక్షగా నిలిచింది.ఈ నేపథ్యంలో శ్రీలంక గడ్డపై ప్రాక్టీస్ మ్యాచ్కు ముందు రోజు గంభీర్ జట్టు సభ్యులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లంతా పూర్తి స్థాయి సామర్థ్యంలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలని, తమ బాధ్యత ఏమిటో అందరూ గుర్తించాలని వారికి సూచించాడు.‘మన ఎదురుగా ఎలాంటి లక్ష్యం ఉందో, ఎందుకు ఆడుతున్నామో అందరికీ తెలుసు. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగల సత్తా మనకు ఉంది. ఆగస్టు 15 ఉదయం ముందుగా బ్యాటింగ్ చేసినా, ముందుగా బౌలింగ్ చేసినా మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. మనపైకి సంధించే ప్రతీ ప్రశ్నకు మన వద్ద సమాధానం ఉండాలి. ఇక కొత్తగా జట్టులోకి వచ్చి న సారాంశ్ జైన్, ఆకిబ్ నబీలకు నా అభినందనలు. ఈ స్థాయి వరకు వచ్చేందుకు ఎంతో శ్రమించిన మీరు మీ కుటుంబ సభ్యులు, దేశం గర్వించేలా ఆడాలి’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా 33 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్, జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ శ్రీలంకతో టెస్టుల సందర్భంగా తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సారాంశ్, జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీ జట్టులోకి వచ్చారు. -
సెంట్రల్ జోన్ కెప్టెన్గా పటీదార్.. అందరి కళ్లు అతడిపైనే!
దులీప్ ట్రోఫీ 2026కు సంబంధించి సెంట్రల్ జోన్ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రజత్ పటీదార్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, ఫినిషర్ రింకూ సింగ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు మోయనున్నాడు. 15 మందితో పాటు అమన్దీప్ ఖరె, మయాంక్ మిశ్రా, సౌరబ్ రావత్, భార్గవ్ మెరాయ్, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయలు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఆగస్టు 23న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఐదు టెస్టులు జరగనున్నాయి. సెంట్రల్ జోన్తో పాటు నార్త్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్తో పాటు సౌత్జోన్ ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది. అయితే ఇటీవలే శ్రీలంకతో టెస్టు సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆల్రౌండర్ సారాంశ్ జైన్ కూడా సెంట్రల్ జోన్లో చోటు లభించింది. సారాంశ్తో పాటు ఎస్ఆర్హెచ్ బౌలర్లు జీషన్ అన్సారి, హర్ష్ దూబేలకు కూడా జట్టులో చోటు లభించింది.గతేడాది జరిగిన దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆయేడు ఫైనల్లో సౌత్జోన్ను మట్టికరిపించిన సెంట్రల్ జోన్ను పటీదార్ దశాబ్ద కాలంలో తొలిసారి చాంపియన్గా నిలిపాడు. అంతేకాదు ఆ సీజన్లో 382 పరుగులు చేసిన పటీదార్ ఖాతాలో ఒక సెంచరీ ఉంది. ఈసారి చాంపియన్ హోదాలో సెంట్రల్ జోన్ నేరుగా సెమీఫైనల్ ఆడనుంది. ఆగస్టు 23 నుంచి 26 మధ్య జరగనున్న క్వార్టర్ ఫైనల్స్లో ఈస్ట్ జోన్తో నార్త్ఈస్ట్ జోన్, నార్త్ జోన్తో వెస్ట్జోన్ తలపడనున్నాయి. ఈ రెండింటిలో గెలిచిన జట్లు సెమీస్లో చాంపియన్ సెంట్రల్ జోన్తో పాటు రన్నరప్ సౌత్జోన్తో ఆడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది.సెంట్రల్ జోన్ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), రింకు సింగ్ (వైస్ కెప్టెన్), ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), సారాంశ్ జైన్, అమన్ మొఖాడే, కునాల్ చండేలా, జీషన్ అన్సారీ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, కునాల్ సింగ్ రాథోడ్ (వికెట్ కీపర్), యాష్ ఠాకూర్, నాచికేత్ భూటెస్టాండ్ బై ప్లేయర్స్: అమన్దీప్ ఖరే, మయాంక్ మిశ్రా, సౌరభ్ రావత్, భార్గవ్ మెరాయ్, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయ.సపోర్ట్ స్టాఫ్: నిఖిల్ డోరు - హెడ్ కోచ్, దేశ్రాజ్ చౌహాన్ - ఫిజియో, చంద్రశేఖర్ రావు - వీడియో అసిస్టెంట్, మోహిత్ కుమార్ - మసీర్, మనీష్ ఝా - అసిస్ట్ కోచ్, మయాంక్ అగర్వాల్ - ట్రైనర్, జుఫ్రీ జకేరియా - మేనేజర్.చదవండి: నీరజ్కు చెక్.. ఫాస్ట్ బౌలర్ నుంచి జావెలిన్ చాంపియన్ దాకా -
మంచి సెలక్షన్.. సుందర్ కంటే అతడు బెటర్
శ్రీలంకతో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లంక పర్యటనలో భారత్కు కచ్చితంగా ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉంటుందని.. ఈ విషయంలో సెలక్టర్లు మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించాడు.కాగా ఆగష్టు 15 నుంచి భారత్- శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ప్రపంచటెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగమైన ఈ సిరీస్లో విజయం భారత్కు అతిముఖ్యమైనది. లంకను వైట్వాష్ చేస్తేనే టీమిండియా ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.నిఖార్సైన ఆఫ్ స్పిన్నర్ అవసరం ఈ నేపథ్యంలో ఇప్పటికే శుబ్మన్ గిల్ సారథ్యంలో టెస్టు జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు.. తొలిసారిగా 33 ఏళ్ల సారాంశ్ జైన్కు జాతీయ జట్టులో చోటిచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడగా.. అతడి స్థానంలో సారాంశ్ను ఎంపిక చేశారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సారాంశ్ ఎంపిక ఉత్తమమైన నిర్ణయం అని పేర్కొన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘శ్రీలంక జట్టులో ప్రస్తుతం ఎడమచేతి వాటం బ్యాటర్లు ఎక్కువగానే ఉన్నారు. కాబట్టి నిఖార్సైన ఆఫ్ స్పిన్నర్ అవసరం టీమిండియాకు ఉంది.మంచి సెలక్షన్వాషింగ్టన్ సుందర్ ఫిట్గా లేడు కాబట్టి సారాంశ్ జైన్కు అవకాశం వచ్చింది. నిజానికి సుందర్ కంటే సారాంశ్ బెటర్ బౌలర్. వాషీ మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడేమోగానీ.. సారాంశ్ మాత్రం అతడి కంటే బౌలింగ్లో మెరుగ్గా రాణించగలడు.సారాంశ్లో ఆ ప్రతిభ ఉంది. ఇప్పటికైనా అతడిని సెలక్టర్లు గుర్తించినందుకు సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో గత కొన్నేళ్లుగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా రెడ్బాల్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. అతడు ఓల్డ్ స్కూల్ స్పిన్నర్.అతడి బౌలింగ్లో పెద్దగా వైవిధ్యం ఉండదు. అయితే, నిలకడగా బౌలింగ్ చేస్తూ ఒకే చోట బంతులు విసురుతూ బ్యాటర్లను తికమకపెట్టగలడు. రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్ మాదిరి నైపుణ్యాలు అతడిలో ఉన్నాయి. కాబట్టి ఇదొక మంచి సెలక్షన్’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.చదవండి: గోల్డ్ మెడల్ నుంచి.. ఒక్కసారిగా ‘పాతాళానికి’! -
30 ఏళ్లు దాటినా తగ్గేదేలే!.. టీమిండియాలో రీఎంట్రీకి సై!
ముప్పై మూడేళ్ల వయసులో తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు సారాంశ్ జైన్. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించినప్పటికీ ఈ మధ్యప్రదేశ్ స్పిన్ ఆల్రౌండర్ సెలక్టర్ల పిలుపు కోసం సుమారు పన్నెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. జట్టు కూర్పు, పోటీ.. ఏదైతేనేమి ఎట్టకేలకు ఒక్కసారైనా జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్న అతడి చిరకాల కోరిక తాజాగా నెరవేరింది.వాషింగ్టన్ సుందర్ గాయం సారాంశ్ జైన్ పాలిట వరంగా మారింది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు వాషీ స్థానంలో సెలక్టర్లు ఈ ఆఫ్ స్పిన్నర్ను ఎంపికచేశారు. దీనిని బట్టి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టుకు అవసరమైన సమయంలో దేశవాళీ క్రికెట్లో మెరిసిన ఆటగాళ్ల నైపుణ్యాలకే పెద్దపీట వేస్తూ.. వారి వయసును పెద్దగా పట్టించుకోమనే సంకేతాలు ఇచ్చినట్లయింది.ఈ నేపథ్యంలో ముప్పై ఏళ్లు దాటినప్పటికీ తమను తాము నిరూపించుకుంటే.. ఆపై అదృష్టం కలిసివస్తే ఈ ఐదుగురు క్రికెటర్లకు కూడా టీమిండియా తలుపులు తెరిచే ఉంటాయనిపిస్తోంది. మరి వారెవరో చూసేద్దామా?!భువనేశ్వర్ కుమార్36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ ఒకప్పుడు టీమిండియా పేస్ దళంలో కీలక సభ్యుడు. అయితే, 2022 తర్వాత అతడికి టీమిండియాలో అవకాశాలు కనుమరుగయ్యాయి. ఈ క్రమంలో దేశీ క్రికెట్, ఐపీఎల్పై దృష్టి సారించిన భువీ.. ఆర్సీబీ వరుసగా రెండు టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో మొత్తంగా 45 వికెట్లు కూల్చి ఆర్సీబీ చాంపియన్గా నిలవడంలో భువీ సహకారం అందించాడు. నిలకడగా, పొదుపుగా బౌలింగ్ చేస్తున్న ఈ స్వింగ్ సుల్తాన్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఐసీసీ టోర్నీల్లో భువీని ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.రజత్ పాటిదార్పదిహేడేళ్లుగా ఐపీఎల్ తొలి టైటిల్ కోసం ముఖం వాచిపోయిన ఆర్సీబీకి.. వరుసగా రెండు ట్రోఫీలు అందించి అభిమానులకు విందుభోజనం పెట్టిన కెప్టెన్ రజత్ పాటిదార్. 2024లో తొలిసారి టీమిండియాకు ఆడిన పాటిదార్కు ఇంత వరకు భారత టీ20 జట్టులో మాత్రం చోటు దక్కలేదు.అయితే, ఐపీఎల్లో బ్యాటర్గా, కెప్టెన్గా సత్తా చాటుతున్న 33 ఏళ్ల రజత్ పాటిదార్కు సెలక్టర్లు పిలుపునివ్వాలని భారత మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో అతడు 15 మ్యాచ్లలో కలిపి 501 పరుగులు సాధించాడు.యజువేంద్ర చహల్టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ చివరగా 2023లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అయితే, గౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత చహల్ తిరిగి రావడం మరింత కష్టమైపోయింది.వైవిధ్యమైన నైపుణ్యాలున్న కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్లకు పెద్దపీట వేసిన గంభీర్ బృందం.. యుజీ చహల్ను పూర్తిగా పక్కనపెట్టేసింది. అయితే, దేశీ క్రికెట్, కౌంటీ, ఐపీఎల్లో రాణిస్తున్న 36 ఏళ్ల చహల్.. తన బౌలింగ్లో పదును తగ్గలేదని సెలక్టర్లకు గుర్తుచేస్తూనే ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల వీరుడి (233)గా చహల్ ఇప్పటికీ కొనసాగుతుండటం అతడి ఆటలో నిలకడకు నిదర్శనం.కృనాల్ పాండ్యాస్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా, గన్ ఫీల్డర్గా కృనాల్ పాండ్యాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చివరగా 2021లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఈ బరోడా ప్లేయర్.. ఐపీఎల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు.ఆర్సీబీ వరుసగా రెండుసార్లు (2025,2026) టైటిల్ గెలవడంలో కృనాల్ తన వంతు పాత్ర పోషించాడు. 35 ఏళ్ల ఈ ఆల్రౌండర్ టీమిండియాలో పునరాగమనం చేయగలననే నమ్మకంతో ఉన్నాడు.సూర్యకుమార్ యాదవ్ఈ ఏడాది టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే, వ్యక్తిగత వైఫల్యాల కారణంగా ఈ ఐసీసీ టోర్నీ తర్వాత మేనేజ్మెంట్ అనూహ్య రీతిలో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా జట్టులోనే చోటు లేకుండా చేసింది.సూర్య వయసు 35 ఏళ్లు కావడం కూడా ఇందుకు ఓ కారణం. అయితే, దేశీ క్రికెట్లో గనుక సత్తా చాటితే సూర్య తిరిగి జాతీయ జట్టులోకి తప్పక వస్తాడని ఇటీవలే బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. సూర్య సైతం అందుకు తగ్గట్లుగానే తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. గంటల కొద్దీ నెట్స్లో శ్రమిస్తూ పునర్వైభవం పొందేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే? అతడి అరంగేట్రం ఫిక్స్?
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. అయితే ఈ సిరీస్కు 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సారాన్ష్ జైన్ను ఎంపిక చేసి సెలక్టర్లు అందరని ఆశ్చర్యపరిచారు. వాషింగ్టన్ సుందర్ ఫిట్గా లేకపోవడంతో జైన్కు తొలిసారి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది.కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 54 ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడిన సారాన్ష్ 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు అఫ్గాన్తో ఏకైక టెస్ట్కు దూరంగా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా, సాయిసుదర్శన్లను ఎంపిక చేసినప్పటికి సిరీస్ ఆరంభానికి ముందు వారు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి లంకతో జరగబోయో తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అంచనా వేశాడు. అన్క్యాప్డ్స్ ఆటగాడు సారాన్ష్ జైన్ అరంగేట్రం చేసే అవకాశముందని అశ్విన్ తెలిపాడు."ప్లేయింగ్ ఎలెవన్లో రవీంద్ర జడేజా కచ్చితంగా ఉంటాడు. అదేవిధంగా అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ను కూడా తుది జట్టులో కొనసాగిస్తారు. వీరిద్దరితో పాటు కుల్దీప్ యాదవ్కు కూడా అవకాశమివ్వాలి. దీంతో జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారు. శ్రీలంక పిచ్లు ఎక్కువగా స్పిన్కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి సారాన్ష్ జైన్ను కూడా ఆడిస్తే బెటర్. అతడిని ఏడో స్ధానంలో బ్యాటింగ్ పంపాలి. ఎప్పటిలాగే ఓపెనర్లగా కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ ఉంటారు. మూడువ స్థానంలో దేవదత్ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్కు ఛాన్స్ దక్కనుంది. సాయి ఫిట్నెస్ సాధిస్తే దాదాపుగా అతడే తుది జట్టులో ఉంటాడు. నాలుగు, ఐదు స్ధానాల్లో వరుసగా శుబ్మన్ గిల్, రిషబ్ పంత్ బ్యాటింగ్కు వస్తారు. ఆరో స్ధానంలో జడేజాను పంపాలి. ఇక చివరగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో బుమ్రా, మహ్మద్ సిరాజ్లను తీసుకోవాలి. బుమ్రా ఫిట్గా లేకపోతే ప్రసిద్ద్ కృష్ణకు ఛాన్స్ ఇవ్వాలని" తన య్యూటూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.అశ్విన్ అంచనా వేసిన భారత తుది జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, సిరాజ్, సరాన్ష్ జైన్.శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరాన్ష్ జైన్. -
33 ఏళ్ల వయసులో... స్వప్నం సాకారం
ఐపీఎల్లో నాలుగు మ్యాచ్ల్లో మెరిస్తే చాలు... భారత జట్టులో చోటు ఖాయమే అని యువత భావిస్తున్న ప్రస్తుత తరుణంలో... ఓ ఆటగాడు దశాబ్ద కాలంగా టీమిండియా పిలుపు కోసం ఎదురు చూశాడంటే నమ్మగలరా! అప్పుడెప్పుడో పుష్కర కాలం క్రితం ఆడిన తొలి రంజీ మ్యాచ్లోనే ఐదు వికెట్లు పడగొట్టి అదుర్స్ అనిపించుకున్న ఆ ప్లేయర్కు 12 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.దేశవాళీల్లో నిలకడగా రాణించినప్పటికీ... టీమిండియాలో ఉన్న పోటీ, జట్టు కూర్పు కారణంగా అవకాశం దక్కించుకోలేకపోయిన మధ్యప్రదేశ్ స్పిన్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్... ఎట్టకేలకు 33 ఏళ్ల వయసులో భారత జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఎంపికైన నేపథ్యంలో సారాంశ్ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి, క్రీడావిభాగంధనాధన్ క్రికెట్ క్రేజ్లోనూ... సుదీర్ఘ ఫార్మాట్కే అధిక ప్రాధాన్యత ఇచ్చిన సారాంశ్ జైన్ నిరీక్షణ ఫలించింది. బ్యాట్ చేత పట్టినప్పటి నుంచి కన్న కల... ఇన్నాళ్ల తర్వాత నిజమైంది. 33 ఏళ్ల వయసులో ఈ ఆఫ్స్పిన్నర్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత పోటీ క్రికెట్లో 33 ఏళ్ల వయసు అంటే కెరీర్ చరమాంకానికి వచ్చేసినట్లే! అలాంటిది ఈ వయసులో అతడు తొలిసారి భారత జట్టుకు ఎంపికవడం ఆశ్చర్యమే. అయితే ఇన్నాళ్లలో ఎన్నోసార్లు సెలక్టర్ల దృష్టికి వచ్చినా... వేర్వేరు కారణాల వల్ల టీమిండియాకు ఎంపిక కాలేకపోయిన ఈ మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్నర్ శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.సుదీర్ఘ కాలగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జాతీయ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండటంతో ఇతర స్పిన్నర్లకు పెద్దగా అవకాశాలు రాకపోగా... ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ గాయంతో లంక పర్యటనకు దూరమవడంతో సారాంశ్ను ఎంపిక చేశారు. కుడిచేతి వాటం ఆఫ్స్పిన్నర్ అయిన ఈ మధ్యప్రదేశ్ ప్లేయర్... లోయర్ ఆర్డర్లో ఎడంచేతి వాటం బ్యాటింగ్తోనూ ఆకట్టుకోగలడు. సుదీర్ఘ కాలంగా మధ్యప్రదేశ్ రంజీ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సారాంశ్... 2022లో ఆ జట్టు చాంపియన్గా నిలవడంతో ప్రధానపాత్ర పోషించాడు. ఇతర ఆటగాళ్లంతా ఐపీఎల్ వంటి అతిపెద్ద లీగ్పై దృష్టి పెడుతున్న సమయంలోనూ సారాంశ్... దేశవాళీలకే తొలి ప్రాధాన్యతనిచ్చి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అతడి కఠోర శ్రమ, అకుంఠిత దీక్షకు ఇప్పుడు ఫలితం దక్కినట్లయింది. ఆశ్విన్ అభిమాని...చిన్నప్పటి నుంచి తండ్రి వద్దే కోచింగ్ తీసుకున్న సారాంశ్... ఆ తర్వాత భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను అభిమానించడం ప్రారంభించాడు. అశ్విన్ వీడియోలను పరిశీలిస్తూ బౌలింగ్లో వైవిధ్యం పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం వస్తే... ‘ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడు’ అని తండ్రి చెప్పిన మాటలను పాటించేందుకు సారాంశ్ సిద్ధమవుతున్నాడు. ‘నేను మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడాను. అయితే అందరు ఆటగాళ్లలాగే దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల నెరవేర్చుకోలేకపోయాను. కానీ ఇప్పుడు ఇన్నాళ్లకు నా కుమారుడికి ఆ అవకాశం వచ్చింది. సారాంశ్తో పాటు ఎంతో మంది రంజీ ప్లేయర్లకు నేను ప్రత్యేక శిక్షణ ఇచ్చా. వాళ్లందరిలో ఒక ప్రత్యేకత ఉంది. నా దగ్గర ట్రయినింగ్ పొందిన వాళ్లంతా తక్కువ మాట్లాడుతారు, ఎక్కువ కష్టపడతారు’ అని సుబోధ్ వివరించారు. మరి 33 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన సారాంశ్ అరంగేట్రం అవకాశం వస్తే అదరగొట్టాలని మనమూ ఆశిద్దాం!క్యాన్సర్ను దాచిపెట్టి...2014లో సారాంశ్ ఇండోర్ క్లబ్ తరఫున ఆస్ట్రేలియాలో మ్యాచ్లు ఆడుతున్న సమయంలో సుబోధ్ క్యాన్సన్ బారిన పడ్డారు. మ్యాచ్ అనంతరం తండ్రితో మాట్లాడాలనుకున్న ప్రతిసారీ బిజీగా ఉన్నారనే సమాధానం దక్కేది. అయితే పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత తండ్రికి నోటి క్యాన్సర్ వచ్చిందనే వార్త సారాంశ్కు తెలిసింది. దీంతో అతడు పూర్తిగా నీరుగారిపోయాడు. ‘అప్పుడు నా నోరు బాగా వాచిపోయింది. దాంతో మాట్లాడే పరిస్థితుల్లో లేను. ఒక చిన్న చీటీ తీసుకొని నువ్వు మెరుగైన ప్రదర్శన చేస్తే నేను త్వరగా కోలుకుంటా (బేటా, తూ జిత్నా అచ్ఛా కరేగా... మై ఉత్నీ జల్దీ ఠీక్ హో జావుంగా) అని రాసిచ్చా. దాన్ని సారాంశ్ తూచా తప్పకుండా పాటించాడు. బరిలోకి దిగిన ప్రతిసారీ 100 శాతం కష్ట పడుతూ మెరుగైన ఫలితాలు సాధించాడు. మంగళవారం భారత జట్టు ప్రకటన సమయంలో అతడు ఆలయానికి వెళ్లాడు. గుడి నుంచి బయటకు రాగానే జాతీయ జట్టుకు ఎంపికైన విషయం తెలిసి చాలా సంతోషించాడు. సుదీర్ఘ కాలంగా అతడు పడ్డ శ్రమకు ఇన్నాళ్లకు ఫలితం దక్కింది’ అని సారాంశ్ తండ్రి సుబోధ్ తెలిపారు.తండ్రి కూడా రంజీ ప్లేయర్...సారాంశ్ తండ్రి సుబోధ్ జైన్ రంజీ ప్లేయర్. మధ్యప్రదేశ్ జట్టు తరఫున 9 రంజీ మ్యాచ్లాడిన సుబోధ్ 23 వికెట్లు పడగొట్టారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో స్పిన్నర్ల మధ్య విపరీతమైన పోటీ కారణంగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్న ఆయన కల నెరవేరలేదు. తాను సాధించలేకపోయింది... తన కుమారుడైనా సాధించాలని సుబోధ్ ఎంతో తపించారు. సారాంశ్కు చిన్నప్పటి నుంచే సుబోధ్ కఠిన శిక్షణ ఇచ్చారు. ‘మాటల కన్నా చేతలు మిన్న’ అని బలంగా నమ్మే సుబోద్... తన కుమారుడిని కూడా అదే విధంగా తీర్చిదిద్దారు. సారాంశ్కు పన్నెండేళ్లు వచ్చేసరికి అతడిలో ఏదో ప్రత్యేకత ఉందని సుబోధ్ గుర్తించారు. దీంతో అతడిని మరింత సానబెట్టి రంజీ స్థాయికి చేర్చారు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రెండు టైటిల్స్ అందించిన రజత్ పాటీదార్తో కలిసి సుదీర్ఘ కాలం ఆడిన సారాంశ్ జైన్... పరిమిత ఓవర్ల కంటే సుదీర్ఘ ఫార్మాట్పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. -
సారాంశ్కు స్వాగతం
న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది. దశాబ్ద కాలానికి పైగా దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న ఆఫ్స్పిన్నర్ సారాంశ్ జైన్కు ఎట్టకేలకు భారత టెస్టు జట్టు నుంచి పిలుపు వచ్చింది. వచ్చే నెల శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు 33 ఏళ్ల సారాంశ్ ఎంపికయ్యాడు. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో... రెండో టెస్టు కొలంబోలో ఆగస్టు 23 నుంచి 27 వరకు జరుగుతాయి. ఈ సిరీస్ కోసం బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం శుబ్మన్ గిల్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గాయాలతో ఇబ్బంది పడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్ను కూడా ఈ సిరీస్కు ఎంపిక చేశారు. అయితే పర్యటన ప్రారంభానికి ముందు ఈ ఇద్దరూ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానాన్ని సారాంశ్తో భర్తీ చేశారు. మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఆల్రౌండర్... ఇటీవల శ్రీలంక ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లో భారత్ ‘ఎ’ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ ముగ్గురూ లెఫ్టార్మ్ స్పిన్నర్లు కావడంతో... వైవిధ్యం కోసం కుడిచేతి వాటం స్పిన్నర్ సారాంశ్ను ఎంపిక చేశారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 54 మ్యాచ్లు ఆడిన సారాంశ్ 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు.భారత టెస్టు జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్. -
సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్?
టీమిండియా తరఫున సారాన్ష్ జైన్ రూపంలో దేశవాళీ సీనియర్ క్రికెటర్ అంతర్జాతీయంగా అరంగేట్రం చేయనున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్కు గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ సారాన్ష్ జైన్ను బీసీసీఐ ఎంపిక చేసింది. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సారాన్ష్ జైన్ లోయర్ ఆర్డర్లో బ్యాటర్గా పరుగులు సాధించడంలో సమర్థుడు. దీంతో లంకతో సిరీస్లో సారాన్ష్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు కూడా దీనికి మరో ప్రధాన కారణం. 33 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన సారాన్ష్ 2014లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్కు ప్రధాన ఆటగాడిగా మారిపోయిన సారాన్ష్ ఆ తర్వాత సెంట్రల్ జోన్తో పాటు రెస్టాఫ్ ఇండియాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. తండ్రి కూడా క్రికెటరే.. స్పిన్ బౌలర్ అయిన సారాన్ష్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 181 వికెట్లతో పాటు 2,223 పరుగులు సాధించాడు. సారాన్ష్ జైన్ తండ్రి సుబోధ్ జైన్ కూడా క్రికెటరే. మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడారు. రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ బౌలర్ అయిన సుబోధ్ జైన్ తొమ్మిది మ్యాచ్ల్లో మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించారు. ఇక సారాన్ష్ జైన్ దేశవాళీ సీనియర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ వద్ద శిక్షణ పొంది ఆటలో మరింత రాటుదేలాడు. 2022లో తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సారాన్ష్ జైన్ సభ్యుడిగా ఉన్నాడు. చెన్నై వేదికగా ముంబైతో జరిగిన రంజీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో కీలక హాఫ్ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. లంక-ఏపై రాణించి సెలెక్టర్ల దృష్టిలో..ఇటీవలే శ్రీలంక-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో సారాన్ష్ జైన్ రాణించాడు. బ్యాట్తో 70 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే సెలెక్టర్ల దృష్టిలో పడిన సారాన్ష్ జైన్ తాజాగా సుందర్ స్థానంలో లంకతో సిరీస్కు ఎంపికయ్యాడు. వేలంలో అన్సోల్డ్ఇక ఐపీఎల్ 2024 నుంచి 2026 వరకు సారాన్ష్ జైన్ తన పేరును రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వేలంలో అతడిని ఎవరు కొనుగోలు చేయకపోవడంతో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ ద్వారా కాకుండా దేశవాలీ క్రికెట్లో రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అరుదైన క్రికెటర్ల జాబితాలో సారాన్ష్ జైన్ పేరును లిఖించుకున్నాడు.Saransh Jain has earned his maiden Test call-up 👏Take a look at the new off-spinner, who set the stage on fire with his stunning 5/49 in the Duleep Trophy final. 👌 pic.twitter.com/VIlTxFDhAy— BCCI Domestic (@BCCIdomestic) July 28, 2026Read: కోచ్ మార్పుకు డిమాండ్.. గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే!


