-
దినకరన్కు చుక్కెదురు
-
దినకరన్కు పచ్చ జెండా
సాక్షి, చెన్నై : ఆర్కేనగర్లో దినకరన్ గెలుపునకు మద్రాసు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. ఆర్కేనగర్ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలకు ముచ్చెమటలు పట్టించే రీతిలో స్వతంత్ర అభ్యర్థిగా దినకరన్ రేసులో నిలబడి భారీ ఆధిక్యంతో విజయ కేతనం ఎగురవేశారు. నియోజకవర్గంలో ఓటుకు నోటు తాండవం చేసినట్టు ఆరోపణలు, ప్రచారాలు జోరుగానే సాగా యి. అయితే, అందుకు తగ్గ ఆధారాల సేకరణలో ఎన్నికల యంత్రాంగం గానీ, పోలీసులు గానీ విఫలం అయ్యారు. భారీ ఆధిక్యంతో విజయ కేత నం ఎగురవేసిన దినకరన్కు వ్యతిరేకంగా ప్రధాన పార్టీలు కోర్టు మెట్లు ఎక్కలేదు. అయితే, మరో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఎంఎల్ రవి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను న్యాయమూర్తి జయచంద్రన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. కేంద్ర ఎన్నికల కమిషన్, పోలీసులు, ప్రభుత్వం వద్ద వివరణలను సైతం కోర్టు సేకరించింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో బుధవారం ఆ పిటిషన్ విచారణయోగ్యం కాదని కోర్టు తేల్చింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నోట్ల కట్టలు తాండవం చేసినట్టుగా పిటిషనర్ పేర్కొంటున్నారని, అయితే, అందుకు తగ్గ ఆధారాలు ఎక్కడ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రూ.30 లక్షలు నియోజకవర్గంలో పట్టుబడ్డట్టు పోలీసులు, ఎన్నికల వర్గాలు పేర్కొంటున్నా, ఆ మొత్తం పలాన వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా ఎలాంటి వివరాలు లేవని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు ఇచ్చినట్టు పేర్కొంటున్నారని, అయితే, ఎవరు ఎవరికి ఇచ్చారు అన్న వివరాలు కూడా లేవని వివరించారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం మేరకు ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని, దీనిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తన గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన ఒక్కగానొక్క పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో దినకరన్కు ఊరట లభించింది. -
ఆ ఫీలింగ్ నాకూ ఉంది- కమల్
సాక్షి, టీ.నగర్: ఆర్కేనగర్ నియోజకవర్గంలో రూ.20 టోకెన్ను అడ్డుకోలేకపోయాననే అపరాధ భావన తనకూ ఉందని నటుడు కమలహాసన్ తెలిపారు. కమలహాసన్ ఆనంద వికటన్ వారపత్రికలో రాస్తున్న సీరియల్ కథనంలో ఆర్కేనగర్ నియోజకవర్గం ఎన్నిక గురించి మళ్లీ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక గురించి విమర్శించే మీరు అందులో ఎందుకు పాలుపంచుకోలేదని ప్రశ్నిస్తున్నారని, అందులో పాలుపంచుకోనందుకు చాలా చింతిస్తున్నట్లు తెలిపారు. ఆ అపరాధ భావనతో బాధపడుతున్నట్లు తెలిపారు. కొందరు దిష్టిబొమ్మలను దహనం చేయడం, కోర్టులో కేసు వేయడాన్ని అభిమాన సంఘాలు ఖండించినప్పటికీ వారిని వారించామని, ఇద్దరు మనుషులు సరిచేసుకోవాల్సిన వ్యవహారంలో తాము ప్రజల్ని భాగస్వాములుగా చేయడం సరికాదని అన్నారు. మయ్యం విజిల్ యాప్ జనవరిలో ప్రారంభించడం జరుగుతుందన్నారే ఎప్పుడు జరుగుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది పొంగల్కు ఇచ్చే చెరకు లాంటిది కాదని, చేదు మందుగా ఉంటుందన్నారు. అందువల్ల దీన్ని జాగ్రత్తగా ఉపయోగించాలని తెలిపారు. సరైన రీతిలో తీసుకువస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుందని, అందుకే ఆలస్యమవుతున్నట్లు తెలిపారు. -
తీవ్ర విమర్శలు.. వెనక్కి తగ్గేది లేదు!
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్యే దినకరన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు కమల్ హాసన్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. కేసులు ఎదుర్కునేందుకైనా తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం మలేషియాలో ఉన్న ఆయనను మీడియా సంప్రదించింది. ‘‘నాపై కేసు నమోదైన ఫర్వాలేదు. వెనక్కి తగ్గను. న్యాయపరంగానే నేను వాటిని ఎదుర్కుంటా’’ అని మీడియాకు కమల్ బదులిచ్చారు. కాగా, ఆనంద వికటన్ కోసం రాసిన వ్యాసంలో కమల్ వ్యాసం ద్వారా దినకరన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసి దినకరన్ గెలిచారని.. ఈ విషయంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గబోనని కమల్ పేర్కొన్నారు. కాగా, ఆర్కేనగర్ ఓటర్లు ఓటుకు రూ. 20వేలు పుచ్చుకునేందుకు ఒక దొంగ వద్ద బిక్షమెత్తుకున్నారని కమల్ ఆ వ్యాసంలో రాశారు. కమల్ చేసిన ఈ విమర్శలు దినకరన్ అనుచరుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. దినకరన్తోపాటు ఆర్కే నగర్ ఓటర్లను కమల్ అవమానించారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీంతో కమల్పై కేసు నమోదు అయ్యింది. జనవరి 12న ఈ కేసు విచారణకు రానుంది. ఇది కూడా చదవండి... తీవ్ర ఆరోపణలు.. కమల్ ఇంటి వద్ద బందోబస్తు -
‘ధనబలంతో గెలిచారు’
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపుపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనబలంతోనే దినకరన్ గెలిచారని కమల్ ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో, తమిళ రాజకీయాల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు మాయని మచ్చగా అభివర్ణించారు. ఆర్కే నగర్ గెలుపు ఓట్లను కొనుగోలు చేయడంతోనే సాధ్యమైందన్నారు. దీన్ని ఓ స్కామ్ అని కూడా తాను వ్యాఖ్యానించనని..ఇది పట్టపగలు జరిగిన నేరమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర అభ్యర్థి (దినకరన్) తో పాటు పాలక పక్షం ఓటర్లకు వెలకట్టిందని ఆరోపించారు. తమిళ మేగజీన్ ఆనంద వికటన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఓటర్లను ఉద్దేశించి మీరు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. కమల్ ఆరోపణలను దినకరన్ తోసిపుచ్చుతూ ఉప ఎన్నికలో తన గెలుపును జీర్ణించుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement