-
ఫేస్ ఆఫ్ ఇండియా.. రిద్ధి కుమార్
పలు కళలకు చక్కటి ఆకృతినిస్తే.. ఆ పేరు రిద్ధి కుమార్. తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలుసు.. ఇటీవలి ‘లవర్’, ఈనాటి ‘రాధే శ్యామ్’ సినిమాల ద్వారా. ఆమె వెబ్స్టార్ కూడా! అందుకే ఈవారానికి రిద్ధి కుమార్ను ఈ ‘కాలమ్’ గెస్ట్గా తీసుకొచ్చాం. పుట్టింది పుణెలో. తండ్రి ఆర్మీ ఆఫీసర్ అవడం వల్ల దేశంలోని చాలా ప్రాంతాల్లో పెరిగింది. తల్లి అల్కా కుమార్... అడ్వకేట్. పుణె, ఫెర్గ్యూసన్ కాలేజ్లో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పదవ తరగతి పూర్తయిన నాటి నుంచే పని చేయడం మొదలుపెట్టింది. డ్యాన్స్ టీచర్గా, ఈవెంట్ మేనేజర్గా, యాంకర్గా ఇలా పలు రంగాల్లో ప్రతిభను చాటుకుంది. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే మోడలింగ్ చేయడం మొదలుపెట్టింది. ఎన్నో అందాల పోటీల్లోనూ పాల్గొంది. అన్నిట్లోనూ ఏదో ఒక టైటిల్స్ను గెలుచుకుంది. వాటిల్లో మిస్ పుణె (2015), ఫేస్ ఆఫ్ ఇండియా (2016) వంటివి మచ్చుకు కొన్ని. మోడలింగ్లో ఉన్నప్పుడే సినిమా అవకాశం వచ్చింది. అదే ‘లవర్’.. తెలుగు చిత్రం. దాని తర్వాత మాతృభాష మరాఠీలో, అనంతరం మలయాళం సినిమాల్లోనూ వరుస చాన్స్లు వచ్చాయి. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉండగానే వెబ్ చానెల్స్లోనూ ఆఫర్స్ ఆమె డేట్స్ డైరీలోని పేజీలను నింపేశాయి. అలా ‘వూట్’లో స్ట్రీమ్ అయిన ‘క్యాండీ’ రిద్ధిని దేశమంతటికీ పరిచయం చేసింది. డిస్నీ హాట్స్టార్లోని ‘హ్యుమన్’ సిరీస్ కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నటనంటే అమితంగా అభిమానించే రిద్ధి చిత్రకారిణి కూడా. ఆమె ఆయిల్ పెయింటింగ్స్కు ఇన్స్టాగ్రామ్లో మహా ఫాలోయింగ్ ఉంది. ఇంకా చాలా కళలున్నాయి ఆమెలో.. రాస్తుంది.. కమ్మటి వెరైటీలను వండుతుంది.. విపరీతంగా ప్రయాణాలు చేస్తుంది. వృత్తి, ప్రవృత్తి రెండూ రెండు కళ్లలాంటివి అంటుంది. తమను తాము ఆవిష్కరించుకునే భూమికలు అంటే ఇష్టం. కానీ డ్రీమ్ రోల్స్ మాత్రం ఫన్ క్యారెక్టర్సే. అంతేకాదు డిటెక్టివ్, పోలీసు పాత్రల్లో నటించాలనీ ఉంది. – రిద్ధి కుమార్ -
రాధేశ్యామ్ భామ రిద్ధి కుమార్ ఫొటోలు
-
Riddhi Kumar: రాధేశ్యామ్ కోసం విలువిద్య నేర్చుకున్నా
‘రాధేశ్యామ్’ సినిమాలో స్పోర్ట్స్ ఉమన్ క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర చేయడం చాలా కష్టం. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఆర్చరీ (విలు విద్య) నేర్చుకున్నాను’’ అని నటి రిద్దీ కుమార్ అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ చిత్రంలో నటించిన రిద్దీ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మాది పుణే. మా నాన్న ఆర్మీ ఆఫీసర్. నేను పుణేలోనే ఫిలాసఫీలో డిగ్రీ చేశాను. సినిమాల్లో నటించాలనుకున్నప్పుడు ముందు మోడలింగ్లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో చాన్స్ వచ్చింది. తెలుగులో ‘లవర్స్, అనగనగా ఓ ప్రేమకథ’ చిత్రంలో నటించాను. ఇంత తక్కువ సమయంలోనే ప్రభాస్ వంటి బిగ్ స్టార్తో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ సినిమాలో నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశాను. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. నేను నటిస్తున్న వెబ్ సిరీస్ మేలో రిలీజ్ అవుతోంది. నటి రేవతి మేడమ్ దర్శకత్వంలో కాజోల్ లీడ్ రోల్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నాను. నాకు డిటెక్టివ్, ఫన్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ.. ఇలా అందరి హీరోలతో నటించాలని ఉంది’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
థియేటర్లో కలుద్దాం
మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న హీరోలుగా, రిద్ధీ కుమార్, మేఘా చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా వేగేశ్న సతీష్ మాట్లాడుతూ– ‘‘యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. నవంబర్ 3న షూటింగ్ మొదలు పెట్టి, డిసెంబర్ మొదటి వారానికి ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తి చేశాం. కరోనా భయం ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకొని అవుట్డోర్లోనే షూటింగ్ చేశాం. అమలాపురం, విశాఖపట్నం, రాజమండ్రిలో నిర్విరామంగా షూటింగ్ జరిపాం. త్వరలోనే మిగిలిన పాట పూర్తి చేసి, సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘సతీష్గారు పర్ఫెక్ట్ ప్లానింగ్తో పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రేక్షకులను థియేటర్స్లో కలుసుకుంటాం’’ అన్నారు ఎం.ఎల్.వి. సత్యనారాయణ. -
ఓ తండ్రి తపనే ఈ సినిమా
విరాజ్. జె. అశ్విన్ హీరోగా ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ధికుమార్, రాధా బంగారు కథానాయికలుగా నటించారు. కె. సతీష్ కుమార్ సమర్పణలో కేఎల్ఎన్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. కేఎల్ఎన్ రాజు మాట్లాడుతూ– ‘‘రాంగ్ ట్రాక్లో వెళ్తోన్న ఓ కూతుర్ని సరైన మార్గంలో పెట్టాలనే ఓ తండ్రి తాపత్రయమే ఈ చిత్రకథాంశం. ప్రతాప్ ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించారు. అంజన్ మంచి సంగీతం అందించారు. అవుట్పుట్ బాగా వచ్చింది. అశ్విన్, రిద్ధిలతో పాటు మిగతా ఆర్టిస్టులందరూ బాగా నటించారు. ఈ సినిమాపై నమ్మకంతో నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఒక కొత్త హీరోపై ఎంతో ప్రెజర్ ఉంటుంది. ఈ ఒత్తిడిని మర్చిపోయేలా మా టీమ్ çసపోర్ట్ చేశారు. మార్తాండ్ కె. వెంకటేశ్గారు నేను హీరోగా నటించడానికి ప్రోత్సహించారు. రాజుగారు నిర్మాతగా ఉన్న ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఇందులో ఎనర్జిటిక్ అండ్ హైపర్గా ఉండే సూర్య క్యారెక్టర్ చేశాను’’ అన్నారు విరాజ్. ‘‘చిన్న సినిమా తీయడమే కాదు రిలీజ్ చేయడం కూడా కష్టమే. కానీ కేఎల్ఎన్ రాజుగారు మా సినిమాను ముందుండి నడిపించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ రీలీజ్ చేస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు ప్రతాప్. ‘‘కొత్తవారిని ప్రోత్సహించడానికి కేఎల్ఎన్ రాజుగారు నిర్మాతగా మారారు. ఈ సినిమా ప్రయాణంలో భాగమైన అందరికీ థ్యాంక్స్’’అన్నారు సునైన. రిద్ధికుమార్, నటుడు కాశీవిశ్వనాథ్, సమర్పకుడు సతీష్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement