breaking news
Medak Falcons
-
తిలక్ వర్మ జట్టును వీడాడు.. పరాజయాల పరంపరతో..
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్ నుంచి మెదక్ ఫాల్కన్స్ నిష్క్రమించింది. ఖమ్మం ఏసెస్తో సోమవారం నాటి మ్యాచ్లో 19 పరుగుల తేడాతో ఓడిపోయి.. పరాజయంతో టోర్నీని ముగించింది.కాగా సీజన్లో తమ ఆరంభ మ్యాచ్లో మెదక్ సంచలన విజయం సాధించింది. వరంగల్ వారియర్స్ విధించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. జయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ తిలక్ వర్మ మెదక్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడంతో పాటు.. సెంచరీ (56 బంతుల్లో 136 నాటౌట్) బాది జట్టును గెలిపించాడు.Goosebumps! 🥶Stuff of dreams, really. The whole of Medak Falcons feel it. The whole of Telangana feels it! 😍😍#WWvMF #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/cASKvz7vgs— tg20official (@tg20official) June 22, 2026తిలక్ వర్మ టీమిండియా విధుల్లోకి వెళ్లగా..ఆ తర్వాత తిలక్ వర్మ టీమిండియా విధుల్లోకి వెళ్లగా.. మెదక్ పరాజయాల పరంపర కొనసాగింది. గెలుపున్నదే లేక చతికిల పడిన మెదక్.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్లోనైనా గెలవాలని భావించింది. అయితే, సోమవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన మెదక్ తొలుత బౌలింగ్ చేసింది.ఆకాశమే హద్దుగాఆరంభంలోనే ఓపెనర్లలో జీఎస్కే రెడ్డిని డకౌట్ చేయడం సహా వాఫీ కచ్చి (14)ని కూడా త్వరగానే పెవిలియన్కు పంపి కెప్టెన్ రవితేజ శుభారంభం అందించాడు. మికిల్ జైస్వాల్ (15) అర్జున్ పెవిలియన్కు చేర్చగా ఖమ్మం ఇన్నింగ్స్ నెమ్మదించింది. అయితే, వన్డౌన్ బ్యాటర్ కొడిమెల హిమతేజ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 57 బంతుల్లోనే 103 పరుగులతో హిమతేజ అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ప్రతీక్ రెడ్డి (32) రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఖమ్మం ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మెదక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 171 పరుగులకే పరిమితమైంది.శుభారంభం అందించినా..ఓపెనర్లు నమన్ అగర్వాల్ (19 బంతుల్లో 32), శృంజిత్ రెడ్డి (46 బంతుల్లో 60) శుభారంభం అందించినా.. మిగతా వాళ్లు దానిని కొనసాగించలేకపోయారు. కెప్టెన్ రవితేజ డకౌట్ కాగా.. విక్రమ్ నాయక్ (7), వరుణ్ యర్రం (0) తీవ్రంగా నిరాశపరిచారు.ఇక సూర్య తేజ (19 బంతుల్లో 26), ఇషాన్ శర్మ (15 బంతుల్లో 34 నాటౌట్) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఫలితంగా మెదక్ 19 పరుగుల తేడాతో ఓడిపోయి భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. ఖమ్మం ఈ విజయంతో ఐదో గెలుపు నమోదు చేసి పది పాయింట్లతో రెండో స్థానానికి దూసుకువెళ్లింది. ఇక మెదక్తో మ్యాచ్లో ఖమ్మం బౌలర్లు హర్షిత్ సాయి, విద్యానంద రెడ్డి, వాఫీ కచ్చీ తలా రెండు వికెట్లు తీయగా.. వేద్రెడ్డికి ఒక వికెట్ దక్కింది. -
శతక్కొట్టిన హిమతేజ
మెదక్ ఫాల్కన్స్తో మ్యాచ్లో ఖమ్మం ఏసెస్ స్టార్ కొడిమెల హిమతేజ శతక్కొట్టాడు. కేవలం 55 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్లో భాగంగా సోమవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో ఖమ్మం ఏసెస్- మెదక్ ఫాల్కన్స్ ముఖాముఖి తలపడుతున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన ఖమ్మం తొలుత బ్యాటింగ్కు దిగింది.ఓపెనర్లలో వాఫీ కచ్చి 14 పరుగులు చేయగా.. జీఎస్కే రెడ్డి డకౌట్ అయ్యాడు. ఇలాంటి తరుణంలో వన్డౌన్ బ్యాటర్ కొడిమెల హిమతేజ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న హిమతేజ 11 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు.మిగిలిన వారిలో మికిల్ జైస్వాల్ 15 పరుగులు చేయగా.. ప్రతీక్ రెడ్డి 32 పరుగులతో రాణించాడు. ఆఖర్లో కెప్టెన్ సీవీ మిలింద్ 14 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఖమ్మం ఏసెస్ 190 పరుగులు చేసింది. మెదక్ బౌలర్లలో రవితేజ రెండు, మధుకర్ మన్నె, అర్జున్ గొర్రపల్లి తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుఖమ్మంసీవీ మిలింద్ (కెప్టెన్), వాఫీ కచ్చి, జీఎస్కే రెడ్డి, హిమతేజ కొడిమెల, మికిల్ జైస్వాల్, సహేంద్ర మల్లు, హర్షిత్ సాయి, షేక్ అజర్, వేద్ రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డి ఎల్లాల.మెదక్రవితేజ (కెప్టెన్), నమన్ అగర్వాల్, శృంజిత్ రెడ్డి, ఇషాన్ శర్మ (వికెట్ కీపర్), విక్రమ్ నాయక్, సాయి వరుణ్ యెర్రం, అర్జున్ గొర్రపల్లి, ఎన్ సూర్యతేజ, కార్తికేయ కాక్, మధుకర్ మన్నె, శశాంత్ బూడిది. -
ఇరుజట్లకు ఆఖరి మ్యాచ్.. తుదిజట్లు ఇవే
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం మ్యాచ్లో ఖమ్మం ఏసెస్- మెదక్ ఫాల్కన్స్ తలపడుతున్నాయి. ఉప్పల్లో టాస్ గెలిచిన ఖమ్మం ఏసెస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.కాగా ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఖమ్మం.. నాలుగింట గెలిచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు.. మెదక్ మాత్రం పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్లలో మెదక్ కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి రెండు పాయింట్లు సాధించింది. లీగ్ దశలో ఇరుజట్లకు ఇదే ఆఖరి మ్యాచ్ కావడం విశేషం.తుదిజట్లుఖమ్మంసీవీ మిలింద్ (కెప్టెన్), వాఫీ కచ్చి, జీఎస్కే రెడ్డి, హిమతేజ కొడిమెల, మికిల్ జైస్వాల్, సహేంద్ర మల్లు, హర్షిత్ సాయి, షేక్ అజర్, వేద్ రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డి ఎల్లాల.మెదక్రవితేజ (కెప్టెన్), నమన్ అగర్వాల్, శృంజిత్ రెడ్డి, ఇషాన్ శర్మ (వికెట్ కీపర్), విక్రమ్ నాయక్, సాయి వరుణ్ యెర్రం, అర్జున్ గొర్రపల్లి, ఎన్ సూర్యతేజ, కార్తికేయ కాక్, మధుకర్ మన్నె, శశాంత్ బూడిది. -
తీరు మారని మెదక్.. నల్గొండ చేతిలో ఘోర ఓటమి
తెలంగాణ టీ20 లీగ్-2026లో మెదక్ ఫాల్కన్స్ తీరు ఏ మాత్రం మారలేదు. ఈ టోర్నీలో మెదక్ వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. శుక్రవారం ఉప్పల్ మైదానం వేదికగా నల్గొండ నైట్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో మెదక్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెదక్ బ్యాటర్లలో విక్రమ్ నాయక్(48) టాప్ స్కోరర్గా నిలవగా.. వరుణ్ యర్రం(44), రవితేజ(33), శ్రుంజిత్ రెడ్డి(30) రాణించారు. నల్గొండ బౌలర్లలో చింతల రక్షణ్, అనికేత్ రెడ్డి, ఇలియాన్ సతాని తలా వికెట్ సాధించారు.అనంతరం మెదక్ ఫాల్కన్స్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని అనురాగ్ నల్గొండ నైట్స్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. నల్గొండ ఓపెనర్ గౌరవ్ రెడ్డి(47 బంతుల్లో 101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు జశ్వంత్(34) రాణించాడు. మెదక్ బౌలర్లలో మధుకర్, అర్జున్ మాత్రమే తలా వికెట్ పడగొట్టారు. మెదక్ జట్టులో కెప్టెన్ తిలక్ వర్మ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మెదక్ జట్టు కేవలం తొలి మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. ఫాల్కన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.చదవండి: IND vs ENG: 'వైభవ్ సూర్యవంశీ వద్దు.. అతడినే జట్టులో కొనసాగించాలి' -
నల్గొండతో మ్యాచ్.. మెదక్ నామమాత్రపు స్కోరు
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026లో శుక్రవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్- నల్గొండ నైట్స్ తలపడుతున్నాయి. ఉప్పల్ వేదికగా టాస్ గెలిచిన మెదక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.ఓపెనర్లలో నమన్ అగర్వాల్ (18) ఫర్వాలేదనిపించగా.. శృంజిత్ రెడ్డి (17 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ రవితేజ 33 పరుగులు చేశాడు. ఆఖర్లో విక్రం నాయక్ (31 బంతుల్లో 48), వరుణ్ యర్రం (29 బంతుల్లో 44) మెరుగ్గా రాణించి అజేయంగా నిలిచారు. నల్గొండ బౌలర్లలో రక్షన్ రెడ్డి, అనికేత్ రెడ్డి, సతాని తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.తుదిజట్లుమెదక్ ఫాల్కన్స్రవితేజ (కెప్టెన్), నమన్ అగర్వాల్, శృంజిత్ రెడ్డి, విక్రమ్ నాయక్ (వికెట్ కీపర్), సాయి వరుణ్ యర్రం, అర్జున్ గొర్రపల్లి, జగమ్ బన్నీ, నొమన్ అహ్మద్, సయ్మద్ ఘాజి అబ్బాస్, కార్తికేయ కాక్, మధుకర్ మన్నెనల్గొండ నైట్స్రాహుల్ బుద్ధి (కెప్టెన్), అనికేత్ రెడ్డి, టి.హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), గౌరవ్ రెడ్డి, జశ్వంత్ మోటే, నితీశ్ రెడ్డి, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, దివేశ్ సింగ్, ఇల్యాన్ సతాని, ఉర్వేశ్ కక్కడ్, రక్షన్ రెడ్డి. -
‘నాలాంటి ఆటగాళ్లకు గొప్ప అవకాశం’
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ నేపథ్యం, సాధారణ రైతు కుటుంబం, ఇప్పుడు బతుకుతెరువు కోసం ఒక దుకాణంలో పని చేయాల్సిన స్థితి... అయినా సరే ఆ అబ్బాయి క్రికెట్పై మక్కువతో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. సరైన వేదికపై తనను తాను నిరూపించుకొని మున్ముందు పైకి ఎదగాలని పట్టుదలగా ఉన్నాడు. అలాంటి వారికి తెలంగాణ టి20 లీగ్ తగిన దిశను చూపిస్తోంది. ఈ టోర్నీ ద్వారా పలువురు క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. అలాంటి వారిలో నోమాన్ అహ్మద్ ఒకడు. ప్రస్తుతం టీజీ టి20 లీగ్లో అతను మెదక్ ఫాల్సన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటికే హెచ్సీఏ లీగ్స్లో ఆడుతున్నా... ఈ టోర్నీతో అభిమానుల మధ్య ఆడేందుకు, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశం దక్కిందని ‘సాక్షి’తో మాట్లాడుతూ నోమాన్ చెప్పాడు. ‘చాలా రోజులుగా టి20 లీగ్ గురించి ఎదురు చూశాను. వేలం జరిగినప్పుడు మాకూ చాన్స్ వస్తుందా అని ఎంతో ఉత్కంఠకు లోనయ్యాను. అయితే నా అదృష్టం బాగుంది. వేలంలో మెదక్ టీమ్ను నన్ను తీసుకోవడంతో సంతోషం కలిగింది. హెచ్సీఏ లీగ్ మ్యాచ్లతో పోలిస్తే ఈ టోర్నీలో వాతావరణం చాలా భిన్నం. పెద్ద సంఖ్యలో అభిమానుల మధ్య ఆడే అవకాశం వచ్చింది. పైగా పలువురు ఇతర సీనియర్ క్రికెటర్లు అండగా నిలుస్తున్నారు’ అని నోమాన్ అన్నాడు. అతని స్వస్థలం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చిల్లేపల్లి. హైదరాబాద్కు వచ్చి సమీప బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో ఆటపై ఆసక్తి ఉండటంతో టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రం ఆడేవాడు. ఇందులోనే రాణించడాన్ని గుర్తించిన మిత్రులు మరింత ప్రోత్సహించారు. ఈ క్రమంలో కోవిడ్ లాక్డౌన్ ముగిసిన తర్వాత నగరంలో పూర్తిస్థాయి శిక్షణవైపు మళ్లాడు. అత్తాపూర్లోని సిటీ క్రికెట్ అకాడమీలో కోచ్ అహ్మద్ వద్ద అతను కోచింగ్ తీసుకుంటున్నాడు. తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్న అతనికి హెచ్సీఏ లీగ్ పోటీల్లో చార్మినార్ క్లబ్ తరఫున ఆడే అవకాశం దక్కింది. బ్యాటర్గా గత సీజన్లో రెండు రోజుల లీగ్లో 350 పరుగులతో అతను ఆకట్టుకున్నాడు. అనంతరం హెచ్సీఏ ఎమర్జింగ్ టీమ్లోకి ఎంపికయ్యాడు. ఇప్పుడు టీజీ టి20 లీగ్ నోమాన్కు మరో మంచి చాన్స్ను ఇచ్చింది. ‘మెదక్ ఫాల్కన్స్ టీమ్ యాజమాన్యం నాకు అండగా నిలిచి అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. ఐపీఎల్ తరహాలో మా జట్టు ప్రాక్టీస్, ట్రైనింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా తొలి మ్యాచ్ సమయంలో భారత ప్లేయర్, మా కెపె్టన్ తిలక్ వర్మ వ్యక్తిగతంగా నా ఆటపై పలు సూచనలు చేయడం మర్చిపోలేనిది’ అని నోమాన్ చెప్పాడు. అనారోగ్యం కారణంగా నోమాన్ తండ్రి వ్యవసాయానికి కూడా దూరమయ్యాడు. దాంతో 24 ఏళ్ల నోమాన్ ఇప్పుడు ఒక బేకరీలో పని చేస్తున్నాడు. అయితే తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదని అతను చెప్పాడు. టీజీ టి20 వేలంలో మెదక్ అతడిని రూ.75 వేలకు సొంతం చేసుకుంది. ‘నేను హెచ్సీఏలో ఎలాంటి ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఆడలేదు. ఇప్పుడు మిగిలింది సీనియర్ టీమ్లో స్థానమే. టీజీ టి20 టోర్నీలోకి ఎంపికైన కొద్ది మందిలో నేనూ ఉన్నానంటే నా ఆట గురించి అందరికీ తెలుస్తోంది. మున్ముందు మరింత పట్టుదలగా కష్టపడతా. నా వ్యక్తిగత కారణాలు ఆటకు అడ్డు రావు. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి హైదరాబాద్ టీమ్లోకి ఎంపిక కావడమే నా లక్ష్యం’ అని నోమాన్ ఆశాభావంతో చెప్పాడు. -
కరీంనగర్ ఘన విజయం.. 99 పరుగులకే మెదక్ ఆలౌట్
తెలంగాణ టీ20 లీగ్లో కరీంనగర్ డైమండ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరిగిన మ్యాచ్లో 133 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది.మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 8 ఫోర్లు, 8 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు చందన్(54), సాత్విక్(35) రాణించారు. మెదక్ బౌలర్లలో వరుణ్, కార్తికేయ, విక్రమ్ నాయక్, రవితేజ తలా వికెట్ సాధించారు.కుప్పకూలిన మెదక్అనంతరం 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ ఫాల్కన్స్.. కరీంనగర్ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. మెదక్ బ్యాటర్లలో తెలకపల్లి రవితేజ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కరీంనగర్ బౌలర్లలో శ్రీవాస్తవ్, శుభమ్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హారీష్, నారయణ్, సతీష్ కుమార్, సాత్విక్ రెడ్డి తలా వికెట్ సాధించారు. -
రాహుల్ సూపర్ సెంచరీ.. మెదక్ ముందు భారీ టార్గెట్
తెలంగాణ ప్రీమియర్ లీగ్-2026లో మరో సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కరీంనగర్ డైమండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కరీంనగర్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో రాదేశ్ తన విరోచిత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మెదక్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 8 ఫోర్లు, 8 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు చందన్(54), సాత్విక్(35) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెదక్ బౌలర్లలో వరుణ్, కార్తికేయ, విక్రమ్ నాయక్, రవితేజ తలా వికెట్ సాధించారు. -
వికాస్, అభిరథ్ విధ్వంసం.. హైదరాబాద్ హ్యాట్రిక్
టీజీ20 లీగ్ 2026లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా మూడో మ్యాచ్లో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇవాళ జరిగిన 12వ మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్పై 46 పరుగుల తేడాతో గెలుపొందింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు అభిరథ్ రెడ్డి (59), వికాస్ రెడ్డి (93) విధ్వంసకర అర్ద శతకాలతో విరుచుకుపడ్డారు. ఆఖర్లో గడుగు గణేశ్ (22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మెదక్ బౌలరల్లో విక్రమ్ నాయక్, ఘాజీ అబ్బాస్ చెరో 2 వికెట్లు తీయగా.. వరుణ్, కార్తీకేయ, రవితేజ, అశ్విన్ రామ్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను మెదక్ కూడా ధీటుగానే ప్రారంభించినప్పటికీ.. 12వ ఓవర్ తర్వాత స్వల్ప విరామాల్లో 6 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. అజయ్ దేవ్ గౌడ్ (4-0-20-4), ప్రణవ్ వర్మ (4-0-35-2) అద్భుతంగా బౌలింగ్ చేసి మెదక్కు దెబ్బకొట్టారు. శ్రీనికేత్, నితన్ నాయక్ తలో వికెట్ తీశారు. మెదక్ బ్యాటర్లలో విక్రమ్ నాయక్ (75) ఒంటరిపోరాటం చేశాడు. వరుణ్ యెర్రమ్ (38), రవితేజ (31), ఇషాన్ శర్మ (27) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ గెలుపుతో హైదారాబాద్ రన్రేట్ను భారీగా మెరుగుపర్చుకొని పాయింట్ల పట్టికలో సోలోగా అగ్రస్థానంలో నిలిచింది. -
హైదరాబాద్ ఖాతాలో మరో గెలుపు
టీజీ20 లీగ్ 2026లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా మూడో మ్యాచ్లో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించింది. ఇవాళ జరిగిన 12వ మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్పై 46 పరుగుల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 240 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన మెదక్ లక్ష్యానికి 47 పరుగుల దూరంలో (194-9) నిలిచిపోయింది. ధీటుగా బదులిస్తున్న మెదక్241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మెదక్ ఫాల్కన్స్ ధీటుగా బదులిస్తుంది. 11.3 ఓవర్లలో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఫాల్కన్స్ గెలవాలంటే మరో 51 బంతుల్లో 114 పరుగులు చేయాలి. విక్రమ్ నాయక్ (70) విధంసాన్ని కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా రవితేజ (18) క్రీజ్లో ఉన్నాడు. హైదరాబాద్ భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు అభిరథ్ రెడ్డి (59), వికాస్ రెడ్డి (93) విధ్వంసకర అర్ద శతకాలతో విరుచుకుపడ్డారు. ఆఖర్లో గడుగు గణేశ్ (22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మెదక్ బౌలరల్లో విక్రమ్ నాయక్, ఘాజీ అబ్బాస్ చెరో 2 వికెట్లు తీయగా.. వరుణ్, కార్తీకేయ, రవితేజ, అశ్విన్ రామ్ తలో వికెట్ తీశారు. సెంచరీ చేజార్చుకున్న వికాస్ రెడ్డి15.1వ ఓవర్- వికాస్ రెడ్డి సెంచరీ చేజార్చుకున్నాడు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసి ఔటయ్యాడు. సెంచరీకి చేరువలో వికాస్ రెడ్డిఓపెనర్ వికాస్ రెడ్డి సెంచరీ దిశగా సాగుతున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 93 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత హైదరాబాద్ స్కోర్ 180-2గా ఉంది. భారీ స్కోర్ దిశగా హైదరాబాద్టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 122-1గా ఉంది. అభిరథ్ రెడ్డి (27 బంతుల్లో 59; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి ఔట్ కాగా.. వికాస్ రెడ్డి 59, నితిన్ నాయర్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అభిరథ్ రెడ్డి వికెట్ ఘాజీ అబ్బాస్కు దక్కింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మెదక్టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 27) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్, హైదారాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్ జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.తుది జట్లు..మెదక్ ఫాల్కన్స్: శృంజిత్ రెడ్డి, నమన్ అగర్వాల్, సాయి వరుణ్ ఎర్రమ్, రవితేజ (కెప్టెన్), నౌమాన్ అహ్మద్, ఇషాన్ శర్మ, విక్రమ్ నాయక్ గుగులోత్, బన్నీ జగం, అహ్వినన్ రామ్, సయ్యద్ ఘాజీ అబ్బాస్, కార్తికేయ కాక్హైదరాబాద్ ఈ ఛాంప్స్: అభిరథ్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, అన్విత్ రెడ్డి, షణ్ముఖ అశ్విన్, గణేశ్ గడుగు, నితిన్ నాయక్, అర్వింద్, అజయ్ దేవ్ గౌడ్, ప్రణవ్ వర్మ, అఖిల్ రాథోడ్, శ్రీనికేత్ -
‘దూకుడే నా శైలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టి20 లీగ్లో భాగంగా వరంగల్ వారియర్స్ ఆడిన తొలి మ్యాచ్లో కెప్టెన్ పేరాల అమన్ రావు మెరుపు శతకంతో చెలరేగిపోయాడు. మెదక్ ఫాల్కన్స్తో జరిగిన ఈ మ్యాచ్లో 32 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అతను చివరకు 48 బంతుల్లో 142 పరుగులు సాధించాడు. రాష్ట్ర స్థాయి లీగ్ పోటీల్లో అమన్దే వేగవంతమైన శతకం. అయితే దీంతో తాను సంతృప్తి చెందలేదని, మరో మూడు బంతుల ముందే సాధించాల్సిందని అతను అన్నాడు. ‘శతకానికి చేరువవుతున్న సమయంలో మరింత వేగంగా ఆడాల్సింది. నేను అనుకున్నదాని ప్రకారం 29 బంతుల్లోనే సెంచరీ రావాలి. కానీ కాస్త ఆలస్యం కావడంతో నేను నిరుత్సాహ పడ్డాను. అయితే మున్ముందు మరో అవకాశం వస్తే వదిలి పెట్టను’ అని గురువారం ‘సాక్షి’తో అమన్ అన్నాడు. ఈ మ్యాచ్లో ప్రత్యర్థి బ్యాటర్ తిలక్ వర్మ కూడా సెంచరీ చేయడంతో చివరకు వరంగల్ ఓటమి పాలైనా, అమన్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. దూకుడుగా బ్యాటింగ్ చేయడమే తన శైలి అని, తొలి బంతి నుంచి చెలరేగడం అలవాటుగా మార్చుకున్నానని అమన్ చెప్పాడు. ‘కెరీర్ ఆరంభం నుంచి నేను ఇదే తరహాలో ఆడతాను. హైదరాబాద్ తరఫున దేశవాళీ మ్యాచ్లలో కూడా వేగంగా పరుగులు సాధించాను. ఇప్పుడు తెలంగాణ టి20 లీగ్లో దీనిని కొనసాగిస్తున్నా. మేం మెదక్తో మ్యాచ్ ఓడినా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేయడం చూశాను. వారికి కావాల్సింది అదే. పైగా ఈ మ్యాచ్తో లీగ్లో సరైన ఊపు లభించిందని భావిస్తున్నా’ అని అమన్ రావు చెప్పాడు. ఈ ఏడాది ఆరంభంలో హైదరాబాద్ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతూ బెంగాల్పై అద్భుత డబుల్ సెంచరీ చేయడం అమన్కు గుర్తింపు తీసుకొచ్చింది. 186 వద్ద నుంచి ఇన్నింగ్స్లో మిగిలిన చివరి మూడు బంతుల్లో వరుసగా 6, 2, 6 బాది అతను ఈ మైలురాయిని చేరుకున్నాడు. ‘వన్డే డబుల్ సెంచరీ నాకు ఎంతో ప్రత్యేకం. కెరీర్ ఆరంభ దశలోనే ఇలాంటి ఇన్నింగ్స్ రావడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాబోయే సీజన్లలో మరింత మంచి ప్రదర్శనలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్నా’ అని అతను వెల్లడించాడు. 2026 ఐపీఎల్ సీజన్లో అమన్ రాజస్తాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దీనిపై నిరాశ చెందలేదని, తనదైన చాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని అతను వ్యాఖ్యానించాడు. ‘నా ప్రతిభను రాయల్స్ గుర్తించింది. అందుకే టీమ్లోకి తీసుకున్నామని హెడ్ కోచ్ సంగక్కర చెప్పారు. అయితే టీమ్ కాంబినేషన్ కారణంగా ఆడే చాన్స్ లభించలేదు. నిరాశపడవద్దని, మున్ముందు ఇదే జట్టుతో కొనసాగించి అవకాశాలు కల్పిస్తామని ఆయన నాకు ధైర్యం చెప్పారు. ఇది ఆరంభమే కదా. మున్ముందు ఐపీఎల్లో సత్తా చాటగలనని నమ్ముతున్నా’ అని అమన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రతిభాన్వేషణ బృందాలను ఆకట్టుకునేందుకు టీజీ టి20 మంచి చాన్స్ అని, కొత్త ఆటగాళ్లు దీనిని అందిపుచ్చుకోవాలన్న అమన్... వారియర్స్ విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. ‘ఐపీఎల్లో తరహాలోనే టీజీ లీగ్ సాగుతోంది. సరైన సమయంలో మన రాష్ట్ర ఆటగాళ్లకు ఈ వేదిక లభించడం శుభపరిణామం. మా జట్టు రెండో మ్యాచ్లో అలవోక విజయం సాధించింది. పలువురు ప్రతిభావంతులతో టీమ్ పటిష్టంగా ఉంది. టీమ్ యాజమాన్యం కూడా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ అండగా నిలిచింది. తొలి సీజన్లో వరంగల్ వారియర్స్ను విజేతగా నిలపాలన్నదే నా లక్ష్యం’ అని అమన్ రావు చెప్పాడు. -
సత్తా చాటిన రాయుడు.. మెదక్పై పాలమూరు గెలుపు
టీజీ20 లీగ్ 2026లో ఇవాళ (జూన్ 25) రాత్రి జరిగిన మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్పై పాలమూరు స్ట్రయికర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విక్రమ్ నాయక్, వరుణ్ యెర్రం తలో 36 పరుగులు చేయడంతో మెదక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.మిగతా బ్యాటర్లలో శృంజిత్ రెడ్డి (19), నమన్ అగర్వాల్ (21), అశ్విన్ రామ్ (12 రిటైర్డ్ ఔట్), రవితేజ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాలమూరు బౌలర్లలో రవి కిరణ్, రిషబ్ చెరో 2 వికెట్లు తీయగా.. అఫ్రిది, తేజ, రోహిత్ రాయుడు తలో వికెట్ పడగొట్టారు.165 పరుగుల లక్ష్య ఛేదనలో పాలమూరు స్ట్రయికర్స్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. రోహిత్ రాయుడు (54) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో ఆదుకున్నాడు. బుడిది తేజ (23), ప్రతీక్ పవార్ (27 నాటౌట్) సహకారంతో పాలమూరును విజయతీరాలకు చేర్చారు. రాయుడు, పవార్ సత్తా చాటడంతో పాలమూరు జట్టు 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మెదక్ బౌలర్లలో వరుణ్ యెర్రం 2, ఘజా అబ్బాస్, శృంజిత్ రెడ్డి, రవితేజ తలో వికెట్ తీశారు. -
మెదక్పై పాలమూరు గెలుపు
ఆదిలోనే పాలమూరుకు షాక్165 పరుగుల లక్ష్య ఛేదనలో పాలమూరు స్ట్రయికర్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో బంతికే కరణ్ యాదవ్ (0), మూడో ఓవర్ నాలుగో బంతికి ప్రజ్ఞయ్ రెడ్డి (15) ఔటయ్యారు. రెండు వికెట్లు యెర్రం వరుణ్కే దక్కాయి. 3 ఓవర్ల తర్వాత పాలమూరు స్కోర్ 18-2గా ఉంది. పాలమూరు టార్గెట్ 165టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విక్రమ్ నాయక్, వరుణ్ యెర్రం తలో 36 పరుగులు చేయడంతో మెదక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో శృంజిత్ రెడ్డి (19), నమన్ అగర్వాల్ (21), అశ్విన్ రామ్ (12 రిటైర్డ్ ఔట్), రవితేజ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాలమూరు బౌలర్లలో రవి కిరణ్, రిషబ్ చెరో 2 వికెట్లు తీయగా.. అఫ్రిది, తేజ, రోహిత్ రాయుడు తలో వికెట్ పడగొట్టారు. కష్టాల్లో మెదక్మెదక్ జట్టు ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అశ్విన్ రామ్ (12) రిటైర్డ్ ఔట్ కాగా.. శృంజిత్ రెడ్డి (19) తేజ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 8 ఓవర్ల తర్వాత మెదక్ స్కోర్ 58-4గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన మెదక్3.4వ ఓవర్- 36 పరుగుల వద్ద మెదక్ రెండో వికెట్ కోల్పోయింది. రవి కిరణ్ బౌలింగ్లో నమన్ అగర్వాల్ (21) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఓవర్లోనే మెదక్కు షాక్మెదక్ ఫాల్కన్స్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రవి కిరణ్ బౌలింగ్లో పవార్కు క్యాచ్ ఇచ్చి సాయి కాకులమర్రి (1) ఔటయ్యాడు.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాలమూరు స్ట్రయికర్స్టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 25) జరుగుతున్న తొమ్మిదో మ్యాచ్లో పాలమూరు స్ట్రయికర్స్, మెదక్ ఫాల్కన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పాలమూరు జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. -
త్యాగరాజన్ ఆల్రౌండ్ షో.. ఫాల్కన్స్పై రైజర్స్ ఘన విజయం
తెలంగాణ టీ20 లీగ్-2026లో భాగంగా ఇవాళ (జూన్ 23) రాత్రి జరిగిన మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్పై రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రైజర్స్.. ఫాల్కన్స్ను 164 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. అనంతరం రైజర్స్ బ్యాటర్లు మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు (5 వికెట్ల నష్టానికి). కెప్టెన తనయ్ త్యాగరాజన్ బంతితో (4-0-36-3), బ్యాట్తో (11 బంతుల్లో 21) సత్తా చాటి రైజర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.రాణించిన బౌలర్లుతనయ్ త్యాగరాజన్ 3 వికెట్లతో పాటు ఓ క్యాచ్ పట్టి ఫాల్కన్స్ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో జడ్డూ, కరియప్ప తలో 2 వికెట్లు తీయగా.. అరుణ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఫాల్కన్స్ ఇన్నింగ్స్లో 49 పరుగులు చేసిన విక్రమ్ నాయక్ టాప్ స్కోరర్గా నిలిచాడు. సాయి కాకులమర్రి (38), నమన్ అగర్వాల్ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.శుభారంభం అందించిన ఓపెనర్లు165 పరుగుల లక్ష్య ఛేదనలో రైజర్స్ ఓపెనర్లు శుభారంభం అందించారు. ఆరోన్ జార్జ్ (27), అరవెల్లి అవనీశ్ (25) మెరుపు ఇన్నింగ్స్లతో గెలుపుకు గట్టి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన ఆదిత్య (12), అలంక్రిత్ (9) నిరాశపరిచినా.. రాకేశ్ (38 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి రైజర్స్ను గెలుపుతీరాలకు చేర్చాడు. అతనికి తనయ్ త్యాగరాజన్, నితిన్ యాదవ్ (28 నాటౌట్) సహకరించారు. ఫాల్కన్స్ బౌలర్లలో వరుణ్ 2 వికెట్లు పడగొట్టగా.. రవితేజ, అబ్బాస్, అశ్విన్ రామ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
మెదక్ ఫాల్కన్స్పై రంగారెడ్డి రైజర్స్ గెలుపు
మెదక్ ఫాల్కన్స్పై రంగారెడ్డి రైజర్స్ గెలుపుతొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. రంగారెడ్డి రైజర్స్ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గెలుపు దిశగా రంగారెడ్డి రైజర్స్165 పరుగుల లక్ష్య ఛేదనలో రంగారెడ్డి రైజర్స్ గెలుపు దిశగా సాగుతోంది. 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన ఆ జట్టు.. మరో 36 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉంది. సత్తా చాటిన త్యాగరాజన్.. ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైన ఫాల్కన్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లతో పాటు ఓ క్యాచ్ పట్టి ఫాల్కన్స్ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో జడ్డూ, కరియప్ప తలో 2 వికెట్లు తీయగా.. అరుణ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఫాల్కన్స్ ఇన్నింగ్స్లో 49 పరుగులు చేసిన విక్రమ్ నాయక్ టాప్ స్కోరర్గా నిలిచాడు. సాయి కాకులమర్రి (38), నమన్ అగర్వాల్ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 5 బంతుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయిన ఫాల్కన్స్5 బంతుల వ్యవధిలో ఫాల్కన్స్ 2 వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్మూడో బంతికి త్యాగరాజన్ నమన్ అగర్వాల్ను (37) ఔట్ చేయగా. 16వ ఓవర్ తొలి బంతికే వరుణ్ను (1) అరుణ్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కోలుకున్న ఫాల్కన్స్5 ఓవర్లలోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఫాల్కన్స్ తిరిగి కోలుకుంది. 12 ఓవర్లలో ఆ జట్టు మూడే వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. విక్రమ్ నాయక్ (31), నమన్ అగర్వాల్ (21) ఫాల్కన్స్ను ఆదుకున్నారు. 3 వికెట్లు కోల్పోయిన ఫాల్కన్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న మెదక్ ఫాల్కన్స్ కష్టాలు ఎదుర్కొంటుంది. 55 ఓవర్లలో ఆ జట్టు 51 పరుగులు చేసినప్పటికీ 3 వికెట్లు కోల్పోయింది. తొలుత తనయ్ త్యాగరాజన్ బౌలింగ్లో శృన్జిత్ రెడ్డి క్లీన్ బౌల్డ్ కాగా.. ఆతర్వాత రవితేజ (6), పూర్ణచంద్ రావ్ (38) పెవిలియన్కు చేరారు. రవితేజను తనయ్ జడ్డూ ఔట్ చేయగా.. త్యాగరాజన్ పూర్ణచంద్ ఆట కట్టించాడు. తొలి వికెట్ కోల్పోయిన ఫాల్కన్స్2.3వ ఓవర్- 26 పరుగుల వద్ద మెదక్ ఫాల్కన్స్ తొలి వికెట్ కోల్పోయింది. తనయ్ త్యాగరాజన్ బౌలింగ్లో శృన్జిత్ రెడ్డి (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తెలంగాణ టీ20 లీగ్-2026లో భాగంగా ప్రణవ్ రంగారెడ్డి రైజర్స్- మెదక్ ఫాల్కన్స్ మంగళవారం రాత్రి తలపడుతున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మెదక్ ఫాల్కన్స్ బ్యాటింగ్కు దిగింది.తుది జట్లు..రంగారెడ్డి రైజర్స్: తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్ఘీస్, అవనీశ్ రావ్ (వికెట్కీపర్), అలంక్రిథ్ రాపోల్, జ్ఞానప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితీశ్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, తనయ్ జడ్డూ, ఆర్యన్ కరియప్పమెదక్ ఫాల్కన్స్: రవితేజ (కెప్టెన్), సాయి పూర్ణానంద్ రావ్, శృన్జిత్ రెడ్డి, విక్రమ్ నాయక్ (వికెట్కీపర్), సూర్య తేజ, సాయి వరుణ్, జంగం బన్ని, అశ్వినన్ రామ్, నమన్ అగర్వాల్, సయ్యద్ ఘజా అబ్బాస్, మధుకర్ మన్నే -
తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ.. 259 టార్గెట్ హాంఫట్
తెలంగాణ టీ20 లీగ్ను మెదక్ ఫాల్కన్స్ ఘనంగా ఆరంభించింది. ఉప్పల్ మైదానం వేదికగా వరంగల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో మెదక్ ఘన విజయం సాధించింది. వరంగల్ నిర్ధేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్.. 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. ఈ విజయంలో మెదక్ కెప్టెన్ తిలక్ వర్మది కీలక పాత్ర. ఈ టీమిండియా సూపర్ స్టార్ విరోచిత శతకంతో చెలరేగాడు. 52 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 136 (నాటౌట్) పరుగులు చేసి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతడితో పాటు విక్రం నాయక్ గగులోత్(25), శృజిత్ రెడ్డి(25) రాణించారు. వరంగల్ బౌలర్లలో కులకర్ణి, మన్సూరి తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో కెప్టెన్ అమన్రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142) భారీ సెంచరీతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ 2, మధుకర్ 2, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ ఒక్కో వికెట్ సాధించారు. -
TG20 League 2026: తిలక్ వర్మ సూపర్ సెంచరీ
తెలంగాణ టీ20 లీగ్లో భాగంగా వరంగల్ వారియర్స్తో మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్, టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ శతక్కొట్టాడు. 259 పరుగుల భారీ లక్ష్య చేధనలో తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో తిలక్ 42 బంతుల్లో తొలి టీజీ 20 సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 52 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 136 (నాటౌట్) పరుగులు చేసి తన జట్టును తిలక్ విజయ తీరాలకు చేర్చాడు. -
TG20 League 2026: శతక్కొట్టిన తిలక్ వర్మ.. మెదక్ ఘన విజయం
తెలంగాణ టీ20 లీగ్లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి.మెదక్ ఫాల్కన్స్ ఘన విజయంఉప్పల్ వేదికగా వరంగల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. వరంగల్ నిర్ధేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్.. 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ తిలక్ వర్మ(55 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్స్లతో 136) అజేయ సెంచరీతో తన జట్టును గెలిపించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142) భారీ సెంచరీతో మెరిశాడు.విజయం దిశగా మెదక్మెదక్ విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి. 18 ఓవర్లకు స్కోర్: 239/6తిలక్ వర్మ సెంచరీమెదక్ కెప్టెన్ తిలక్ వర్మ 42 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 104 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. మొదక్ విజయానికి ఇంకా 24 బంతుల్లో 52 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో రెండు వికెట్లు15 ఓవర్ వేసిన అసిఫ్ బౌలింగ్లో మెదక్ రెండు వికెట్లు కోల్పోయింది. అనిష్ రెడ్డి(2), సూర్యతేజ(0) వరుసగా ఔటయ్యారు. తిలక్ 99 పరుగులతో ఉన్నాడు.నాలుగో వికెట్ డౌన్19 పరుగులు చేసిన వరుణ్.. మురుగన్ అభిషేక్ బౌలింగ్లో ఔటయ్యాడు. మొదక్ మూడో వికెట్ డౌన్మెదక్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన తెలుకుపల్లి తేజ.. కులకర్ణి బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు మెదక్ స్కోర్: 159/4తిలక్ హాఫ్ సెంచరీమెదక్ కెప్టెన్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 23 బంతుల్లోనే మొదటి టీజీ20 ఆర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 8 ఓవర్లకు మెదక్ స్కోర్: 104/2దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మ259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి మెదక్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(24), శృంజిత్(16) ఉన్నారు.వరంగల్ భారీ స్కోర్ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో వరంగల్ వారియర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142) భారీ సెంచరీతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ 2, మధుకర్ 2, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.మూడో వికెట్ డౌన్వరంగల్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సిసోడియా తిలక్ బౌలింగ్లో ఔటయ్యాడు.వరంగల్ రెండో వికెట్ డౌన్వరంగల్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 48 బంతుల్లో 142 పరుగులు చేసిన అమన్రావు పేరాల.. రాహుల్ బౌలింగ్లో ఔటయ్యాడు.లీగ్ తొలి సెంచరీఅమన్రావు 32 బంతుల్లో శతక్కొట్టాడు.వరంగల్ తొలి వికెట్ డౌన్వరంగల్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన హర్షిత్ చౌదరి.. సూర్యతేజ బౌలింగ్లో ఔటయ్యాడు. 8.2 ఓవర్లలో వరంగల్ స్కోర్: 134-1అమన్ ఫిప్టీవరంగల్ కెప్టెన్ అమన్ రావు పేరాల కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, మూడు సిక్స్లతో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. దీంతో వరంగల్ స్కోర్ పవర్ప్లేలోనే వంద పరుగులు దాటింది.దంచికొడుతున్న వరంగల్ ఓపెనర్లువరంగల్ ఓపెనర్లు అమన్ రావు(22), హర్షిత్(21) దూకుడు ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి వరంగల్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది.తెలంగాణ టీ20 లీగ్లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వరంగల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్గా టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు.మరో భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్(వరంగల్) మాత్రం ఈ మ్యాచ్కు అందుబాటులో లేడు. టీజీ20 లీగ్ తొలి సీజన్ వేలంలో తిలక్ను రూ.33 లక్షల రికార్డు ధరకు మెదక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తుదిజట్లు వరంగల్ వారియర్స్ అమన్రావు పేరాల (కెప్టెన్), హర్షిత్ చౌదరి, భావేశ్ సేథ్, రుషికేశ్ సిసోడియా, మురుగన్ అభిషేక్, ఆది మణికిరణ్, అనిరుధ్ శ్రీవాస్తవ టీపీ, మహ్మద్ ఆసిఫ్ మన్సూరి, షౌనక్ కులకర్ణి, మహ్మద్ ముదస్సర్ హుస్సేన్, క్రాంతి పల్లెపాటి.మెదక్ ఫాల్కన్స్ తిలక్ వర్మ (కెప్టెన్), రవితేజ టి, నమన్ అగర్వాల్, శృజిత్ రెడ్డి, విక్రం నాయక్ గగులోత్, నిమ్మగడ్డ సూర్యతేజ, సాయి వరుణ్ యెర్రమ్, నయని అనీశ్ రెడ్డి, కుంటా రాహుల్, ఘాజి అబ్బాస్ అబేది, మధుకర్ మన్నె.


