బంగ్లాదేశ్ కెప్టెన్గా లిట్టన్ కుమార్ దాస్..
పాకిస్తాన్, యూఏఈలతో టీ20 సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్లకు బంగ్లాదేశ్ కెప్టెన్గా వికెట్ కీపర్ బ్యాటర్ లిట్టన్ కుమార్ దాస్ ఎంపికయ్యాడు. టీమిండియాతో టీ20 సిరీస్ అనంతరం బంగ్లా టీ20 కెప్టెన్సీకి నజ్ముల్ హొస్సేన్ శాంటో రాజీనామా చేశాడు.ఈ క్రమంలోనే తమ టీ20 జట్టు కెప్టెన్గా లిట్టన్ కుమార్ దాస్ను బంగ్లా క్రికెట్ బోర్డు నియమించింది. ఈ సిరీస్లలో లిట్టన్ దాస్ సారథిగా తనను తాను నిరూపించుకుంటే ఫల్ టైమ్గా కెప్టెన్గా కొనసాగించే అవకాశముంది. అయితే ఈ సిరీస్లకు స్టార్ ఆల్రౌండర్ మెహదీ హసన్ మిరాజ్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే మాజీ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటోతో పాటు యువ ఆటగాళ్లు షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ అనిక్, రిషాద్ హొస్సేన్లకు సెలక్టర్లు చోటిచ్చారు. బంగ్లా జట్టు తొలుత యూఏఈతో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్లు మే 17, మే 19 తేదీలలో షార్జాలో జరగనున్నాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం పాకిస్తాన్కు వెళ్లనుంది. ఈ సిరీస్ మే 25 నుంచి ప్రారంభం కానుంది.యూఏఈ, పాకిస్తాన్ టీ20 సిరీస్లకు బంగ్లా జట్టులిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ అనిక్, రిషద్ హొస్సేన్, షక్ మహిదీ హసన్ (వైస్ కెప్టెన్), తన్వీర్ మహ్ముద్, ససనీబ్, తన్వీర్ మహ్మద్, సస్కీమ్, నహిద్ రానా, షోరిఫుల్ ఇస్లాం