breaking news
Konda surekha
-
కొండా సురేఖ ఎపిసోడ్ లో ట్విస్ట్
-
కొండా సురేఖ వ్యవహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి కొండాసురేఖ అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సచివాలయంలోని కొండా సురేఖ ఛాంబర్కు అధికారులు ఈ రోజు (మంగళవారం) తాళం వేశారు. ఛాంబర్లోని మూడు పేషీలకు తాళం వేశారు. అదే విధంగా కొండా సురేఖ పేషీలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి పలువురిని వారి సొంతశాఖలకు పంపారు.కాగా కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ అధిష్ఠానం కొండా సురేఖను క్రమశిక్షణ చర్యల పేరుతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఛాంబర్కు సైతం అధికారులు తాళం వేశారు. -
కొండా సురేఖను అధిష్టానం పిలిచిందా?
సాక్షి, హైదరాబాద్: ఉద్దేశపూర్వకంగానే స్పీకర్పై వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమంలో దళిత కార్డును కేసీఆర్ ఎలా వాడారో చూశాం. గద్దర్, అందెశ్రీని ఏ రకంగా అవమానించారో ప్రజలకు తెలుసు. కేసీఆర్ 2003లో ఇచ్చిన హామీలపై డాక్యుమెంట్ విడుదల చేస్తున్నా.. కేసీఆర్ ఇచ్చిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు.‘‘దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు? హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు. అంబేద్కర్ విగ్రహం పెడితే సరిపోదు ఆ మహాభావుని సలహాలు, విలువలు ఆచరణలో పెట్టాలి. దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం దారుణం. దళిత జాతిని కేసీఆర్ అవమానించారు. కేసీఆర్ రాజకీయాన్ని శుద్ధి చేయాలి. ప్రజాస్వామ్య దేశంలో ఇంతకంటే దారుణం మరోటి లేదు’’ అని మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు.‘‘దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి కాంగ్రెస్ గౌరవించింది. రీల్ మాక్ అసెంబ్లీ పెట్టడం కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ను ప్రతిపక్ష నాయకుడిని చేయండి. పదేళ్ల బీఆర్ఎస్ బీసీ,దళిత, మైనార్టీ వ్యతిరేక పాలనను ప్రజలు మరిచిపోలేదు. దళిత స్పీకర్ను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. మీనాక్షీ విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు. మీనాక్షి విషయంలో అధిస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ఆ అంశంపై సమాచారం లేదు..‘‘కొత్త ఇంఛార్జ్ విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. కొండా సురేఖను అధిష్టానం పిలిచిందన్న అంశంపై నాకు సమాచారం లేదు’’ అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. కాగా, కొండా సురేఖ.. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: కొండా సురేఖది.. నాది ఒకే మాట.. సుస్మితది మాత్రం..: కొండా మురళి -
Surekha : వైఎస్ జగన్ పై అభిమానంతో రాజీనామా చేశా
-
కాంగ్రెస్ లోనే... కాంగ్రెస్ తోనే కృతజ్ఞత మా రక్తంలోనే ఉంది
-
పార్టీని వీడే ప్రసక్తేలేదు.. కొండా ఫ్యామిలీ సంచలన వ్యాఖ్యలు
-
కొండా సురేఖది.. నాది ఒకే మాట.. సుస్మితది మాత్రం..: కొండా మురళి
వరంగల్: మాజీమంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆదివారం వరంగల్లో కార్యకర్తలతో కొండా సురేఖ దంపతులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. పదవి ఉంటే ఉంటుంది.. పోతే పోతుంది.. కానీ, సారీ అని ఏ రోజూ రాతలు రాయలేదని తెలిపారు. బీసీల కోసం ముందుకు వచ్చే నాయకుడే లేడని చెప్పారు.రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కొండా దంపతుల లక్ష్యమని మురళి తెలిపారు. ‘‘మాటపై నిలుచోవాలి.. పదవులు ఉంటాయి.. పోతాయి. కృతజ్ఞత అనేది కొండా రక్తంలో ఉంది. నా కారు రంగు ఇండియాలో ఎవరికి ఉండదు.. అది ముస్లింలకు చిహ్నం. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని విడిచేది లేదు... కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం.నా శరీరంలో ఇంకా నాలుగు బుల్లెట్స్ ఉన్నాయి.. మీ ఆశీస్సులు నన్ను బతికిస్తున్నాయి. పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పొడవకండి. కొండా సురేఖది... నాది ఓకే మాట... నా బిడ్డ సుస్మితది వేరే మాట. వరంగల్ తూర్పులో 24మంది కార్పొరేటర్లను గెలిపిస్తాను. కొండా మురళి కబ్జా చేసినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి బయటకు వస్తా. రేవంత్ అన్నకు అన్నీ తెలుసు. ఢిల్లీ రావాలని ఫోన్ వచ్చింది నిజం. వరంగల్ తూర్పు బాధ్యతలను నవిన్ రాజ్ కు అప్పగిస్తున్నా. కష్టపడి పని చేసేవారికి.. గెలిచే వ్యక్తి కార్పోరేటర్ టిక్కెట్ దక్కుతుంది. నాకు, నా బిడ్డ సుస్మితకు సంబంధం లేదు. నన్ను నమ్ముకొని చాలా మంది నాయకులు ఉన్నారు. కొండా మురళీ మాటంటే మాటే. అన్ని వర్గాలను కల్పుకొని ముందు పోతాం. కార్యకర్తల కోసం ఇంకో 10 ఎకరాలు అయినా అమ్ముతా. కార్యకర్తలే నా బలం’’ అని కొండా మురళి అన్నారు. -
కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది?
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే వారు హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.కీలక బాధ్యత అప్పగిస్తారా?సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈపర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందేనని నాయకులు అంటున్నారు.రాజకీయ వర్గాల్లో ఉత్కంఠఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా దంపతులతో మాట్లాడారు. ఈనేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, కొండా దంపతుల రాజకీయ పాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే సురేఖకు పార్టీపరంగా కొత్త బాధ్యత దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు, కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో ఉన్న రాజకీయ ప్రభావాన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని వారి అనుచరులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు, కేడర్ను సమన్వయం చేసేందుకు సురేఖ సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేనని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని నాయకులు చెబుతున్నారు. దీంతో ఆదివారం రాంనగర్లో జరగనున్న కార్యకర్తల సమావేశం, అనంతరం కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో కొండా దంపతులు చేసే వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనపై వెల్లడించే వివరాలు, పార్టీ అధిష్టానంతో జరిగే చర్చలపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు! -
నా భర్త లైఫ్ నాశనమైంది.. Ex OSD సుమంత్ భార్య సంచలన వీడియో
-
కొండా సురేఖ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగుస్తున్న వేళ మాజీ మంత్రి కొండా సురేఖ అంశం మరోమారు చర్చనీయాంశమవుతోంది. గత సమావేశాల వరకు మంత్రిగా ఉన్న ఆమె వర్షాకాల సమావేశాల ప్రారంభం కంటే ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన ఆమె గత ఐదు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. మంత్రిపదవి నుంచి తొలగించిన తర్వాత తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పినప్పటికీ గురువారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశానికి కూడా ఆమె రాలేదు. అసలు ఆమె ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న విషయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు రావడం లేదు. హైదరాబాద్లోని తన నివాసంలోనే ఆమె ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, శుక్రవారం గాందీభవన్ వర్గాల్లో జరిగిన చర్చతో ఆమె మరోమారు వార్తల్లో వ్యక్తి అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆమెకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. జరిగిన విషయాలను పక్కనపెట్టి పార్టీలో మళ్లీ చురుకుగా వ్యవహరించాలని, అసెంబ్లీకి హాజరు కావాలని సురేఖను మీనాక్షి కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
40 స్లీపింగ్ టాబ్లెట్స్ మింగిన కొండా సురేఖ మాజీ OSD తండ్రి
-
40 స్లీపింగ్ టాబ్లెట్స్ మింగిన కొండా సురేఖ మాజీ OSD తండ్రి
-
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ తండ్రి ఆత్మహత్యాయత్నం
సాక్షి, వరంగల్: వరంగల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. 40కి పైగా స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకున్న ఆయన.. తెల్లవారుజామున అపస్మారక స్థితిలో ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.సుబ్రహ్మణ్యేశ్వరరావు గత కొద్ది రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నట్లు తెలుస్తోంది. సుమంత్ వ్యవహారశైలితో మనస్తాపానికి గురైన నేపథ్యంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ వర్గాల నుంచి సమాచారం. అయితే ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. సుబ్రహ్మణ్యేశ్వరరావు విద్యుత్ శాఖలో ఉద్యోగం చేశారు. ఉద్యోగ విరమణకు మరో ఆరు నెలల సమయం ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం కుటుంబంతో కలిసి ఉంటున్న ఆయన.. కొంతకాలంగా మానసిక ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, సుమంత్కు సంబంధించిన వివాదాలు ఇటీవల తీవ్ర చర్చకు దారితీశాయి. సుమంత్పై ఇప్పటికే దాడి, బెదిరింపులు, డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో కేసులు నమోదైనట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆత్మహత్యాయత్నం ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: ఉద్యోగుల కోసం ఎనీ టైమ్.. రేవంత్ ఆఫర్ -
సురేఖ ఎపిసోడ్.. కాంగ్రెస్లో రేవంత్ బలపరీక్ష నెగ్గినట్టేనా?
రాజకీయాలలో సరైన వ్యూహం లేకుండా పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన తీరు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ మొత్తం ఉదంతంలో ఆమె రాజకీయంగా నష్టపోయారు. అదే టైమ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను కొంతవరకు దెబ్బతీశారు. విపక్షాలకు ఆమె కొన్ని ఆయుధాలు అందించారు. మరోవైపు రేవంత్ రెడ్డి తనకు పార్టీలో పట్టు ఉందని నిరూపించడానికి శ్రమించాల్సి వచ్చింది.కొండా సురేఖతో గత కొన్ని నెలలుగా రేవంత్కు కారణం ఏమైనా విభేదాలు ఏర్పడ్డాయి. అయినా ఆమెను మంత్రిగా కొనసాగించవలసి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తనను పదవి నుంచి తప్పించారని సురేఖ ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఉందా, లేదా అన్నది పక్కనబెడితే దాదాపు రెండువారాల పాటు సాగిన ఈ డ్రామా వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పరపతి కొంత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనే డైలాగులకు ఈ ఎపిసోడ్ ద్వారా ప్రాధాన్యత ఏర్పడింది. రేవంత్ టీడీపీ వాసన వదలుకోలేకపోతున్నారన్న భావన పలువురిలో ఉంది. కాకపోతే పైకి అనడం లేదు.సురేఖ, ఆమె భర్త మురళీ ఉమ్మడి వరంగల్ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. అందువల్లే ఆయా పార్టీలు వారిని ఆదరించక తప్పలేదు. అంతవరకు ఓకే కాని కొండా దంపతులు దానిని సద్వినియోగం చేసుకోవడంలో సఫలం కాలేకపోతున్నారు. 1999లో తొలిసారి శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచి ఇంతవరకు వారిది ఘర్షణాత్మక రాజకీయమే. ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డితో తప్ప, ఆయా పార్టీల నేతలు పలువురితో గొడవలు ఉండేవి. రెండున్నర దశాబ్దాల తర్వాత, లక్కీగా మంత్రి అయిన తర్వాత కూడా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో సఖ్యత లేకపోవడం పెద్ద మైనస్గా కనిపిస్తుంది. పోనీ రాష్ట్ర స్థాయిలో ఎవరితోనైనా అవగాహనతో ఉన్నారా అంటే అదీ కనిపించదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తేడా వచ్చాక, తెలివిగా వేరే ముఖ్యమైన నేతలు, మంత్రుల మద్దతు పొందే యత్నం చేయాలి. కాని వీరు రేవంత్ సోదరులపైన, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితర నేతలు పలువురిపైన ఆరోపణలు గుప్పించారు. దాంతో ఈమెకు అండగా నిలవడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారనిపిస్తుంది. గతంలో కూడా వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్లో ఏర్పడిన పరిణామాలలో తొలుత వైఎస్సార్ కుమారుడు జగన్కు మద్దతుగా ఉన్నా, తదుపరి ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ క్రమంలో అనవసర విమర్శలు చేశారు. రోశయ్య క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ ఆయనను వ్యతిరేకించారు. నిజానికి అప్పట్లో రఘువీరారెడ్డి వంటి వారు కూడా రోశయ్య క్యాబినెట్ లో చేరడానికే ఇష్టపడలేదు. కాని తదుపరి సర్దుకుపోయారు. కొండా సురేఖ మాత్రం అలా వ్యూహాత్మకంగా చేయలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా, మళ్లీ అక్కడే గొడవే అయింది. కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి ఎమ్మెల్యే, మంత్రి అవ్వడం విశేషమే. రేవంత్తో మొదట సత్సంబంధాలు ఉన్నా, కారణం ఏమిటో కాని తేడా వచ్చింది. ఈమె భర్త కొండా మురళీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్న అసంతృప్తి ఉండవచ్చు. ఇంకేదైనా కావచ్చు. పరకాలలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి తిరిగి టిక్కెట్ ఇస్తామని రేవంత్ ప్రకటించడం వీరికి ఆగ్రహం తెప్పించింది. కొండా కుమార్తె సుస్మిత దానిపై ఒక సభలో తీవ్రమైన భాషలో ప్రసంగం చేయడం, రేవంత్పై ఆరోపణలు గుప్పించడం కలకలం రేపింది. దానికి ముందు ఒఎస్డి కేసులో మంత్రి ఇంటిని సోదా చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు కూడా ఈమె పరుష వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎలాగో రాజీ చేశారు. కాని ఈసారి రేవంత్ సీరియస్గా తీసుకున్నారు.నిజానికి తన కుమార్తె సీఎంపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వెంటనే సురేఖ నిలువరించి ఉండాల్సింది. లేదా ఆ వెంటనే ఖండించి ఉండాల్సింది. ఎందువల్లో సురేఖ ఆ పని చేయలేదు. దాంతో వివాదం ముదిరింది. ఎంత కాదన్నా ముఖ్యమంత్రికి ఉండే పవర్ వేరు. ఆమె తన మంత్రిత్వ శాఖలో జోక్యం చేసుకుంటున్నారని, ఇతరత్రా విమర్శలు చేసినా, ప్రయోజనం ఉండదు. క్రమశిక్షణ కమిటీ నోటీసు ఇచ్చినప్పుడు సారీ చెబితే అయిపోయేదానికి మంత్రి పదవి పోయేవరకు తెచ్చుకున్నారనిపిస్తుంది. ఏఐసీసీకి ఇచ్చిన లేఖ బయటపెట్టినా పెద్దగా ప్రకంపన ఏమీ రాలేదు.బహుశా ఆమె భర్త మురళీ ఆమె రాజకీయ ఎదుగలకు, అలాగే పతనానికి కూడా కారణమా అన్న విశ్లేషణ వస్తుంది. దానికి తగినట్లే మురళీ ఇంత జరిగిన తర్వాత మీడియాకు కనిపించేలా మీసం మెలి తిప్పుతూ కన్పించారు. అంటే జనంలో తనకు అంత పట్టు ఉందని చెప్పదలిచి ఉండవచ్చు. కాని వర్తమాన రాజకీయాలలో ఎన్నికలు వచ్చేవరకు అధికారంలో ఉన్నవారిదే పెత్తనం అవుతుంది. ఇవన్ని వారికి అనుభవమే అయినా, ఏ ధైర్యంతో ఇలా చేశారో తెలియదు. వారి ప్లాన్ బి ఏమిటో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతామని సురేఖ ప్రకటించడం కాస్త తెలివైన చర్యగానే కనిపిస్తుంది. సమయం మించిపోయాక రక్షాబంధన్ రాఖీని రేవంత్కు కట్టినా ప్రయోజనం కలగలేదనుకోవాలి.ఇక రేవంత్ వైపు చూస్తే సురేఖ ఇష్యూ మొదలు కాగానే పదవి నుంచి తప్పించి ఉంటే ఆయన పవర్ పుల్ గా ఉన్నారన్న అభిప్రాయం కలిగేది. సురేఖపై కొంతమంది ఎమ్మెల్యేలతో విమర్శలు చేయించడంతో పార్టీలో వివాదాలు రచ్చకెక్కినట్లయింది. అధిష్టానం వద్దే పంచాయతీ జరగడం, ఆ పైన మరికొన్ని రోజులు జాప్యం జరగడంతో రేవంత్ కూడా అధిష్టానం చెప్పినట్లు వినాల్సిందేనన్న అభిప్రాయం కలుగుతుంది. అందువల్లే రేవంత్ హైకమాండ్ను బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ ఆరోపించగలిగారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. సురేఖ రాఖీ కట్టిన తర్వాత రాజీ కుదిరిందేమోనని అనుకున్నారు. కాని రేవంత్ అందుకు సిద్దపడలేదన్నమాట.బీసీ వర్గానికి చెందిన మహిళ సురేఖను పదవినుంచి తప్పించడంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అన్నదానిపై అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే తుది నిర్ణయం జరిగి ఉంటుంది. ఈ వివాదం తొలుత రేవంత్ వ్యాఖ్యలతోనే ఆరంభమైన సంగతిని కూడా కాంగ్రెస్ క్యాడర్ గుర్తించి ఉంటారు. గతంలో పవర్ ఫుల్ ముఖ్యమంత్రులన్న పేరున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటివారు సైతం బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు చేసేవారుకాదు. మరో బలమైన నేత చెన్నారెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి పదవి కోల్పోయారు. అయితే ఆయన సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు చెందిన ఒక మంత్రి విమర్శలు చేసిన వెంటనే పదవి నుంచి తప్పించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాటికొండ రాజయ్య, ఈటెల రాజేందర్ లను బర్తరఫ్ చేశారు.కాగా తాను ఎవరికి భయపడనని, స్నేహంగా అడిగితే అన్నీ చేసి పెడతానని రేవంత్ అంటున్నారు. ఇది అచ్చంగా గతంలో కొన్నిసార్లు ఆయన గురువు చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం మాదిరే కనిపిస్తుంది. అయితే చంద్రబాబు ప్రాంతీయ పార్టీ అధినేత కాబట్టి కొంతవరకు చెల్లవచ్చు. అయినా ఆయన అన్నీ అంచనా వేసుకున్నాకే ధైర్యం చేసేవారు. కొన్నిసార్లు ఏమి జరగనట్లు రాజకీయం సాగించేవారు. కాంగ్రెస్లో అది అంత తేలికకాదు. ఎవరికి ఉండే బలం వారికి ఉంటుంది. ప్రస్తుతానికి కర్ణాటకలో మాదిరి ఒక నేత ఎవరూ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడే దశ తెలంగాణలో రాలేదు. అది ఆయనకు కలిసివచ్చే అంశం. అయితే తన కుటుంబ సభ్యులపైన, సన్నిహితులు కొందరిపైన సురేఖ చేసిన ఆరోపణల వల్ల కాంగ్రెస్కు కొంత నష్టం జరుగుతుంది. వాటిపై అసెంబ్లీలో చర్చ జరగాలని విపక్షం పట్టుపట్టవచ్చు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన సురేఖ తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తే అదొక సమస్య అయ్యే అవకాశం ఉంది. కాగా సౌమ్యుడుగా పేరొందిన చిన్నారెడ్డి అనూహ్యంగా వివాదంలో చిక్కుకుని పదవి పోగొట్టుకోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. బీసీ నేత పదవినే తీసేశారన్న విమర్శ రాకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. ఓవరాల్గా ఈ పరిణామాలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలలో పలచన కావచ్చు. సురేఖ రాజకీయం ముళ్లబాటగా మారే అవకాశం ఉంటుంది. కాగా, రేవంత్ తన పరపతి నిలబెట్టుకున్నప్పటికీ, కొంత డామేజీని భరించక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: విజయసాయి మాట ఎందుకు మార్చారు? -
‘నా వల్లే ఇదంతా’.. బోరున ఏడ్చేసిన కొండా సుష్మిత!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం నుంచి తన తల్లి కొండా సురేఖను తప్పించడంపై ఆమె కుమార్తె కొండా సుష్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తల్లికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ భోరున విలపిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఉన్న కోపాన్ని తన తల్లిపై చూపించి బలిచేశారని ఆరోపించారు.మా అమ్మను ఇంతగా అవమానిస్తారని తెలిస్తే నేను ఆ రోజు ఆ విధంగా మాట్లాడేదాన్ని కాదు. నేను మాట్లాడిన దానికి మా అమ్మను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అన్న మాటల్లో తప్పులేదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి నాపై ఈ స్థాయిలో పగ పెంచుకుంటారని ఊహించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.మా అమ్మ చేసిన ఒక్క తప్పునైనా చూపించగలరా? 'పార్టీలో నేనైనా ఉండాలి, లేదా ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారుతారా? అని రేవంత్ రెడ్డి తీరును నిలదీశారు. ఎంపీపీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కొండా సురేఖ దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చారని గుర్తుచేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న తమ కుటుంబాన్ని ఇప్పుడు తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన తరుణంలో కొండా సుష్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. తన తల్లికి అన్యాయం జరిగిందని, ఆమె గొంతు నొక్కలేరని పేర్కొన్నారు. సీఎం రేవంత్ను శపిస్తున్నట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా, తన వ్యాఖ్యల వల్లే తల్లి పదవికి ముప్పు వచ్చిందనే భావనతో సుష్మిత భావోద్వేగానికి గురవుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. బోరున ఏడ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత నా వల్లే మా అమ్మకు ఇంత అవమానంనేను మాట్లాడిన మాటలకు మా అమ్మను ఇంతలా అవమానిస్తారా? –కొండా సుష్మిత pic.twitter.com/2njDtBF1G0— Mirror TV (@MirrorTvTelugu) September 6, 2026 -
‘కొండా సురేఖ మా పార్టీలోకి కూడా వద్దు’
హైదరాబాద్: ఇటీవల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్కు గురైన కొండా సురేఖ ఏ పార్టీలో చేరుతుంది అనే డైలమా కొనసాగుతున్న తరుణంలోనే అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలు తమ స్వరం పెంచాయి. కొండా సురేఖ ఏ రాజకీయ పార్టీలో చేరతారు అనే దానిపై ఇంకా స్పష్టత రాకుండానే బీఆర్ఎస్, బీజేపీలు నేరుగానే దాడి ప్రారంభించాయి. కొండా సురేఖను తమ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని, తెలంగాణ భవన్ గేట్ను కూడా ఆమె తాకలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్రెడ్డి ఇప్పటికే ప్రకటించగా, ఇప్పుడు బీజేపీ నుంచి కూడా దాదాపు అదే స్వరం వినిస్తుంది. కొండా సురేఖ తమ పార్టీలోకి కూడా వద్దంటూ బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు తేల్చిచెప్పేశారు. కొండా సురేఖ బర్తరఫ్ అంశం తర్వాత బీజేపీలోకి చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేత మురళీదర్రావు సంచలన ట్వీట్ చేశారు. BJP అంటే BIN అనుకుంటున్నారా? అంటూ ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నుంచి బహిష్కృతం అయిన నేతలను తీసుకునే రాజకీయ డంపింగ్ గ్రౌండ్గా బీజేపీ ఉండదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం కనిపిస్తున్న సమయంలోనే ప్రతి ఊహాగానానికి బీజేపీని లింక్ చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. బీజేపీని చర్చలోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్లోని అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమా? అనే అనుమానం కలుగుతుంది. కాంగ్రెస్ అంతర్గత సమస్యలు పరిష్కరించుకునే లోపే బీజేపీ పేరును తెరపైకి తెచ్చి రాజకీయ నరేటివ్ను ముందుగానే మార్చే ప్రయత్నం జరుగుతోందా?, తెలంగాణ బీజేపీ లక్ష్యం కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చే అసంతృప్త నేతలకు ఆశ్రయం కల్పించడం కాదు.కాంగ్రెస్, బీఆర్ఎస్లకు విశ్వసనీయ సొంతంగా ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలనుకుంటోంది. ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి, వ్యక్తిత్వం, సిద్ధాంతం, రాజకీయ విధానాల్లో కనిపించాలి. బీజేపీకి కార్యకర్తల బలం, కేడర్ కమిట్మెంట్ కీలకం. పార్టీని కేవలం నేతల చేరికలతో బలోపేతం చేయడం కాదు. ప్రత్యేకమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలబెట్టడమే లక్ష్యం. అందుకే “BJP = BIN” అనే రాజకీయ నరేటివ్ను నమ్మొద్దు. ప్రస్తుతం వస్తున్న రాజకీయ ఊహాగానాల వెనుక ఇంకేదైనా రాజకీయ వ్యూహం ఉందా? అన్న కోణంలో కూడా చూడాలి. బీజేపీ ఒక ప్రత్యామ్నాయం.. మరో పార్టీకి పేరు మార్చిన రూపం కాదు’ అని స్పష్టం చేశారు.BJP is NOT a BIN.Why is the media so eager to drag BJP into every speculative political story—just when the Congress crisis appears to be unfolding?Is this an attempt to prematurely stop the game, divert the narrative, and help Congress nip its troubles in the bud?BJP…— P Muralidhar Rao (@PMuralidharRao) September 5, 2026 ఇవీ చదవండి: సురేఖ ఎపిసోడ్, కేబినెట్ విస్తరణపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు‘కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం’ -
ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?
-
సురేఖ ఎపిసోడ్, కేబినెట్ విస్తరణపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంశం, కొండా సురేఖ ఎపిసోడ్పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సురేఖను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారం జరుగుతుందని తెలిపారు.మీడియా చిట్ చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే. ఢిల్లీలో కేబినెట్ విస్తరణపై చర్చ జరగలేదు. కేవలం కొండా సురేఖ, చిన్నా రెడ్డి అంశంపై మాత్రమే చర్చ జరిగింది. కేబినెట్ విస్తరణపై హై కమాండ్ నుండి ఎలాంటి సమాచారం లేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం. నాకు మంత్రి పదవి అనే ప్రచారంపై నాకు మాత్రం సమాచారం లేదు. అవన్నీ ఊహాగానాలే. అలాగే, కొండా సురేఖను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. సురేఖ విషయంలో అందరం మా వంతు ప్రయత్నం చేశాం. సురేఖ విషయంలో ఏఐసీసీ ఒప్పుకోలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ నెరవేర్చారు. కుల సర్వే శాస్త్రీయంగా చేశాం. రాబోయే వంద రోజులు దేశవ్యాప్తంగా బీసీ హక్కుల గర్జన చేస్తాం. బీసీ హక్కుల కోసం జరిగే గర్జనను విజయవంతం చేయండి’ అని పిలుపునిచ్చారు.మరోవైపు.. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బండి సంజయ్, అరవింద్, ఈటల, లక్ష్మణ్ బీసీల అంశంపై స్పందించాలి. అడిగితే పదవులు పోతాయని బీజేపీ బీసీ నేతలు భయపడుతున్నారా?. తెలంగాణలో బీజేపీ ఉండాలా వద్దా తేల్చుకోండి. కుల గణనలో దేశానికి రోల్ మోడల్గా ఉన్నాం. తెలంగాణ చేసిన కులగణనలో అన్ని విషయాలు పొందుపరిచాం. మేం పంపిన ఫైల్పై కేంద్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఓబీసీల జనాభాను ఎందుకు లెక్కించడం లేదు? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: తెలంగాణలోనూ అలాగే గెలవాలన్నది బీజేపీ ప్లాన్: రేవంత్ -
ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది. ఒకవైపు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై చర్చ.. మరోవైపు వరంగల్ తూర్పులో అంతర్గత సమీకరణాలపై ఆసక్తి.. వెరసి ‘కొండా’ దంపతులకు ‘అక్కడ సెగ.. ఇక్కడ పొగ..’ అన్నట్టుగా పరిస్థితి మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారానికి ఆమె స్వయంగా తెరదించారు. కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో తక్షణ రాజకీయ సంక్షోభంపై కొంత స్పష్టత వచ్చింది. వరంగల్ తూర్పుపై ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ‘కుడా’ చైర్మన్ గుండు సుధారాణిలు పట్టు బిగిస్తుండటం.. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా దంపతుల వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తూర్పులో కొండా కుటుంబానికి భిన్నంగా వేగమందుకున్న కాంగ్రెస్ నేతల కదలికలపై చర్చ మొదలైంది.కాంగ్రెస్లోనే.. సురేఖ స్పష్టత.. పార్టీ మారతారనే ప్రచారం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే చర్చ మధ్య సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే కొనసాగుతానని ప్రకటించారు. దీంతో వెంటనే పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా వంటి అంశాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్లోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. మంత్రి పదవి లేకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో.. పార్టీలో తన రాజకీయ ప్రాధాన్యాన్ని ఎలా కొనసాగిస్తారు? స్థానికంగా తన వర్గాన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.చదవండి: మంత్రివర్గంలోకి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్?పెరుగుతున్న వ్యతిరేక స్వరంవరంగల్ తూర్పు కాంగ్రెస్లో కొండా సురేఖకు భిన్నమైన రాజకీయ వర్గాలు గతంలోనూ ఉన్నాయి. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ గుండు సుధారాణి వంటి నేతలు వరంగల్ తూర్పు రాజకీయాల్లో తమదైన ప్రాధాన్యం కలిగిన నాయకులు. గత రాజకీయ పరిణామాల్లో కొండా కుటుంబంతో వీరికి భిన్నాభిప్రాయాలు కనిపించిన సందర్భాలున్నాయి. తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన గుండు సుధారాణి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల చేస్తే ఊరుకునేది లేదని గట్టిగానే హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ పోటీ చేయాలని, తాను సైతం ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని బసవరాజు సారయ్య సురేఖకు సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లో వీరి రాజకీయ వైఖరి ఎలా ఉంటుంది? కొండా సురేఖతో పార్టీ అంతర్గతంగా సమన్వయం జరుగుతుందా? లేక కాంగ్రెస్లో వేర్వేరు రాజకీయ శక్తులుగా కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.‘కొండా’ అనుచర వర్గంలో మౌనంతాజా పరిణామాల తర్వాత కొండా సురేఖకు మద్దతుగా ఉండే నాయకులు, కార్యకర్తల నుంచి పెద్దగా బహిరంగ ప్రకటనలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీనిని మొత్తం అనుచరవర్గం మౌనంగా ఉందని చెప్పడం కంటే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న వాతావరణంగా చూడాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆమె అనుచరుల రాజకీయ వైఖరి కూడా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉండే అవకాశముంది. భవిష్యత్తులో ఏదైనా కీలక రాజకీయ నిర్ణయం వస్తే.. స్థానికంగా ఆమె వెంట ఎవరెవరు నిలుస్తారన్నది అప్పుడే స్పష్టం కానుంది. దీంతోపాటు కాంగ్రెస్లో కొనసాగుతున్న కొండా సురేఖకు ఇప్పుడు ప్రధాన సవాలు పార్టీ బయట కంటే సొంత పార్టీలోనే తన రాజకీయ స్థానాన్ని నిలబెట్టుకోవడమే. కాంగ్రెస్లోనే ఉంటూ రాజకీయ బలాన్ని పునర్నిర్మించుకోవడమా? పార్టీలోని విభేదాలను అధిష్టానం దష్టికి తీసుకెళ్లడమా? వరంగల్ తూర్పులో తన కేడర్ను మరింత బలోపేతం చేసుకోవడమా? వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్నది వారి తదుపరి రాజకీయ చర్యలతోనే స్పష్టం కానుంది. -
మంత్రివర్గంలోకి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్?
గాంధీ భవన్ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు ఒకటే ఉత్కంఠ! కొండా సురేఖ బర్తరఫ్తో ఖాళీ అయిన మంత్రి స్థానం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పాలకవర్గాల సమరానికి సిద్ధమవుతున్న వేళ..రాజధాని ప్రాంతం సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అనివార్యత కాంగ్రెస్ అధిష్టానానికి ఏర్పడింది. ఇప్పటికే మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో కలిపి భర్తీ చేయాల్సిన బెర్త్ల సంఖ్య మూడుకు చేరింది.సాక్షి, హైదరాబాద్: నగర పాలక సంస్థల సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పారీ్టకి అగ్నిపరీక్ష ఎదురవుతోంది. కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కేబినెట్ బెర్తులపై చర్చ తీవ్రమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, పరిసర రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్కు ఆశించిన స్థానాలు దక్కకపోయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, రాబోయే గ్రేటర్ పోరులో గులాబీ, కాషాయ దళాల హోరాహోరీని తట్టుకుని జెండా పాతాలంటే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో బలమైన ప్రాతినిధ్యం తప్పనిసరైంది. ఎమ్మెల్సీ అజహరుద్దీన్ను కేబినెట్లోకి తీసుకున్నప్పటికీ, స్థానిక రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి క్యాడర్ను మెప్పించే బలమైన నేతలకు పీఠం దక్కలేదనే అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ..ఇప్పుడు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కేబినెట్ విస్తరణను ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. కేబినెట్æలో రాజధాని బెల్ట్కు చోటు దక్కితేనే పార్టీకి మైలేజ్ వస్తుందనే రాజకీయ విశ్లేషణలు ఊపందుకున్నాయి.జెన్–జీ ప్లస్ బీసీ ఫార్ములాలో... జెన్–జీ ప్లస్ బీసీ ఫార్ములాలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, యువ నేత నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో ఆమె ఖాళీ చేసిన స్థానాన్ని తిరిగి బీసీ వర్గంతోనే భర్తీ చేసేవిధంగా ఒత్తిడి అధిష్టానంపై వచ్చే అవకాశం లేకపోలేదు. జెన్–జీ కోటాలో యువకుడైన నవీన్ యాదవ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే..ఒకవైపు బీసీ కోటా, జెన్జీ రాజకీయ ప్రాధాన్యతపై సముచిత నిర్ణయమవుతుందని కొందరు వాదిస్తున్నారు. కాగా బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే సమయంలో అధిష్టానం ఆయనకు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా కల్పించడంపై సాంకేతిక, న్యాయపరమైన చిక్కులతో పాటు పాత కాంగ్రెస్ నేతల నుండి వస్తున్న నిరసనలను అధిష్టానం ఎలా సమన్వయం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.శివారులో అసంతృప్తి జ్వాలలు రాష్ట్ర రాజధానికి ఆనుకుని, అత్యధిక జనాభా, నియోజకవర్గాలు కలిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో సరైన ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి స్థానిక నాయకత్వంలో నెలకొని ఉంది.. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి వంటి సీనియర్ నేతలు ఇప్పటికే కేబినెట్ చోటు దక్కలేదనే ఆసంతృప్తి వ్యక్తం చేస్తూనే..సాక్షాత్తు ఏఐసీసీ పెద్దల వద్ద సైతం మొరపెట్టుకున్నారు. మరొకవైపు శాసనసభ స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించకపోతే గ్రేటర్ చుట్టుపక్కల అర్బన్–రూరల్ నియోజకవర్గాల్లో పారీ్టకి ఇబ్బందులు తప్పవని జిల్లా నేతలు హెచ్చరిస్తున్నారు.హైకమాండ్ కోర్టులో బంతి ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం పూర్తిగా పార్టీ అధిష్టానం వద్దే తేలాల్సి ఉంది. ఒకవైపు పార్టీలోని సీనియర్ నేతల ఆశలు, మరోవైపు కొత్తగా చేరిన నాయకుల అంచనాలు, వీటితో పాటు సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి కత్తిమీద సాములా మారింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే ఈ విస్తరణ ఉండవచ్చనే ప్రచారంతో గాంధీ భవన్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పార్టీని బలపరచే దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తారా? లేక జిల్లా సీనియర్లు, బీసీ వర్గాలు నగర కీలక నేతల మధ్య సమతుల్యత పాటిస్తూ నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: మాజీ మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్ -
కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరం
సాక్షి, న్యూఢిల్లీ: కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరమని..అయితే పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని శబరి బ్లాక్లో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణా సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగానే కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై హైకమాండ్ సమానంగా చర్యలు తీసుకుందని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని తేల్చి చెప్పారు. ‘కూతురు సుస్మిత తెలిసి చేసినా తెలియక చేసినా.. సీఎం రేవంత్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించాల్సింది. జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండేది. అలా చేయలేదు కాబట్టే ఏఐసీసీ ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించింది’అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బ్లాక్మెయిల్ చేసే అవసరం లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖ పార్టీలోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. గతంలో కొండా సురేఖపై రెండుసార్లు ఫిర్యాదులు వచ్చినప్పుడు స్వయంగా సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి సర్దిచెప్పానని మహేశ్గౌడ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటుందో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపట్ల అంత కఠినంగా కూడా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మహేశ్గౌడ్ ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్హౌస్కే పరిమితం కాకుండా అసెంబ్లీకి వచ్చి తన అనుభవాలను పంచుకోవాలని, ప్రతిపక్ష నేతగా తన వాదనను వినిపించాలని డిమాండ్ చేశారు. కేబినెట్ విస్తరణపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే మంత్రి కావాలని కోరుకోవడం సహజమే అయినా అందరికీ ఒకేసారి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని, ఎన్నో సమీకరణాలు ఉంటాయని చెప్పారు. -
ట్వీట్.. ట్విస్ట్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ది వెయిట్ ఈజ్ ఆల్ మోస్ట్ ఓవర్.. బిగ్ అప్డేట్ కమింగ్ సూన్.. తెలంగాణ స్టే ట్యూన్డ్’అంటూ కొండా సురేఖ పేరుతో శుక్రవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన పోస్టు.. మంత్రివర్గం నుంచి ఆమె ఉద్వాసన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. కథ మొదలైన వెంటనే ట్విస్ట్.. కాసేపటికే ‘అది మా పోస్టు కాదు’అంటూ సురేఖ అధికారిక ఖాతాల నుంచి ప్రకటన వచ్చింది. అసలేం జరుగుతోంది.. రాజకీయవర్గాల్లో కొత్త చర్చ ఫేక్ పోస్టు అయితే.. ఇంతకీ ‘బిగ్ అప్డేట్’ఏమిటి? కొండా దంపతుల తదుపరి రాజకీయ అడుగు ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ‘నిరీక్షణ దాదాపు ముగిసింది.. త్వరలోనే బిగ్ అప్డేట్.. తెలంగాణ వేచిచూడండి’ కొండా సురేఖ పేరుతో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ మూడు వాక్యాలు.. కాసేపట్లోనే తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరతీశాయి. మంత్రివర్గం నుంచి సురేఖను తొలగించిన నేపథ్యంలో ఈ పోస్టు రావడంతో.. ఇక కీలక రాజకీయ నిర్ణయం ప్రకటించబోతున్నారా? కాంగ్రెస్కు గుడ్బై చెబుతారా? కొత్త రాజకీయ అడుగు వేయబోతున్నారా? అంటూ చర్చ మొదలైంది. ఆ ఉత్కంఠకు తెరపడకముందే మరో ట్విస్ట్! ‘అది మా పోస్ట్ కాదు’అంటూ సురేఖ అధికారిక ఖాతాల ద్వారా ప్రకటించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మరి బిగ్ అప్డేట్?: అసలు సురేఖ రాజకీయ నిర్ణయం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సురేఖ పేరుతో వచ్చిన పోస్టు ఫేక్ అని స్పష్టమైనా, ఆమె రాజకీయ భవిష్యత్పై ఆసక్తి మాత్రం తగ్గలేదు. కొండా సురేఖ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పినా, తాజా పరిణామాల నేపథ్యంలో బయట రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్లోనే కొనసాగుతారా? పార్టీ నాయకత్వంపై మరింత ఒత్తిడి తెస్తారా? లేక రాజకీయంగా మరో మార్గాన్ని ఎంచుకుంటారా? తనపై చర్యల విషయంలో న్యాయ పోరాటం చేస్తారా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. -
కాంగ్రెస్లో కుతకుత
సాక్షి, హైదరాబాద్: అసలే కొండా సురేఖ బర్తరఫ్ ఎపిసోడ్తో అతలాకుతలమవుతున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త కుతకుతలు మొదలయ్యాయి. చిన్నారెడ్డి స్థానంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా గద్వాల విజయలక్ష్మి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్గా గుండు సుధారాణిల నియామకాలు దేనికి సంకేతాలనే చర్చ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రచ్చకు కారణమవుతోంది. పార్టీలో చర్చించి నియామకాలు చేపట్టాల్సి ఉండగా, కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ నియామకాలు చేపట్టడంపై అధిష్టానం దగ్గర పలుకుబడి ఉన్న ఓ కీలక నేత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పోస్టుల భర్తీ విషయంలో పార్టీలో చర్చించి, టీపీసీసీ సమన్వయ కమిటీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్లాల్సి ఉండగా, ఏకపక్షంగా పదవులు ప్రకటించడాన్ని ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ముఖ్య నేత గుర్రు.. సురేఖకు ఉద్వాసన పలకగానే సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుంటూ ముగ్గురు మహిళలకు కీలక పదవులిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన హైదరాబాద్ నగర మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించారు. ఆమెకు కేబినెట్ హోదా కల్పించడమే కాకుండా గతంలో చిన్నారెడ్డి తరహాలోనే మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా అవకాశం కల్పించారు. ఇప్పటికే ఆమె తండ్రి కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయనకూ కేబినెట్ హోదా ఉంది. మళ్లీ ఇప్పుడు కుమార్తెకు ఎందుకు పదవి ఇవ్వాల్సి వచ్చిందని, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి కేబినెట్ హోదా ఎలా ఇస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న ఆమెను అక్కడి నుంచి తొలగించి మరీ కేబినెట్ హోదా గల పదవిలో ఎందుకు నియమించారని, కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న మహిళా నేతల్లో ఆ పదవి నిర్వహించగలిగిన సామర్థ్యం ఉన్న వారు లేరా అనే ఆవేదన వ్యక్తమవుతోంది. అలాంటప్పుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్రెడ్డిలకు ఎందుకు కేబినెట్లో అవకాశం ఇవ్వరనే వాదనా వినపడుతోంది. ఉత్తమ్ పద్మావతికి మంత్రి పదవి, భట్టి విక్రమార్క సతీమణి నందినికి ఖమ్మం ఎంపీ టికెట్ అడిగినప్పుడు ఈ కుటుంబ నిబంధన ఎలా అడ్డువచ్చిందని కొందరు బాహాటంగానే ప్రశి్నస్తున్నారు. మరోవైపు వరంగల్ మాజీ మేయర్, రాజ్యసభ మాజీ సభ్యురాలు, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణిని ప్రాధాన్యం గల పోస్టులో నియమించారు. ఈ ఇద్దరూ కష్టకాలంలో పార్టీలో లేరని, అధికారం వచ్చాక పార్టీలోకి వచ్చిన వీరికి క్లిష్ట సమయంలో కీలక పదవులు ఇవ్వడం ద్వారా మున్నూరుకాపు, పద్మశాలి సామాజిక వర్గాలకు ఏదో అవకాశం కల్పించామని చెప్పుకునేందుకు చేసే ప్రయత్నాలు సఫలం కావనే అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పెనం మీద నుంచి పొయ్యిలోకి... తాజా పరిణామాలపై పాలమూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే మనసుకు బాధ అనిపిస్తుంది. సురేఖ కుమార్తె చేసిన దానికి ఆమెను బలిచేశారు. పార్టీలో కనీసం మూడేళ్లు పనిచేసి ఉంటేనే మండల పార్టీ అధ్యక్ష పదవి ఇస్తున్నప్పుడు ఎన్నేళ్లు పనిచేశారని గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదా, కేబినెట్ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించారు? తన మేయర్ పదవిని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సుధారాణి పార్టీ అభివృద్ధి కోసం ఏం కష్టపడ్డారని కుడా చైర్మన్ ఇచ్చారో అర్థం కావడం లేదు.అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అంటూ సురేఖ కుమార్తె సుస్మిత మాట్లాడింది ఇందుకేనా? పంతాలకు పోయి పార్టీని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.’అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ నేతల ప్రస్తుత మానసిక స్థితికి అద్దం పడుతోంది. గుండు సుధారాణికి కుడా చైర్మన్ ఇవ్వడం పట్ల వరంగల్ కాంగ్రెస్ నేతలు, ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సురేఖ పోయి సుధారాణి వచ్చిందని, తద్వారా తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయిందని కాంగ్రెస్ నాయకులంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ విధేయ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి లాంటి వారు ప్రస్తుతానికి మౌనంగా ఉన్నా... భవిష్యత్ ఓరుగల్లు రాజకీయాలు మరింత రచ్చకెక్కడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. -
తొలగింపుపై తాపత్రయం
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం అధికార కాంగ్రెస్లో కొత్త కోణం తెరపైకి వస్తోంది. ఈ విషయంలో అధిష్టానానికి నచ్చజెప్పి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభీష్టానికి అనుగుణంగా హైకమాండ్ను ఒప్పించడంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక నేతల సహకారం ఉందనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. రేవంత్తోపాటు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడిన ఓ నాయకుడు, ప్రభుత్వంతో సమాంతరంగా పార్టీకి అధికారాలు కావాలని పోరాట బాటపట్టిన మరో నాయకుడు ఏకాభిప్రాయంతో ఈ ఎపిసోడ్లో కీలకపాత్ర పోషించారని.. ఇందులో స్వామి కార్యంతోపాటు స్వకార్యం కూడా దాగి ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. మరో విషయం ఏమిటంటే సురేఖకు ఖర్గే అపాయింట్మెంట్ ఇప్పించడంలో తెరవెనుక పాత్ర పోషించిన అధిష్టాన దూత ఒకరు.. ఈ వ్యవహారం ఢిల్లీకి మారాక మౌనం దాల్చారని.. ఆయన మౌనముద్రతోనే జరగాల్సిందంతా సజావుగా జరిగిందనే చర్చ కూడా గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. మొదటి నుంచీ ఆయన చుట్టూనే.. కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే సీఎం రేవంత్కు ఢిల్లీ వేదికగా సహకరించిన కీలక నేత ఒకరి చుట్టూనే రాజకీయమంతా తిరిగింది. ఒకదశలో సురేఖ ఎపిసోడ్పై కమిటీ వేస్తారని.. ఈ కమిటీకి ఆయనే నేతృత్వం వహిస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. ఆయన క్యాంపు కార్యాలయంలోనే కీలక నేతల సమావేశాలు, తర్జనభర్జనలు జరిగాయి. ఆ సమయంలోనే ఆయన తన వైఖరిని సురేఖ శిబిరానికి కుండబద్దలు కొట్టి చెప్పారని సమాచారం. ఆ తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసినప్పుడు కూడా తన వైఖరిని వెల్లడించారని.. ఓ దఫా ఆయనకు ఆశించిన సమ్మతి లభించకపోయినా ఎపిసోడ్ ఢిల్లీకి బదిలీ అయ్యాక ఏఐసీసీలో ఉండే మరో ముఖ్యుడి సహకారంతో ఆయన అధిష్టానం పెద్దలకు నచ్చజెప్పగలిగారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఆ కీలక నేత మంతనాల నేపథ్యంలో సురేఖ తొలుత బెంగళూరులో, ఆ తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినప్పుడు ఆయన స్వరంలో మార్పు కనిపించిందని అంటున్నాయి. ఇక పార్టీలోని ఓ ముఖ్య నేత సహకారం ఈసారి సీఎం రేవంత్కు లభించిందని తెలుస్తోంది. ఇటీవల పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగిన సందర్భంలో రేవంత్ వ్యతిరేక శిబిరంలో ఉన్న ఆ నాయకుడు సురేఖ వ్యవహారంలో మాత్రం రేవంత్ అనుకూల శిబిరంలో కీలకపాత్ర పోషించారని సమాచారం. ఆయన కూడా సీఎం నిర్ణయానికి అడ్డుచెప్పకుండా తలూపారని తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు కలిసి పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలను నియంత్రించాలంటే నిర్ణయం తప్పనిసరిని చెప్పి అధిష్టానానికి నచ్చజెప్పారని తెలుస్తోంది. ఆ ఇరువురి సహకారానికి తోడు అధిష్టాన దూత ప్రేక్షకపాత్ర పోషించడం, సీఎం సైతం ఒత్తిడి తేవడం వెరసి అధిష్టానం సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని.. ఈ నేపథ్యంలోనే సురేఖ పక్షం వహించిన మరో ముఖ్య నేత వాదనకు ప్రాధాన్యం ఇవ్వలేదని సమాచారం. అయితే తనకు సహకరించిన ఆ ఇద్దరు నేతల విషయంలో సీఎం రేవంత్ భవిష్యత్ వైఖరి ఎలా ఉంటుంది? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వారికి ప్రాధాన్యం ఉంటుందా? శాఖల మార్పుపై ప్రభావం చూపుతుందా? అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ‘అనుబంధం’కొనసాగుతుందా? అనేది వేచిచూడాల్సిందే! అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక హస్తినకు మరోసారి సీఎం! సురేఖ ఉద్వాసన నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ప్రస్తుతమున్న మంత్రుల శాఖల మార్పు గురించి చర్చించేందుకు వీలైనంత త్వరగా కబురు చేస్తామని ఢిల్లీ పెద్దలు సీఎం రేవంత్రెడ్డికి చెప్పారని తెలుస్తోంది. అందుకే ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని.. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక సీఎం రేవంత్తోపాటు పార్టీలోని ఇతర ముఖ్యులు హస్తినకు వెళ్లి కేబినెట్ ప్రక్షాళనపై హైకమాండ్తో చర్చిస్తారని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. -
మాజీ మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖకు తెలంగాణ ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవలే ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించిన సర్కార్, తాజాగా ఆమెకు కల్పించిన భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో పాటు ఆమెకు కేటాయించిన 4+4 గన్మెన్ల భద్రతను కూడా పూర్తిగా రద్దు చేసింది.కేబినెట్ నుంచి బర్తరఫ్తో పాటు భద్రతను కూడా తొలగించడంతో హనుమకొండలోని ఆమె నివాసం వద్ద ఉన్న పోలీస్ సెక్యూరిటీని అధికారులు వెంటనే వెనక్కి తీసుకున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలు కొండా సురేఖ అనుచరులు, మద్దతుదారుల్లో ఈ పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 👉ఇదీ చదవండి: ‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’ -
‘కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం’
హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. కొండా సురేఖ రాజకీయ భవిష్యత్పై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్రెడ్డి స్పందించారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కొండా సురేఖను బీఆర్ఎస్లోకి ఆహ్వానించే ప్రసక్తే లేదన్నారు. కొండా సురేఖను కనీసం తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమన్నారు జగదీష్రెడ్డి. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దని తప్ప ఎవరినీ తీసుకోమన్నారు. ఎమ్మెల్యేల క్యారకర్ట్ ఆధారంగా వాళ్లు వస్తామంటే తీసుకుంటామన్నారు. ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు బిఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా తీసుకోము. ఎన్నికల కంటే ముందు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్రెడ్డి ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామంటే తీసుకోలేదు. వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ జరుగుతుంది. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే డబ్బులకు అమ్ముడు పోయినట్టే’ అని పేర్కొన్నారు. కొండా సురేఖ బర్తరఫ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు -
కొండా అవుట్... మంత్రి పదవి కావలెను
-
కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?
-
కొండా సురేఖ బర్తరఫ్పై డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
మహబూబ్నగర్: కొండా సురేఖ బర్తరఫ్ అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీ మంత్రిపై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలే కొండా సురేఖ బర్తరఫ్కు కారణమన్నారు. కొండా సురేఖ సీనియర్ నాయకురాలని, వైఎస్సార్ మంత్రి వర్గంలో ఇద్దరం కలిసి పని చేశామన్నారు. ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖను బాధ్యరాలిని చేసి బర్తరఫ్ చేయడమనేది మంచి పరిణామం కాదన్నారు. వికారాబాదు జిల్లా మర్పల్లిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. కొండా సురేఖ బర్తరఫ్పై స్పందించారు. ‘సీఎం రేవంత్రెడ్డి రాఖీ కట్టించుకున్నాడు.. గొంతు పిసికిండు’ అని ఆమె విమర్శించారు. తనను నమ్ముకున్న మహిళలను అసెంబ్లీలో ముందు వరుసలో కూర్చోబెట్టిన అని చెప్పిన సీఎం రేవంత్.. ఇప్పుడు మాత్రం గొంతు పిసికిండు అని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి:మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ -
‘కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగాలని కోరుకుంటున్నాం’
సాక్షి,న్యూఢిల్లీ: కొండా సురేఖ బర్తరఫ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొండా సురేఖ తన కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను వెంటనే ఖండించి ఉండాల్సింది. అలా ఖండించకపోవడం వల్లే ఈ అంశాన్ని ఏఐసీసీ చాలా సీరియస్గా తీసుకుంది. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని తాము బలంగా కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎవరినీ బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం గానీ, పరిస్థితి గానీ లేదని మహేష్ గౌడ్ తేల్చిచెప్పారు. -
కొండా సురేఖ దారెటు..!
-
Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం
-
ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్
-
మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: తాజా మాజీ మంత్రి, వరంగల్ తూర్పు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. “నిరీక్షణ ముగిసింది.. అతిత్వరలో ఓ కీలక నిర్ణయం ప్రకటిస్తా.. చూస్తూనే ఉండండి.. తెలంగాణ!” అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఈ ఉదయం నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై కాసేపటికే ఆమె మరో ప్రకటన చేశారు. ఈ పోస్టు వైరల్ అవుతూ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆ ఫేస్బుక్ అకౌంట్ తనది కాదని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవాస్తవం. మా పేరిట జరుగుతున్న ప్రచారాలకు మాకు సంబంధం లేదు అంటూ ఆమె నుంచి ఓ ప్రకటన వెలువడింది. “త్వరలో పెద్ద అప్డేట్” అంటూ సురేఖ పేరిట వచ్చిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయింది. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై ఆమె ఏదైనా క్లారిటీ ఇస్తారా? అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఆమెను రెండు పార్టీలు సంప్రదించాయని.. ప్రాంతీయ పార్టీ వైపు ఆమె మొగ్గు చూపిస్తున్నారని వరంగల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో ముదిరిన పంచాయితీ.. సురేఖను బర్తరఫ్ చేసేదాకా వెళ్లింది. మరీముఖ్యంగా మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించిన తర్వాత వరంగల్ రాజకీయాల్లోనూ చర్చ ధారి తీసింది.ఇదీ చదవండి: కొండాను ఒంటరి చేయడంలో సక్సెస్! -
‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’
సాక్షిప్రతినిధి, వరంగల్ : పదవులు రావడం.. పోవడం రాజకీయాల్లో సహజమే. కానీ కొందరిని మాత్రం అదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణి పరిస్థితి ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవల గ్రేటర్ వరంగల్ మేయర్ పదవినుంచి మాజీ అయిన ఆమెకు.. కొద్ది రోజుల వ్యవధిలోనే మరో కీలక పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ‘కుడా’ (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి ఆమెను వరించింది. టీడీపీలో రాజ్యసభ సభ్యురాలిగా, బీఆర్ఎస్ హయాంలో మేయర్గా ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరగా ఇప్పుడు ‘కుడా’ చైర్పర్సన్ పదవి వరించింది. కాగా, ప్రస్తుతం ఈ పదవిలో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి సుధారాణికి బాధ్యతలు అప్పగించారు.సురేఖ బర్తరఫ్.. సమీకరణాల్లో మార్పుకొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గంనుంచి తప్పించడంతో ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో సామాజిక, ప్రాంతీయ సమీకరణలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పద్మశాలి సామాజికవర్గానికి చెందిన గుండు సుధారాణికి కుడా చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న గుండు సుధారాణికి రాజకీయంగా కీలక పదవులు కొత్తేమీ కాదు. గ్రేటర్ వరంగల్ మేయర్గా పనిచేసిన ఆమె.. ఇటీవల మేయర్ పదవీకాలం ముగియడంతో ఆ పదవికి వీడ్కోలు పలికారు. దీంతో ఇక ఆమె రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ జరుగుతున్న సమయంలోనే మరో కీలక బాధ్యత దక్కడం విశేషం. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణికి ‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చిన’ పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రస్తుతం వరంగల్ రాజకీయ వర్గాల్లో ఆమెకు ‘అదృష్టం మరోసారి వరించింది’ అన్న చర్చ సాగుతోంది. ఇంటివద్ద సంబురాలువరంగల్ చౌరస్తా : కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణి నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. గురువారం సాయంత్రం రామన్నపేటలోని సుధారాణి ఇంటి ఎదుట బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. చదవండి: అప్పుడు రాజయ్య.. ఇప్పుడు సురేఖ -
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లాయి. ఇప్పటివరకు కొండా వర్గానికి బలంగా అండగా నిలిచి నేతలు, అనుచరుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. చర్యలు తమదాకా వస్తాయేమో అనే భయంతో కొందరు ఇప్పటికే కొండా వర్గానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత.. వరంగల్ తూర్పులో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని, ఆమె అనుచర గణం హడావిడి చేస్తుందని అంతా భావించారు. కానీ, ఇప్పటిదాకా అలాంటిదేం జరగకపోవడం గమనార్హం. పైగా నిన్నటిదాకా కొండా కుటుంబం పేరు చెప్పుకుని తిరిగిన నేతలు.. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అయితే కొండా సురేఖ అనుచరులుగా ఉన్న పలువురికి దక్కిన పదవులు.. అలాగే వాళ్లకు అప్పగించిన ఏజెన్సీలు, ఇతర వ్యవహారాలపై అధికారులు ఆరా తీస్తున్నారన్న వార్తలు ఆ వర్గంలో మరింత టెన్షన్ పెంచుతున్నాయి.కొండా సురేఖ బర్తరఫ్తో వరంగల్ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. చర్యల భయంతో ఆమె అనుచర వర్గంలో టెన్షన్ నెలకొనగా.. తమ పదవులు కూడా పోతాయన్న ఆందోళనతో కొందరు సైలెంట్ అవుతున్నారు. ఈ భయంతోనే కొందరు అనుచరులు కొండాకు దూరంగా ఉంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటు ఇంతకాలం కొండాకు వ్యతిరేకంగా నిలిచిన తమను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో తమకు రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతుందని వారు భావిస్తున్నారు. కొందరు నేతలైతే ఏకంగా సంబురాలు జరుపుకున్నట్లు సమాచారం.మరోవైపు.. తన అనుచరులు ఇబ్బందుల్లో పడకూడదన్న ఉద్దేశంతో కొండా సురేఖ వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో కొందరు నేతలు వేచి చూసే ధోరణిలో ఉండగా.. మరికొందరు మాత్రం పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కొండా వర్గాన్ని వీడి.. మరో వర్గంలోకి జంప్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఇంతకాలం కొండా కేంద్రంగా సాగిన వరంగల్ రాజకీయ సమీకరణాలు ఇప్పుడు మరో బాట పట్టేలా కనిపిస్తున్నాయి.ఇటు కొండా కుటుంబానికి ఇంతకాలం వ్యతిరేకంగా ఉన్నవాళ్లు.. తమకూ మంచి రోజులొస్తాయనే ఆశతో ఉన్నారు. కొత్త పదవులు, రాజకీయ అవకాశాలపై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ కూడా మొదలైంది. దీంతో వరంగల్ కాంగ్రెస్లో ఎవరు ఎటు వెళ్తారు? ఎవరికి కొత్త అవకాశాలు దక్కుతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: విపక్షాలకు కొత్త అస్త్రం అందించిన రేవంత్! -
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి మార్పులు, చేర్పులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించనున్నట్లు సమాచారం. దీంతో జరగబోయేది కేబినెట్ విస్తరణా? శాఖల మార్పులా? లేదంటే మొత్తం ప్రక్షాళనా? అనే ఉత్కంఠ మొదలైంది. ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్లో ఇటు మంత్రులు.. అటు ఆశావహులు కనిపిస్తున్నారు.కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయం మరింత వేడెక్కింది. ఈ ఎపిసోడ్పై మూడ్ ఆఫ్ ఎమ్మెల్యేల నివేదికకు సీఎం రేవంత్ ఆదేశించారు. అలాగే ఆమెను తొలగించడంతో కేబినెట్లో ముగ్గురికి అవకాశం లభించనుంది. అయితే సురేఖ స్థానంలో మహిళకే చాన్స్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అయితే కేబినెట్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంతోపాటు.. కొందరు మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది.మంత్రుల్లో మరికొందరిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించే అంశంపైనా అధిష్ఠానం, సీఎం మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్ఠాన నేతలతో భేటీల సందర్భంగా ఆయా అంశాలపై ఆయన, సీనియర్ మంత్రులు చర్చించినట్లు సమాచారం. రెండ్రోజుల పాటు సొంతూరిలో పర్యటించనున్న సీఎం రేవంత్.. సీనియర్ మంత్రులతో మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో ప్రస్తుత మంత్రుల్లో ఎవరికి పదవులు ఉంటాయో.. ఎవరికి శాఖలు మారతాయోనన్న టెన్షన్ నెలకొంది. మరోవైపు మంత్రి పదవుల కోసం పలువురు ఆశావహ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి? సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను ఎలా సర్దుబాటు చేయాలి? అనే అంశాలపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణా.. పూర్తిస్థాయి ప్రక్షాళనా.. లేక రెండూ కలిపి చేస్తారా? అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది.ఇదీ చదవండి: ఇప్పుడు కొండా సురేఖ.. అప్పుడేమో ఆయన! -
వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్
-
బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు
-
రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?
-
ఎంపీటీసీ నుంచి మంత్రి.. బర్తరఫ్ వరకు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తాజా మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖది ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయం. క్షేత్రస్థాయి రాజకీయాల నుంచి మొదలైన ఆమె ప్రస్థానం శాసనసభకు.. అక్కడి నుంచి మంత్రివర్గానికి చేరింది. మధ్యలో పార్టీ మార్పులు.. రాజీనామాలు.. ఉపఎన్నికలో ఓటమి.. మళ్లీ విజయాలు.. రాజకీయ ప్రత్యర్థులతో పోరాటం.. ఇలా ఎన్నో మలుపులు తిరిగింది. కాంగ్రెస్తో మొదలైన ప్రస్థానం వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ మీదుగా తిరిగి కాంగ్రెస్లోకి చేరింది. రెండుసార్లు మంత్రి పదవిని చేపట్టిన ఆమె.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురవడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీటీసీగా రాజకీయాల్లోకి.. కొండా సురేఖ 1995లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ తరఫున వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి ఎంపీటీసీగా ఎన్నికై గీసుకొండ మండల పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1996లో ఏపీ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు అయ్యారు. అనంతరం 1999లో అప్పటి శాయంపేట అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో సురేఖ స్థానం పొందారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వై.ఎస్. మరణం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలిచి కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి పరకాల ఉపఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీ చేసినా టీఆర్ఎస్ అభ్యర్థి మొలుగూరి భిక్షపతి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆమెకు తొలిసారి ఎదురైన రాజకీయ ఓటమి ఇదే. 2014లో బీఆర్ఎస్... 2018లో మళ్లీ కాంగ్రెస్లోకి.. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో సురేఖ వైఎస్సార్సీపీని వీడి నాటి టీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ప్రాంతంలో పార్టీ మారి భారీ మెజారిటీతో గెలవడం ఆమె రాజకీయ బలానికి నిదర్శనంగా నిలిచింది. కానీ ఆ పార్టీలోనూ ఆమె ప్రయాణం ఎక్కువకాలం సాఫీగా సాగలేదు. పార్టీ నాయకత్వంతో విభేదాలు, అంతర్గత రాజకీయాల నేపథ్యంలో 2018లో ఆ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్లో చేరిన సురేఖ.. పరకాల నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో సురేఖకు ఒక దశలో రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బే తగిలింది.మళ్లీ తూర్పులో పట్టు... 2023లో ఘన విజయం 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సురేఖ తిరిగి వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే సమయంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమెకు మరోసారి మంత్రి పదవి పొందేందుకు మార్గం సుగమమైంది. 2023 డిసెంబర్ 7న రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా సురేఖ ప్రమాణ స్వీకారం చేశారు. అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖల బాధ్యతలు చేపట్టారు. కానీ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ పలుమార్లు పార్టీ అంతర్గత అంశాలపై ఆమె బహిరంగంగా స్పందించారు. ఇటీవల సీఎంను ఉద్దేశించి ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఇది సురేఖ బర్తరఫ్కు దారి తీసింది. ఈ పరిణామం ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్లోని అంతర్గత సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సురేఖకు ఉన్న వ్యక్తిగత అనుచరగణం, భర్త కొండా మురళి రాజకీయ పరిచయాలు, బీసీ వర్గాల్లో ఆమెకు ఉన్న మద్దతు.. ఇవన్నీ కలిపి చూస్తే ఆమె బర్తరఫ్ ప్రభావం తక్షణమే ముగిసే అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.అచ్చిరాని దేవాదాయ శాఖ జూపల్లి నుంచి సురేఖ దాకా రిపీట్ అవుతున్న సెంటిమెంట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖకు ఉద్వాసన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఓ ఆసక్తికర సెంటిమెంట్పై చర్చ మొదలైంది. దేవాదాయ శాఖను చేపట్టిన మంత్రులకు ఆ పదవి రాజకీయంగా కలిసి రాదనే అంశం కొండా సురేఖ బర్తరఫ్తో మరోసారి తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు ఉదంతం ఇందుకు ప్రధాన ఉదాహరణగా రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. 2009లో వైఎస్సార్ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి.. కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంలో దేవాదాయ శాఖకు మారారు. తనకు ప్రాధాన్యత లేని శాఖ ఇచ్చారనే అసంతృప్తి అప్పట్లో ఆయనలో వ్యక్తమైంది. అదే సమయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మరో మంత్రి డీకే అరుణతో జూపల్లి మధ్య ప్రొటోకాల్, ఆధిపత్య వివాదాలు చర్చకు వచ్చాయి. చివరకు మంత్రి పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ఏర్పడ్డాక దేవాదాయ శాఖ బాధ్యతలు చేపట్టిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా ఈ చర్చకు మరో ఉదాహరణగా నిలుస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో నిర్మల్ నుంచి గెలిచిన ఆయన.. దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగిన తర్వాత 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. 2023లో ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ పార్టీ అంతర్గత వివాదాల్లో చిక్కుకుని చివరకు కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. -
సురేఖ బర్తరఫ్.. విపక్షాలకు కొత్త అస్త్రం?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ వేయి రోజుల పాలనపై నిప్పులు చెరుగుతున్న ప్రతిపక్ష పార్టీలకు కొండా సురేఖ బర్తరఫ్ అంశం కొత్త అస్త్రాన్ని అందించింది. మరో మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభా వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశముంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి వంటి అంశాలపై రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షం ఇకపై కాంగ్రెస్పై విమర్శల దాడికి మరింత పదును పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు లక్ష్యంగా కొండా సురేఖ కూతురు చేసిన విమర్శలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ లోపలా, బయటా నిలదీసే అవకాశముంది. ఇన్నాళ్లూ కేబినెట్లో ఉన్న కొండా సురేఖ నుంచి వచ్చే ప్రతీ విమర్శ కాంగ్రెస్కు కొత్త తలనొప్పి సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ప్రజల ముందుకు ప్రభుత్వ వైఫల్యాలుసురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత గొడవలను కూడా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఇన్నాళ్లు ప్రభుత్వంలో భాగంగా ఉన్న సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై అసెంబ్లీ వేదికగా విచారణ కోసం బీఆర్ఎస్ పట్టు పట్టే అవకాశముంది. సీఎం సోదరుడికి రూ.200 కోట్ల విలువైన భూ కేటాయింపుపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది. ఇన్నాళ్లూ మాజీ మంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్యంగా విమర్శలు చేస్తూ వచ్చిన రేవంత్పై ఎదురుదాడికి దిగేందుకు సురేఖ, ఆమె కుమార్తె చేసిన విమర్శలను అ్రస్తాలుగా మలుచుకునే అవకాశముంది. మరోవైపు బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ అంశాన్ని ఉపయోగించుకుంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సురేఖ అడుగులు ఎటు?కొండా సురేఖ బర్తరఫ్ అంశాన్ని పార్టీ అంతర్గత వ్యవహారంగా పేర్కొంటూ విపక్షాల నుంచి వచ్చే ఆరోపణలు, విమర్శలను ఇప్పటికే కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. అయితే సీఎం, ఆయన సోదరులు లక్ష్యంగా వస్తున్న ఆరోపణలపై సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మేర తిప్పికొడతారనే అంశంపై కాంగ్రెస్ శిబిరంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మేర స్వేచ్ఛగా ఉన్నారో అందరికీ తెలుసంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. విపక్షాల నుంచి అసెంబ్లీ వేదికగా ఒత్తిడి వస్తే ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే చర్చ కూడా జరుగుతోంది. సీఎంను తప్పుపడుతూ సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఎంత మేర ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంలోనూ కాంగ్రెస్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే సురేఖ వేసే భవిష్యత్తు రాజకీయ అడుగులపైనా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్లో కొనసాగుతూ అధిష్టానంతో రాజీ ధోరణితో వ్యవహరిస్తారా లేక సీఎం లక్ష్యంగా విమర్శలకు పదును పెడతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్కు దూరమైతే గతంలో బీఆర్ఎస్తోనూ అనుబంధం ఉన్న సురేఖ భవిష్యత్తులో రాజకీయంగా ఏ పార్టీ దిశగా అడుగులు వేస్తారనే అంశంపైనా చర్చ జరుగుతోంది. -
మంత్రిగా ఎవరికీ ఛాన్స్ ?
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ బర్తరఫ్తో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. సురేఖ స్థానంతోపాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు బెర్తులు కలిపి మొత్తం మూడు స్థానాలపై ఇప్పుడు ఆశావహుల కన్ను పడింది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా..? లేక సమావేశాల తరువాత ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. అయితే శనివారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్రెడ్డి గురువారం రాత్రి లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సమావేశం మంత్రివర్గ విస్తరణ వాదనకు బలం చేకూరుస్తోంది. కాగా సురేఖను తొలగించిన వెంటనే నామినేటెడ్ పదవుల్లో చేపట్టిన మార్పులు కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు మూడేళ్లు కావస్తున్న తరుణంలో మంత్రుల శాఖలో మార్పులు ఉంటాయని గట్టిగా ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయక్, ప్రేమ్సాగర్రావు, రామచంద్రునాయక్, గడ్డం ప్రసాద్కుమార్, మహిళా కోటాలో విజయశాంతి తదితరుల పేర్లు వివిధ దశల్లో ప్రచారంలోకి వచ్చినప్పటికీ... సాకారం కాలేదు. ఇప్పుడు మూడో బెర్తు చేరడంతో పోటీ మరింత పెరగనుంది. మున్నూరుకాపు, పద్మశాలి లెక్క? సురేఖ పద్మశాలి కాగా, ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు వర్గానికి చెందిన వారు. సురేఖకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రెండు వర్గాలకు న్యాయం చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు సురేఖకు ఉద్వాసన పలకడంతో ఆమె స్థానంలో మున్నూరు కాపు, పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన మహిళా నేతలకు పట్టం కట్టారు. ఆది శ్రీనివాస్ ఆశలపై నీళ్లు? కాంగ్రెస్ తరపున మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (వేములవాడ) ఒక్కరే. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న మున్నూరుకాపు నుంచి ఆయన పేరు చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే కొండా సురేఖ బర్తరఫ్కు ముందే మున్నూరుకాపు వర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదాలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా ఆది శ్రీనివాస్కు చెక్ పెట్టినట్లయింది. అసమ్మతి గళం వినిపించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేరు కూడా మరోసారి మంత్రివర్గ విస్తరణలో చర్చలోకి వస్తోంది. తనకు ఇచ్చిన మంత్రి పదవి హామీని నెరవేర్చలేదని ఆయన బాహాటంగానే పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవి కోసం ఆయన తనవంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఓవైపు సీఎంపై విమర్శల నేపథ్యంలో మంత్రి పదవిని కోల్పోతున్న సురేఖ స్థానంలో రాజగోపాల్రెడ్డికి అవకాశం కల్పిస్తారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా చాలాకాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం కూడా విస్తరణలో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాలకు చెందిన ప్రేంసాగర్ రావు, జెన్జీ ఉద్యమాల నేపథ్యంలో యువ ఎమ్మెల్యేల నుంచి ఒకరికి అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా వస్తోంది. -
సురేఖ చేరికపై బీజేపీ ఆచితూచి..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ, ముఖ్యనేతలు మహిళా సాధికారత గురించి గొప్పగా చెబుతూ... మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ను చేశారంటూ బీజేపీ నేతలు ఘాటుగానే స్పందించారు. అయితే కొండా ఫ్యామిలీ బీజేపీవైపు వస్తుందా? వస్తే ఏం చేయాలి? చేర్చుకోవాలా వద్దా? అన్న దానిపై ఆచితూచి స్పందిస్తున్నారు. ఒకవేళ కొండా మురళి, సురేఖ, సుస్మిత బీజేపీలో చేరితే పార్టీకి ప్రయోజనమెంత? లాంటి అంశాలను విశ్లేషిస్తుతున్నారు. కేబినెట్ నుంచి సురేఖ ఉద్వాసనకు గురైన నేపథ్యంలో... కొండా ఫ్యామిలీ జాయినింగ్పై పార్టీ ముఖ్యనేతల్లో చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రి పదవిని వదులుకున్నాక ఆమె బీజేపీ వైపు వస్తారా? రావాలనుకుంటే పార్టీలో ఎవరితో చర్చలు జరుపుతారు? పార్టీలో చేరతానంటే చేర్చుకుంటే మంచిదా? కాదా? అన్న రకరకాల చర్చలు బీజేపీలో సాగుతున్నాయి. వారి ముందున్న మార్గాలేంటి? రాష్ట్ర రాజకీయాల్లో కొండా ఫ్యామిలీ వ్యవహారశైలి, ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలు తదితరాలు చర్చనీయాంశమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎదుట ఉన్న మార్గాలేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొండా ఫ్యామిలీ జనసేనలో చేరేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ప్రచారాలు సాగుతున్నాయి. కొన్నిరోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొండాసురేఖ, బీజేపీ చీఫ్ రాంచందర్రావు ఎదురుపడినపుడు మర్యాదపూర్వకంగా పలకరించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సురేఖ రాజీనామా చేశాక అప్పుడు ఆలోచిస్తామంటూ ఊహాగానాలకు తెరలేపారు. అయితే బీజేపీ ముఖ్య నేతలు మాత్రం ఇటు బీజేపీ వైపు నుంచి గానీ, అటు కొండా ఫ్యామిలీ వైపు నుంచి గానీ ఎలాంటి సమాలోచనలు మొదలుకాలేదనే సంకేతాలు ఇస్తున్నారు. మంత్రి పదవి పోయినా సురేఖ ఎమ్మెల్యేగా కొనసాగుతానంటూ, పార్టీకి కూడా రాజీనామా చేయబోనని ప్రకటించిన విషయం విదితమే. ఇతర పార్టీల నేతలు చేరాలంటే ఆ పార్టీ సభ్యత్యానికి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశాకే రావాలని బీజేపీ జాతీయ నాయకత్వం కండిషన్ పెట్టిన విషయాన్ని రాష్ట్ర పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. అందువల్ల సురేఖ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుంటే పార్టీలో చేర్చుకునే ప్రసక్తే ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇంకా రెండేళ్లకు పైగా పదవీకాలం ఉండటంతో రాజీనామాకు సురేఖ సుముఖంగా లేకపోగా... పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా కండిషన్ అడ్డుగా నిలుస్తోందని చెబుతున్నారు. బీజేపీలో ఫ్యామిలీ ప్యాకేజీలు ఉండవని... ప్రత్యేక సందర్భాల్లోనే ఒక కుటుంబంలో ఒకరికి మించి టికెట్ ఇవ్వడం జరుగుతుందని అంటున్నారు. అందువల్ల బీజేపీలో కొండా ఫ్యామిలీ చేరడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదీగాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ పోటీకి క్లెయిమ్ చేస్తున్న సీట్లలో బీజేపీకి బలమైన నేతలు ఉన్నారని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు మంచి ఓటింగ్నే సాధించారని అంటున్నారు. అందువల్ల వారి చేరికతో పార్టీకి, నేతలకు కొత్త తలనొప్పి మొదలవుతుందనే గుసగుసలు కూడా బీజేపీలో వినిపిస్తున్నాయి. -
అగ్రనేతల ఆమోదంతోనే...
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఉద్వాసనకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్గాంధీ ఆమోదం తెలిపారు. దీంతో గత మూడు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కొనసాగిన సురేఖ వ్యవహారానికి పార్టీ అధిష్టానం బర్తరఫ్తో ముగింపునిచ్చింది. రాష్ట్ర ముఖ్య నేతలు ఇచ్చిన సమాచార క్రోడీకరణ..తమ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు..ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వేదికగా సురేఖ చేసిన వ్యాఖ్యల తీవ్రత దృష్ట్యా ఆమెపై వేటుకే హైకమాండ్ మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, క్రమశిక్షణా సంఘం అభిప్రాయాలను.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం సోనియా, రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. చర్చల అనంతరం సురేఖను బర్తరఫ్ చేసేందుకు రాష్ట్ర నాయకత్వానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఒక వర్గాన్నే లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలకు తావులేకుండా చిన్నారెడ్డిపైనా వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సమాచారం అందిన వెంటనే..తదుపరి పర్యవసానాలు, పార్టీపై పడే ప్రభావంపై పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి..తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మూడ్రోజులుగా తర్జనభర్జనలు.. సురేఖతో పాటు చిన్నారెడ్డికి సంబంధించి ఢిల్లీలో అనేక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన ముఖ్యమంత్రి తన అభిప్రాయం చెప్పారు. రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న సురేఖపై కఠినంగా వ్యవహరించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, విపక్షాలకు అ్రస్తాలను అందించినట్లే అవుతుందని అన్నారు. మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించాలని విన్నవించారు.దీనిపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిల అభిప్రాయాలను సేకరించారు. మెజార్టీ నేతలు ఆమెను తొలగించేందుకే మొగ్గు చూపారు. సురేఖ కూడా తన వాదన ఖర్గేకు చెప్పుకున్నారు. ఇంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నుంచే ముఖ్యమంత్రిపై మొదటగా చర్యలు తీసుకోవాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ ఆమె తొలగింపుపై పట్టుబట్టడంతో గురువారం సైతం వరుస సమావేశాలు కొనసాగాయి. సోనియా, రాహుల్కు కేసీ సమాచారం బుధవారం నాటి వరుస భేటీల సారాంశం.. రాష్ట్ర నేతల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను ఖర్గేతో మరోమారు చర్చించిన కేసీ వేణుగోపాల్..ఆయన సూచనల మేరకు అన్ని అంశాలను అగ్రనేతలు రాహుల్గాం«దీ, సోనియాగాం«దీలకు వివరించారు. దీంతో వారు సురేఖపై వేటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు చిన్నారెడ్డిని తప్పించాలని నిర్ణయించారు. ఈ సమాచారం సీఎం, పీసీసీ చీఫ్లకు కేసీ వేణుగోపాల్ చేరవేశారు. కాపాడని ‘రాహుల్ మనుస్మృతి’ ఇటీవల పుణెలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో రాహుల్గాంధీ మనుస్మృతి, మహిళలపై చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖపై అధిష్టానం కటువుగా వ్యవహరించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. కానీ అలా జరగలేదు. మహిళలు దేశానికి అత్యంత పెద్ద ఆస్తి అని, వారు తమ కోసం తాము నిలబడాలని, పితృస్వామ్య భావజాలాన్ని ప్రశ్నించాలని రాహుల్ ఈ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. మహిళకు తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం, కలలు, లక్ష్యాలు ఉండాలని, స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో బీసీ మంత్రి అయిన సురేఖపై చర్యలు ఉండక పోవచ్చని, ఆమెపై వేటు వేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని హైకమాండ్ భావించవచ్చనే చర్చ జరిగింది. సురేఖ కూడా మీడియా ముందు రాహుల్ వ్యాఖ్యలు ప్రస్తావించారు. కానీ పార్టీ అధిష్టానం.. సురేఖపై వేటుకే మొగ్గు చూపింది.సీఎం నివాసంలో సుదీర్ఘ చర్చలు సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో తలెత్తే పర్యవసానాలు, రాజకీయ ప్రభావం, దీనిని ఎదుర్కొనే వ్యూహంపై ఢిల్లీలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో చర్చోపచర్చలు జరిపారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. రాజకీయ విమర్శలకు తావివ్వకుండా బీసీ మహిళలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందనే సందేశాన్ని ఇవ్వడంపై సమాలోచనలు జరిపారు. ఈ భేటీలోనే గద్వాల్ విజయలక్ష్మీ, నేరెళ్ల శారద, గుండు సుధారాణిలకు పదవులు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. కాగా సురేఖ తొలగింపు సమాచారం మీడియాకు అందాక ముఖ్యమంత్రి హైదరాబాద్కు బయలుదేరారు. ఆ తర్వాత మహేశ్గౌడ్, భట్టిలు కూడా హైదరాబాద్ వెళ్లారు. -
రేవంత్ బ్లాక్మెయిల్... అందుకే ఉద్వాసన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయడం వల్లనే తనను మంత్రివర్గం నుంచి తప్పించారని కొండా సురేఖ ఆరోపించారు. పార్టీ అధిష్టానానికి తనను తప్పించాలన్న ఆలోచన లేదని.. అయితే తనను తప్పించకపోతే..తాను వెళ్లిపోతానని సీఎం అన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎవరితోనూ సంప్రదించడం లేదని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా కమ్యూనికేషన్ చేయడంలో రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలతో, నేతలతో వైఎస్సార్ ఉన్నట్లు రేవంత్రెడ్డి లేడన్నారు. తాము వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించనంతగా..రేవంత్రెడ్డిని అభిమానించామని చెప్పారు. రేవంత్రెడ్డిని నిందించిన వారంతా ఇప్పుడు మంచిగానే ఉన్నారని, కానీ తనను మాత్రమే రేవంత్రెడ్డి టార్గెట్ చేసుకున్నారని సురేఖ వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ వేం నరేందర్రెడ్డి, సీఎం సోదరులు కొండల్రెడ్డి, తిరుపతిరెడ్డి మరికొందరు కుట్రపన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. అప్పట్లో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పుడు రేవంత్రెడ్డి కూడా అలానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఇప్పటికైనా రేవంత్రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె సూచించారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. పార్టీ హైకమాండ్కు ఇటీవల తాను రాసిన లేఖలను సురేఖ విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రస్తుత పరిణామాలపై పశ్చాత్తాపం లేదు.. ‘తమవైపు ఒక వేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు ఆయన వైపే చూపిస్తాయన్న అంశాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అయితే ఎలాంటి తప్పు చేయకపోయినా మంత్రివర్గం నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యమంత్రిని నేను ఏనాడూ విమర్శించలేదు.. పార్టీని దూషించలేదు. నేను ఎలాంటి తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. పదవుల కోసం నేనెప్పుడూ వెంపర్లాడలేదు. కొణిజేటి రోశయ్య, జైపాల్రెడ్డిలు ఇందిరాగాం«దీని నిందించిన వారే. జగ్గారెడ్డి, రాజగోపాల్రెడ్డి వంటి వ్యక్తులు మాట్లాడితే ఎలాంటి చర్యలు లేవు. నా కూతురు చేసిన వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకుని నన్ను శిక్షించడం సరికాదు. ఉరి శిక్షపడిన ఖైదీని కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారు. కానీ అధిష్టానం నా అభిప్రాయాలను తెలుసుకోకుండా సీఎం బ్లాక్మెయిల్కు లొంగి బర్తరఫ్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి పాలనతో సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా లేరని నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ రోజు నాకు జరిగింది, రేపు మీకూ జరుగుతుంది. ఇప్పటికైనా బయటికి వచ్చి మాట్లాడండి. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో చెప్పండి. మనం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ప్రభుత్వంలో ఏ పనులు జరగడం లేదు. దీంతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతపై సర్వే చేయించాలని సూచిస్తున్నా. ప్రభుత్వంలో తప్పులు సరిదిద్దుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఆలోగా మనపై ఉన్న వ్యతిరేకతను అధిగమించాలంటే.. ప్రజల సమస్యలు పరిష్కరించాలి. హామీలను అమలు చేసి చూపించాలి. కాంగ్రెస్లోనే ఉంటా... కాంగ్రెస్లోనే ఉంటా. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా. మంత్రి పదవి మాకు ఆభరణం మాత్రమే. అది లేనంత మాత్రాన మాకు నష్టం లేదు. రెండు మూడు రోజుల తర్వాత కుటుంబ సభ్యులం మాట్లాడుకుంటాం. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతా. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. బర్తరఫ్ చేశారన్న సమాచారం ఇప్పుడే తెలిసింది. నా కూతురు ఇంగ్లండ్లో ఉంది. ఆమెతో, నా భర్తతోనూ ఇంకా చర్చించలేదు. నా కూతురు గౌరవం కోసమే ఆమె వ్యాఖ్యలపై నేను స్పందించలేదు. సుమంత్పై కేసులు విత్డ్రా చేసుకోవాలి నా ఓఎస్డీ సుమంత్ ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయనను వెంటాడుతున్నారు. సుమంత్ ఎవరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారో ఆ వ్యక్తికి వెంటనే బెయిల్ ఇచ్చి.. 15 రోజుల తరువాత అదే వ్యక్తితో ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. సుమంత్పై పెట్టిన కేసులను విత్డ్రా చేసుకోవాలని హోం శాఖను కోరుతున్నా. పరకాలలో సీఎం అక్కడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి టికెట్ ఎలా ప్రకటిస్తారు? 70 ఏళ్ల వృద్ధుడు.. వచ్చే ఎన్నికల నాటికి నడుస్తారో..మంచంపై ఉంటారో తెలియదు. నన్ను తొలగించిన నేపథ్యంలో బ్యాలెన్స్ చేయడానికి ముగ్గురు మహిళలకు పదవులు రావడం అభినందనీయం. వారికి నా శుభాకాంక్షలు. చిన్నారెడ్డిని నా కోసం శిక్షించడం సరికాదు..’అని సురేఖ అన్నారు.పీసీసీ పదవి కోసం రూ.50 కోట్లు ఇచ్చారన్న వారిని సన్మానించారు.. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికోసం రూ.50 కోట్లు ఇచ్చారని ఆరోపించిన వారికి సీఎం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి సన్మానించారు. డీఎస్ కుటుంబంలో ఇద్దరు రెండు వేర్వేరు పార్టీల్లో లేరా? పదేళ్లుగా నా కూతురికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించలేకపోయాం. అదే మొన్న పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి తన కూతురుకు ఎంపీ పదవి తెప్పించుకున్నారు. నా భర్తకు కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇప్పించుకోలేదని నా కూతురు అన్నది. నా కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. వాటిని ఖండించాల్సిన లేదా సమర్థించాల్సిన అవసరం నాకు లేదు. మేము నిబద్ధతతో రాజకీయాలు సాగిస్తున్నాం. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లలేదు. రాజీనామాలు చేసే ఇతర పార్టీలోకి వెళ్లాం. -
సీఎం సలహా మేరకు.. కొండా సురేఖ బర్తరఫ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రిమండలి నుంచి బర్తరఫ్కు గురయ్యారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి సైతం ఉద్వాసనకు గురయ్యారు. తక్షణమే వీరిద్దరిని ఆయా పదవుల నుంచి తొలగించాలని సీఎం ఎ.రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. కొండా సురేఖకు ఉద్వాసన పలకాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్కు సీఎం రేవంత్ సిఫారసు చేశారని తెలిపింది. అయితే దీనిపై లోక్భవన్ గురువారం రాత్రి 8 గంటల వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగింది. కానీ సీఎం..మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్తో కలిసి రాత్రి 8 గంటల ప్రాంతంలో లోక్భవన్కు వెళ్లి గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ వెంటనే లోక్భవన్ నుంచి బులెటిన్ జారీ అయింది. సీఎం రేవంత్ సలహా మేరకు కొండా సురేఖను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టు బులెటిన్ వెల్లడించింది. కాగా చిన్నారెడ్డి తొలగింపు నేపథ్యంలో ఆ పదవిని భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వం మరోరెండు కీలక నియామకాలు కూడా చేపట్టింది. రెండు వారాలుగా రాజకీయ దుమారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరు ప్రకాశ్రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 16న పరకాలలో జరిగిన బహిరంగ సభలో పిలుపునిచ్చారు. దీనిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆగస్టు 19న కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ముఖ్యమంత్రిని ఉద్దేశించి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. రేవంత్రెడ్డికి సీఎం కాగానే కళ్లు నెత్తికెక్కాయని, వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే పరకాలలో ఆయన తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని వనపర్తి టికెట్ను ఇచ్చారని జి.చిన్నారెడ్డి సైతం వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పార్టీ క్రమశిక్షణ కమిటీ వీరిద్దరికి ఉద్వాసన పలకాలని సిఫారసు చేస్తూ అధిష్టానానికి నివేదిక సమర్పించింది. ఈ పర్యావసానాల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లడం, ఏఐసీసీ చీఫ్ ఖర్గే సహా కొందరు పెద్దల్ని కలవడంతో సురేఖతో పాటు జి.చిన్నారెడ్డిపై వేటు పడడం ఖాయమనే ఊహాగానాలు చెలరేగాయి. మరోవైపు సురేఖ కూడా మంగళవారం నాడే ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఖర్గే తదితరులతో సమావేశమై అదే రోజు రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. కాగా రేవంత్రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం హైదరాబాద్కు తిరిగి బయలుదేరడానికి ముందు..సురేఖ, చిన్నారెడ్డి విషయంలో సీఎంఓ కార్యాలయంనుంచి ప్రకటన వెలువడింది. అంతకుముందే వీరిద్దరి ఉద్వాసనకు పార్టీ హైకమాండ్ ఆమోదం తెలిపింది. గజిట్ జారీ చేసిన ప్రభుత్వం సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రధాన సలహాదారు కె.రామకృష్ణారావు గురువారం సాయంత్రం లోక్భవన్కు వెళ్లి సీల్డ్ కవర్లో మంత్రిమండలి నుంచి కొండా సురేఖ తొలగింపు ప్రతిపాదనను అందజేశారు. అనంతరం ఢిల్లీ నుంచి సాయంత్రం 5 గంటలకు తిరిగి వచ్చిన సీఎం.. వెంటనే చంచల్గూడ – సంతోష్నగర్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించి, ఆ తర్వాత లోక్భవన్కు చేరుకుని గవర్నర్ శుక్లాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సురేఖ తొలగింపుపై లోక్భవన్ బులెటిన్ జారీ చేసింది. సీఎం వెంట ఎంపీలు వేం నరేందర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రఘువీర్రెడ్డి ఉన్నారు. కాగా సురేఖను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గజిట్ వెలువరించింది. సచివాలయంలోని 4వ అంతస్తులో ఉన్న కొండా సురేఖ కార్యాలయాన్ని సీజ్ చేశారు. అంతకు ముందే కీలకమైన ఫైళ్లన్నీ సీఎస్ కార్యాలయంలో అప్పగించాలని ఆమె పీఎస్ను ఆదేశించారు. సురేఖను మంత్రిమండలి నుంచి తొలగించడంతో ఆమె వద్ద ఉన్న పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖలూ సీఎం పర్యవేక్షణ కిందికి వెళ్లాయి. వ్యూహాత్మకంగా మూడు నియామకాలు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి జి.చిన్నారెడ్డిని తొలగించిన ముఖ్యమంత్రి తక్షణమే ఆయన స్థానంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుమార్తె, జీహెచ్ఎంసీ మాజీ మేయర్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మీ (మున్నూరుకాపు)ని నియమించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ (కుడా) చైర్మన్గా మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి (పద్మశాలి)ని రెండేళ్ల కాలపరిమితితో నియమిస్తూ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద (గౌడ) నియమాకానికి సంబంధించిన ఉత్తర్వులు సీఎం ఢిల్లీ నుంచి తిరిగి రాకముందే జారీ అయ్యాయి. కొండా సురేఖ ఇటీవల బీసీ అస్త్రాన్ని ఉపయోగించి సీఎం రేవంత్పై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మహిళలు, బీసీ వర్గాలకు న్యాయం చేశారనే సందేశాన్ని ఇవ్వడానికే వ్యూహాత్మకంగా ముగ్గురు బీసీ మహిళలకు పదవులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఉద్వాసనకు గురైన మూడోమంత్రి సురేఖ తెలంగాణ రాష్ట్రంలో ఉద్వాసనకు గురైన మూడో మంత్రిగా కొండా సురేఖ చరిత్రకెక్కారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ తాటికొండ రాజయ్యను అనూహ్యంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కేసీఆర్ 2015 జనవరి 25న నిర్ణయం తీసుకున్నారు. వైద్యారోగ్య శాఖలో అవినీతి, స్వైన్ ఫ్లూ నివారణలో వైఫల్యాల నేపథ్యంలో ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈటల రాజేందర్ను వైద్యారోగ్య శాఖ మంత్రిగా నియమించారు. అయితే అసైన్డ్ భూముల ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2021 మే నెలలో ఈటలకు ఉద్వాసన పలికారు. రేవంత్ మంత్రివర్గంలో 1,002 రోజుల పాటు మంత్రిగా కొనసాగిన సురేఖపై తాజాగా వేటు పడింది. -
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ భర్త మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాకు ఇదేం కొత్త కాదన్న మురళి.. ఇవాళ మేము.. రేపు ఎవరో? అంటూ వ్యాఖ్యానించారు. పదవులు ఉన్నా లేకున్నా మా గౌరవం మాకు ఉంటుంది. మేం ప్రతిదానికి స్పందించకపోవచ్చు.. కానీ అన్నీ గమనిస్తూనే ఉంటాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరూ తట్టుకోలేరు’’ అంటూ కొండా మురళి ట్వీట్ చేశారు. అంతకుముందు హైదరాబాద్లోని తన నివాసంలో మీడియా ముందు కొచ్చిన కొండా మురళి.. మీసం మెలేశారు.హైదరాబాద్ లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు లోక్భవన్కు పలువురు క్యాబినెట్ మంత్రులు వెళ్లారు. కొండా సురేఖ బర్తరఫ్, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై గవర్నర్కు సీఎం వివరించారు. గవర్నర్తో సుమారు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం తెలిపారు.ఇదేం కొత్త కాదు, ఉన్నది ఉన్నట్టు, కుండా బద్దలు కొట్టినట్టు మాట్లాడుతే ఎవ్వరు తట్టుకోరు! ఇవ్వాళ మేము, రేపు ఎవ్వరో.పదవులు ఉన్నా లేకున్న మా గౌరవం మాకు ఉంటుంది.మేము ప్రతిదానికీ స్పందిచకపోవచ్చు కానీ ప్రతీ ఒక్కటి గమనిస్తూనే ఉంటాం. pic.twitter.com/xj9EUYl6rQ— Konda Murali (@TeamKonda) September 3, 2026 -
రేవంత్రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
తెలంగాణ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ అయిన మంత్రి కొండా సురేఖ అంశానికి సంబంధించి ఆమె కుమార్తె కొండా సుస్మిత స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఇటీవల తాను చేసిన విమర్శలు తన వ్యక్తిగత హోదాలో చేసినవేనని, ఏ రాజకీయ పార్టీనీ ఉద్దేశించి చేసినవి కావని స్పష్టం చేశారు.సీఎన్ఎన్-న్యూస్18తో గురువారం సుస్మిత మాట్లాడారు. “నా ప్రకటన వ్యక్తిగతమైనది. ఏ పార్టీకి వ్యతిరేకంగా కాదు. నేను నా వ్యక్తిగత హోదాలో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడాను” అని తెలిపారు. తన తల్లికి ఎదురైన పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నా తల్లికి అన్యాయం జరిగింది. నా తల్లిని ఇలా చూసినందుకు నేను తీవ్రంగా బాధపడ్డాను” అని అన్నారు.రేవంత్ రెడ్డికి సుస్మిత సవాల్ తన తల్లి కోసం తాను ఎప్పటికీ మద్దతుగా నిలబడతానని సుస్మిత స్పష్టం చేశారు. “నా తల్లి మౌనంవహించేలా ఎవరూ చేయలేరు. నేను రేవంత్రెడ్డిని శపిస్తున్నాను” అని అన్నారు. రేవంత్ రెడ్డికి సుస్మిత సూటిగా సవాల్ కూడా విసిరారు. “నా తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం నుంచి రేవంత్రెడ్డి పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నాను” అని అన్నారు. పరకాల అసెంబ్లీ స్థానం, తన తల్లికి సంబంధించిన రాజకీయ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్లో వివాదం ముదురుతున్న సమయంలో సుస్మిత ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొండా సురేఖను తక్షణమే తన మంత్రివర్గం నుంచి తొలగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి నియామకాన్ని కూడా రద్దు చేశారు. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే నిర్ణయాన్ని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కార్యాలయానికి ఇప్పటికే తెలియజేశారు.పార్టీకి చెందిన సీనియర్ నేతలపై సుస్మిత, చిన్నారెడ్డి ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. వారి వ్యాఖ్యలను పలువురు పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇద్దరు నేతల వ్యాఖ్యలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. అయితే సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని అన్నారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చూడకూడదని చెప్పారు. అయినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు మంత్రిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. -
తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి
-
గతంలోనూ మంత్రులు బర్తరఫ్.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడంటే?
కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో మంత్రివర్గం నుంచి మంత్రులను బర్తరఫ్ చేసిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాలు, రాజకీయ పరిణామాలు, పార్టీ క్రమశిక్షణ వంటి కారణాలతో పలువురు మంత్రులు పదవులు కోల్పోయారు. ఎవరు ఎప్పుడు మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? మంత్రి పదవులను పోగొట్టుకున్న నేతలు ఎవరో తెలుసుకుందాం..ఎం. రామచంద్రరావు - 1984ఎం. రామచంద్రరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉండేవారు. లంచం తీసుకుంటున్నారన్న ఆరోపణలపై ఆయనను తొలగించారు.డాక్టర్ తాటికొండ రాజయ్య - 2015 కేసీఆర్ తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా రాజయ్య ఉన్నారు. 2015 జనవరి 25న కేసీఆర్ ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. రాజయ్య శాఖలో అవినీతి ఆరోపణలు, స్వైన్ఫ్లూ నియంత్రణలో వైఫల్యంపై వచ్చిన విమర్శలు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈటల రాజేందర్ -2021కేసీఆర్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. భూముల ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో ఆయనను శాఖ నుంచి తొలగించిన తర్వాత 2021 మేలో కేబినెట్ నుంచి కూడా బర్తరఫ్ చేశారు. గుమ్మనూరు జయరాం- 2024వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు జయరాం ఉన్నారు. 2024 మార్చిలో వైఎస్ జగన్ సిఫారసుతో గవర్నర్ ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. పార్టీ ఫిరాయించిన గుమ్మనూరి జయరాంను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారు.కొండా సురేఖ- 2026రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అటవీ, దేవాదాయ శాఖలు నిర్వహించారు. గురువారం ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించారు. కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇదీ చదవండి: కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎప్పుడేం జరిగింది? -
మీసం మెలేసిన కొండా మురళి
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ ఎపిసోడ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మారింది. రేవంత్ ఫిర్యాదుతో కొండా సురేఖపై వేటు వేసిన కాంగ్రెస్ అధిష్టానం..మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. కొండా భవిష్యత్ కార్యాచరణపై ఉఠ్కంత కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్లోని తన నివాసం ముందు కొచ్చిన కొండా సురేఖ భర్త కొండా మురళి.. మీసం మెలేయడం ఆసక్తికరంగా మారింది.మరోవైపు, తన నివాసంలో మీడియ సమావేశంలో మాట్లాడిన కొండా సురేఖ.. తన బిడ్డ వ్యాఖ్యలకు తనను టార్గెట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. నాకు పదవులపై వ్యామోహం లేదు. నా వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావడం సంతోషం. సీఎం రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయం చేశారు. అధిష్టానానికి నన్ను తొలగించే ఆలోచన లేదు. రేవంత్ బ్లాక్మెయిల్ చేయడంతోనే నన్ను తొలగించారు. నన్ను బర్తరఫ్ చేయకపోతే తాను వెళ్లిపోతానని బెదిరించారు. రేవంత్ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. కావాలని నన్ను ఇబ్బందిపెడుతున్నారు’’ అని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నన్ను మంత్రి పదవి నుంచి తొలగించడం కాంగ్రెస్కే నష్టం : కొండా సురేఖ
సాక్షి,హైదరాబాద్: తన మీద కుట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయని కొండా సురేఖ ఆరోపించారు. ఉరితీసే ఖైదీని కూడా మీ ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు?. కానీ కనీసం అలా నన్ను అడగకుండా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వర్గం నుంచి తనని బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘సంతకం లేని ఒక ఫేక్ లెటర్ సర్క్యూలేట్ అవుతుంది. నన్ను బర్తరఫ్ చేస్తున్నట్లు , చిన్నారెడ్డిని తొలగించినట్లు అడ్రస్ లేని లెటర్ బయటకొచ్చింది. నా వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావడం సంతోషం. నన్ను తొలగిస్తున్నామని ఒక మాట అడగాల్సి ఉండేది. అడిగి ఉంటే..ఎందుకు అనే ప్రశ్న వేసే అవకాశం నాకు దక్కేది.నా అభిప్రాయం తీసుకోకుండా తొలగించారు. నన్ను తొలగించడం ఏఐసీసీకి ఇష్టం లేదు. సీఎం రేవంత్రెడ్డి పట్టుబట్టి తొలగించారు. మీరు తొలగిస్తారా.. నన్ను వెళ్లమంటారా అని సీఎం బెదిరించారు. మా మాజీ ఓఎస్డీ సుమంత్ కుటుంబాన్ని బెదిరించారు. మా ప్రభుత్వంలో మా మనిషిని ఇబ్బంది పెట్టడం అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు కాదా. ఇకనైనా ప్రభుత్వం సుమంత్ను ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నా. మల్లు రవి గతంలో కాంగ్రెస్ను తిట్టలేదా.. రోశయ్య ఇంధిరా గాంధీని తిట్టలేదా. జైపాల్ రెడ్డి, ఇంధిరా గాంధీని దూషించలేదా. అలాంటి వారిపై చర్యలు తీసుకోలేదు.. కానీ నా కూతురు చేసిన వాఖ్యలకు నన్ను భాధ్యురాలిని చేస్తారా.. నా మంత్రి పదవి పోయినందుకు నాకు ఎటువంటి బాధలేదు.మా కాళ్ళు మొక్కి మమ్మల్ని గెలిపించాలని అడిగిన వారు.. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తారా? మాకు ప్రజాబలం ఉంది.. మమ్మల్ని ఏం చేయలేరు. మంత్రి పదవి మాకు ఆభరణం మాత్రమే.. అది లేనంత మాత్రానా మాకు నష్టం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. ఈ రోజు నాకు వచ్చింది.. రేపు మీకు వస్తుంది. బయటకు వచ్చి మాట్లాడండి. ఈ ప్రభుత్వంలో పనులు అవ్వడం లేదు. పిటీషన్లు తీసుకోవడం తప్ప.. మేము చేసిందేమీ లేదు. సర్వేలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నన్ను తొలగించిన నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలని నేను అడగను. యాదాద్రి టెంపుల్ కమిటీ విషయం నిర్ణయం అందరితో చర్చించలేదు. నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా. నా కూతురు గౌరవం కోసమే.. ఆమె వాఖ్యలపై నేను స్పందించలేదు. నేను తప్పు చేయలేదు..నాకు అవమానం ఎందుకు. ప్రజలతో,నేతలతో వెఎస్సార్ మమేకమైనట్లు సీఎం రేవంత్రెడ్డి లేరు’ అని వ్యాఖ్యానించారు. 👉ఇదీ చదవండి: మీసం మెలేసిన కొండా మురళి -
తెలంగాణ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో చిన్నారెడ్డిపైనా కూడా కాంగ్రెస్ హై కమాండ్ వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్గా చిన్నారెడ్డిని తొలగించింది. దీంతో సీఎం రేవంత్రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలకు సీఎం రేవంత్ బలమైన సంకేతం పంపినట్లయింది.రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దీనిపై వ్యక్తమైన భిన్నాభిప్రాయాలు, ప్రభుత్వంపై కొందరు ఎమ్మెల్యేలు, నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు, జిల్లాల్లో బయటపడుతున్న విభేదాల నేపథ్యంలో రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం వారితో చర్చించిన సంగతి తెలిసిందే.తన పైన కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలను రేవంత్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను ఖండించకపోవటం, అనంతరం ఆమె స్వయంగా చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంతో ఉన్న రేవంత్.. సురేఖ చేసిన ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖర్గేకు వివరించారు. కొండా సురేఖ వ్యవహారాన్ని ఉపేక్షిస్తే పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్లడంతో పాటు రాష్ట్ర నాయకత్వంపై లేనిపోని అపోహలకు తావిచ్చినట్లు అవుతుందని సీఎం చెప్పినట్లుగా తెలిసింది. ఇంత జరిగాక కూడా ఆమెపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం తగదని అన్నట్లు సమాచారం. రేవంత్ పట్టుతో కొండా సురేఖ, చిన్నారెడ్డిపైనా కూడా కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది.మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్కు సీఎం రేవంత్రెడ్డి సిఫార్సు చేశారు. ఇదిలా ఉండగా.. కొండా ఫ్యామిలీ ఏం పార్టీలో చేరబోతుంది?. తెలంగాణ రాజకీయాల్లో తరువాత ఏం జరగనుంది?. కొండా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?. కొండా సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?. ఆమె కాంగ్రెస్లో కొనసాగే అవకాశముందా?’’ అనే చర్చ నడుస్తోంది. -
వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
-
కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?
-
కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎప్పుడేం జరిగింది?
మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయ్యారు. కొండా సురేఖ గురించి చెప్పాలంటే ఆమె చుట్టూ ఎప్పుడూ వివాదాలే. జెన్ జీ భాషలో చెప్పాలంటే వివాదాలు ఎల్లప్పుడూ ఆమె చుట్టూ వైఫైలా ఉంటాయి. ఇటీవల ఆమెను చుట్టుకున్న వివాదం ఆమె పదవి పోవడానికి కారణమైంది. కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎప్పుడేం జరిగింది? ఆమె మంత్రి పదవి పోవడానికి ఎలా కారణమైంది?ఆగస్టు 16న రేవూరిని మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ‘‘పరకాలకు కాబోయే ఎమ్మెల్యే కొండా సుస్మిత’’ అంటూ ఆగస్టు 18న కొండా సురేఖ కూతురు సుస్మిత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ స్టోరీ పోస్ట్ చేశారు. ‘‘కొండా టీమ్’’ అనే ఖాతాలో చేసిన పోస్ట్నే ఆమె తన స్టోరీగా పెట్టుకున్నారు. దీంతో వివాదం మొదలైంది. ఆగస్టు 19న కొండా సుస్మిత తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు?’’ అంటూ కాంగ్రెస్లో ప్రకంపనలు రేపేలా కామెంట్లు చేశారు. దీంతో కొండా సురేఖ స్పందించకతప్పలేదు. తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని అన్నారు.ఆ తర్వాత ఏం జరిగింది?ఆగస్టు 21: కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రెస్మీట్. రాజీనామాకు డిమాండ్.ఆగస్టు 23: బెంగళూరులో ఖర్గేను కలిసిన కొండా సురేఖఆగస్టు 24: విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిఆగస్టు 24: కొండా సురేఖ వివరణపై సంతృప్తి చెందని క్రమశిక్షణ కమిటీఆగస్టు 25: కాంగ్రెస్ హైకమాండ్కు చేరిన క్రమశిక్షణ కమిటీ నివేదికఆగస్టు 26: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా దంపతుల భేటీఆగస్టు 27: వ్యవహారం ఏఐసీసీ పరిధికి వెళ్లిందన్న పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ఆగస్టు 28: సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రాఖీ కట్టిన కొండా సురేఖసెప్టెంబరు 2: కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీసెప్టెంబరు 3: మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్ -
కొండా సురేఖపై వేటు..
-
సీఎం రేవంత్పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయం చేశారు. కాంగ్రెస్ అధిష్టానానికి నన్ను తొలగించే ఆలోచన లేదు. నన్ను బర్తరఫ్ చేయకపోతే తాను వెళ్లిపోతానని రేవంత్ బెదిరించడంతోనే నన్ను తొలగించారు’అని ఆమె ఆరోపించారు.ఈ సందర్భంగా కేబినెట్ నుంచి తన బర్తరఫ్ చెల్లదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కనీసం తన నుంచి ఎలాంటి వివరణ కోరకుండా, అడిగి తెలుసుకోకుండా మంత్రి పదవి నుంచి ఎలా తొలగిస్తారని కాంగ్రెస్ అధిష్టానాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న బర్తరఫ్ సర్క్యులర్లో సీఎం రేవంత్రెడ్డి గానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గానీ సంతకాలు చేయలేదని, ఆమోదముద్ర లేని ఆ పత్రానికి ఎలాంటి చెల్లుబాటు ఉండదని తేల్చిచెప్పారు.తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని ఆమె నిలదీశారు. ఇతర నాయకుల కుటుంబాలను ఉదహరిస్తూ.. ‘పదేళ్లుగా నా కూతురు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తోంది. సుస్మిత టికెట్ అడిగితే తప్పేంటి? కడియం శ్రీహరి తన కూతురిని ఎంపీని చేయలేదా? ఎంపీ అరవింద్ బీజేపీలో ఉంటే, ఆయన సోదరుడు సంజయ్ కాంగ్రెస్లో కొనసాగడం లేదా?’అని ప్రశ్నించారు.కుటుంబ సభ్యుల వ్యాఖ్యలను తనకు ముడిపెడుతూ కేబినెట్ నుంచి తొలగించాలనే నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో వరుస పరిణామాల నేపథ్యంలో తన భవిష్యత్తుపై భర్త కొండా మురళితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.👉ఇదీ చదవండి: మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ ఔట్! -
రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్
-
KA పాల్ బంపర్ ఆఫర్
-
ఇది కరెక్ట్ టైం కాదు.. రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, యాదాద్రి భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న తాజా పరిణామాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ రాజీనామా చేస్తారా? అధిష్టానం ఆమెను భర్తరఫ్ చేస్తుందా? అనే ఎపిసోడ్పై స్పందించారాయన. ఇందులో తమ నిర్ణయమంటూ ఏదీ ఉండదని.. ఈ అంశాన్ని పూర్తిగా కాంగ్రెస్ జాతీయ కార్యవర్గమే చూసుకుంటుందని చెప్పారాయన.సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో గురువారం బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని మీడియాతో దాటవేత ధోరణిలో మాట్లాడారు. అయితే చివరకు కొండా సురేఖకు సంబంధించిన వివాదంపై స్పందించిన రాజగోపాల్రెడ్డి.. ఈ అంశాన్ని కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం చూసుకుంటుందని తెలిపారు. దీనిపై తాము వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని, పార్టీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పారు.‘‘కొండా సురేఖ పార్టీ పెద్దలను కలిసి తన వాదన వినిపించారు. ఈ ఇష్యూపై అధిష్టానం వద్ద పూర్తి సమాచారం ఉంది. అధిష్టానం నిర్ణయమే ఫైనల్.. అందరం కట్టుబడి ఉండాలి. ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది అధిష్టాన నిర్ణయం. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరగాలన్నది అధిష్టానమే నిర్ణయిస్తుంది. రాహుల్ గాంధీపై నమ్మకం ఉంది.. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్పై పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలి. నేను కాంగ్రెస్ కార్యకర్తల గురించే ఆలోచిస్తా’’ఆ నిర్ణయమే ఫైనల్కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీ తరఫున తామంతా దానికి కట్టుబడి ఉంటామని రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయ అంశాలపై అనవసరమైన చర్చలకు తావివ్వకుండా పార్టీ అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూడాలని ఆయన వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా గత కొంతకాలంగా సీఎం రేవంత్రెడ్డి తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తానే పదేళ్లు సీఎంగా కొనసాగుతానంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్రెడ్డి గతంలో ఖండించారు. ముఖ్యమంత్రి పదవి అనేది వ్యక్తిగత నిర్ణయం కాదని, పార్టీ అధిష్ఠానం, రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. నిన్న సైతం ‘‘మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెల్లగొడతారా?’’ అంటూ సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు.ఇదిలా ఉండగా నిన్న ఢిల్లీలోనూ.. కొండా సురేఖ రేవంత్.. రేవంత్ కుటుంబం, అలాగే కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలతో అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె.. తన కూతురు వ్యాఖ్యలు పూర్తి వ్యక్తిగతమని, అయితే అధిష్టానం చెప్పకుండా తానే పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ ఎలా మాట్లాడతారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదు’ అంటూ రాజగోపాల్రెడ్డి కాస్త స్వరం తగ్గించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: రాజీనామా చేయమని ఖర్గేనే చెప్పారా? -
కొండా సురేఖ ఎపిసోడ్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ ఓఎస్డీ అరెస్టు ఘటన నుంచే అసలు కథ మొదలైందని ఆయన ఆరోపించారు. అప్పటి నుంచే మంత్రి పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయని వ్యాఖ్యానించారు. తాజాగా డబ్బుల వాటాకు సంబంధించి కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతోనే ఈ వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లిందని ఆయన విమర్శలు గుప్పించారు.మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్పై రాజాసింగ్ తాజాగా స్పందిస్తూ..‘కొండా సురేఖను సస్పెండ్ చేయాలని పెద్ద నేతలు ఢిల్లీలో కూర్చున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి జరుగుతోంది. మంత్రులు, పెద్ద నేతలు, చిన్న నేతలు, అధికారులనే తేడా లేకుండా అవినీతి నడుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అవినీతి ఆగడం లేదు. గతంలో కేసీఆర్ అప్పులు చేసి పాలించి ఫాంహౌస్లో కూర్చున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కేవలం పేపర్లో మాత్రమే నిధులు ఇస్తున్నట్టు చెప్తారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం జీరో.దీంతో మంత్రులకు, నేతలకు అర్థమైంది.కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడూ పడిపోతుందో చెప్పలేమనే అనుమానం వారికి వచ్చేసింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో.. పోతుందో.. అని డిసైడ్ అయ్యారు. ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం షురూ చేశారు. ఏదీ ఎక్కడ దొరికితే అక్కడ దోచేస్తున్నారు. ఇదంతా డబ్బుల వ్యవహారం అయింది. ఇదంతా ఢిల్లీకి చేరింది. ఆ డబ్బుల గొడవే కొండా సురేఖ రాజీనామా వరకు వచ్చింది. ఇప్పుడు కొండా సురేఖ ప్రెస్ మీట్లో ఏం చెబుతారో చూడాలి. బర్తరఫ్ చేస్తామని అధిష్టానం చెప్పిందట.. దీనిపై ఆమె ఏం అంటారో తెలుస్తుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్లో కొండా సురేఖ.. అడుగడుగునా వివాదాలే! -
కాసేపట్లో సురేఖ మీడియా సమావేశం.. ఖర్గే అల్టిమేటం?
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేయకపోతే మంత్రి పదవి నుంచి తప్పించే దిశగా సీఎం రేవంత్రెడ్డి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉదయం బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైనే చర్చ జరిగినట్లు సమాచారం. ఏఐసీసీ కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో.. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై నిర్ణయం దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు సీఎం రేవంత్రెడ్డి బయలుదేరనున్నారు. సీఎం హైదరాబాద్కు చేరుకున్న తర్వాత కొండా సురేఖ వ్యవహారంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మరి కాసేపట్లో కొండా సురేఖ మీడియా ముందుకు రానుండటం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. తన వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇస్తారా? లేక రాజీనామాపై ప్రకటన చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె ఏం మాట్లాడతారు? అనే ఉత్కంఠ రేపుతోంది.ఇదీ చదవండి: కాంగ్రెస్లో కొండా సురేఖ.. అడుగడుగునా వివాదాలే!ఈరోజు సాయంత్రంలోగా రాజీనామా ప్రకటన చేయకపోతే.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని గవర్నర్కు సీఎం లేఖ రాసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కొండా సురేఖ మంత్రి పదవిలో కొనసాగుతారా? లేదా కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో తప్పుకుంటారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కీలకంగా మారిన ఈ పరిణామాలపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కాంగ్రెస్లో కాంట్రవర్సీల కొండ(డా)
కాంగ్రెస్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి కొండా సురేఖ చుట్టూ వివాదాలు ఆగలేదు.. ప్రత్యర్థులతో ఢీ కొట్టిన సందర్భాల కంటే సొంత పార్టీలోనే ఢీకొన్న సందర్భాలే ఎక్కువ!. పదవులు, ఆధిపత్యం, వర్గపోరు, నేతలతో విభేదాలు.. ఇలా ఒక్కో ఎపిసోడ్ ఒక్కో రాజకీయ ప్రకంపనగా మారింది. ఒక దశలో సినీ హీరోయిన్లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తే.. మరో దశలో సొంత పార్టీ నేతలే ఆమె వ్యవహార శైలిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్రెడ్డితో విభేదాలు బహిరంగం కావడం.. వ్యవహారం కాంగ్రెస్ అధిష్ఠానం గడప దాటడం.. కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపుగా మారింది. అసలు 2018లో కాంగ్రెస్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కొండా సురేఖ చుట్టూ చోటుచేసుకున్న వివాదాలేంటి? ఎక్కడెక్కడ ఎవరితో ఢీ కొట్టారు? ఈ రాజకీయ రచ్చలో అసలు ట్విస్టులేంటి?..కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం 2018లో కాంగ్రెస్లో మొదలైంది కాదు. ఆమె అసలు కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానం 1996లోనే ప్రారంభమైంది. 2018లో ఆమె కాంగ్రెస్లోకి తిరిగి వచ్చారు.కొండా సురేఖ తొలి కాంగ్రెస్ ప్రస్థానం..1995: గీసుకొండ మండల పరిషత్ రాజకీయాలతో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.1996: కాంగ్రెస్లో చేరి ఏపీ పీసీసీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు.1999: శాయంపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కోశాధికారిగా, పలు అసెంబ్లీ కమిటీల్లో సభ్యురాలిగా పనిచేశారు.2000: ఏఐసీసీ కో-ఆప్షన్ సభ్యురాలిగా ఎంపికయ్యారు.2004: శాయంపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు.2009: నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి.. వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ నుంచి వివాదాల పరంపర1. 2018.. కాంగ్రెస్లోకి రీఎంట్రీ2018లో బీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్లోకి తిరిగి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచే వరంగల్ కాంగ్రెస్లో ఆమె ఆధిపత్యం, స్థానిక నేతలతో సంబంధాలపై చర్చలు మొదలయ్యాయి.2.ఎర్రబెల్లి స్వర్ణతో ఆధిపత్య పోరువరంగల్ రాజకీయాల్లో కొండా సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి స్వర్ణ విభేదాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. 2018లోనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయని, ఆ తర్వాత కూడా ఈ ఆధిపత్య పోరు కొనసాగిందని నివేదికలు పేర్కొన్నాయి.3. 2023 నుంచి మళ్లీ తెరపైకి విభేదాలు2023లో వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి మంత్రి అయిన తర్వాత సురేఖ రాజకీయ ప్రాధాన్యం భారీగా పెరిగింది. అయితే అదే సమయంలో నియోజకవర్గంలోకి ఇతర పార్టీల నేతల చేరికలు ఆమెకు అసంతృప్తి కలిగించాయి. తనకు సమాచారం ఇవ్వకుండా ఇతర నేతలను కాంగ్రెస్లోకి ఎలా తీసుకుంటారని ఆమె బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.4. పోలీస్ స్టేషన్కు వెళ్లిన వ్యవహారంకాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్లో పార్టీ వర్గాల మధ్య గొడవల నేపథ్యంలో మంత్రి హోదాలో కొండా సురేఖ పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి హంగామా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.5. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఫిర్యాదులుసురేఖ, ఆమె భర్త కొండా మురళి వ్యవహార శైలిపై వరంగల్ కాంగ్రెస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలను పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఏఐసీసీకి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి.6. 2024.. సమంత-నాగచైతన్య విడాకుల వ్యాఖ్యలుఇది కొండా సురేఖ పొలిటికల్ కెరీర్లోనే అత్యంత పెద్ద వివాదాల్లో ఒకటిగా మారింది. మంత్రి హోదాలో ఉండగా.. నటి సమంత, నాగచైతన్య విడిపోవడానికి అప్పటి బీఆర్ఎస్ నేత కేటీఆర్ కారణమంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయ విమర్శలు కాస్తా సినీ పరిశ్రమలోకి వెళ్లడంతో పలువురు సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసు పంపగా, ఆ తర్వాత పరువునష్టం కేసు వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. రాజకీయంగా కేటీఆర్ను టార్గెట్ చేయాలనుకున్న సందర్భంలో చేసిన ఆమె వ్యాఖ్యలు.. చివరకు ఆమెపైనే పెద్ద రాజకీయ, న్యాయపరమైన వివాదంగా మారాయి.7. రకుల్ ప్రీత్ సింగ్ పేరును ప్రస్తావించడంపై వివాదంసమంత వివాదం సమయంలోనే నటి రాకుల్ ప్రీత్ సింగ్ పేరును కూడా సురేఖ ప్రస్తావించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రకుల్ కూడా సురేఖ తన పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని తీవ్రంగా స్పందించారు.8. 2025.. మేడారం పనులు, పొంగులేటితో విభేదాలు2025లో మేడారం పనులు, టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో సురేఖకు విభేదాలు బయటపడ్డాయి. తన శాఖ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటున్నారన్న అభ్యంతరాలు సురేఖ వర్గం నుంచి వచ్చాయి. ఈ వివాదం క్రమంగా కాంగ్రెస్లో అంతర్గత వర్గపోరుగా మారింది.9.కొండా మురళి వర్సెస్ పొంగులేటిసురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా పొంగులేటిపై బహిరంగంగా విమర్శలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇన్చార్జ్ మంత్రిగా పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.10. మాజీ OSD సుమంత్ అరెస్ట్ ఎపిసోడ్2025లో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆమె జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లిన ఘటన మరో పెద్ద వివాదానికి దారితీసింది. పోలీసులు సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు రావడం, ఆ సమయంలో సురేఖ కుమార్తె సుస్మిత అభ్యంతరం వ్యక్తం చేయడం, అనంతరం సీఎం రేవంత్రెడ్డి, ఆయన సన్నిహితులపై రాజకీయ కుట్ర ఆరోపణలు చేయడం తీవ్ర చర్చకు దారితీశాయి. సురేఖ క్యాబినెట్ సమావేశానికి గైర్హాజరు కావడంతో వ్యవహారం మరింత ముదిరింది.11. బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయ వివాదంఈ ఎపిసోడ్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు మరో రాజకీయ చర్చకు తెరతీశాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన తన తల్లిని కొందరు రెడ్డి నేతలు అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించడం కాంగ్రెస్లో తీవ్ర చర్చకు కారణమైంది.12. 2025-26.. వరంగల్ కాంగ్రెస్లో గ్రూప్ వార్వరంగల్ కాంగ్రెస్లో సురేఖ వర్గం, ఇతర నేతల మధ్య విభేదాలు కొనసాగాయి. ఆమెకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయడం వరుసగా జరిగింది.13. 2026.. ఎర్రబెల్లి స్వర్ణతో మళ్లీ ఢీ2026లో మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో ఎర్రబెల్లి స్వర్ణకు ప్రాధాన్యం దక్కడంతో మరోసారి కొండా వర్గం అసంతృప్తి చర్చకు వచ్చింది. 2018 నుంచి కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఇంకా ముగియలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.14. 2026.. కొండా కుటుంబం వర్సెస్ కాంగ్రెస్ నాయకత్వం2026లో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్లో కలకలం రేగింది. సీఎం రేవంత్రెడ్డిపై వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖపై కూడా పార్టీ క్రమశిక్షణ చర్యల డిమాండ్ వచ్చింది. విషయం చివరకు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది.15. ప్రస్తుతం.. రేవంత్తో నేరుగా ఢీతాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ అనంతరం సురేఖ స్వయంగా సీఎం రేవంత్రెడ్డిపై ప్రశ్నలు సంధించారు. పార్టీలో తన విషయంలో ఒక రకంగా, ఇతర నేతల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మహిళను, బీసీ నేతను కావడంతోనే టార్గెట్ చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఇక సీఎం రేవంత్రెడ్డి సైతం సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. ఆమెను కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ప్రస్తుతం తీవ్రంగా సాగుతోంది. అయితే తుది నిర్ణయం ఇంకా అధికారికంగా వెలువడలేదు.మొత్తంగా చూస్తే.. కొండా సురేఖ రాజకీయ ప్రయాణంలో ప్రత్యర్థి పార్టీలతో పోరాటం ఎంత కనిపిస్తుందో.. సొంత పార్టీలో అంతర్గత పోరాటం కూడా అంతే కనిపిస్తోంది. తాజాగా వ్యవహారం ఏకంగా గాంధీభవన్ దాటి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరడంతో.. ఈసారి వివాదానికి ఎలాంటి ముగింపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. -
కొండా ఫ్యామిలీ బిగ్ డెసిషన్..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఆమెపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా? లేదంటే ప్రత్యామ్నాయ నిర్ణయం వెలువడుతుందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో హైకమాండ్ పెద్దలంతా కీలక భేటీ నిర్వహించనున్నారు. అయితే ఆ నిర్ణయం వెలువడడం కంటే ముందే.. ఓ బిగ్ డెసిషన్ తీసుకోవాలని కొండా ఫ్యామిలీ యోచిస్తుందని సమాచారం. కాంగ్రెస్ పార్టీని వీడే యోచనలో కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేయాలా?.. లేదంటే పార్టీని వీడాలా? లేదంటే మరేదైనా నిర్ణయం తీసుకోవాలా? అనే తమ తదుపరి రాజకీయ అడుగుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తమ నిర్ణచం ఏదనేది వాళ్లు మీడియా ముఖంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లి పెద్దలకు వివరణ ఇచ్చిన కొండా సురేఖ.. గత రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు. సీఎం రేవంత్ కుటుంబంతో పాటు కొందరు మంత్రులపైనా ఆమె ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అయితే హైకమాండ్ మాత్రం తమ నిర్ణయం వెల్లడించేందుకు కాస్త సమయం కావాలని చెప్పినట్లు సమాచారం. దీంతో ఇవాళ ఆమె వరంగల్కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొండా దంపతులు తమ నివాసంలో అనుచరులతో సమావేశం కానున్నారు. పార్టీని వీడాలా? ప్రస్తుత పరిణామాలపై వేచి చూడాలా? అనే అంశాలపై అనుచరులతో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కుటుంబ సభ్యులతోనూ కొండా దంపతులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు.. తనపై వేటేస్తే ఎమ్మెల్యే(వరంగల్ తూర్పు) పదవికి సైతం రాజీనామా చేసి ఉపఎన్నికకే వెళ్లాలని ఆమె ఇది వరకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కూతురు సుస్మిత రాజకీయ భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం వెల్లడించే చాన్సే ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం.కొండా సురేఖ వ్యవహారంపై ఇవాళో, రేపో కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే అప్పటిదాకా వేచి ఉండాలా? లేదంటే పార్టీ నిర్ణయం వెలువడకముందే తమ వైఖరిని ప్రకటించాలా? అనే అంశంపై కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. కూతురు సుస్మితా పటేల్ పరకాలకు తానే కాబోయే ఎమ్మెల్యేనంటూ కామెంట్ చేయడం మొదలు .. ఈ వివాదం రాజుకుంది. గతంలోనూ సీఎం రేవంత్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుస్మిత.. తాజాగానూ అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్లో కలకలం రేపాయి. కూతురి వ్యాఖ్యల్ని ఖండించని సురేఖపై వేటు వేయాల్సిందేనని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు. సురేఖ వైఖరి, కొండా ఫ్యామిలీ తీరుతో కాంగ్రెస్కు నష్టమే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు వాళ్లంతా.కొండా దంపతుల వ్యవహారంపై కాంగ్రెస్లో ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్నాయి. కొండా సురేఖపై పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక అధిష్ఠానానికి చేరింది. ఆమెను బర్తరఫ్ చేయాలని సీఎం, టీపీసీసీ చీఫ్ సహా పలువురు అధిష్టానానికి నివేదించారు. అదే సమయంలో ఆమెను కొనసాగించాలని, కొండా ఫ్యామిలీని దూరం చేసుకోవడం మంచిది కాదని మరికొందరు సీనియర్లు అధిష్టానికి విజ్ఞప్తులు చేశారు. దీంతో కొండా దంపతుల తదుపరి రాజకీయ అడుగుపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: నా కంటే ముందు ఆయనపై చర్యలు తీసుకోండి: కొండా సురేఖ -
కొండా సురేఖ ఎపిసోడ్కు నేడు ఎండ్కార్డ్?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొంతకాలంగా కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మంత్రి సురేఖపై క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక, సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయం, హైకమాండ్ ముందు సురేఖ వివరణ, ఆపై మీడియా ముందు సీఎంపై చేసిన ఆరోపణలు.. అన్నింటినీ పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు తుది నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే కీలక భేటీ నేపథ్యంలో ఈ వ్యవహారానికి తెరపడొచ్చనే చర్చా జోరందుకుంది. పరకాల రాజకీయాల నేపథ్యంలో మొదలైన వివాదం.. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్(చిట్టక్క) చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది. సీఎం రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా భావించారు. కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు పార్టీ క్రమశిక్షణా కమిటీ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై సురేఖను వివరణ కోరగా.. తన కుమార్తె వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే పీసీసీ మాత్రం ఈ వ్యవహారం అంతా అధిష్టానమే చూసుకుంటుందని చెబుతూ వచ్చింది. ఈలోపు ఈ వివాదంపై విచారణ జరిపిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ.. సురేఖ వ్యవహారంపై ఓ నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదిక ఆగస్టు 25న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు చేరింది. అక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు.. అటు నుంచి ఏఐసీసీకి చేరింది. అప్పటి నుంచి ఈ అంశం కాంగ్రెస్ హైకమాండ్ వద్దే ఉంది. అయితే వెంటనే చర్యలు తీసుకోకుండా.. సురేఖ వివరణ, పార్టీపై దాని ప్రభావం, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వంటి అంశాలను అధిష్టానం పరిశీలిస్తూ వచ్చింది.రేవంత్ స్పష్టమైన వైఖరిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా.. ఈ ఎపిసోడ్ అంతా నడిచింది. తిరిగొచ్చిన వెంటనే ఆయన ఈ పరిణామాలపై భగ్గుమన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా సురేఖపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ విషయంలో స్పష్టమైన సందేశం వెళ్లాలన్నది రేవంత్ అభిప్రాయంగా తెలుస్తోంది. అలాగే పాలమూరు రాజకీయాల్లో కాకరేపిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి వ్యవహారంపైనా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నుంచి పదవుల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని సీఎం రేవంత్ కోరుతుండగా.. దానికి టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ సైతం మద్దతు ప్రకటించినట్లు సమాచారం. అయితే.. సురేఖకు మద్దతు కూడామరోవైపు సురేఖను వెంటనే కేబినెట్ నుంచి తొలగించొద్దంటూ కాంగ్రెస్లోని కొందరు సీనియర్ నేతలు హైకమాండ్ను కోరినట్లు తాజా సమాచారం. ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు మంత్రులు సహా పలువురు నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సురేఖ విషయంలో హైకమాండ్ ముందు రాజకీయంగా సున్నితమైన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో.. ఒకవేళ ఆమెను బర్తరఫ్ చేసినా ఆ తర్వాతి పరిస్థితులకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.హైకమాండ్తో సురేఖ భేటీమరోవైపు ఢిల్లీలో నిన్నంతా కాంగ్రెస్ హెడ్క్వార్టర్స్ ఇందిరా భవన్ వేదికగా నాటకీయ పరిణామాలు జరిగాయి. అధిష్టానం పిలుపుతో అక్కడికి వెళ్లిన కొండా సురేఖ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. తనపై జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులపై వస్తున్న ఆరోపణల గురించి కూడా హైకమాండ్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాను చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆమె చెప్పారు. ఆ వెంటనే సీఎం రేవంత్, ఖర్గేతో మరోసారి భేటీ జరిపారు. అయితే రాష్ట్ర వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఖర్గే.. రాహుల్ గాంధీతో చర్చించాకే ఏ నిర్ణయమైనా వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం.నేడు కీలక భేటీలురాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర అగ్రనేతలు తిరిగి అందుబాటులోకి రావడం, తెలంగాణకు చెందిన కీలక నేతలు ఢిల్లీలో ఉండటంతో గురువారం చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మీనాక్షి నటరాజన్ తదితరులు హైకమాండ్తో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత రేవంత్, మహేష్ గౌడ్లు హైదరాబాద్కు తిరుగుపయనం అవుతారని సమాచారం. దీంతో ఇవాళ నిర్ణయం వెలువడొచ్చనే ప్రచారం జోరందుకుంది. ఇటు ఇవాళ కొండా సురేఖ దంపతులు తిరిగి వరంగల్కు చేరుకోనున్నారు. అనుచరులతో వాళ్లు భేటీ అవుతారని సమాచారం అందుతోంది.కేబినెట్ మార్పులపై కూడా చర్చ?ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలనే ఆలోచనలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు ఉన్నారు. ఇప్పటికే అధిష్టానంతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇవాళ్టి భేటీలో సురేఖపై నిర్ణయంతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సురేఖను తప్పిస్తే ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలి? ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి? నామినేటెడ్ పదవుల భర్తీ ఎలా చేపట్టాలి? అనే అంశాలపైనా ఢిల్లీలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వేటా.. ప్రత్యామ్నాయ మార్గమా?సురేఖను కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు బలంగా ఉన్నాయన్న ప్రచారం కొనసాగుతున్నప్పటికీ.. హైకమాండ్ మరో మార్గాన్ని పరిశీలిస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆమెకు కేబినెట్ నుంచి తప్పుకుని మరో కీలక పదవి ఇచ్చే అవకాశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే కొండా వ్యవహారంపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎవరూ బహిరంగంగా స్పందించవద్దని హైకమాండ్ నుంచి సూచనలు వెళ్లినట్లు సమాచారం. తుది నిర్ణయం వచ్చే వరకు ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదన్న ఆదేశాలు.. ఈ అంశాన్ని పార్టీ ఎంత సీరియస్గా తీసుకుంటోందో స్పష్టం చేస్తున్నాయి. సురేఖతో పాటు జి.చిన్నారెడ్డి వ్యవహారం కూడా హైకమాండ్ ముందుంది. ఇద్దరిపై క్రమశిక్షణా కమిటీ సిఫారసులు చేయడంతో.. ఒకేసారి ఇద్దరిపై చర్యలు తీసుకోవాలా? లేక వేర్వేరుగా నిర్ణయం తీసుకోవాలా? అన్నదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఒకవైపు రేవంత్రెడ్డి కఠిన చర్యల వైపు మొగ్గు చూపుతున్నారన్న సమాచారం.. మరోవైపు సురేఖకు పార్టీలోని కొందరి మద్దతు.. ఇంకోవైపు హైకమాండ్ రాజకీయ లెక్కలు.. ఈ మూడు అంశాల మధ్య తుది నిర్ణయం ఆసక్తికరంగా మారింది. నేటి ఢిల్లీ పరిణామాలతో కొండా ఎపిసోడ్కు ఎండ్కార్డ్ పడుతుందా? లేదంటే మరో మలుపు తిరుగుతుందా?అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హాట్టాపిక్ అయ్యింది.ఇదీ చదవండి: పిల్లల బడిలో.. పెద్దోళ్ల ఆఫీస్! -
ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: విలేకరుల సమావేశంలో మాట్లాడక ముందు మంత్రి సురేఖ వారితో ముచ్చటించారు. సీఎం, ఇతర నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యల చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ప్రస్తుతం అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నా. రాజీనామా చేయాలని ఇప్పటివరకు నాకెవరూ చెప్పలేదు. నేను బీసీని కాబట్టి నాకు ఒక న్యాయం, ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయం పాటిస్తారా? కేబినెట్లో ఉన్న ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు నేతలపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. మరి వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారు? మంత్రి పొంగులేటి కుమారుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్యపై అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు నోటీసులు ఇవ్వరు? సీఎంది క్రమశిక్షణ ఉల్లంఘన కాదా? సీఎం రేవంత్రెడ్డి అనేకసార్లు పదేళ్లు నేనే ముఖ్యమంత్రినని ప్రకటించుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఆయనే నేరుగా ప్రకటిస్తున్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంంఘన కాదా? నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు. నాపై చర్యలు తీసుకోవాలంటే పార్టీ, ప్రభుత్వంలో ఇంకా చాలామందిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటికీ ఎవరు సమాధానం చెబుతారు? నా కుమార్తె మాట్లాడిన దాంట్లో తప్పేముందో చెప్పాలి. ప్రభుత్వ పెద్దల, సీఎంకుటుంబ సభ్యుల అవినీతి అందరికీ తెలియదా? నాపై బర్తరఫ్ వంటి లాంటి చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందో నేను ఇప్పుడే చెప్పలేను..’ అని సురేఖ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ను సైతం తొలగించేందుకు కుట్ర జరగుతోందని, మంత్రి పొన్నంను ఆయన శాఖలో స్వేఛ్చగా పని చేయనీయడం లేదని ఆరోపించారు. -
నా కుమార్తె వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. వివాహం చేసుకుని స్వతంత్రంగా జీవిస్తున్న ఆమె మాట్లాడిన మాటలకు, మంత్రిగా ఉన్న తనకు పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వడం పెద్ద తప్పని పేర్కొన్నారు. తన కుమార్తె మాట్లాడిన మాటలకు తననెలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనకుండి మాట్లాడించిన శక్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.‘మంగళవారమే ఢిల్లీకి చేరుకున్నప్పటికీ సమయం దొరకలేదు. బుధవారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడిని కలిసి అన్ని అంశాలను సమగ్రంగా వివరించా. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బిజీగా ఉండటంతో ఆయన్ను కలవలేకపోయా. నా వివరణను ఖర్గే, మీనాక్షి నటరాజన్లకు లిఖితపూర్వకంగా అందజేశా. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాం«దీలకు ఈ–మెయిల్ ద్వారా, కేసీ వేణుగోపాల్కు వాట్సాప్ ద్వారా పంపించా. నా వివరణను పరిశీలిస్తానని ఖర్గే చెప్పారు..’అని సురేఖ వెల్లడించారు. నా కూతురు పూర్తి స్వతంత్ర వ్యక్తిగా జీవిస్తోంది.. ‘నా కూతురికి పెళ్లయింది. తను ఒక ఇంటి కోడలిగా పూర్తి స్వతంత్ర వ్యక్తిగా జీవిస్తోంది. తన ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేసే, మాట్లాడే అధికారం ఆమెకు ఉంది. మాట్లాడవద్దని చెప్పే అధికారం తల్లిదండ్రులుగా మాకు లేదు. సమాజంలో నిత్యం వందల మంది ఎన్నో మాట్లాడుతుంటారు. అలాగే ఆమె కూడా మాట్లాడింది. ఆమె నా బిడ్డ అయినంత మాత్రాన నన్ను ఎందుకు బాధ్యురాలిని చేయాలి? మహిళలు మనుస్మృతి భావజాలాన్ని వీడి తండ్రి లేదా సోదరుల మద్దతుపై ఆధారపడకుండా స్వతంత్రంగా మాట్లాడాలని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. నా బిడ్డ అలాగే స్వతంత్రంగా మాట్లాడింది. ఆ వ్యాఖ్యలను సమరి్ధంచడం లేదా ఖండించడంపై నేనేమీ మాట్లాడను. నా సొంత రాజకీయ జీవితం, నా భర్త రాజకీయ ప్రస్థానం వేరు. మంత్రి పదవి కొనసాగించాలని కోరా.. నేను పద్మశాలి వర్గానికి, నా భర్త మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాళ్లం. తెలంగాణలో ఈ రెండు సామాజిక వర్గాలకు కలిపి దాదాపు 16 శాతం ఓటు బ్యాంకు ఉంది. బీసీ మంత్రిగా ఉన్న నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అప్పగించిన శాఖలను నిరి్వఘ్నంగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నా. నా మంత్రి పదవికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనసాగేలా చూడాలని అధిష్టానాన్ని కోరా. నాపై మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ స్వచ్ఛందంగా మాట్లాడలేదు. కొందరు వెనకుండి బలవంతంగా మాట్లాడించారు. వివాదం అవుతుందనే ఉద్దేశంతో వారి పేర్లు బయటపెట్టడం లేదు. ఎవరు మాట్లాడించారో అధిష్టానానికి తెలుసు. మాట్లాడినవారే స్వయంగా మాకు ఫోన్లు చేసి..వాళ్లు పిలిస్తే అయిష్టంగానే వెళ్లాల్సి వచి్చందని చెప్పారు. తప్పు చేయని నన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. వారి వెనుక ఉండి నడిపించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..’అని సురేఖ అన్నారు. పీసీసీ క్రమశిక్షణ సంఘం తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా నివేదిక ఇచ్చి ఉండవచ్చని, ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్న తనపై నిర్ణయం తీసుకునే తుది అధికారం కేవలం అధిష్టానానికే ఉంటుందని చెప్పారు. ఏఐసీసీ తీసుకునే నిర్ణయం ఆధారంగా తన తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. -
చర్యపై చెరోవైపు!
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారంతో తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. సీఎం రేవంత్రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలు అన్నట్టుగా పరిస్థితి మారింది. సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు మంత్రి పదవి నుంచి తొలగించాలని సీఎం రేవంత్రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తుండగా..మరోవైపు ఆమెపై చర్యలను కొందరు ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నిజానికి రేవంత్ మంత్రివర్గంలోని అసంతృప్తి నాయకులుగా పరిగణింపబడేవారు.. గత రెండున్నరేళ్లలో ఏనాడూ సీఎంకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. తమ అసంతృప్తిని ఇన్నాళ్లూ లోలోపలే ఉంచుకున్నారని, తాజాగా సురేఖ ఎపిసోడ్ వారికి కలిసొచి్చందని అంటున్నారు. ఏఐసీసీలో సురేఖకు అనుకూలంగా ఒకరిద్దరు మంత్రులు తమ వాయిస్ వినిపించినట్లు సమాచారం. సురేఖపై తక్షణ చర్యకు బదులుగా ఆమె వివరణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు కొందరు అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది. ఒక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఇద్దరు మంత్రులు, ఓ కీలక నేత సైతం ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించే విషయంలో తొందరపడొద్దని కోరినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీ వర్గానికి చెందిన కీలక మహిళా నేతపై చర్యలు తీసుకుంటే రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని ఏఐసీసీ పెద్దలకు రేవంత్కు వ్యతిరేకంగా ఉన్న నేతలు వివరించినట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రితో పాటు ఆయన అనుకూలురు ఎట్టి పరిస్థితుల్లోనూ సురేఖపై చర్య తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నట్లు ఓ సీనియర్ నాయకుడు వెల్లడించారు. ఒకవేళ సురేఖపై చర్యలు తీసుకోకపోతే..ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో సీఎం రేవంత్ పట్టుపై పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందన్నట్టుగా కాంగ్రెస్ హైకమాండ్కు వారు స్పష్టం చేసినట్లు సమాచారం. సురేఖ తాజా వ్యాఖ్యలపై చర్చ ఇలావుండగా..ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసిన అనంతరం సురేఖ చేసిన వ్యాఖ్యలు పార్టీలో మరింత కలకలం రేపాయి. తాజా చర్చకు తెరలేపాయి. టీపీసీసీ క్రమశిక్షణా సంఘానికి ఇదే సమాధానం చెప్పిన మంత్రి..బెంగళూరులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వద్ద, ఢిల్లీలో మీడియా ముందు కూడా అదే వాదన విని్పంచడంతో పాటు మరో అడుగు ముందుకేసి.. సీఎం రేవంత్రెడ్డిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎంపైనే కాకుండా డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రిపై చేసిన వ్యాఖ్యలు సమస్యను మరింత సంక్లిష్టం చేసినట్లు చెబుతున్నారు. రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలతో కొత్త చర్చ తాజా పరిణామాల నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఇతర పార్టీలనుంచి వచ్చిన వారు కాంగ్రెస్ను ‘కబ్జా’చేయాలనుకుంటే సహించబోమనడం, వైఎస్సార్ వర్ధంతి సభలో కార్యకర్తలు ’సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేయగా, ‘ఆ సమయం వస్తే దాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు..’అని వ్యాఖ్యానించడం పార్టీలో సీఎం కుర్చీ పోరును మరోసారి బట్టబయలు చేసిందని అంటున్నారు. -
తెగని పంచాయితీ.. తగ్గని సురేఖ!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఢిల్లీ వేదికగా మరింత ముదిరింది. వివాదం అధిష్టానం వద్దకు చేరినా బుధవారం ఏమీ తేల్లేదు. సురేఖపై చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా..మరోవైపు సురేఖ కూడా తన వాదన గట్టిగా విన్పించారు. పైగా హైకమాండ్ పెద్దలతో భేటీ తర్వాత కూడా ఏమాత్రం తగ్గనట్టుగా వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈ విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రోజంతా నాటకీయ పరిణామాలు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ వేదికగా బుధవారం రోజంతా నేతల వరుస భేటీలు జరిగాయి. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా సీనియర్ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు, దీని పర్యవసానాలు వంటి అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం.. బుధవారం వారితో సమావేశాలు నిర్వహించింది. కొండా సురేఖ విషయమై మంగళవారం రాత్రే ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకున్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, బుధవారం తొలుత ఉదయం 11.30 గంటల సమయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. వారిద్దరి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా సుస్మిత, మంత్రి సురేఖల వ్యవహారాన్ని పీసీసీ అధ్యక్షుడు తప్పుపట్టినట్లు తెలిసింది. సుస్మిత వ్యాఖ్యలతో ప్రభుత్వం, పార్టీలో గందరగోళం నెలకొందని, అనేకమంది జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు దీన్ని తప్పుపట్టినట్లుగా మహేశ్ వివరించినట్లు సమాచారం. కూతురు మాట్లాడిన విషయాలను సురేఖ తప్పుపట్టకపోగా, ఆ వ్యాఖ్యలతో తనకేం సంబంధం అన్న రీతిలో స్పందించడం సరైంది కాదని అన్నట్టు తెలిసింది. సురేఖపై క్రమశిక్షణా చర్యల విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు స్పందించడంపై మీనాక్షి అసహనం! అయితే పీసీసీ వైఖరికి భిన్నంగా మీనాక్షి స్పందించినట్లు తెలుస్తోంది. ఓ మంత్రి కుమార్తె మాట్లాడితే దానిపై హుటాహుటిన 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించడం సరైందేనా? ఇది ఎవరి ఆదేశాల మేరకు జరిగిందన్న రీతిలో మీనాక్షి మాట్లాడినట్టు చెబుతున్నారు. పార్టీలోని ఇతర ఎమ్మెల్యేలు, నేతలు మాట్లాడితే స్పందించని ఎమ్మెల్యేలు.. సుస్మిత వ్యాఖ్యలపై అంతలా స్పందించడాన్ని చాలామంది సీనియర్లు తప్పుపట్టిన విషయాన్ని ఆమె ప్రస్తావించినట్లు సమాచారం. మధ్యలో వచ్చిన రేవంత్.. కేసీ వేణుగోపాల్తో మీనాక్షి, మహేశ్ల భేటీ జరుగుతుండగానే.. కేంద్రమంత్రి రాజ్నాధ్ సింగ్తో భేటీ ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేరుగా ఇందిరాభవన్కు చేరుకుని వారితో జత కలిశారు. వీరి భేటీ కొనసాగుతుండగానే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం కార్యాలయానికి రావడంతో అంతా కలిసి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానూ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ సురేఖ అంశాన్ని తీవ్రంగా తప్పుపట్టడమే కాకుండా రాష్ట్ర నేతల అభిప్రాయాన్నీ వివరించారు. ఆమెను కేబినెట్ నుంచి తొలగించాలన్న అభిప్రాయాన్నే ఖర్గే వద్ద వెలిబుచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో పరిణామాలపై ఖర్గే అసంతృప్తి రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న కుమ్ములాటలు, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై ఖర్గే తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో జరుగుతున్న వరుస పరిణామాలు, కలహాలతో చెడ్డపేరు వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం, పార్టీలోని నేతలపై అనేక ఫిర్యాదులు అధిష్టానానికి అందుతున్నాయని, వీటిని రాష్ట్ర స్థాయిలోనే కట్టడి చేయకపోవడానికి గల కారణాలపై గట్టిగా నిలదీసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ, ప్రభుత్వం మధ్య కొరవడిన సమన్వయం, నేతల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలను పరిష్కరించడంలో వైఫల్యమే దీనికి కారణమని ఆయన పేర్కొనట్లు సమాచారం. అయితే సురేఖ వ్యవహారంలో ఆమెను పిలిచి మాట్లాడతామని, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఖర్గే స్పష్టం చేశారు. గంట పాటు చర్చల అనంతరం ముఖ్యమంత్రి ఏఐసీసీ కార్యాలయం వెనుక గేటు ద్వారా బయటకి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి మీనాక్షి సైతం అక్కడి నుంచి నిష్క్రమించారు. సురేఖ ఎంట్రీ.. గంట పాటు వెయిటింగ్ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, మీనాక్షితో ఖర్గే, కేసీల భేటీ జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ సైతం ఇందిరాభవన్కు వచ్చారు. నేరుగా ఖర్గే కార్యాలయానికి వెళ్లిన ఆమె.. అక్కడ గంట సేపు నిరీక్షించారు. సీఎం, మీనాక్షి, కేసీలు వెళ్లిపోయాక ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అవినీతి, వారిపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు, వివిధ సందర్భాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, కేబినెట్లోని ఇతర మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయనకు ఒక నివేదిక అందించినట్లు తెలిసింది. అనంతరం సురేఖ మీడియాతో ముచ్చటించారు. ఖర్గేతో కొండా సురేఖ మీనాక్షి, సురేఖ, ఉత్తమ్ మంతనాలు మీడియాతో సురేఖ ముచ్చటిస్తున్న సమయంలోనే రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇందిరాభవన్కు వచ్చారు. ఉత్తమ్ను చూసిన సురేఖ ఆయనతో కలిసి ఇందిరాభవన్కు తిరిగొచ్చి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిణామాలు, ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన నివేదికను ఆమెకు అందజేశారు. తనను మంత్రివర్గంలో కొనసాగించాలని, తన కూతురు మాట్లాడిన దానికి తనను బాధ్యురాలిని చేయరాదని కోరారు. అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. సురేఖ ఆరోపణలను ఖర్గేకు వివరించిన రేవంత్ సురేఖ విలేకరులతో మాట్లాడిన తర్వాత.. సీఎం రేవంత్ మరోసారి ఖర్గేను కలిసారు. సురేఖ విలేకరులతో మాట్లాడుతూ చేసిన ఆరోపణలపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఏఐసీసీ కార్యాలయం వేదికగా ఆమె ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలపై ఆరోపణలు చేశారంటూ ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఇంత జరిగాక కూడా ఆమెపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం తగదని అన్నారని తెలిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి కూడా పాల్గొన్నారు. కాగా ఈ అన్ని అంశాలపై రాహుల్గాంధీ ఢిల్లీకి వచ్చిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఖర్గేతో భేటీ తర్వాత రేవంత్, భట్టి.. వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. -
సీఎం రేవంత్పై కొండా సురేఖ తిరుగుబాటు
సాక్షి,న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ ఎపిసోడ్ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తన కుమార్తె కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై అధిష్టానం ముందు తన ఆవేదనను వెలిబుచ్చేందుకు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్లతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్పై తిరుగుబాటు ప్రకటించేలా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ మహిళలు స్వతంత్రంగా బ్రతకాలని నిత్యం చెబుతుంటారు. నా కూతురు స్వతంత్రంగా మాట్లాడిన దానికి నన్ను బాధ్యురాలిని చేస్తూ నాకే షోకాజ్ నోటీసులు ఇస్తారా?.ఖర్గేకు పరిస్థితిని వివరిస్తూ లేఖ అందించాను. ఆ లేఖలోని విషయాలు బయటకు వస్తే పార్టీలో తీవ్ర ప్రకంపనలు రావడం ఖాయం.నా కుమార్తె సుష్మితా పటేల్ మాట్లాడింది తప్పా? ఒప్పా? అనేది నేను చెప్పను. నా బిడ్డ స్వతంత్ర ఆలోచనలతో మాట్లాడింది, తనను వారించే అధికారం నాకు లేదు. నా పొలిటికల్ లైఫ్ నాది. నా వైపు ఎలాంటి తప్పు లేదనే విషయాన్ని అధిష్టానానికి స్పష్టంగా వివరించానాపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవని, మంత్రి పదవిలో కొనసాగేలా చూడాలని అధిష్టానాన్ని కోరా. భేటీలో తన బర్తరఫ్ గురించి ఎలాంటి చర్చా రాలేదు. నాపై కుట్ర జరుగుతోందని ఆరోపించిన సురేఖ.. నాకు నోటీసులు ఇచ్చిన పార్టీ, నాపై బహిరంగంగా విమర్శలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. వారి వెనుక ఉండి నన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడించిన అసలు సూత్రధారులపై కూడా చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూసి, అధిష్టానం స్పందన ఆధారంగానే తన తదుపరి కార్యాచరణ ఉంటుందని కొండా సురేఖ తేల్చిచెప్పారు.👉ఇదీ చదవండి: మంత్రి కొండా సురేఖకు ఊహించని షాక్ -
ఆ లేఖలో ఏముంది? రాజకీయ ప్రకంపనలని కొండా సురేఖ ఎందుకన్నారు?
సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తిరుగుబాటు చేస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఇటీవలే సీఎం రేవంత్రెడ్డికి రాఖీ సైతం కట్టారు కొండా సురేఖ. దీంతో ఆమె ఇష్యూ కాస్త చల్లబడేలా ఉందని కొందరు భావించారు. అయితే, కొండా సురేఖ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. న్యూఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ తాను మల్లికార్జున ఖర్గేను కలిసి, తన వివరణ ఇచ్చానని తెలిపిన విషయం తెలిసిందే. సవివరమైన లేఖను ఖర్గేకు అందజేశానని ఆమె అన్నారు. ఆ లేఖ బయటకు వస్తే రాజకీయ ప్రకంపనలు సంభవిస్తాయని కొండా సురేఖ అనడం గమనార్హం. రాజీనామా చేయాలంటే.. తాను చేయబోనని చెప్పారు. తన కూతురు ఎమ్మెల్యే కావాలనుకుకుంటున్నారని తెలిపారు. కడియం శ్రీహరి తన కూతురును ఎంపీని చేసుకున్నారని చెప్పారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని అన్నారు. పొంగులేటి, భట్టి విక్రమార్క కమీషన్లపైన కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని, దానిపైన ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని ఆమె నిలదీశారు.లేఖలో ఏముంది?మల్లికార్జున ఖర్గేను కలిసి, లేఖను ఖర్గేకు అందజేశానని.. అది బయటకు వస్తే రాజకీయ ప్రకంపనలు సంభవిస్తాయని చెబుతూ కొండా సురేఖ మరో బాంబు పేల్చారు. దీంతో ఆ లేఖలో ఏముందన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటే ఆమె ఆ లేఖను బయటపెడతారా? అసలు ఆ లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారు? ఎవరిని ఉద్దేశించి రాశారు? అందులో ఎలాంటి కీలక విషయాలు ఉన్నాయి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో లేఖలోని అంశాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే లేఖలోని పూర్తి వివరాలు ఇప్పటివరకు బహిరంగం కాలేదు. ఖర్గేకు లేఖ అందజేసినట్లు ఆమె స్వయంగా చెప్పడంతో, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన కీలక అంశాలు అందులో ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేఖ బయటకు వస్తుందా? అందులోని విషయాలు ఏమిటన్నది తెలియాలంటే మరింత స్పష్టత రావాల్సి ఉంది. లేఖ గురించి చెప్పే సమయంలో ఆమె భట్టి విక్రమార్క, పొంగులేటి కమీషన్లపై ఎందుకు చర్యల్లేవు?’’ అంటూ కూడా ప్రశ్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదీ చదవండి: బంగారం ఎందుకు కొనొద్దు? విదేశీ పర్యటనలు ఎందుకు వద్దు? -
వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ
-
ఢిల్లీలో హైటెన్షన్.. ఖర్గేతో కొండా సురేఖ కీలక చర్చలు!
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాల వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆమె భేటీ కానున్నారు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా అధిష్ఠాన పెద్దలతో సమావేశమవుతున్నారు.ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి.. ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సుమారు గంటన్నరపాటు సమావేశమైనట్లు సమాచారం. ఈ భేటీలో కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీ క్రమశిక్షణ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, పెండింగ్లో ఉన్న రెండు మంత్రి పదవులు, కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, అలాగే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులు కూడా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలా? లేక శాఖ మార్పుతో సరిపెట్టాలా? అనే అంశంపై అధిష్ఠానం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సురేఖకు కాంగ్రెస్లోని కొందరు సీనియర్ నేతలు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఆమెపై తుది నిర్ణయం తీసుకునే ముందు సురేఖతో సంప్రదింపులు జరపాలని కొందరు నేతలు అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. శాఖను మార్చడం వంటి ప్రత్యామ్నాయాన్ని కూడా కొందరు నేతలు సూచించినట్లు సమాచారం.ఇక మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్తో కేసీ వేణుగోపాల్ సమావేశం కూడా కీలకంగా మారింది. సురేఖ వ్యవహారంపై వారి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ఖర్గే నేతృత్వంలో మరో కీలక భేటీ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా.. కొండా సురేఖపై చర్య విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఉత్కంఠగా మారింది.ఇదీ చదవండి: ప్రజలను కాంగ్రెస్ నట్టేటముంచింది: కేటీఆర్ -
ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక భేటీలు.. ఏం జరుగనుంది?
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్లో సంస్థాగత వ్యవహారాలపై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీలోని ఇందిరా భవన్కు చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో వారు భేటీ కానున్నారు.ఈ సందర్భంగా కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీ సంస్థాగత అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన తదితర అంశాలపై చర్చించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది.దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీకి వచ్చామని, ఆయనను స్మరించుకుంటున్నామని మహేష్ గౌడ్ తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలుస్తున్నట్లు చెప్పారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ చార్జ్షీట్ -
మంత్రి పదవి ఊస్ట్ హుటాహుటిన ఢిల్లీకి కొండా సురేఖ
-
సురేఖను తప్పించాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న నేతలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారంతో పార్టీ, ప్రభుత్వం రెండూ సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని.. ఈ విషయంలో ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలన్నదే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల అభిప్రాయంగా ఉందని సీఎం తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ వ్యవహారాన్ని ఉపేక్షిస్తే పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్లడంతోపాటు రాష్ట్ర నాయకత్వంపై లేనిపోని అపోహలకు తావిచ్చినట్లు అవుతుందని ఆయన చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, సీనియర్ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దీనిపై వ్యక్తమైన భిన్నాభిప్రాయాలు, ప్రభుత్వంపై కొందరు ఎమ్మెల్యేలు, నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు, జిల్లాల్లో బయటపడుతున్న విభేదాల నేపథ్యంలో రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం మంగళవారం వారితో చర్చించింది. గతంలో పెద్ద మనసుతో ఉపేక్షించినా.. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం రాత్రి ముందుగా భేటీ అయ్యారు. కాన్వాయ్ లేకుండా కేవలం ఒక్క కారులోనే కేసీ ఇంటికి చేరుకొని గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండ సురేఖ అంశంలో జరిగిన పరిణామాలు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి వివరించినట్లు తెలిసింది. అలాగే పలు జిల్లాల్లో నేతల మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలపై చర్చించారు. ఈ సందర్భంగానే కొండా సురేఖ అంశంలో ఆమె శాఖలో బయటపడ్డ అవినీతి ఆరోపణలు, జిల్లాల నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులు, గతంలోనే ఆమె కుమార్తె నేరుగా తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కేసీకి ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. అప్పుడే సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమైనా పెద్ద మనసుతో ఉపేక్షించామని.. కానీ ప్రస్తుతం ఆమె కుమార్తె నేరుగా తనపై అవినీతి ఆరోపణలు చేయడంతోపాటు స్థానిక ఎమ్మెల్యేను తూలనాడటాన్ని కేడర్ సహించట్లేదన్న విషయాన్ని బలంగా చెప్పినట్లుగా సమాచారం. అధిస్టానం నిర్ణయాలనే ధిక్కరించేలా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలపై సుస్మిత వ్యాఖ్యలను సైతం జిల్లా ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుపడుతున్న విషయాన్ని వివరించినట్లు తెలిసింది. ఈ పరిణామాల దృష్ట్యా ఆమె కేబినెట్ను తొలగించడమే సమంజసమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక జి.చిన్నారెడ్డి విషయంలోనూ ఉపేక్షించరాదని.. ఈ రెండు విషయాలపై క్రమశిక్షణా సంఘం చేసిన నిర్ణయాన్ని పార్టీ అమలు చేసేలా చూడాలని సీఎం కోరినట్లుగా తెలిసింది. అసెంబ్లీ తర్వాత మంత్రివర్గ విస్తరణ.. అదే సమయంలో సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆమె స్థానంలో చేపట్టాల్సిన భర్తీతోపాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవులను కూడా భర్తీ చేయాలన్న అంశం కేసీ, రేవంత్ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్రెడ్డి, బీసీ సామాజికవర్గం నుంచి ఆది శ్రీనివాస్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ స్పీకర్గా బాలూనాయక్ పేర్లను ముఖ్యమంత్రి ముందుంచినట్లుగా చెబుతున్నారు. మంత్రి పదవులు దక్కని సీనియర్లకు నామినేటెడ్ పదవులను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణపై అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఈ నెల మూడో వారంలో ఓ నిర్ణయానికి రావాలని నిశ్చయించినట్లు సమాచారం. ఆ తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీపై నిర్ణయం తీసుకుందామనే అభిప్రాయం వ్యక్తమైందని తెలియవచ్చింది. అలాగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ముందుగానే అభ్యర్థుల ప్రకటనపైనా ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఢిల్లీలోనే మంత్రులు.. హస్తిన రాజకీయాల నేపథ్యంలో కీలక మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. జలవనరులకు సంబంధించిన సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం సైతం ఇక్కడే ఉండనున్నారు. అయితే రాజకీయ భేటీలు ఉంటాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. మంత్రివర్గంలో మార్పుచేర్పులు, నామినేటెడ్ పదవుల భర్తీలు జరిగితే మాత్రం ఆయన్ను పలిపించి మాట్లాడతారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రులను కలిసేందుకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలోనే ఉండగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా స్వామినాథన్ ఫౌండేషన్కు అందిస్తున్న అవార్డు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబులు బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకోనున్నారు. వారు సైతం అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారని అంటున్నారు. ఇక అధిస్టాన పెద్దల పిలుపుమేరకు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ బుధవారం ఉదయం అధిస్టాన పెద్దలతో భేటీ కానున్నారు. మరోవైపు రాష్ట్రపతి భవన్లో జరిగిన స్పీకర్ల సదస్సు కోసం ఢిల్లీ వచ్చిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. పార్టీకి తాను చేసిన సేవలను వివరిస్తూ కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని విన్నవించినట్లు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకు ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా పార్టీకి సానుకూలత ఏర్పడుతుందని ఆయన తెలిపినట్లుగా సమాచారం. సురేఖ వేచిచూసినప్పటికీ.. మరోవైపు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి మంత్రి కొండా సురేఖ ఒకే విమానంలో మంగళవారం ఢిల్లీ చేరుకున్నప్పటికీ అధిష్టానం నుంచి ఆమెకు ఇంకా పిలుపు రాలేదు. కేసీ వేణుగోపాల్ను సీఎం కలిసి వెళ్లాక కొండా సురేఖ కూడా కేసీని కలుస్తారనే ప్రచారం జరిగింది. అయితే రాత్రి 10 గంటల సమయం దాటినా ఆమెను కేసీ పిలవలేదు. దీంతో బుధవారం ఉదయం అధిష్టానం పెద్దల నుంచి ఆమెకు పిలుపు వచ్చే అవకాశం ఉందని సమాచారం. నివేదిక ఇచ్చా.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్: మల్లు రవి తమ పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నివేదికను హైకమాండ్కు అందజేశానని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. ఇక అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. హైకమాండ్ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. -
కేసీ వేణుగోపాల్కు కీలక విషయాలు చెప్పిన రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారు. దాదాపు గంటకుపైగా కొనసాగిన ఈ సమావేశంలో.. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై తన అభిప్రాయాలను నేరుగా కేసీ వేణుగోపాలకు వివరించారు రేవంత్ రెడ్డి.కొండా సురేఖపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత క్రమశిక్షణ రాహిత్యం పెరిగే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు అంటున్నారు. కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. బీసీ మహిళపై వేటు వేస్తే పార్టీకి వచ్చే నష్టంపైన కాంగ్రెస్ హై కమాండ్ బెరీజు వేస్తోంది. కొండా సురేఖ వివరణ తీసుకుని నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు కర్గే రాహుల్ గాంధీకి కేసీ వేణుగోపాల్ అందజేయనున్నారు. ఆ తర్వాత కొండా సురేఖపై నిర్ణయాన్ని ఏఐసీసీ ప్రకటించనుంది.కాగా, ఇటీవల రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ కూతురు సుస్మిత పలు వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. -
ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పరిణామాలతో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, అంతర్గత విభేదాలు,త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో హస్తిన వేదికగా కీలక చర్చలు సాగుతున్నాయి.ఈ క్రమంలో మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకే విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు అధిష్టానం పెద్దలతో మంత్రి కొండా సురేఖ భేటీ కానున్నారు.మరోవైపు, కేబినెట్ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ఆశావాహుల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి సైతం కాసేపట్లో ఢిల్లీకి పయనం కానున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని గతంలో హైకమాండ్ ఇచ్చిన హామీని గుర్తుచేసేందుకే ఆయన ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం.ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వేదికగా ఏఐసీసీ ముఖ్య నేతలతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. వీరితో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, సీనియర్ నాయకురాలు విజయశాంతి కూడా ఢిల్లీ చేరుకున్నారు.మంత్రి కొండా సురేఖకు సంబంధించిన అంశాలతో పాటు, రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ, తుది స్థానాల భర్తీపై ఈ కీలక సమావేశాల్లో అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
అచ్చ కాంగ్రెస్లో పచ్చ మీడియా చిచ్చు
తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ ఎపిసోడ్ ముగిసినట్లేనా? ఇంకా సశేషంగానే ఉన్నాదా? ప్రస్తుత రాజకీయ పరిశీల కుల మెదడుకు మేత వేస్తున్న ప్రశ్న ఇది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై లోతైన అవగాహన ఉన్నవారు మాత్రం మరోరకంగా ఆలోచిస్తున్నారు. వాళ్లను తొలుస్తున్న ప్రశ్నావళి సురేఖ ఉదంతం కంటే విస్తృతమైనది. రాష్ట్ర కాంగ్రెస్లోగానీ, ఎమ్మెల్యేలు, మంత్రి వర్గ సహచరుల్లోకానీ నిజంగానే రేవంత్రెడ్డికి మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నాదా? ఆయన పాలనపై అధిష్టానం వైఖరి ఏమిటి? ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో కనిపిస్తున్న పెదవి విరుపు ఎక్కడికి దారితీయనున్నది? అసలు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నది? ఇటువంటి ప్రశ్నలు తలెత్త డానికి సహేతుకమైన కారణాలే కనిపిస్తున్నాయి. కారణాలు న్నాయి కనుకనే యెల్లో మీడియా కలవరపాటుకు లోనవు తున్నది. ఆవేదన వెళ్లగక్కుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పార్టీ–ప్రభుత్వ వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛనివ్వడం లేదని కాంగ్రెస్ అధిష్టానంపై యెల్లో మీడియా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. రేవంత్ నాయకత్వా నికి కంట్లో నలుసుగా వుండే నేతలను ఏరిపారేసి ఆయన్ను బలోపేతం చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి పోగాలం దాపురిస్తుందని హెచ్చరించడానికి కూడా యెల్లో మీడియా వెనుకాడటం లేదు. తెలుగుదేశం పార్టీకి యెల్లో మీడియా అనుబంధ పరిశ్ర మగా పని చేస్తు్తన్నదని కొత్తగా చెప్పుకోనవసరం లేదు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారన్నది నిజం. కేంద్రంలో రాజీవ్ సర్కార్ను గద్దెదించడం కోసం నేషనల్ ఫ్రంట్కు ఎన్టీఆర్ రూపశిల్పిగా మారిన సంగతి కూడా నిజం. అటువంటి తెలుగుదేశం పార్టీకి, దాని అనుబంధ యెల్లో మీడియాకు తెలంగాణ కాంగ్రెస్పై ఇంతటి అవ్యాజమైన వాత్సల్యం కుదరడానికి కారణమేమిటి? ఇది కూడా బ్రహ్మరహస్యమేమీ కాదు. తెలుగు ప్రజలంద రికీ తెలిసిన విషయమే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణపై పెత్తనం చేయాలనే కోరిక చంద్రబాబుకు చావ లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలుకు ప్రయ త్నిస్తూ ఆడియో సాక్షిగా చంద్రబాబు, వీడియో సాక్షిగా అప్పటి ఆయన సహచరుడు రేవంత్రెడ్డి క్యాష్తో సహా దొరికిపోవడం, ఫలితంగా హైదరాబాద్ను వదిలేసి చంద్రబాబు పారిపోవడం తెలిసిన కథే. తామేదో రహస్యంగా దొంగతనం చేయబోతే అన్యాయంగా పట్టుకుని కేసీఆర్ అల్లరి పెట్టాడనే కోపం అప్ప ట్నుంచే చంద్రబాబుకూ, రేవంత్కూ ఉన్నది. చంద్రబాబుకు జలుబు చేస్తే ముక్కు చీదే అలవాటున్న యెల్లో మీడియా కూడా నాటినుంచే కేసీఆర్ను శత్రువుగా ప్రకటించుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు రాజశేఖరరెడ్డి చేతిలో ఓటమి పాలైన చంద్రబాబు, జగన్ రాజకీయ జీవితాన్ని మొగ్గలోనే తుంచేయడం కోసం పదిహేనేళ్ల కిందనే కాంగ్రెస్ అధిష్టానంతో స్నేహం నెరపడం ప్రారంభించారు. సిద్ధాంత రాద్దాంతాలు, విశ్వసనీయత వగైరాలతో తనకు ఏ రకమైన సంబంధం లేదని కొన్ని డజన్లసార్లు చంద్రబాబు నిరూపించుకున్నారు. అందువల్లనే ఎన్డీయేతో బహిరంగ స్నేహం, కాంగ్రె స్తో రహస్య ప్రేమ ఏకకాలంలో ఆయన నడపగలిగారు. ఆ స్నేహం ఉపకరించి వర్తమాన రాజకీయ పరిస్థితికి బాటలేసింది. ఎన్నికల సమయం నాటికి కూడా అత్యధిక ప్రజామోదం కలిగిన నేతగా కేసీఆర్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్కు ఓటమి తప్పలేదు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం. తవ్వుకోవడం అనవసరం.వ్యవహార దక్షత, ఎన్నికలకు అవసరమయ్యే వనరులను సమీకరించగలిగే సామర్థ్యం రేవంత్రెడ్డికి సహజంగానే ఉన్నా యని చెబుతారు. దానికోసం యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీల సంపూర్ణ మద్దతు ఉండనే ఉన్నది. బీజేపీ వ్యతిరేకత మొత్తం బీఆర్ఎస్ మీదనే కేంద్రీకృతమవడంతో అటువైపునుంచి కూడా రేవంత్ కాంగ్రెస్కు ఇబ్బంది లేకుండా పోయింది. అధికా రంలోకి వచ్చిన తర్వాత మొన్నటి అమెరికా పర్యటనను అడ్డు కోవడం మినహా ఇతరత్రా రేవంత్ సర్కార్ను బీజేపీ ఇబ్బంది పెట్టిన ఘటనలు లేకపోవడం ఆశ్చర్యమే. కాంగ్రెస్ పార్టీలో తనకో సొంత వర్గాన్ని తయారు చేసుకోవడం కోసం తెలుగు దేశం పార్టీ తెలంగాణా అవశేషాలను కాంగ్రెస్లోకి రేవంత్ బదిలీ చేయగలిగారు. ఇప్పుడీ అవశేష తెలుగుదేశం శ్రేణులకే పెత్తనం దక్కాలనే వాంఛ యెల్లో మీడియాలో కనిపిస్తున్నది. దశాబ్దాల చరిత్ర కలిగిన కొందరు కాంగ్రెస్ నాయకులను ఈ కారణాల వల్లనే యెల్లో మీడియా టార్గెట్ చేస్తున్నదనీ, వారిమీద నెగెటివ్ ముద్రలు వేస్తున్నదనే ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణులనుంచి వినపడుతున్నాయి. కొండా సురేఖ వివాదం నలుగుతున్న సందర్భంగా ఒకరోజు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడున్న మీడియాతో మాట్లాడవలసి వచ్చింది. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియాపై పేరు పెట్టి మరీ ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో మీక్కావలసిన ఎవరినో బలోపేతం చేయడం కోసం నాలాంటి నిజాయితీపరు లైన నాయకుల మీద నిందలేస్తున్నారని ఆయన దుమ్మెత్తి పోశారు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. వర్తమాన కాలంలోని సగటు రాజకీయ నాయకులకు భిన్నంగా జనసామాన్యంలో మంచి పేరున్న నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గత ఇరవయ్యేళ్లుగా తన తల్లి పేరుమీద ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం వ్యాపారాలు చేస్తారో ఎక్కడ చేస్తారో తెలి యదు కానీ, నియోజకవర్గంలో మాత్రం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు రాజగోపాలరెడ్డి వెనుకాడరని స్థానిక ప్రజలు చెబుతారు. సొంత అసెంబ్లీ నియోజకవర్గం మునుగోడులోనే కాకుండా భువనగిరి లోక్సభ స్థానం పరిధిలోని అన్ని నియోజక వర్గాల్లో కోమటిరెడ్డి సోదరులకు అనుచరగణం, పలుకుబడి ఉన్నాయని చెబుతారు. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేని పరిస్థితి ఏర్పడినప్పుడు తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి మరీ రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారు. ఆ పార్టీతో భావసారూప్యత పొసగక తిరిగి కాంగ్రెస్లో చేరారు. ఇటువంటి నేపథ్యం ఉన్న తనపై అవాకులు చవాకులు ప్రచారం చేస్తున్నదని మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని తప్పు పట్టగలమా? పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్పై కూడా ఆ మధ్యన ఒక టీవీ ఛానల్ ధారావాహిక దాడికి పాల్పడింది. ముఖ్యమంత్రికి సన్నిహితులైనవారు ఈ ఛానల్ను నడిపిస్తారని చెబుతారు. మహేష్గౌడ్ మూడున్నర దశాబ్దాల కిందనే ఎన్ఎస్యూఐ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్ నాయకునిగా, సేవాదళ్ కార్యకర్తగా పని చేస్తూ ఏనాడూ కాంగ్రెస్ జెండాను భుజం మీదినుంచి కిందకు దింపలేదు. వందలాది ఎకరాల సాగుభూములున్న కుటుంబం నుంచి వచ్చిన మహేశ్గౌడ్కు ఏనాడూ అవినీతి మకిలి అంటింది కూడా లేదు. అటువంటి వ్యక్తిని అయోగ్యుడిగా చిత్రించడానికి సదరు టీవీ ఛానల్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే ఇవి. కొండా సురేఖ తాజా వివాదానికి ఆమె కుమార్తె సుష్మిత ముఖ్యమంత్రిపై చేసిన ఘాటు వ్యాఖ్యలే కారణమనే సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై సుష్మిత ఉపయోగించిన పరుష పదజాలాన్ని ఎవరూ హర్షించరు. ఆమె చేసిన వ్యాఖ్యలకు కారణమెవరు? వరంగల్ జిల్లా పరకాల నియోజక వర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా రేవూరి ప్రకాశ్రెడ్డి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ స్థానంపై ఎప్పటి నుంచో దృష్టి పెట్టిన సుష్మిత ఘాటుగా స్పందించారు. సుష్మిత సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ కల్చర్లో అభ్యర్థులను ముందు గానే ముఖ్యమంత్రి నిర్ణయించే సంప్రదాయం ఉన్నదా? అంతే కాకుండా ఇంకో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా రేవంత్రెడ్డి పలుమార్లు ప్రకటించారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సీఎం స్థానం నిజంగా అంత బలంగా ఉన్నట్లయితే సురేఖ మీద చర్య తీసుకోవడానికి ఇంత తతంగం ఎందుకు? మొదట 20 మంది శాసనసభ్యులతో ప్రెస్ మీట్, సురేఖను తప్పించాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు, దాన్ని హైకమాండ్కు పంపించడం, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ రాకకోసం నిరీక్షణ... ఇదంతా అవస రమా? సీఎం తలుచుకుంటే ఏ మంత్రినైనా తప్పించే అధికారం రాజ్యాంగబద్ధంగానే ఉన్నది. ఆ అవకాశాన్ని వినియోగించు కోలేని అశక్తత ఎందుకొచ్చింది? గత ఎన్నికల సందర్భంగా రేవంత్ను ఫోకస్ చేయడం కోసం నల్లగొండ గద్దర్ నర్సన్న పాడిన ఒక పాట పాపులరయింది. ‘‘మూడు రంగుల జెండా పట్టి... సింగమోలే కదిలినాడు... మన రేవంతన్న’’ అని సాగు తుందా పాట. ఎక్కడ ముఖ్యమంత్రి సభ జరిగినా ఆ రికార్డు పెట్టడం రివాజు. గత కొంత కాలంగా గాంధీ భవన్లో జరిగే కార్యకర్తల సమావేశంలాంటి కార్యక్రమాల్లో ఆ పాట వినిపించ కూడదనే ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. పరకాల సంగతేమోగానీ కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీలోకి ఒక కొత్త పదబంధాన్ని తెచ్చారు. ‘అచ్చ కాంగ్రెస్–పచ్చ కాంగ్రెస్’ అనే మాటపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. యెల్లో మీడియా ట్రాప్లో పడి ‘అచ్చ’ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూపోతే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనుకోవడం భ్రమ. ఒక పక్కన ప్రభుత్వ పాలనపై జనసామాన్యంలో పేరుకొంటున్న తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని సమైక్యంగా నడిపించ డంపై దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో దారుణమైన పరాజ యాన్ని మూట కట్టుకోవలసి వస్తుందని గ్రహిస్తే మంచిది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రేవంతన్నకు బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ
-
రాజకీయ రక్షాబంధన్!
సాక్షి, హైదరాబాద్: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మియ బంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ఈసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసానికి వెళ్లడం, ముఖ్యమంత్రితో పాటు ఆయన మనవడికి బంగారంతో ప్రత్యేకంగా చేయించిన రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకోవడం తాజా రాజకీయ పరిణామాల్లో ఆసక్తికరంగా మారింది. మరో మంత్రి సీతక్కతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన ఆమె ముఖ్యమంత్రికి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.సీఎంతో పాటు ఆయన సతీమణి గీత, కుమార్తె నైమిషాలకు బొట్టు పెట్టి, రేవంత్తో పాటు ఆయన మనవడికి కూడా రాఖీ కట్టారు. అయితే, రాఖీ కట్టేందుకు సీఎం నివాసానికి సురేఖ వెళ్లారన్న వార్తతో పాటు రాఖీ కట్టిన సందర్భంలోనూ, ఆ తర్వాత రేవంత్, సురేఖలిద్దరూ ఆత్మియంగా పలకరించుకోవడం, ఎక్కడా ఇద్దరి ముఖకవళికల్లో ఇబ్బంది కనిపించకపోవడంతో అసలేం జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ బంధం ఇలానే కొనసాగుతుందా? లేక బంధానికి త్వరలోనే గండి పడుతుందా? అన్న చర్చ జరిగింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా? వాస్తవానికి, ప్రతి రాఖీ సందర్భంగా సీఎం రేవంత్కు మంత్రి సురేఖ రాఖీ కడుతున్నారు. అయితే, ఇటీవల సురేఖ కుమార్తె సుస్మిత మాట్లాడిన మాటలు, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు సురేఖ, రేవంత్ల నడుమ రాజకీయ అగాధాన్ని ఏర్పరిచాయి. అసలు ఎదురుపడితే ఇద్దరూ మాట్లాడుకోగలరా? అనే స్థాయిలో రాజకీయ చర్చోపచర్చలు జరిగాయి. కానీ, రాఖీ పౌర్ణమి రోజున ఇద్దరూ హుందాగా వ్యవహరించి పండుగ ప్రత్యేకతను, సందేశాన్ని ప్రజలకు పంపడం గమనార్హం.అయితే, అసలు సీఎం అపాయింట్మెంట్ తీసుకునే సురేఖ వెళ్లారా? కనీసం సమాచారమిచ్చారా? ఒకవేళ నిజంగానే సమాచారం అందిన మేరకు సురేఖతో రాఖీ కట్టించుకునేందుకు సీఎం అమోదించారా? తద్వారా రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం అనే వివాదం విషయంలో రాజీ సంకేతాలను పంపాలనుకున్నారా? లేదంటే పండుగ పండుగే... చర్యలు చర్యలే.. అన్న ధోరణిలో ముందుకెళ్లారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. నన్ను వేరుగా చూడకండి.. రాఖీ కట్టి సీఎం నివాసం నుంచి వెళ్లిపోయిన మంత్రి సురేఖ తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్కు రాఖీ కట్టి వచ్చానని, ఆయనకు ఆడపడుచులందరి దీవెనలు ఉంటాయని చెప్పారు. ఆయన సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తి, యుక్తి ఆయనకు కలగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ ఆశీర్వాదం కూడా ఆడపడుచులందరిపై ఉండాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ రోజున రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదని, మూడోసారి రేవంత్కు రాఖీ కట్టి వచ్చానని చెప్పారు. ఆడపడుచుల విషయంలో సురేఖను వేరు చేసి మాట్లాడవద్దని, గ్రామీణ ప్రాంత మహిళలతో పాటు తనపై కూడా ఆయన ఆశీస్సులు ఉంటాయని సురేఖ వ్యాఖ్యానించారు. కిటకిటలాడిన సీఎం నివాసం కాగా, రక్షాబంధన్ సందర్భంగా జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ నివాసం కిటకిటలాడింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ అధ్యక్షురాళ్లు మొగిలి సునీత, నేరెళ్ల శారద, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి, రైతు కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి, బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి, మాజీ ఎంపీ గుండు సుధారాణి, పీసీసీ నేతలు బొజ్జా సంధ్యారెడ్డి, ఇందిరా శోభన్, రేగులపాటి రమ్యారావు, పాల్వాయి రజనీకుమారి తదితరులతో పాటు పలు కార్పొరేషన్ల చైర్పర్సన్లు, బ్రహ్మకుమారీలు, మలక్పేటలోని గవర్న్మెంట్ హైసూ్కల్ ఫర్ ది బ్లైండ్ గరల్స్ విద్యార్థినులు రేవంత్కు రాఖీలు కట్టారు.నా ఎదుగుదలలో అండగా రేవంత్: మంత్రి సీతక్క సీఎం రేవంత్కు రాఖీ కట్టిన తర్వాత టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొజ్జా సంధ్యారెడ్డి తదితరులతో కలిసి మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. వామపక్ష భావజాలం నుంచి వచి్చన ఆదివాసీ బిడ్డగా తన ఎదుగుదలలో రేవంత్రెడ్డి అండగా ఉన్నారని, తను ఈ స్థాయికి రావడంలో ఆయన సహకారం చాలా ఉందని చెప్పారు. తనకున్న ఒక్క తోబుట్టువు ఎన్కౌంటర్లో చనిపోయారని, అక్కా అంటూ తన వద్దకు వచి్చన వారందరినీ సోదరులుగా భావిస్తానని చెప్పారు. -
సీఎం రేవంత్కు రాఖీ కట్టిన కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: సుస్మిత వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారి సీఎం రేవంత్ను కలిసిన మంత్రి కొండా సురేఖ.. ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం మీడియాతో కొండా సురేఖ మాట్లాడుతూ.. సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టానని తెలిపారు. సీఎం మనవడు, అల్లుడికి కూడా రాఖీ కట్టా. మంత్రి సీతక్కతో కలిసి రాఖీ కట్టాను. నేను అందరికీ ఆడపడుచునే. నన్ను వేరు చేసి చూడొద్దని కొండా సురేఖ అన్నారు.అయితే, తాజా పరిణామాలను ప్రస్తావించని కొండా సురేఖ.. పండగ వాతావరణంలో తాను ఎలాంటి కామెంట్స్ చేయనన్నారు. సీఎం రేవంత్రెడ్డికి మూడోసారి రాఖీ కట్టానన్నా సురేఖ.. ప్రెస్మీట్లో రాఖీ శుభాకాంక్షలకే పరిమితమయ్యారు. సీఎం మంచి సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నా. ఇక్కడ రాజకీయాలు మాట్లాడను, సీఎం రేవంత్కు ఆడపడుచుల దీవెన ఉంటుంది’’ అని కొండా సురేఖ పేర్కొన్నారు. -
సీఎం రేవంత్ ఇంటికి మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డితో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. సీఎం రేవంత్కు రాఖీ కట్టేందుకు వచ్చారు. వివాదం తర్వాత తొలిసారి సీఎంతో ఆమె సమావేశమయ్యారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు తర్వాత పొలిటికల్ గ్యాప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ కమిటీ.. నివేదికను ఏఐసీసీకి పంపించింది.. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్తో కొండా సురేఖ భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది. చెల్లెమ్మ సురేఖను అన్న రేవంత్ క్షమిస్తారా?. కాంగ్రెస్లో కొండా సురేఖ తుపాన్ ముగిసిపోతుందా?. సుస్మిత కామెంట్ల వివాదానికి తెరపడుతుందా? అనే చర్చ జరుగుతోంది.కాగా, తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికతో వేటుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం ఊపందుకున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. సురేఖపై చర్య ఖరారైందా? లేక అధిష్టానం చివరి నిమిషంలో మరో మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం తెలిసిందే. ఈ నివేదిక ఏఐసీసీకి చేరడంతో బంతి పూర్తిగా అధిష్టానం కోర్టులోకి వెళ్లింది.టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా ఈ వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో ఖర్గేతో భట్టి బెంగళూరులో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా భట్టి ఖర్గేకు వివరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అలాగే చిన్నారెడ్డి వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సిఫారసు బయటకు వచ్చిన తర్వాత సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమన్న వాదన బలపడింది. కేబినెట్ నుంచి తక్షణమే తొలగించాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు ఆగాలా? అన్న అంశంపై అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
రాఖీ కట్టనిస్తారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో రాఖీ పండుగ వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ.. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి రాఖీ కట్టేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. భట్టి ఇంకా బెంగళూరులోనే ఉండగా!.. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇస్తారా? అన్న అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.ప్రతీ ఏడాది రాఖీ పండుగ సందర్భంగా మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సీఎం, డిప్యూటీ సీఎంలకు రాఖీ కడుతుంటారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సురేఖ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో ఉండటంతో ఆయనను కలిసే అవకాశం కూడా ఆసక్తికరంగా మారింది.సుస్మిత వ్యాఖ్యలతో దుమారం..కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపాయి. పరకాల(వరంగల్) ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డితో పాటు సీఎం రేవంత్రెడ్డిపై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పరకాల ఎమ్మెల్యే కాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి.అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి స్పష్టం చేశారు. అయినప్పటికీ సురేఖ వివరణపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ క్రమశిక్షణా కమిటీకి, అటు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు.అధిష్టానం వద్దకు వ్యవహారం..ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించింది. క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అంశంపై పార్టీ పెద్దలతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో కొండా మురళి కూడా పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరుకు వెళ్లారు. కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీలో మరికొందరిపై క్రమశిక్షణ చర్యల అంశాలపైనా ఖర్గేతో భట్టి చర్చించినట్లు సమాచారం.మౌనంగా సురేఖ.. అపాయింట్మెంట్పై ఉత్కంఠకొండా సురేఖ వ్యవహారం అధిష్టానమే చూసుకుంటుందని.. ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే సూచించారు. అయితే ఆయన అపాయింట్మెంట్ కోసం సురేఖ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటు కూతురి వ్యవహారంపైనా కొన్నిరోజులుగా కొండా సురేఖ పెద్దగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా ఆమె కొంత దూరంగా ఉంటూ.. తన నియోజకవర్గంలో జరిగే శుభకార్యాలకు హాజరవుతూ బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతలను కలిసేందుకు సురేఖ తాజాగా అపాయింట్మెంట్ కోరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా? రాఖీ కట్టేందుకు అవకాశం కల్పిస్తారా? అన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఎపిసోడ్.. లాస్ట్ మినిట్లో ఆ ట్విస్ట్ తప్పదా? -
చివరి నిమిషంలో ట్విస్ట్ ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికతో వేటుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం ఊపందుకున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. సురేఖపై చర్య ఖరారైందా? లేక అధిష్టానం చివరి నిమిషంలో మరో మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం తెలిసిందే.ఈ నివేదిక ఏఐసీసీకి చేరడంతో బంతి పూర్తిగా అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా ఈ వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో ఖర్గేతో భట్టి బెంగళూరులో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా భట్టి ఖర్గేకు వివరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే చిన్నారెడ్డి వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సిఫారసు బయటకు వచ్చిన తర్వాత సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమన్న వాదన బలపడింది. కేబినెట్ నుంచి తక్షణమే తొలగించాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు ఆగాలా? అన్న అంశంపై అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీకి ముగ్గురు కీలక నేతలుమంత్రి కొండా సురేఖతోపాటు చిన్నారెడ్డి తదితర నేతలకు సంబంధించి క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదికను ఏఐసీసీకి పంపిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపే ఉంది. అదే సమయంలో సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ఈనెల 31న ఢిల్లీకి వచ్చిన తరువాతే ఈ అంశంపై స్పష్టత వస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది.ఈ ముగ్గురు అధిష్టానంతో భేటీ అయితే సురేఖపై చర్యతోపాటు తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవలి కాలంలో పెరిగిన అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సురేఖ, చిన్నారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు రాజగోపాల్రెడ్డి, అనిరుధ్రెడ్డి తదితర ఎమ్మెల్యేల వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మురళీ భేటీలో ఏం జరిగింది?కొండా మురళీ డిప్యూటీ సీఎం భట్టిని కలిసి తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యం గురించి వివరించినట్లు చెబుతున్నారు. సురేఖ కుటుంబం తరఫున వివరణ ఇవ్వడంతోపాటు రాజకీయంగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న చర్చకు ఈ భేటీ కారణమైంది. అదే సమయంలో సురేఖ మంత్రి హోదాలో తనదైన శైలిలో వరంగల్ జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటుండడం, వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. -
వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఇద్దరికి ఉద్వాసన!
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్పై సస్పెన్స్ కొనసాగుతోంది. కేబినెట్ విస్తరణ, ప్రక్షాళనతోనే ఈ ఎపిసోడ్కు ఎండ్కార్డ్ వేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముందని సమాచారం. విస్తరణలో భాగంగా పలువురు మంత్రుల శాఖల మార్పు.. ఇద్దరు, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాముందని చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఇదిలా ఉండగా.. శాఖల మార్పు సంకేతాలతో తమ శాఖలో పూర్తయిన పనులకు రిబ్బన్ కటింగ్ చేసేందుకు మంత్రులు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, వరంగల్లో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతుంది, వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గాల్లో అనధికార పర్యటనలో పాల్గొంటున్న మంత్రి కొండ సురేఖ.. నో పొలిటికల్ కామెంట్స్ అంటూ ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు. అదే రీతిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కూడా మౌనం పాటిస్తున్నారు. అయితే, ఒక వైపు ఏం జరుగుతుందోన్న ఆందోళనలో వరంగల్ ఈస్ట్ కొండా క్యాడర్ ఉంటే.. మరో వర్గం సంబరాలు చేసుకుంటున్నారు.రెండు రోజులుగా హైదరాబాద్లో ఉన్న కొండా మురళి తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత మూడు రోజులుగా ఎక్కడ కనిపించని సుస్మిత పటేల్ హడావుడి లేకుండా సైలెన్స్ మూడ్లోకి వెళ్లిపోయారు. మరో వైపు, మాజీ ఓఎస్డీ సుమంత్ జాడ కోసం వరంగల్లో కూడా టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని రాష్ట్రవాప్తంగా ఆసక్తి నెలకొంది. -
ఎదురు మాట్లాడను.. ప్రెస్మీట్ పెట్టను: అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల: మహిళలంటే తనకు చాలా గౌరవం, వారిపై తాను ప్రెస్ మీట్లు పెట్టనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇంట్లో మా అమ్మ తిట్టినా తల వంచుకుంటానే తప్ప ఎదురు మాట్లాడను. మహిళల ఒక్క చుక్క కంటనీరు నేలపై పడ్డా అది సునామీ అయిపోయి మనం అందులో కొట్టుకుపోతామ'ని వ్యాఖ్యానించారు.కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని అనిరుధ్ రెడ్డి (Janampalli Anirudh Reddy) చెప్పారు. ఈ వ్యవహారంపై ఎవరూ మాట్లాడొద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొండా సురేఖ అంశంలో ఎమ్మెల్యేలు నిర్వహించిన ప్రెస్మీట్కు తనను ఎవరూ ఆహ్వానించలేదని వెల్లడించారు. చిన్నారెడ్డి చాలా సీనియర్ నాయకుడని, ఆయన విషయంలో తానేమి మాట్లాడబోనని అన్నారు.ప్రశ్నిస్తూనే ఉంటాతన నియోజకవర్గ సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. పెండింగ్ బిల్లుల కోసం అవసరమైతే భట్టి విక్రమార్కతో కొట్లాడుతానని, ఈయకపోతే దీక్షకు దిగుతానని వ్యాఖ్యానించారు. కాగా, కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదీ చదవండి: ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్పై సస్పెన్స్! -
ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్పై సస్పెన్స్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో.. కొండా కుటుంబంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఈ వ్యవహారం రాష్ట్రం నుంచి ఢిల్లీకి చేరడంతో రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక, ఖర్గేతో భేటీ అనంతరం కూడా భట్టి విక్రమార్క బెంగళూరులోనే ఉండటం ఆసక్తిని పెంచుతోంది.తాజా పరిణామాల్లో భాగంగా నిన్న కొండా మురళి, రాజగోపాల్రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. అయితే భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా మురళి.. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదంపై కొండా కుటుంబం తమ వైఖరిని స్పష్టం చేసినప్పటికీ.. పార్టీ అధిష్ఠానం మాత్రం కఠిన చర్యల దిశగానే అడుగులు వేస్తుందా? అన్న చర్చ మొదలైంది.ఇదిలా ఉంటే.. కొండా మురళి, రాజగోపాల్రెడ్డితో భేటీ అనంతరం భట్టి విక్రమార్క నేరుగా బెంగళూరు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా ఖర్గేతో భట్టి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో కొండా కుటుంబం వ్యవహారంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను భట్టి ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా సుస్మిత తాజాగా చేసిన వ్యాఖ్యలు, వాటిపై పార్టీలో నెలకొన్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో.. ఆ సిఫారసులను అమలు చేయాల్సిన అవసరం ఉందని భట్టి అధిష్ఠానం వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. కొండా కుటుంబంతో పాటు సీనియర్ నేత చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని భట్టి కోరినట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం క్రమశిక్షణతో ముందుకు సాగాలంటే.. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే నేతలపై చర్యలు తప్పవని ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు.ఇంకా బెంగళూరులోనే భట్టి..మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం కూడా భట్టి విక్రమార్క బెంగళూరులోనే ఉండటం ఆసక్తిని పెంచుతోంది. మరోసారి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో కొండా ఫ్యామిలీపై కాంగ్రెస్ అధిష్ఠానం చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. క్రమశిక్షణ కమిటీ సిఫారసులకు ఆమోదం లభిస్తుందా? కొండా కుటుంబంపై చర్యలు తప్పవా? చిన్నారెడ్డిపై కూడా వేటు పడుతుందా? లేక వివాదానికి మరోసారి సర్దుబాటు పరిష్కారం చూపుతారా? అన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.సీఎం, పీసీసీ అభిప్రాయాలపైనా చర్చఇదిలా ఉండగా.. కొండా కుటుంబం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీపీసీసీ నాయకత్వం అభిప్రాయాలపైనా భట్టి-ఖర్గే మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదాన్ని రాష్ట్ర స్థాయిలోనే ముగించాలా? లేక అవసరమైతే ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలా? అన్న అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ అంశాన్ని ఇకపై సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని భట్టి అధిష్ఠానానికి సూచించినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని కూడా కోరినట్లు సమాచారం.చదవండి: ‘రేవంత్పై కొండా సుస్మిత వ్యాఖ్యలతో నాకేం సంబంధం’ -
వేటేస్తారా... వదిలేస్తారా?
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆమెపై వేటు వేయాల్సిందేనంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో శంఖంలో పోయడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసమైన ప్రజాభవన్ వేదికగా నాటకీయ ఘటనలు జరిగాయి. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన మరుసటి రోజు బుధవారం భట్టి నివాసంలో కొండా మురళీ కనిపించారు. ఆయన వచ్చిన సమయంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కనిపించింది. కొండా ఎపిసోడ్ను కోల్డ్స్టోరేజీలో పెట్టే దిశలో పరిణామాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సురేఖ కుటుంబంతో మాట్లాడే బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. భట్టికి అప్పగించారని, అందులో భాగంగానే మురళీని కలిశారని అంటున్నారు. కలిసి వచ్చారా..? మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, అసమ్మతికి మారుపేరైన రాజగోపాల్రెడ్డి ప్రజాభవన్లో ఉన్న సమయంలోనే మురళీ కూడా రావడం అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, గ్లోబల్ సమ్మిట్పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కోసం ఉత్తమ్, శ్రీధర్బాబు వచ్చారని, తన నియోజకవర్గ పనుల కోసం రాజగోపాల్రెడ్డి వచ్చారే తప్ప ముందస్తు సమాచారం ప్రకారం రాలేదని ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి. కానీ, మురళీని కలిసేందుకు భట్టి సమ్మతించడం, సీఎంతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతుండటం, సాయంత్రానికి హడావిడిగా బెంగళూరుకు బయలుదేరి వెళ్లడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ వ్యక్తమవుతోంది. భట్టి భుజంపై తుపాకీ పెట్టి సురేఖ కుటుంబాన్ని కాల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదంటే తొందరపడద్దనే ధోరణితో సీఎం ఉన్నారా... లేదా సురేఖ వ్యవహారం మధ్యే మార్గంలో వెళ్తుందా అన్న చర్చ గాం««దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. భట్టి గురువారం బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మాత్రం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సెపె్టంబర్ 7 నాటికే కొండా ఎపిసోడ్కు ఫుల్స్టాప్ పడుతుందని సమాచారం. మురళీ ఏమన్నారంటే... మురళీ, భట్టి భేటీలో ఏం జరిగిందన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం భట్టి కొంత గట్టిగానే మాట్లాడినట్టు తెలుస్తోంది. సుస్మిత చేసిన వ్యాఖ్యలు సీఎంను కించపరిచేలా, పార్టీని నష్టపరిచేలా ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. అయితే, సుస్మిత మాటలతో తనకేం సంబంధమని మురళీ చెప్పినట్టు తెలిసింది. పదేపదే వివాదాలకు కారణమవడం, జిల్లా నేతలతో సమన్వయంతో వ్యవహరించలేకపోవడం, సీఎంతో ముఖాముఖి కలిసే పరిస్థితి కూడా లేకుండా చేసుకోవడం లాంటి అంశాలపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం. అనంతరం మురళీ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఓ బిల్లు కోసం భట్టి దగ్గరకు వచ్చానని చెప్పారు. సుస్మిత వ్యాఖ్యల గురించి తాను భట్టితో మాట్లాడలేదని, ఆ వ్యాఖ్యలకు తనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ‘అది నా బిడ్డకు సంబంధించింది. ఆమెకు 35 ఏళ్ల వయసు.. 15 ఏళ్ల పిల్లలున్నారు. వరల్డ్ చాంపియన్ అయిన కొడుకు ఉన్నాడు. ఆమె మనోభావాలు ఆమెకు ఉండొచ్చు. ఎవరి స్వతంత్రత వారిది... ఆమెను ప్రశ్నించే హక్కు మాకు లేదు. ఆమె ప్లాన్ ఏలో భాగంగా ఏదో మాట్లాడింది. ప్లాన్ బీలో ఏం చేస్తుందో.. ఆమె మనసులో ఉన్నది మాకెలా తెలుస్తుంది. కవిత గారు పోయారు. అలానే ఎవరి నిర్ణయం వాళ్లు తీసుకుంటారు. మాకు సోనియా, రాహుల్, ప్రియాంకా గాం«దీలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. మేం కాంగ్రెస్లోనే ఉంటాం’ అని మురళీ వ్యాఖ్యానించారు. రాజగోపాల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గ విషయాలు మాట్లాడేందుకు ప్రజాభవన్కు వచ్చానన్నారు. తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి గురించి, వ్యక్తిగతంగా ఎవరి గురించీ మాట్లాడలేదన్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో హైకమాండ్దే తుది నిర్ణయమని, ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహించాల్సిందేనన్నారు. సురేఖ విషయంలోనూ హైకమాండ్దే తుది నిర్ణయమని, ఈ విషయంలో సీఎం అభిప్రాయమే తన అభిప్రాయమన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకో రాధాకృష్ణ: రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్, ఆ చానల్ ఎండీ రాధాకృష్ణకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ఏబీఎన్ చానల్ ఎవరికి సపోర్ట్ చేస్తోంది. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. లేదంటే మర్యాద దక్కదు. మా కెపాసిటీ ఏంటో చూపిస్తే మీ చానల్, పేపర్ ఉండవు. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీపరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పారీ్టల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నతస్థాయిలో ఉండొచ్చు. అంతమాత్రాన పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడిన మాలాంటి వ్యక్తులను కించపరచొద్దు. అసలైన కాంగ్రెస్ రక్తం మాది. మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు రాస్తే బాగుండదని హెచ్చరిస్తున్నా. మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపర్చే విధంగా ప్రయత్నించడం మంచిది కాదు. ఎవరు చేస్తున్నారో వారికే చెబుతున్నా. కొందరు వ్యక్తుల గురించి, వారిని బలంగా చేసేందుకు నా లాంటి వారిని బలహీనులను చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి... ఇలాంటి చానళ్లు, పేపర్లు 100 పెడతా. మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు’ అని రాజగోపాల్రెడ్డి హెచ్చరించారు. -
‘సీఎం రేవంత్పై కొండా సుష్మిత వ్యాఖ్యలతో నాకేం సంబంధం’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్లో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కివేసే ప్రయత్నం జరుగుతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి వివాదాన్ని సర్దుమణిచే ప్రయత్నంలో భాగంగా కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కాగా, ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారన్న ప్రచారంపై ఆయన స్పందించారు. కొండ సుస్మిత పటేల్ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు. మునుగోడు అభివృద్ధి నిధుల విషమై చర్చించేందుకు భట్టి విక్రమార్కను కలిశాను. నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని నేను. ఎంపీ, ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం ఆనాడు ఫైట్ చేశా. తెలంగాణ ఏర్పాటులో భాగస్వామ్యం లేని వాళ్ళు ఇవాళ విమర్శలు చేస్తున్నారు.నా పైన విమర్శలు చేసే వాళ్ళు వాళ్ళ స్థాయి ఏంటో గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కి వేసే ప్రయత్నం జరుగుతుంది. ఉద్యమంలో లేనివాళ్లు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉండవచ్చు. కొండా సుస్మిత పటేల్ అంశాన్ని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. నాలాంటి ఉద్యమ నేతలను విమర్శ చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం’అని హెచ్చరికలు జారీ చేశారు.👉ఇదీ చదవండి: కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు -
కొండా సురేఖ రాజీనామా చేస్తారా?.. ఢిల్లీలో హైఓల్టేజ్ పాలిటిక్స్
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేయడంతో.. ఏఐసీసీ పెద్దలు తదుపరి నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ విషయంలో ఎలాంటి చర్య తీసుకోవాలన్న దానిపై అధిష్టానంలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.అయితే, కొండా సురేఖను నేరుగా మంత్రి పదవి నుంచి తప్పిస్తే రాజకీయంగా ఎలాంటి విమర్శలు ఎదురవుతాయన్న అంశాన్ని కూడా ఏఐసీసీ నేతలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఆమె బీసీ మహిళా మంత్రి కావడంతో నేరుగా వేటు వేస్తే పార్టీపై వచ్చే రాజకీయ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సస్పెన్షన్కు బదులుగా రాజీనామా చేయించడం ద్వారా మధ్యేమార్గాన్ని అనుసరించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, తుది నిర్ణయం తీసుకునే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో అధిష్టానం నేరుగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల ఎంపిక కోసం 28న లక్కీ డ్రా.. ఇక, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీపై ఈ వ్యవహారం చూపుతున్న ప్రభావం, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొండా సురేఖపై ఎలాంటి చర్య ఉంటుందన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సస్పెన్షన్ చేస్తారా? లేక మంత్రి పదవికి రాజీనామా చేయిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.చిన్నారెడ్డి పరిస్థితేంటి?మరోవైపు సీనియర్ నేత చిన్నారెడ్డి విషయంలోనూ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయనను అధికార పదవి నుంచి తప్పిస్తారా? లేక కేవలం మందలింపుతో వ్యవహారాన్ని ముగిస్తారా? అనే అంశాలపై కూడా ఏఐసీసీ పెద్దలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇద్దరిపై ఒకే తరహా చర్య తీసుకోవాలా? లేక వారి వ్యవహారాలను వేర్వేరుగా పరిగణించాలా? అన్నదానిపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. మంత్రి కొండా సురేఖ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే, క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి నివేదిక పంపిన నేపథ్యంలో ఈ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ రియాక్షన్పై పలువురు నేతలు ఎదురుచూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. కాగా, మంత్రి సురేఖ మాత్రం ఈ అంశంపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. -
వేటు వేయండి!
సాక్షి, హైదరాబాద్: అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిపై చర్యలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. పార్టీకి ఇబ్బంది కలిగేలా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారని, ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి, చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని పార్టీని కోరింది. ఈ మేరకు కొండా సురేఖ, చిన్నారెడ్డిలకు సంబంధించిన నివేదికలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు అనంతుల శ్యాంమోహన్, వాజిద్ హుస్సేన్ తదితరులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ను కలిసి నివేదికను అందజేశారు. ఈ నివేదికను ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందా..? లేక నేరుగా అధిష్టానం పరిశీలించి నిర్ణయం వెంటనే తీసుకుంటుందా? లేక ఏఐసీసీ స్థాయిలో వారిద్దరిని పిలిపించి వారి వివరణలు తీసుకున్నాక తుది నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆసక్తికర చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఆమెను తప్పించడమే పరిష్కారం మంత్రి కొండా సురేఖ విషయంలో ఇచ్చిన నివేదికలో ‘క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటం సురేఖకు అలవాటుగా మారింది. ఆమె రాజకీయ నేపథ్యమంతా వివాదాలతో కూడుకున్నదే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఆమె వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రెండుసార్లు పార్టీకి క్షమాపణలు చెప్పి మళ్లీ పార్టీ నియమావళిని ఉల్లంఘించారు. అమెను మంత్రి పదవి నుంచి తప్పించడమే సరైన చర్య అని భావిస్తున్నాం’ అని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. సురేఖకు సంబంధించి మూడు, చిన్నారెడ్డిపై రెండు పేజీల నివేదికతోపాటు ఇందుకు తగిన ఆధారాలను కూడా పొందుపరిచిన క్రమశిక్షణ కమిటీ ఇదే నివేదికను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు కూడా పంపినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. మంచి అవకాశమిచ్చాం... విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ చిన్నారెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా, గెలిచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి అవకాశం ఇచ్చాం. కేబినెట్ హోదా ఇచ్చాం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఆయన కేబినెట్ సమావేశాలకు కూడా వస్తున్నారు. తొమ్మిదిసార్లు ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది. పోటీ చేసేందుకు అవకాశామిచ్చింది. కానీ ఉద్దేశపూర్వకంగానే పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరించారని, పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడారని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించి ఆయన్ను పదవి నుంచి తప్పించాలి’ అని చిన్నారెడ్డి గురించి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. హైకమాండ్ నిర్ణయం మేరకు చర్యలు: మల్లురవి పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్కు నివేదిక ఇచ్చిన అనంతరం గాం«దీభవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ప్రధానమైందని చెప్పారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి గురించిన అన్ని విషయాలు, సిఫారసులను తమ నివేదికలో పొందుపర్చామని చెప్పారు. ఈ నివేదికను ఏఐసీసీ చీఫ్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పంపుతారని చెప్పారు. ఏదైనా హైకమాండ్దే తుది నిర్ణయమని, తమ సిఫారసుల ద్వారా పార్టీ కేడర్కు ఓ సందేశం వచ్చేలా నివేదిక ఇచ్చామని మల్లురవి స్పష్టం చేశారు. పార్టీ పెద్దగా తనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా సురేఖ, చిన్నారెడ్డి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ కోణంలో ఆ ఇద్దరికి నోటీసులు ఇస్తే.. ఆ నోటీసులనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సమాధానం ఇవ్వడం సబబు కాదని వ్యాఖ్యానించారు. కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన అంశం కొండా సురేఖకు తెలియకుండానే జరుగుతుందా అని పశి్నంచారు. సాయంత్రం సీఎం రేవంత్రెడ్డిని కూడా కలిసి నివేదికలోని అంశాలను వివరించడానికి ప్రయత్నించారు. కానీ రేవంత్ బిజీ షెడ్యూల్ కారణంగా కలవలేకపోయారని, వీలును బట్టి బుధవారం సీఎంను కలిసే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.ఏమి జరుగుతుందో? కఠిన చర్యలు తీసుకోవాలన్న క్రమశిక్షణ కమిటీ నివేదిక నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు హైకమాండ్ అంగీకరిస్తుందా? లేక గౌరవప్రదంగా ఆమెతో రాజీనామా చేయిస్తుందా..? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమె శాఖను మారుస్తారా.. ఇంతకు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు చిన్నారెడ్డి విషయంలో ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు... అధికారిక పదవి నుంచి మాత్రమే తప్పిస్తారా లేదంటే మందలింపుతో సరిపెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. -
కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ మంత్రిపై చర్యలకు సిపారసు చేసింది. ఈ రోజు (మంగళవారం) టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్కు ఆరు పేజీల నివేదికను అందించింది. నివేదికలో.. "కొండా సురేఖ పదే పదే తప్పులు చేస్తున్నారు. గతంలో కూడా కీలక వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుటుంబసభ్యులను కంట్రోల్ చేయలేకపోతున్నారు. సురేఖపై చర్యలు తీసుకోకపోతే పార్టీకే నష్టం" అని తెలిపింది. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో మల్లురవి భేటీ కానున్నారు. సీఎం రేవంత్ను కలిసి నివేదికలోని అంశాలు వివరించనున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఏ నిర్ణయం తీసుకోనుందా అని ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ అంశంపై ఇదివరకే సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ‘కొండా సురేఖ అంశం క్రమశిక్షణా కమిటీ పరిధిలో ఉంది. పార్టీ అంతర్గత అంశాలపై మీడియా ముఖంగా మాట్లాడను. తీసుకునే నిర్ణయాలకు మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కమిటీ సైతం మంత్రిపై చర్యలకు సిపారసు చేసింది.అసలు వివాదం ఏంటి?ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ అభ్యంతకరంగా మాట్లాడారు. 'సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతి అబ్బలేదు. టీడీపీ నుంచి వచ్చిన వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోంది. అచ్చ కాంగ్రెస్కు స్థానం లేకుండా చేస్తున్నారు. ఎప్పుడూ ఏం మాట్లాడతారో సీఎంకు తెలియదు. సంగారెడ్డికి వెళ్లినపుడు జగ్గారెడ్డి విషయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం.. పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎలా కోరతారు’ అని ప్రశ్నించారుఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే సీఎం కాదన్నారు. తాము కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా, రాహల్, ప్రియాంకలను గౌరవిస్తామన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఆనందంగా లేరన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్లో కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడారు.కొండా సురేఖ వివరణకాగా ఈ వివాదంపై ఇదివరకే కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మంత్రి స్పందిస్తూ.. ‘సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక స్వతంత్ర వ్యక్తిగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకానీ ఆ వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా నియమావళిపై నాకు పూర్తి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ నాకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కొండా సురేఖ కోరారు. అయినప్పటికీ క్రమశిక్షణ కమిటీ ఆమెపై చర్యలకే సిపారసు చేసింది.ఇదీ చదవండి: ఒంటరైన మంత్రి కొండా సురేఖ -
జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదులో అలసత్వం వహించారంటూ సీఐపై వేటు వేసింది. సుమంత్ను పట్టుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకుంది. మూడు వారాల క్రితమే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్గా ముత్తు యాదవ్ బాధ్యతలు చేపట్టారు.కాగా, హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు మూడు బృందాలు ఏర్పాటు చేయగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. గత నెల 30న జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయానికి సుమంత్ సహచరులు రాము డబ్బు వ్యవహారంలో మాట్లాడేందుకు చెంగిచెర్ల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ని పిలిపించారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టుఅక్కడే ఉన్న సుమంత్ ఆయన అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము తదితరులు ఇనుపరాడుతో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సుమంత్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ఆయన డ్రైవర్ నవీన్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
అధిష్టానం కోర్టులోకి!
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోర్టులోకి చేరింది. ఈ విషయంలో ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయంపైనే ఆమె భవితవ్యం ఆధారపడి ఉంటుందని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు తగినట్టుగానే సోమవారం రెండు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్రెడ్డి అటు విలేకరుల సమావేశంలోనూ ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీలోనూ సురేఖ అంశంపై స్పందించారు. అంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందని విలేకరుల సమావేశంలో చెప్పిన ఆయన.. ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని సూచించారు. ‘పాజిటివ్ వద్దు.. నెగెటివ్ వద్దు.. సురేఖ ఎపిసోడ్ గురించి మాట్లాడొద్దు.. ఫుల్స్టాప్ పెట్టండి... విషయం హైకమాండ్ దగ్గరకు వెళ్లింది కదా. వారు నిర్ణయం తీసుకోవాలి.’అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మరోవైపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, షోకాజ్ నోటీసులకు సురేఖ సమాధానంపై ప్రాథమిక నివేదికను పార్టీకి అందజేసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్లకు కమిటీ చైర్మన్ మల్లురవి సోమవారం ప్రాథమిక నివేదికను అందజేశారు. సుస్మిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్టను వ్యక్తిగతంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. కాగా, ఈ నివేదిక ఆధారంగా సుస్మిత, సురేఖల అంశంపై పీసీసీ నుంచి కూడా ఏఐసీసీకి ఓ నివేదిక వెళుతుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత రాష్ట్ర పార్టీ పెద్దలకు హస్తిన నుంచి పిలుపు వస్తుందని, అక్కడ జరిగే చర్చలో సీఎం, పీసీసీ చీఫ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఆ వర్గాల్లో జరుగుతోంది. నాడు అడ్డుకున్నదెవరు? ఈ ఎపిసోడ్లో మరో ఆసక్తికర అంశం వెలుగులోనికి వచ్చింది. గతంలో కూడా సురేఖ కుమార్తె సుస్మిత తననుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే సీఎం రేవంత్ చాలా సీరియస్గా తీసుకున్నారని, ఈ అంశంపై అధిష్టానం దగ్గర చర్చ జరిగినప్పుడు కొండా కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అడ్డుకున్నారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. అప్పుడు చర్యలు తీసుకోకపోవడంతోనే మరోమారు సుస్మిత సీఎం మీద మాట్లాడగలిగారని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. ఈసారి తాను కూడా కాపాడలేనని ఇటీవల మహేశ్గౌడ్ నిజామాబాద్లో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనమని వారంటుండడం గమనార్హం. కాగా, కొండా సురేఖ ఎపిసోడ్ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిల మధ్య కూడా చర్చకు వచ్చింది. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో తెలంగాణ రైజింగ్–2027 సమీక్షకు ముందు తాజా రాజకీయ వివాదం గురించి ఇద్దరూ మాట్లాడుకున్నట్టు సమాచారం. సురేఖ విఫలమయ్యారు: క్రమశిక్షణ కమిటీ విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రి కొండా సురేఖపై చర్యలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. సురేఖ కుమార్తె సుస్మిత పదేపదే సీఎంను కించపరిచేలా, పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతుంటే ఆమెను నియంత్రించడంలో సురేఖ విఫలమయ్యారని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. తాము సుస్మిత మాట్లాడిన మాటలు, ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలను క్షుణ్ణంగా పరిశీలించామని, సురేఖ సమాధానాలను కూడా పరిశీలించామని, అన్నింటినీ పరిశీలించిన మీదట క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సురేఖ అర్హురాలని, ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఏఐసీసీ నిర్ణయమని టీపీసీసీ ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. -
మంత్రి పదవికి గండం...? రేవంత్ తో సురేఖ భేటీపై ఉత్కంఠ
-
కొండా సురేఖ ఇష్యూ.. రేవంత్ కీలక భేటీ!
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటన రద్దు తర్వాత హైదరాబాద్కు తిరిగొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్న పరిణామాలపై దృష్టి సారించారు. సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం, పార్టీలో క్రమశిక్షణ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్రెడ్డి తన విదేశీ పర్యటనను కుదించుకుని లండన్ నుంచి తిరిగి వచ్చారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించగా.. కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడింది. దీనిపై తిరిగి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం రేవంత్ అన్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్(చిట్టక్క) సీఎం రేవంత్ రెడ్డికి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తట్టుకోలేకపోతున్నారు. కూతురి వ్యాఖ్యలను ఖండించకపోగా.. నాకేం సంబంధం అన్నట్లు సురేఖ మాట్లాడటాన్ని కూడా అంగీకరించడం లేదు. ఇప్పటికే ఈ విషయమై క్రమశిక్షణా కమిటీకి వాళ్లంతా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంతో తమ అభిప్రాయాలను పంచుచుకోనున్నారు. మరోవైపు.. కొండా సురేఖ ఎపిసోడ్తో పాటు వనపర్తిలో చిన్నారెడ్డి-ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆదిలాబాద్ నేతలు కంది శ్రీనివాస్రెడ్డి-అల్లూరి సంజీవరెడ్డి గొడవ, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇటు.. కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖ చిక్కుల్లో పడ్డారు. వివరణ కోరుతూ పీసీసీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె నిన్న బెంగళూరు వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. గంట పాటు వీళ్ల మధ్య భేటీ జరిగింది. మరోవైపు ఈ పరిణామాల మధ్య మంత్రి కొండా సురేఖ ఇవాళ సీఎంను కలుస్తారనే ప్రచారం సాగుతోంది. తన శాఖ సమీక్ష కోసం ఆమె సచివాలయానికి చేరుకునే అవకాశం ఉంది.దీంతో ఈ వరుస భేటీలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సాయంత్రం ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆయన స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఫ్యామిలీ వ్యవహారం.. ఏం చేస్తే ఏమవునో? -
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కోసం గాలింపు
హైదరాబాద్: హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు మూడు బృందాలు ఏర్పాటు చేయగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. గత నెల 30న జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయానికి సుమంత్ సహచరులు రాము డబ్బు వ్యవహారంలో మాట్లాడేందుకు చెంగిచెర్ల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ని పిలిపించారు. అక్కడే ఉన్న సుమంత్ ఆయన అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము తదితరులు ఇనుపరాడు తో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సుమంత్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ఆయన డ్రైవర్ నవీన్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ఖర్గేను కలిసిన సురేఖ.. నేడు రేవంత్ ప్రెస్మీట్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొనసాగుతున్న కొండా కుటుంబ వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ నిన్న బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లిన ఆమె రాత్రి 8.45 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.బెంగళూరులో ఖర్గేతో భేటీ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను మంత్రి సురేఖ.. ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చిన తర్వాత అన్ని విషయాలను ఆయనతో మాట్లాడతానని కొండా సురేఖ పేర్కొన్నట్లు సమాచారం. అలాగే, ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్గౌడ్లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్పై పీసీసీ చీఫ్ రియాక్షన్ఇదిలా ఉండగా, లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రాకతో కొండా కుటుంబ వ్యవహారంపై తదుపరి పరిణామాలపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ సీఎంను కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉందని, ఈ వ్యవహారంపై పార్టీ పరంగా కీలక నిర్ణయం వెలువడే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమెరికా పర్యటన రద్దు కావడానికి గల కారణాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కారణంగానే తన పర్యటన రద్దయిందన్న అంశంపై కూడా సీఎం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. -
మల్లికార్జున ఖర్గేను కలిసిన మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరింది. ఆదివా రం మధ్యాహ్నం ఆమె బెంగళూరుకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. దాదాపు 15 నిమిషాలపాటు ఇద్దరి భేటీ జరిగిందని సమాచారం. అయితే బెంగళూరుకు వెళ్లి ఖర్గేను కలిసిన విషయంలో మంత్రి సురేఖ గోప్యత పాటించడం.. సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకోనున్న ముందు రోజే ఆమె ఏఐసీసీ అధ్యక్షుడితో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అన్ని విషయాలపై వివరణ ఖర్గేను కలిసిన సందర్భంగా మంత్రి సురేఖ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై మాట్లాడినట్టు తెలిసింది. ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్గౌడ్లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం. బీజేపీ చీఫ్ రాంచందర్రావుకు తారసపడిన సురేఖ మంత్రి కొండా సురేఖ బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురూ పలకరించుకున్నారని, ఆ సమయంలోనే బెంగళూరు నుంచి వస్తున్నానని సురేఖ వెల్లడించారని సమాచారం. -
కొండా సురేఖకు ఆలిండియా ఓబీసీ సంఘం మద్దతు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ఆలిండియా ఓబీసీ సంఘం మద్దతు ప్రకటించింది కొండా సురేఖకు అండగా ఉంటామని స్పష్టం చేసింది. కొండా సురేఖ బీసీ మంత్రి కాబట్టే కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని ఓబీసీ సంఘం విమర్శించింది. కొండా సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా నోటీసులిచ్చారని మండిపడింది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, చిన్నారెడ్డిలు వ్యతిరేకంగా మాట్లాడినా నోటీసులు ఇవ్వలేదని, అదే కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన దానికి మాత్రం నోటీసులిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి కొండా సురేఖకు అన్యాయం జరిగితే మాత్రం రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించింది. కాంగ్రెస్లో కొందరు చెంచాలున్నారని, అందుకే ఈ తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని దుయ్యబట్టింది. కొండా సురేఖ రెండో లేఖపై సమీక్షిస్తాంకావాలనే కొందరు తనను టార్గెట్ చేశరని, కుమార్తె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా కావాలనే కొంతమంది నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ మరో లేఖ రాసింది. దీనిపై క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందిస్తూ.. కొండా సురేఖ రెండో లేఖపై సమీక్షిస్తామన్నారు. తెరవెనుక ఎవరున్నారనేది చెప్పాల్సిన అవసరం లేదని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదీ చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్పై టీపీసీసీ చీఫ్ రియాక్షన్కొండా సురేఖ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. చర్యలకు కాంగ్రెస్ సిద్ధం -
కొండా సురేఖ ఎపిసోడ్పై టీపీసీసీ చీఫ్ రియాక్షన్
సాక్షి, నిజామాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ.. కానీ హద్దులు ఉల్లంఘిస్తే ఎంత పెద్దవారినైనా ఉపేక్షించం’’ అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన కొండా సురేఖ ఎపిసోడ్పై స్పందిస్తూ.. ప్రతి పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీలో మరింత ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందన్నారు. అయితే, క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడితే సహించబోమన్నారు.నేతలకు ఇబ్బందులు ఉంటే పార్టీ వేదికలపై మాట్లాడాలని.. అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడటం సమంజసం కాదని మహేష్ గౌడ్ హితవు పలికారు. కాగా, నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తపనతో ముందుకు వెళ్తున్నామన్న మహేష్ గౌడ్.. జిల్లా అభివృద్ధి గతంలో కాంగ్రెస్ హయంలో జరిగిందన్నారు.వైఎస్సార్ హయంలో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. కొత్తగా అధికారంలోకి వచ్చాక ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం. రాష్ట్రంలో అత్యధికం ఇందిరమ్మ ఇళ్లు జిల్లాలో ఇచ్చాం. హైదరాబాద్ మాదిరి నిజామాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ టవర్స్ చేపట్టినట్లు మహేష్ గౌడ్ అన్నారు. -
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి.. ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని సుమంత్పై ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుమంత్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.మేడ్చల్ మల్కాజగిరి జిల్లా మేడిపల్లిలో సుమంత్పై కేసు నమోదు చేశారు పోలీసులు. రాడ్లుతో దాడి చేసినట్లు వ్యాపారి గొంగడి హరికృష్ణ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. సుమంత్పై 109 సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది.అయితే మేడిపల్లిలో పీఎస్లో జీరో ఎఫ్ఐఆర్(నేరం ఎక్కడ జరిగినా, ఏ ప్రాంతానికి చెందినదైనా సరే... బాధితులు తమకు దగ్గరలోని ఏ పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవడం) నమోదు చేయడంతో ఇప్పుడు ఆ కేసు జూబ్లీహిల్స్కు బదిలీ అయ్యింది. సుమంత్తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. -
నేడు రేవంత్ రాక.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్పై బిగ్ సస్పెన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సీరియల్ ఎపిసోడ్లా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్టాపిక్గా మారింది. సొంత పార్టీ నేతలే తనపై విమర్శలు చేస్తున్నా పార్టీ అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మంత్రి కొండా సురేఖ మరోసారి లేఖాస్త్రం సంధించడం చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ, కొండా మురళి వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణ కమిటీ మరోసారి ఈ అంశాన్ని చర్చించనుంది. తదుపరి సమావేశంలో కొండా వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.మరోసారి లేఖాస్త్రం..తనపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేస్తున్న తనపై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనపై వస్తున్న విమర్శల విషయంలో పార్టీ నాయకత్వం స్పందించాలని ఆమె కోరినట్లు సమాచారం.ఇది కూడా చదవండి: కొండా సురేఖపై చర్యలు.. కాంగ్రెస్లో తర్జనభర్జనకొండాపై గరం..మరోవైపు కొండా కుటుంబం తీరుపై కాంగ్రెస్లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు కొండా కుటుంబం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు మరో అడుగు ముందుకేసి పార్టీ నుంచి బయటకు వెళ్లాలని అల్టిమేటం ఇస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వివాదం వ్యక్తిగత విమర్శల స్థాయి దాటి పార్టీ అంతర్గత క్రమశిక్షణ అంశంగా మారింది.సీఎం రాగానే కీలక పరిణామాలు?ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉండగా.. నేడు రాత్రి ఆయన హైదరాబాద్కు తిరిగి రానున్నారు. సీఎం రాకతో కొండా వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో.. సీఎం సమక్షంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత.. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూపులు.. ఇంకోవైపు మంత్రి కొండా సురేఖ వరుస లేఖలు.. ఇలా కాంగ్రెస్లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతోంది. క్షమాపణ చెబుతారా? పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది. సీఎం హైదరాబాద్కు తిరిగొచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. -
కొండా సురేఖ బేషరతుగా రాజీనామా చేయాలి
సాక్షి, ఆదిలాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అటవీశాఖ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యలకు మంత్రే బాధ్యత వహించాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో శనివారం పర్యటించిన ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బేషరతుగా మంత్రి కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్రెడ్డి చేసిన కృషిని మరవద్దన్నారు. అంతకు ముందు ఉట్నూర్లోని బాలికల ఆశ్రమ పాఠశాలను లక్ష్మణ్ సందర్శించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు, జుంబా, ఏరోబిక్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మంత్రి చేతుల మీదుగా విద్యార్థినులకు యూనిఫాం, కిట్లను అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు భోజనం చేశారు. కేబీ కాంప్లెక్స్లో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సంతోష్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేవిప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, రాంచంద్రునాయక్ సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ విప్లు సీహెచ్ విజయరమణారావు, ఆది శ్రీనివాస్, రాంచంద్రునాయక్ డిమాండ్ చేశారు. రాష్రా ్టన్ని గాడిలో పెట్టేందుకు రోజుకు 18 గంటలు శ్రమిస్తోన్న సీఎం రేవంత్రెడ్డికి తాము అండగా ఉంటామన్నారు. శని వారం సీఎల్పీ మీడియా హాల్లో ఎమ్మెల్యేలు రాజ్ఠాకూర్, నవీన్ యాదవ్ తో కలిసి విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడుతూ కొండా సుస్మిత అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యు రాలే కాదని, ఆమె చేసిన వ్యాఖ్యలకు తల్లిగా సురేఖ బాధ్యత తీసుకోవాల్సిందని అభిప్రా యప డ్డారు. సురేఖ క్షమాపణలు చెప్పాల్సిందని, అలా చెప్పకపోవడం, కనీసం ఖండించక పోవడం దారుణమన్నారు. విజయ రమణా రావు మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి కొందరు ఇష్టారాజ్యాంగా మాట్లాడు తున్నా రని, పదవులు అనుభవిస్తూనే ప్రభు త్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిప డ్డారు. కుటుంబ సభ్యురాలు అసభ్యంగా మా ట్లాడితే ఖండించకపోగా పరోక్షంగా మద్ద తిచ్చేలా సురేఖ తీరు ఉందని రాంచంద్రు నాయక్ ఆరోపించారు. ఆమె నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే బాగుంటుందన్నారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎంపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్ఠాకూర్, నవీన్ యాదవ్ డిమాండ్ చేశారు. -
ఏం చేస్తే.. ఏమవునో!
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా అటవీ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ కుటుంబమే కేంద్రంగా అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయం చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సృష్టించిన వ్యాఖ్యల కలకలం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో ఉంది. సురేఖను బర్తరఫ్ చేస్తారని, మంత్రి పదవి నుంచి తీసేస్తారని, ఇందుకు అధిష్టానంతో రేవంత్ సంప్రదింపులు జరుపుతున్నారని, లేదంటే ఆమెతో రాజీనామా చేయిస్తారని సీఎం వర్గం ప్రచారం చేస్తున్నా... అసలు ఏం చేయాలనే విషయంలో మాత్రం అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వం తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. బీసీ వర్గాలకు చెందిన మహిళా మంత్రి కావడం, ఇదే సమయంలో మరికొందరు ముఖ్య నేతలు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందోననే చర్చ జరుగుతోంది. రేవంత్ విదేశీ పర్యటనలో ఉండగా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చే నెల 2 వరకు అందుబాటులో ఉండరన్న ఢిల్లీ వర్గాల సమాచారం నేపథ్యంలో ఈ ఎపిసోడ్ మరికొన్ని రోజులు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం వర్గం అప్రమత్తం సీఎం రేవంత్రెడ్డి సన్నిహితులైన ఎమ్మెల్యేలు, నేతలు కొండా ఎపిసోడ్లో తమ వంతు పావులు కదుపుతున్నారు. రేవంత్ సన్నిహితుడైన ఎంపీ వేం నరేందర్రెడ్డి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కుటుంబ ఎపిసోడ్ను ఎలా ముగించాలన్న దానిపైనే ఎక్కువగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఆమెను తప్పించేలా అధిష్టానాన్ని ఒప్పించాలా లేదంటే ఆమెతో రాజీనామా చేయించాలా లేదా మరో మార్గంలో అంతర్గతంగా ఏదైనా సర్దుబాటు చేయాలా అనే కోణంలోనే ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే, రేవంత్ ఆదివారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్కు రానుండటంతో ఆయన వచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్లో ఎలాంటి సంకేతాలిస్తారన్నది కీలకంగా మారనుంది. ఆయన్ను కలిసి మాట్లాడతానని సురేఖ చెప్పిన నేపథ్యంలో ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చి కలుస్తారా లేదంటే అధిష్టానం పెద్దలతో మాట్లాడతారా? తనకు బహిరంగంగా మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యేలకు ఆయన ఏం చెప్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేవంత్కు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. సురేఖతో పాటు రాజగోపాల్రెడ్డి, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుపడుతున్నారు. కానీ, రేవంత్ కేబినెట్ సహచరులెవరూ ఇప్పటివరకు బహిరంగంగా ఈ అంశంపై మాట్లాడకపోవడం రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అన్నీ పరిశీలించాకే తుది నిర్ణయం: క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ శనివారం గాం«దీభవన్లో సమావేశమైంది. చైర్మన్ మల్లురవి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులు శ్యాంమోహన్ తదితరులు పాల్గొని కమిటీ ముందు పెండింగ్లో ఉన్న పలు అంశాలపై చర్చించారు. రేవంత్నుద్దేశించి సుస్మితా పటేల్ మాట్లాడిన వీడియోను పరిశీలించారు. వనపర్తి నియోజకవర్గం విషయంలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి మాట్లాడిన వీడియోలను కూడా పరి«శీలించారు. అనంతరం మల్లురవి మీడియాతో మాట్లాడుతూ.. తమ నోటీసుకు సురేఖ ఇచ్చిన సమాధానాన్ని, సుస్మిత మాట్లాడిన వీడియోను కమిటీ పరిశీలించిందని చెప్పారు. ‘ముఖ్యమంత్రిని ఒక మామూలు వ్యక్తి కంటే తక్కువగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఈ వీడియోలో కనపడుతోంది. సురేఖ ఇచ్చిన వివరణ చదివిన తర్వాత మరోమారు సమావేశమై పరిశీలించాం. ఎమ్మెల్యేలు కూడా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు ఇస్తామని చెప్పారు. కాబట్టి తుది నిర్ణయం తీసుకోకుండా, అందరి ఫిర్యాదులు స్వీకరించి వాటిపై కమిటీలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సీఎం గురించి ఎవరు మాట్లాడినా ఖండించాల్సిన బాధ్యత సురేఖపై ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఆమె మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది’అని వెల్లడించారు. వనపర్తి విషయంలో కూడా ఇద్దరు నేతలు మాట్లాడిన మాటలను కూడా పరిశీలించామన్నారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణకు, ఎమ్మెల్యే ఫిర్యాదుకు తేడా ఉందని, మరోమారు ఎమ్మెల్యేను పిలిచి వివరణ తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్లో జరిగిన పీఏసీ సమావేశం ఘటన గురించి కంది శ్రీనివాస్రెడ్డి వివరణ ఇచ్చారని, డీసీసీ అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎల్బీనగర్ నేత జక్కిడి ప్రభాకర్రెడ్డి సస్పెన్షన్ గురించి తప్పనిసరి పరిస్థితుల్లోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో వచ్చిన ఫిర్యాదులపై షోకాజ్ ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మాకు ఎవరిపై ప్రేమ ఉండదు... తమకు పార్టీ నేతలెవరిపై వ్యక్తిగతంగా ప్రేమ, వ్యతిరేకత ఉండవని మల్లురవి స్పష్టం చేశారు. ‘మేం తీసుకునే ప్రతి చర్య కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు దిశలోనే ఉంటుంది. పార్టీకి నష్టం జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ , కేబినెట్ హోదాలో ఉన్న చిన్నారెడ్డిలకు నోటీసులిచ్చాం. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రస్తావన ఎమ్మెల్యేల మాటల్లో వచ్చింది కానీ ఫిర్యాదు మా దగ్గరకు రాలేదు. రాజగోపాల్రెడ్డి మాట్లాడింది నాకు తెలియంది కాదు కానీ పద్ధతి ప్రకారం నాకు ఫిర్యాదు రాలేదు. సుమోటోగా తీసుకోవాలా వద్దా అన్నది పరిశీలిస్తున్నాం. ఎవరైనా సరే క్రమశిక్షణ కమిటీ దృష్టిలో వ్యక్తులు ముఖ్యం కాదు. పార్టీనే ముఖ్యం. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా పార్టీ వల్లనే. పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా ఎవరూ మాట్లాడకూడదు’అని ఆయన స్పష్టం చేశారు. మరో లేఖ రాసిన సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ శనివారం మరో లేఖ రాశారు. ‘క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకు నేను వివరణ ఇచ్చాను. అయినా కొందరు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు నన్ను, నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా అవమానించేలా మాట్లాడుతున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే నాపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, నాపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలి. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది’అని లేఖలో పేర్కొన్నారు. పార్టీ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సురేఖ కోరడం కొసమెరుపు. చిన్నారెడ్డి వివరణ వనపర్తి ఎమ్మెల్యే కారణంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న అంశాలను మాత్రమే తాను గోపాల్పేట సమావేశంలో ప్రస్తావించానే తప్ప ఎవరినీ కించపర్చలేదని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీకి నివేదించారు. కాంగ్రెస్ పార్టీ దేవాలయమని, నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గేలు తనకు దేవుళ్ల లాంటి వారని, తాను పార్టీని, పార్టీ నాయకులను ఎక్కడా విమర్శించలేదని పేర్కొన్నారు, ఎమ్మెల్యే ఒంటెత్తుపోకడలతో 40 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలు పడుతున్న బాధలనే ప్రస్తావించానని అన్నారు, తనకు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలని కోరారు. -
కొండా సురేఖ ఎపిసోడ్.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సుస్మిత వ్యాఖ్యలను పరిశీలించాం. సీఎం రేవంత్పై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోసారి క్రమశిక్షణ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై కూడా చర్చించాం. చిన్నారెడ్డి అంశంపై కూడా మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.‘‘మూడు గంటల పాటు ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి వ్యవహారం పై చర్చించాం. సుస్మిత మాట్లాడిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాం. కొండా సురేఖ వివరణ అందింది. కొందరు ఎమ్మెల్యేలు ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. వీలైనంత త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖ అంశంపై నిర్ణయం తీసుకుంటాం...చిన్నారెడ్డి వివరణ కూడా అందింది. చిన్నారెడ్డి మాట్లాడిన వీడియోను పరిశీలించాం. ఎమ్మెల్యే మేఘారెడ్డి అభిప్రాయం తీసుకున్న తర్వాత చిన్నారెడ్డి కేసులో నిర్ణయం తీసుకుంటాం. కంది శ్రీనివాస్ రెడ్డిని విచారించాం. తన వాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు’’ అని మల్లు రవి తెలిపారు. -
చిట్టక్క పంచాయితీ.. కొండా మురళి రియాక్షన్పై ఉత్కంఠ
సాక్షి, వరంగల్: తెలంగాణ కాంగ్రెస్లో కొండా కుటుంబం చుట్టూ నెలకొన్న వివాదం మరింత వేడెక్కుతోంది. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గాంధీభవన్లో ప్రెస్మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో అసంతృప్తిని ఒక్కసారిగా బయటపెట్టేశాయి. ఈ క్రమంలో కొండా దంపతుల స్పందనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ అలియాస్ చిట్టక్క చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపాయి. పరకాలకు కాబోయే ఎమ్మెల్యే తానేనంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, ఆపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా పార్టీ నేతలపై ఆమె చేసిన విమర్శలపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూతురి వ్యాఖ్యలను ఖండించకుండా.. ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటూ కొండా సురేఖ ఇచ్చిన నామమాత్రపు వివరణపైనా భగ్గుమన్నారు. ప్రతిపక్షాలకు సహకరించేలా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. కొండా ఫ్యామిలీ తక్షణమే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని.. లేని పక్షంలో అధిష్టానమే క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద గెంటేయాలని డిమాండ్ చేశారు.చర్యలపై ఉత్కంఠఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. వివాదం ముదిరుతున్నా.. ఇప్పటివరకు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి బహిరంగంగా స్పందించకపోవడం కూడా చర్చకు దారితీసింది. మంత్రులు సైతం ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అమెరికా పర్యటన రద్దుతో సీఎం రేవంత్ రేపు తిరిగి హైదరాబాద్ రానున్నారు. వచ్చిరాగానే అత్యవసరంగా ఆయన ఈ అంశంపై చర్చలు జరుపుతారని సమాచారం. ఈ క్రమంలో హైకమాండ్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతుందా? లేదంటే చర్యలకు దిగుతుందా? అనే అంశం ఉత్కంఠగా మారింది.టికెట్ దక్కలేదనే అలా..ఇదిలా ఉండగా.. తన వ్యాఖ్యలపై సుస్మిత కాస్త టోన్ మార్చింది. తన తండ్రికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం వల్లే తాను ముఖ్యమంత్రిపై విమర్శలు చేశానని పేర్కొంది. వ్యక్తిగత అసంతృప్తితోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆమె వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.నేడు కొండా మురళి స్పందించే అవకాశంఈ వివాదంపై కొండా కుటుంబం వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు మౌనం పాటించిన కొండా సురేఖ భర్త కొండా మురళీధర్రావు నేడు(శనివారం) మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన స్పందనతో ఈ వివాదంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.మొత్తంగా.. వరంగల్ కాంగ్రెస్లో మొదలైన ఈ అంతర్గత కలకలం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అధిష్ఠానం నిర్ణయం, కొండా కుటుంబ స్పందనపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.ఇదీ చదవండి: నా టార్గెట్ ఆయనే.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్య -
మంత్రి పదవి నుంచి కొండా సురేఖ అవుట్..?
-
20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే
-
కొండా సురేఖ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. చర్యలకు కాంగ్రెస్ సిద్ధం
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సురేఖపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. మరోసారి నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోంది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా నేతలు నిన్న తీర్మానం చేశారు. కొండా సురేఖను భర్తరఫ్ చేయాలని శుక్రవారం సీఎం, పీసీసీ, హైకమాండ్కు 20 మంది ఎమ్మెల్యే లు లేఖ రాశారు. మరోసారి నోటీసులు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ సిద్ధమైంది.ఇప్పటికే కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఓ సారి నోటీసులు జారీ చేసింది. ఆమె కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పింది. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి.తాను త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని కొండా సురేఖ అంటున్నారు. పార్టీపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, రేవంత్ రెడ్డిపైనే తాను టార్గెట్ చేశానని కొండా సుస్మిత తెలిపారు. టికెట్ ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరని సుస్మిత ప్రశ్నించారు.ఇదీ చదవండి: మాట్లాడతా అన్ని విషయాలూ చెబుతా: కొండా సురేఖ -
‘సురేఖ.. సుస్మిత వ్యాఖ్యలను ఖండించాలి కదా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత రాజకీయం మరోసారి వేడెక్కింది. సీఎం రేవంత్రెడ్డిని టార్గెట్ చేస్తూ సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలపై ప్రభుత్వ విప్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లో కొత్త వివాదానికి దారితీశాయని వారు మండిపడ్డారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించాలని, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు.సీఎల్పీలో ప్రభుత్వ విప్లు బల్మూరి వెంకట్, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కొండా సుస్మిత వ్యాఖ్యలపై నేతలు ఘాటుగా స్పందించారు. ‘సీఎంను టార్గెట్ చేయడం క్రమశిక్షణా రాహిత్యమే’ అని వ్యాఖ్యానించారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించాలని, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటున్నప్పుడు.. కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డిపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరుతున్నామని వారు తెలిపారు. సీఎం నిర్ణయాలను వ్యతిరేకించే వ్యక్తులు పార్టీలో అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు.. ఇలాంటి వారిని కేబినెట్లో ఉంచొద్దని సీఎంను కోరుతున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత విషయాలను పార్టీలోనే మాట్లాడుకోవచ్చని, కానీ కొండా సురేఖ కుటుంబం పదేపదే బహిరంగ విమర్శలు చేయడం సరికాదన్నారు. సీనియర్ ఎమ్మెల్యేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చివరగా మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు.. ఇదే సమయంలో తెలంగాణలో 22A భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని బల్మూరి వెంకట్ ఆరోపించారు. అధికారుల తప్పిదాలను సరిదిద్దుతున్నామని, పేదలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందకూడదనే ఉద్దేశంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. అలాగే, సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక కూడా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ఉందని వెంకట్ ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. అయితే స్వపక్షంలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. -
తల్లి, కూతురి మధ్య బంధం తెగిందా..?
-
కాంగ్రెస్లో భూకంపం.. తన వ్యాఖ్యలపై సుస్మితా పటేల్ వివరణ
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ చెప్పారు. తన వ్యాఖ్యలతో కొండా సురేఖకు ఎటువంటి సంబంధమూ లేదని తెలిపారు. రాజకీయంగా ఒకే కుటుంబంలో కూడా అభిప్రాయభేదాలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ హై కమాండ్పై తనకు నమ్మకం ఉందని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే గౌరవమని చెప్పారు.కాగా, రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అంతకుముందు, రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో పార్టీలో ఒక్కసారిగా మంటలు రేగాయి. మళ్లీ పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్రెడ్డిని ఆశీర్వదించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.దీంతో కొండా సుస్మితా పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. రేవూరి ప్రకాశ్రెడ్డితో రేవంత్రెడ్డి రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా తాను పరకాల నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. -
‘‘షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సింది మంత్రి కొండా సురేఖకు కాదు’’
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులను మంత్రి కొండా సురేఖకు కాకుండా సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ విచ్ఛన్నం కావడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి అని చెప్పారు.‘‘సుష్మితను ప్రేరేపించిందెవరు? సుష్మిత కామెంట్స్ కు ఎవరు బాధ్యులు? కావాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పండి. సమయం, సందర్భం లేకుండా.. ప్రకాశ్ రెడ్డికి ఓటు వేయాలని రేవంత్ ఎలా చెబుతారు? రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటి నుంచే అభ్యర్థులను అనౌన్స్ చేసుకోవాలని ఏమన్నా రాసిచ్చారా? రాహూల్ ఆలోచనలకు భిన్నంగా పార్టీ ఫిరాయింపులను తెరపైకి తీసుకురావడం వల్లే కదా ఇవాళ పార్టీ విచ్ఛిన్నం కావడానికి కారణం. కాంగ్రెస్ డిసిప్లైనరీ కమిటీ ఏఐసీసీ కనుసన్నల్లో నడవడం లేదు.. రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో నడుస్తోంది. నిన్న ఆదిలాబాద్ బీఏసీ సమావేశంలో ఆ అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. చిన్నారెడ్డిని, సుష్మితను ప్రేరేపించింది రేవంత్ రెడ్డే.. పార్టీ ఫిరాయింపులతో విచ్ఛిన్నానికి కారకుడూ రేవంత్ రెడ్డే. ఇంకా రెండేళ్లు కాంగ్రెస్ ను బతికించుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పునరాలోచన చేయాలి. చంద్రబాబు మేనిఫెస్టోను అమలు చేసేందుకు, కాంగ్రెస్ ను కనుమరుగు చేసేందుకే రేవంత్ రెడ్డి పార్టీలోకి ఎంటరయ్యారు. 2034 దాకా తానే ముఖ్యమంత్రినని రేవంత్ ఎలా చెబుతాడు.. కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకొస్తుందని చెప్పాలి’’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
నా కూతురు మాటలకు నాకు సంబంధం లేదు సంచలనం రేపుతున్న కొండా సురేఖ లేఖ
-
‘నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశిస్తూ తన కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం, తన నుండి వివరణ కోరడం ఎంతమాత్రం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ మేరకు మంత్రి కొండా సురేఖ అధికారిక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మంత్రి స్పందిస్తూ.. ‘సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక స్వతంత్ర వ్యక్తిగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకానీ ఆ వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా నియమావళిపై నాకు పూర్తి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ నాకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కొండా సురేఖ కోరారు.కుటుంబ సభ్యుల వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలకు పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను ముడిపెట్టడం సరికాదని, ఈ విషయంలో తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ను ఉద్దేశిస్తూ కొండా సుష్మిత ఏమన్నారంటే? 'సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతి అబ్బలేదు. టీడీపీ నుంచి వచ్చిన వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోంది. అచ్చ కాంగ్రెస్కు స్థానం లేకుండా చేస్తున్నారు'అని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఆనందంగా లేరన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్లో కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడారు.‘ఎప్పుడూ ఏం మాట్లాడతారో సీఎంకు తెలియదు. సంగారెడ్డికి వెళ్లినపుడు జగ్గారెడ్డి విషయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం.. పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎలా కోరతారు’అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే సీఎం కాదన్నారు. తాము కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా, రాహల్, ప్రియాంకలను గౌరవిస్తామన్నారు.పరకాలనుంచి తాను ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని చెప్పారు. ‘బీసీ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వారు వచ్చి చెబుతున్నారు. మంత్రులు సంతకాలు పెట్టిన పనులూ జరగటం లేదు. టీపీసీసీ అధ్యక్ష పదవికి నా తల్లిదండ్రులే రేవంత్ రెడ్డిని ప్రతిపాదించారు. అధ్యక్షుడైన తర్వాత మా ఇంటికి వచ్చి నా తండ్రి మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మరచిపోయారు’అని పేర్కొన్నారు.కోటమైసమ్మ, ఎల్లమ్మ గుడి వద్దకు వచ్చి ఆ మాట అనలేదని ప్రమాణం చేస్తారా అని సీఎంకు సవాల్ విసిరారు. తన తండ్రి తిరిగి ప్రచారం చేస్తే రేవూరి గెలిచాడని, అలాంటి నాయకుడు నీకు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. సీఎంకు కళ్లు నెత్తికె క్కాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసం పనిచేసే దాన్నని,చావుకు కూడా భయపడనన్నారు.నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ ఎవరు'సీఎంతోపాటు ఒక 'పొంగు ఉంది. ఆ పొంగు ఎక్కువ సేపు ఉండదు. వీరిలో ఎవరూ సీఎం అనేది తెలియడం లేదు. హైదరాబాద్ ఇన్చార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటో పెట్టకుండా అక్కడి ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం, పొంగు ఫొటోలు పెట్టుకున్నారు. బీసీలంటే అంత చులకనా. రేవంత్రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావడానికి ప్రయత్నించిన దయాసాగర్, షబ్బీర్ అలీ ఆయన సీఎం అయిన తర్వాత కలవడానికి వెళితే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు'అని సుస్మితా ఆగ్రహం వ్యక్తంచేశారు.మూడేళ్లలో వేం నరేందర్రెడ్డి ఇచ్చిన సలహాలు ఏమిటో, వాటిని పాటించి సీఎం చేసిన పనులేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. సీఎం తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే రూ.200 కోట్ల విలువైన భూమిని అతడికి ధారాదత్తం చేశారని మండిపడ్డారు. అన్నా, తమ్ముడు రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము కాపోళ్లమని తమకు వ్యవసాయం చేయడం తప్ప ఊడిగం చేయడం రాదని, తాము పద్మశాలీలమని తమకు నేత చేయడం తప్పితే మోసం చేయడం రాదని అన్నారు. -
'కూతురి వైఖరితో చిక్కుల్లో కొండా సురేఖ'
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మితా పటేల్ను అదుపులో పెట్టుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు సూచించారు. బిడ్డను అదుపు చేయకుంటే మంత్రి పదవికి ముప్పు తప్పదని హెచ్చరించారు. గాంధీభవన్లో గురువారం కల్వ సుజాత, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజా రేణుక, ఇందిరా శోభన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండా సురేఖ పేరును సుస్మిత దిగజారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సుస్మితకు హితవు పలికారు.కొండా సురేఖను చూస్తే జాలేస్తోందికూతురు వ్యాఖ్యలతో మంత్రి సురేఖ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ మహిళా నేత కల్వ సుజాత అన్నారు. కొండా సురేఖను చూస్తే జాలేస్తోంది. బిడ్డ చేసిన పనికి ఆమె ఇబ్బంది పడుతోంది. సుస్మితకి కాంగ్రెస్ సభ్యత్వం కూడా లేదు. ఆమె ఇండియాలో 15 రోజులు ఉంటే 15 రోజులు అమెరికాలో ఉంటుంది. సుస్మితకి ఆసక్తి ఉంటే పరకాలలో ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు. టికెట్ల కేటాయింపుతో సుస్మితకి ఏం సంబంధం? రేవంత్ తన మేనమామ అని సుస్మిత చెబుతోంది.. మేనమామని ఇష్టమున్నట్టు తిడతారా? అని కల్వ సుజాత నిలదీశారు.సురేఖ తన కూతురిని అదుపులో పెట్టుకోవాలిసుస్మితపై చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కోరుతున్నామని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజా రేణుక తెలిపారు. కొండా సురేఖ తన కూతురిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. సుస్మిత పటేల్ ఇంకా తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థ ఉందని అనుకుంటుంది. సుస్మిత కాంగ్రెస్లో కవిత అవుదాం అనుకుంటుందా? ఇంకోసారి రేవంత్రెడ్డి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. సుస్మిత ముందు వార్డు మెంబర్గా గెలవాలి. ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి ఆమెకు లేదు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే ఇక్కడ నడవదని రేణుక అన్నారు. చదవండి: సుస్మిత వల్ల సురేఖ తలదించుకోవాల్సి వస్తోందిhttps://t.co/G1ixgCmU99— Telangana Congress (@INCTelangana) August 20, 2026 -
బరాబర్ పరకాల బరిలో ఉంటా
సాక్షి, వరంగల్: పరకాల నియోజకవర్గ కాంగ్రెస్లో అసంతృప్తి సెగలు ఇప్పుడే రాజుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ పార్టీలో మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల పరకాల పర్యటనలో పిలుపునివ్వడం ఒకవైపు.. కొండా సుస్మితాపటేల్ చేసిన ఘాటు వ్యాఖ్యలు మరోవైపు రాజకీయ వేడిని పెంచాయి. ఇదే సమయంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి సైతం తాను లేదా తన సతీమణి పరకాల నుంచి బరిలో ఉంటామని చెప్పడంతో కాంగ్రెస్లో మూడు వర్గాల మధ్య పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎన్నికలకు ముందే మొదలైన ఈ టికెట్ పోరు.. రానున్న రోజుల్లో ఇంకా ముదిరే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.గీసు‘కొండా’ కేంద్రంగానే..2024 మే 8: గీసుకొండ కాంగ్రెస్ నాయకుడి వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య ఫోన్ సంభాషణ ఆడియో లీక్తో కలకలం.2024 అక్టోబర్ 13: ధర్మారంలో దసరా ఫ్లెక్సీ వివాదం.. కొండా, రేవూరి వర్గాల మధ్య ఉద్రిక్తత, పోలీస్స్టేషన్లో హైటెన్షన్.2025 డిసెంబర్: గీసుకొండ మండలంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 16 స్థానాల్లో కొండా వర్గానికి 7, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి వర్గానికి 9 స్థానాలు వచ్చాయి. 2026 మార్చి 3: కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో సుస్మితా పటేల్ పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననే సంకేతాలు.2026 మార్చి 3: కొండా మురళి సైతం కుమార్తెకు మద్దతుగా కొండా కుటుంబాన్ని భవిష్యత్లోనూ గీసుకొండ ప్రజలు ఆశీర్వదించాలని పిలుపు.2026 ఆగస్టు 19: గీసుకొండలో సుస్మితా పటేల్ సీఎం రేవంత్రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు.. రేవూరి ప్రకాశ్రెడ్డితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా పరకాల నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటన. -
కాంగ్రెస్లో అంతే..!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోజుకో తీరుగా బహి ర్గతమవుతున్నాయి. మంత్రుల మధ్య సమన్వయ లేమి, తమ శాఖలో జరిగే అంశాలు తమకు తెలియకుండానే జరిగి పోతున్నాయనే అసంతృప్తి, ఒకరి శాఖపై మరో మంత్రి వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలు వర్సెస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ఇన్చార్జీలతో సమన్వయ లేమి, పార్టీ కేడర్తో ఎమ్మెల్యేల గిల్లి కజ్జాలు, పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ గొడవలు నిరంతరాయంగా వెలుగులోకి వస్తున్నాయి. వీటికి తోడు ఏకంగా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, అధిష్టానాన్ని వేలెత్తి చూపుతున్న ఘటనలు, నేరుగా వారికే సవాల్ విసిరే ప్రసంగాలు కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తుంగతుర్తి, పాలకుర్తి, గజ్వేల్, మునుగోడు, జడ్చర్ల, వనపర్తి, ఎల్బీనగర్... ఇలా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించడం, పార్టీ నేతలను సమన్వయం చేయడంలో రాష్ట్ర పార్టీ పక్షాన ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అన్ని చోట్లా ఇదే పరిస్థితి పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అసమ్మతి స్వరాలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పుకునే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఏదో నియోజకవర్గంలో తలనొప్పులు బహిరంగంగానే బయటపడుతున్నాయి. ఇప్పటికే పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ పేరుతో సతమతమవుతున్న కాంగ్రెస్లో తాజా గొడవలు మరింత చిచ్చు రేపుతున్నాయి. వనపర్తి అసెంబ్లీ పరిధిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయంలో ఏకంగా చిన్నారెడ్డికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. మరోవైపు తుంగతుర్తిలో ఎమ్మెల్యే వర్సెస్ స్థానిక నాయకత్వం పంచాయతీ ఇంకా సమసిపోలేదు. ఇప్పటికే పాలకుర్తి, గజ్వేల్ నియోజకవర్గాల్లోని అంతర్గత గొడవలతో ఫిర్యాదుల మీద ఫిర్యాదులు గాం«దీభవన్కు చేరాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోని నేతలతో పార్టీ క్రమశిక్షణా కమిటీ పలుమార్లు భేటీ అయి విచారణ జరిపింది. అయినా ఇక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఆదిలాబాద్లో బాహాబాహి ఎల్బీనగర్ నియోజకవర్గంలో అయితే ఈశ్వరమ్మ యాదవ్, జక్కిడి ప్రభాకర్రెడ్డి వర్గాలు ఏకంగా ఇళ్ల ముందు ఆందోళనల వరకు వెళ్లాయి. వీటితోపాటు ఇటీవల ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగిన జిల్లా పీఏసీ సమావేశంలో ఆదిలాబాద్ స్థానిక నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో ఇరువర్గాలకు పీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. మరోవైపు అసలు తమకు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ప్రాధాన్యతే లేదని ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు వాపోతున్నారు. బీజేపీ నేతలు చెప్పిన మాట వింటున్నారే తప్ప తమను పట్టించుకోవడం లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు బహిరంగ వేదికపైనా వ్యాఖ్యానించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటికితోడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల ఈ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు బయటపడుతున్నాయి. ఇటీవల పోచారం శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుధవారం బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే రవీందర్రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య విభేదాలు ఇలా ఉంటే పార్టీ అధిష్టానం నియమించిన డీసీసీ అధ్యక్షుల్లో కొంత మందికి స్థానిక పార్టీ నాయకత్వం అసలు సహకరించడమే లేదు. ఇటీవల కాలంలో ముగ్గురు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన డీసీసీ అధ్యక్షులను మార్చాలనే నిర్ణయం తీసుకున్నారనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు తాజాగా తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ ధిక్కారం ఇటీవలి కాలంలో షరా మామూలే అయిపోయిందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సీఎంకు నేరుగా అసమ్మతి సెగ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి సహజమే అయినా ఇటీవలి కాలంలో సీఎం రేవంత్రెడ్డికి కూడా ఈ సెగ నేరుగానే తగులుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన వైఖరిని ఖండిస్తూ, పాలనను వేలెత్తి చూపుతూ, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ కొందరు పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండగా, మరికొందరు పార్టీలోనే అంతర్గతంగా చక్రం తిప్పుతూ రేవంత్కు చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సీఎం రేవంత్ టార్గెట్గానే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నవారు వేలకోట్లు సంపాదించుకుంటూ ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5లక్షలు ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది బహిరంగ రహస్యమేనని పార్టీ వర్గాలంటున్నాయి. ఇక, తనకు తెలియకుండానే రైస్మిల్లులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం గురించి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అంతర్గతంగా పావులు కదిపారని, అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో జరిగిన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగిందనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యలు కూడా ఈ కోవలోనే చర్చనీయాంశమవుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిన ప్రభుత్వమని, కీలక నిర్ణయాల్లో పార్టీ జోక్యం ఉంటుందని స్పష్టం చేయడం ద్వారా రేవంత్కు చెక్ పెట్టే జాబితాలోకి ఆయన కూడా చేరారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కూడా అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే తాజాగా వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ కుమార్తె నేరుగా సీఎం పేరును ఉటంకిస్తూ ఆయనకే నేరుగా సవాల్ విసిరిన నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పార్టీలో ఎవరికీ సరైన పట్టు లేదన్న చర్చ సాగుతోంది. మంత్రికి నోటీసులు సుస్మితా పటేల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె తల్లి, దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండాసురేఖకు పీసీసీ క్రమశిక్షణకమిటీ నోటీసులు జారీ చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదేవిధంగా మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా క్రమశిక్షణ నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల వనపర్తిలో చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అనుచిత ప్రసంగాల గురించి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో పార్టీ ఆదేశించింది. ఎల్బీనగర్ నియోజకర్గంలో బీసీ మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్నుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ నేత జక్కిడి ప్రభాకర్రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించడం గమనార్హం. -
మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.చిన్నారెడ్డికి కూడా...కాగా, మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. వనపర్తి సభలో పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై చిన్నారెడ్డిని కమిటీ వివరణ కోరింది. స్థానిక ఎమ్మెల్యేపై అనుచిత ప్రసంగం చేసిన అంశంపైనా మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని టీపీసీసీ కోరింది.జక్కిడి ప్రభాకర్రెడ్డిపై సస్పెన్షన్ వేటుజక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ కమిటీ ఆదేశాలు ఇచ్చింది. వ్యక్తిగత, కులపరమైన దూషణలపై ఆధారాలు ఉండటంతో చర్యలు తీసుకున్న కమిటీ.. జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
పరకాల పవర్ పాలిటిక్స్.. కొండా సుస్మిత పోస్టుతో కాకరేపిన రాజకీయం!
సాక్షి, వరంగల్: పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్టాపిక్గా మారాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తన ఇన్స్టాగ్రామ్లో “అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ సుస్మిత పోస్టు చేయడంతో.. పరకాల రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తి పెరిగింది. మరోవైపు.. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో, రాజకీయం మరో టర్న్ తీసుకుంది. కాగా, రేవూరి ప్రకాశ్రెడ్డి ప్రస్తుతం పరకాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో.. సుస్మిత తాజా పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో అధికార కాంగ్రెస్లోనే రేవూరి, కొండా కుటుంబం మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతోందన్న చర్చ మొదలైంది.పరకాలపై కొండా ఫ్యామిలీ కన్ను?కొండా కుటుంబానికి పరకాల నియోజకవర్గంతో రాజకీయంగా బలమైన అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో సుస్మితను పరకాల నుంచి రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కొంతకాలంగా ఉంది. తాజాగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆ చర్చకు మరింత బలం చేకూర్చింది. అయితే, మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పరకాల నియోజకవర్గ పరిధిలో భారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గీసుకొండ మండలంలోనూ పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సుస్మిత పటేల్ రాజకీయంగా కీలక ప్రకటన చేస్తారా? అన్న ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.ఒకవైపు రేవూరి ప్రకాశ్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి మద్దతు, మరోవైపు పరకాల నుంచి పోటీకి సుస్మిత పటేల్ ఆసక్తి.. ఈ రెండు పరిణామాలతో పరకాల కాంగ్రెస్లో రాజకీయ వేడి పెరిగింది. ప్రస్తుతం ఇది పార్టీ అంతర్గత రాజకీయంగా కనిపిస్తున్నప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. రేవూరి వర్సెస్ కొండా ఫ్యామిలీగా మారుతున్న ఈ పవర్ పాలిటిక్స్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. -
రేవంత్ పై కోపమా అక్కా.. CM టూర్ లో మంత్రి మిస్సింగ్
-
సీఎం పరకాల పర్యటనకు కొండా సురేఖ దూరం.. !
పరకాల: ఒకవైపు సీఎం రేవంత్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం.. మరొకవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి పోటీచేస్తారని రేవంత్ వ్యాఖ్యలు.. వీరి మధ్య దూరం పెరిగిందనే వాదనకు బలం ఇస్తోంది. తాజాగా సీఎం రేవంత్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్యక్రమాలకు మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే మేడారం సమ్మక్క-సారలమ్మ అభివృద్ధి పనులను పరిశీలించారు సీఎం రేవంత్. మరొకవైపు రేవంత్ పరకాల సభలోనూ కొండా సురేఖ కనిపించలేదు. దాంతో ఈ అంశం తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. మరొకవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి పోటీ చేస్తారని రేవంత్ చెప్పడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. రేవూరిని ఆశీర్వదించాలని కూడా రేవంత్ పిలుపునిచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తానని కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలకు కొండా సురేఖ దూరంగా ఉన్నారనే చర్చ మొదలైంది. -
ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి : కొండా సురేఖ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో విజయవంతంగా ముగిసిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. జూలై 16న గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన బోనాల మహోత్సవం, బుధవారం (ఆగస్టు 13) జగదాంబిక అమ్మవారికి మహాకుంభహారతితో సంప్రదాయబద్ధంగా ముగిసిందని మంత్రి స్పష్టం చేశారు.దాదాపు నెలరోజుల పాటు వైభవోపేతంగా జరిగిన బోనాల వేడుకలు శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, జానపద కళల ప్రదర్శన, అంబారీల ఊరేగింపు, రంగం, ఘటోత్సవాలతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ ఘనంగా జరిగాయని అన్నారు.ప్రభుత్వ పర్యవేక్షణలో ఘనంగా ఉత్సవాలుబోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. రూ. 20 కోట్ల నిధులతో ఆషాడ బోనాల జాతరను దేదీప్యమానంగా నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో వేలాది ఆలయాల్లో జరిగిన బోనాల వేడుకలు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా జరిగేందుకు పోలీసులు, జీహెచ్ఎంసీ, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్యారోగ్యం, ట్రాఫిక్ నియంత్రణ, జలమండలి తదితర శాఖలు సమన్వయంతో పనిచేశాయని తెలిపారు. జాతర విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు, సహకరించిన స్వచ్ఛంద సంస్థలకు మంత్రి పేరుపేరునా అభినందనలు తెలిపారు.లౌకిక సందేశానికి ప్రతీక హైదరాబాద్ బోనాలుహైదరాబాద్ బోనాలు తెలంగాణ సమాజంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నాయని, గంగా జమునా సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ యావత్ దేశానికి లౌకిక సందేశాన్నిస్తున్నాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం హైదరాబాద్ నగర ప్రత్యేకతను మరోసారి ప్రపంచానికి చాటిందని అన్నారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి“అమ్మవారి చల్లని చూపు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలి. రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలి. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి. అమ్మవార్ల దయతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి. శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక సామరస్యం మరింత బలపడాలి” అని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. దేవాదాయ శాఖ తరఫున నిర్వహించిన వరుణయాగంతో ప్రభుత్వ సంకల్పం సిద్ధించి, రాష్ట్రం వర్షాలతో కళకళలాడుతుండటం అమ్మవార్ల మహిమేనని పేర్కొన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. -
మంత్రులు వర్సెస్ పీసీసీఎఫ్!
సాక్షి, హైదరాబాద్: అటవీశాఖకు చెందిన 25 మంది దాకా అధికారులు, సిబ్బంది డిప్యుటేషన్ల్ల రద్దు అంశం కొందరు మంత్రులు వర్సెస్ పీసీసీఎఫ్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. వీటిలో కొన్ని డిప్యుటేషన్లను కొనసాగించాలని మంత్రులు తుమ్మల, జూపల్లి, శ్రీధర్బాబు, పొన్నం, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యేలు డా.చిక్కుడు వంశీకృష్ణ, డా.సంజయ్ కోరి నా పీసీసీఎఫ్ వెనక్కి తగ్గలేదు. అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ సైతం ఈ డిప్యుటేషన్లను ఎలా రద్దు చేస్తారంటూ పీసీసీఎఫ్ను ప్రశ్నించినా ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని తెలుస్తుంది.అటవీశాఖ నూతన ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్)గా వినయ్కుమార్... గత జూన్ 30న బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందున్న పీసీసీఎఫ్ సువర్ణ ఆమోదించిన డిప్యుటేషన్లను రద్దు చేశారు. దీంతో ఈ అంశం అటు అరణ్యభవన్లో, ఇటు ప్రభుత్వవర్గాల్లో హాట్టాపిక్గా మారింది. డిప్యు టేషన్లు రద్దు అయిన వారిలో క్షేత్రస్థాయిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మొదలుకొని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఇలా వివిధ స్థాయిల్లోని వారున్నారు. అటవీ శాఖ మంత్రి చెప్పినా..: స్థానిక పరిస్థితులు, కుటుంబ అవసరాల రీత్యా తమను మరో చోటకు లేదా మరో శాఖకు డిప్యుటేషన్పై పంపించాలని కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేలను కోరుతూ అధికారులు, ఉద్యోగులు వినతిపత్రాలు సమర్పించడం సాధారణంగా జరిగేదే. ఈ దరఖాస్తులపై ప్రజాప్రతినిధులు స్పందిస్తూ...ఆయా అధికారులు, ఉద్యోగులు కోరుకున్నట్టుగా డిప్యుటేషన్ పంపించాలని సిఫార్సు చేస్తూ లేఖలు పంపుతారు. ఇలాంటి వాటికి ఆమోదం లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ డిప్యుటేషన్లు రద్దు కావడం మంత్రుల కోపానికి కారణమైంది. ఇటీవల బాధ్యతలు చేపట్టిన వినయ్కుమార్ ఏకపక్షంగా వాటిని మధ్యలోనే రద్దు చేయడంతో తమ సిఫార్సులకు విలువ లేకుండా పోయిందని వారు వాపోతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు మంత్రి సురేఖ దృష్టికి రావడంతో రద్దు చేసిన డిప్యుటేషన్లను పునరుద్ధరించి, మంత్రులు చేసిన సిఫార్సులను గౌరవించాలని సూచించినట్టు తెలిసింది. అయితే అటవీశాఖ మంత్రి చేసిన సూచనలను కూడా పెడచెవిన పెట్టడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మరోవైపు తన సమీప బంధువు కూడా బాధి తుడు కావడంతో ఓ మంత్రి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పెద్దల వద్ద పంచాయితీ పెట్టినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం మంత్రులు–పీసీసీఎఫ్ మధ్య ఏర్పడిన వివాదం మరింత ముదురుతున్నట్టుగా తెలుస్తోంది. -
నీ క్యారెక్టర్ ఏంటో చెప్పమంటారా..? కడియంకు కొండా వార్నింగ్..
-
కడియం శ్రీహరిపై రేవంత్కు కొండా సురేఖ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆలయ పరిస్థితులపై కడియం శ్రీహరి రివ్యూ నిర్వహించడంపై మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. ఈ రోజు (మంగళవారం) ఈ విషయమై ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావుకు క్లాస్ పీకారు. ప్రోటోకాల్ పాటించకుండా రివ్యూ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కమిషనర్పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కాగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మళ్ళీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. కడియం శ్రీహరి వ్యవహారంపై ఇదివరకే ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ తాజాగా ఆయనపై మరోసారి సీరియస్ అయ్యారు. గతంలోనూ ఇరువురు నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందన్న నేపథ్యంలో నిన్న నియోజకవర్గంపై అధికారులతో కడియం రివ్యూ చేశారు.సమీక్ష తర్వాత ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని అధికారులను కడియం కోరారు. జిల్లా వ్యవహారాలలో కడియం తల దూర్చడం ఏంటని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడియంపై ఏఐసీసీ పెద్దలు, సీఎం రేవంత్కు కొండా సురేఖ లేఖ రాశారు. ఆలయాల అభివృద్ధిపై కడియం ఆదేశాలివ్వడంపై కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగంలో కడియం అయోమయం సృష్టిస్తున్నారంటూ సీఎం రేవంత్కు లేఖ రాశారు. -
కడియం శ్రీహరిపై ఏఐసీసీకి కొండా సురేఖ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య మళ్ళీ వివాదం ముదురుతోంది. కడియం శ్రీహరిపై ఏఐసీసీకి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. కొండా, కడియం.. గతంలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుంది. ఈ నేపథ్యంలో నిన్న నియోజకవర్గంపై అధికారులతో కడియం రివ్యూ చేశారు.సమీక్ష తర్వాత ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని అధికారులను కడియం కోరారు. జిల్లా వ్యవహారాలలో కడియం తల దూర్చడం ఏంటని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కడియంపై ఏఐసీసీ పెద్దలు, సీఎం రేవంత్కు కొండా సురేఖ లేఖ రాసిన రాశారు. -
‘మ్యాపింగ్ ద్వారా అటవీ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తరణ, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో మొక్కల పెంపకం అత్యంత కీలకమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గుర్రంగూడ అటవీ ప్రాంతంలో నిర్వహించిన వనమహోత్సవం–2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.వనమహోత్సవాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం 1950లో ప్రజా ఉద్యమంగా ప్రారంభించిందని గుర్తు చేసిన మంత్రి, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో వనమహోత్సవాన్ని మహా ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు గత రెండు సంవత్సరాలుగా వనమహోత్సవ కార్యక్రమాలకు అపూర్వ స్పందన అందించారని, "ప్రతి నవజాత శిశువు పేరుతో ఒక మొక్క" అనే ముఖ్యమంత్రి పిలుపు రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ చైతన్యాన్ని పెంచి, పచ్చదనం పెంపు దిశగా సమాజాన్ని ప్రేరేపించిందని అన్నారు.మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఏడాది నాటిన మొక్కలలో 94 శాతం మొక్కలు విజయవంతంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 13,242 నర్సరీలలో సిద్ధం చేసిన 16.06 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.గుర్రంగూడ అటవీ ప్రాంతం తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి, అటవీ శాఖ పట్టుదలకు, న్యాయపరమైన విజయానికి ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుతో సుమారు 102 ఎకరాల అటవీ భూమి తిరిగి అటవీ శాఖకు లభించిందని, అనంతరం మొత్తం 424 ఎకరాల 31 గుంటల భూమిని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించినట్లు తెలిపారు. ఇది తెలంగాణ అటవీ సంరక్షణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. -
తెలంగాణ : సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఆరంభం (ఫొటోలు)
-
కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డు
అత్యంత పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించిన బాలుడిగా కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ నిలిచాడు. రెండు సంవత్సరాల 11 నెలల వయసులో ఈ ఘనత సాధించాడు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం సాధించిన కొండా శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ నిలిచాడు. 15 నిమిషాల 52 సెకండ్స్ లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాల 9 సెకండ్స్ లలో 21 చెస్ బోర్డ్ లను అమర్చి రెండు ప్రపంచ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాడు.జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్లో మంగళవారం వేడుకగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు.శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డ్ సాధించి, భరతమాత ముద్దు బిడ్డగా, అపార మేధస్సు కలిగిన స్వామి వివేకానందునిగా అవతరించాడని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశంసించారు. మరోవైపు.. తన మనవడి ప్రతిభను చూసి మంత్రి సురేఖ మురిసిపోయారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, శ్రీయాన్ష్ తల్లి కొండా సుస్మిత పటేల్ ఉద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చారు.కాగా రాయ్ చెస్ అకాడమీ తరఫున క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొండా శ్రేయాన్ష్ పటేల్కు ట్రోఫీలు, సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ ద్వారా బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారంతో పాటు సర్టిఫికెట్ను శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ పొందనున్నాడు. -
చిట్టక్క ఎంట్రీతో పరకాల పాలిటిక్స్కి కొత్త ట్విస్ట్..!
సాక్షి, వరంగల్: గీసుకొండ నుంచి పరకాల టార్గెట్గా ‘కొండా’ వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. గతంలోనే పరకాల నుంచి ఎమ్మెల్యే అవుతానని ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, మంత్రి కొండా సురేఖ దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ (చిట్టక్క).. తాజాగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర సాక్షిగా తన తండ్రి మురళీధర్రావు దీవెనలు, గీసుకొండ మండల ప్రజల అండతో ఎమ్మెల్యే అవుతానని మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కాక రేపినట్లయ్యింది. ఆమె మాటలకు అనుకూలంగానే కొండా కుటుంబాన్ని గతంలో ఆశీర్వదించినట్లుగా భవిష్యత్లో కూడా ఆదరించాలని కొండా మురళి మాట్లాడడంతో పొలిటికల్ హీట్ పుట్టించినట్లయ్యింది. ఎవరు అడ్డొచ్చినా కొండా సుస్మిత అదరదు బెదరదని, ఇది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. తప్పకుండా పరకాల నుంచే తన కుటుంబం రేసులో ఉంటుందని ఆయన విస్పష్టంగా ప్రకటించడంతో మరోసారి పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ వార్ తెరమీదకు వచ్చినట్లయ్యింది. గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ సుస్మితాపటేల్ బ్యానర్లు వెలిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా కొండా, రేవూరి వర్గాలతో కాంగ్రెస్ పార్టీ కేడర్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొండా చేసిన ఈ వ్యాఖ్యల మర్మం వెనుక రాజకీయ మతలబు దాగి ఉందని, వరంగల్ తూర్పులో కూడా కొండా వ్యతిరేక వర్గాలు ఉండడంతో అదే సిద్ధాంతాన్ని పరకాలలో ప్రయోగించి.. పార్టీలో తమ పట్టు నిలుపుకోవాలన్న ఎత్తుగడలో భాగమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అప్పుడు దసరా.. ఇప్పుడు హోలీ● 2024 మే 8న గీసుకొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రడం భరత్ విషయంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఫోన్లో వాగ్వాదం సోషల్ మీడియాలో వైరలైంది. తన మనిషిని కాదని ఇతరులకు పదవుల్లో ఎలా ప్రాధాన్యమిచ్చారంటూ రేవూరిని ఆమె ప్రశ్నించారు. మా వల్లే మీరు గెలిచారు.. నియోజకవర్గంలోని సొంత మండలం గీసుకొండలో మేం చెప్పినట్లే నడవాలని అప్పట్లో ఫోన్లో మాట్లాడిన మాటలు ఆడియో లీక్ అవడం సంచలనంగా మారింది. అంతకుముందే తనకు తెలియకుండా పలు మండలాలకు చెందిన వారిని పార్టీలోకి తీసుకోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయమై గీసుకొండ మండలంలోని కొండా వర్గానికి చెందిన ఒకరిపై పరకాలలో కేసు కూడా నమోదైంది. మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్యపై మంత్రి బాహాటంగానే అప్పుడు విమర్శలు గుప్పించారు.● 2024 అక్టోబర్ 13న దసరా పండుగను పురస్కరించుకొని గీసుకొండ మండలం ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని ఆయన వర్గీయులు దాన్ని ధ్వంసం చేశారు. ఈక్రమంలో కొండా వర్గీయులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్కు వచ్చిన మంత్రి కొండా సురేఖ సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొండా వర్గీయులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకొని, వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిందని, ఇది పార్టీ అంతర్గత వ్యవహారం కాదని, స్థానికతకు సంబంధించిన విషయమన్న సంగతి తెలిసిందే.● 2026 మార్చి 3న కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కుమార్తె, కొండా సుస్మితాపటేల్ మాట్లాడుతూ కొండా కుటుంబాన్ని గీసుకొండ ప్రజలు ఆదరించారని, భవిష్యత్లోనూ బాసటగా ఉండాలని సుస్మితాపటేల్ పరకాల నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటాననే సంకేతాలను ఇవ్వడం కలకలం రేపింది. దీంతో ఇప్పటికే ఉప్పునిప్పులా ఉంటున్న కొండా, రేవూరి వర్గాలు మరింత దూరమయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ గీసుకొండ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలిచింది. కొండా వర్గం 7 స్థానాలు, రేవూరి వర్గం 9 స్థానాలు దక్కించుకుంది. ఇలా గీసుకొండ మండల కేంద్రంగా అధికార పార్టీలోనే రెండు వర్గాలు తమ ప్రాబల్యాన్ని చూపుతుండడం గమనార్హం. -
నేను ఎమ్మెల్యే అవుతా...! కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు
-
దటీజ్ కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఆహ్వానం వెళ్లింది. ఆ సమయంలో ఆయన పలకరింపు మహిళా మంత్రులనూ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందనే చర్చ నడుస్తోంది. ‘‘బాగున్నారా అమ్మా..’’ అంటూ కొండా సురేఖను, సీతక్కలను ఆత్మీయంగా పిలిచి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారాయన. అంతటితో ఆగకుండా.. మేడారం జాతర పనులు ఎంతవరకు వచ్చాయని మంత్రులను అడిగి తెలుసుకున్నారు. పనులు చివరి దశలో ఉన్నాయని.. జాతర దగ్గర పడుతుండడంతో పనులు వేగంగా చేస్తామని ఈ సందర్భంగా మాజీ సీఎంకు మంత్రులిద్దరూ వివరించారు. అయితే.. పనుల విషయం జాగ్రత్త వహించండి.. పనులు తొందర కావాలని ఆగం కావొద్దంటూ ఆయన వాళ్లను సున్నితంగా సూచించారు. అవసరం అయితే కొన్ని పనులు జాతర అయిపోయాక కూడా చేసుకోవచ్చంటూ సలహా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఆయన.. హెలికాప్టర్లో సతీసమేతంగా జాతరకు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ‘‘ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాం. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు’’ అని మంత్రులిద్దరూ మీడియాకు చెప్పారు. అంతకు ముందు.. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను కేసీఆర్ దంపతులు అతిథి మర్యాదలతో పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించడం వైరల్గా మారింది. మాజీ ముఖ్య మంత్రివర్యులు కేసీఆర్ గారిని మేడారం మహా జాతరకు ఆహ్వానించిన మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు,శ్రీమతి సీతక్క గారు..@seethakkaMLA @iamkondasurekha #prajapalana#medaramjatara#sammakkasarakka#tribalfestival pic.twitter.com/F8pwvacqlP— Telangana Congress (@INCTelangana) January 8, 2026కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్.. మొన్నటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రేవంత్ రెడ్డి పలకరింపునకు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సీఎం రాక సందర్భంగా లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ‘‘దటీజ్ కేసీఆర్ అని.. ఆయనకంటూ ఓ సంస్కారం ఉందని.. ఆయన విమర్శలు ఏనాడూ హద్దుదాటి ఉండవు’’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేశాయి. -
మేడారం జాతరకు కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రులు
-
మేడారం జాతరకు కేసీఆర్కు ఆహ్వానం.. ఎర్రవల్లికి సురేఖ, సీతక్క
సాక్షి, సిద్దిపేట: మేడారం మహా జాతర నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించేందుకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. ఎర్రవల్లిలోని ఫామ్హౌస్కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టి మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు అందించారు. అనంతరం, కేసీఆర్ దంపతులు కూడా మంత్రులను సన్మానించారు.ఆహ్వానం సందర్భంగా దాదాపు 20 నిమిషాలపాటు వారు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మేడారంలో జాతర సందర్బంగా చేస్తున్న ఏర్పాట్లను కేసీఆర్కు వివరించినట్టుగా తెలిసింది. అనంతరం, మేడారం జాతరకు ఏదోఒక రోజు తాము హాజరు అవుతామని కేసీఆర్ చెప్పారని మంత్రులువెల్లడించారు. కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లిపోయారు.బాగున్నరా.. అమ్మ !కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపుఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారంగురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది… pic.twitter.com/8NPsnWB5jX— Telugu Scribe (@TeluguScribe) January 8, 2026అంతకుముందు మంత్రులిద్దరూ మాట్లాడుతూ..‘మాజీ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. హెలికాప్టర్లో సతీసమేతంగా జాతరకు కేసీఆర్ వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాము. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. మేడారం జాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందరిని మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం’ అని అన్నారు. -
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందన్న కథనాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. తనకు ఎలాంటి వారెంట్ జారీ కాలేదని.. కోర్టుకు హాజరు కావాలని మాత్రమే కబురు అందిందని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారామె. ఇదిలా ఉంటే.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని తొలుత ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఈ పరిణామం చోటు చేసుకుందన్నది ఆ ప్రచార సారాంశం. ‘‘గురువారం (డిసెంబర్ 11, 2025) ఈ కేసు విచారణకు రాగా, నిందితురాలి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు’’ అని ఆ ప్రచారంలో ఉంది. అయితే దానిని కొండా సురేఖ కాసేపటికి ఖండించారు. ‘‘కోర్టు నాకు ఎన్బీడబ్ల్యూ జారీ చేయలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కోర్టుకు రావాలని చెప్పింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది’’ అని అన్నారామె. కేసు వివరాల్లోకి వెళితే.. తనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాయని కేటీఆర్ పరువు నష్టం దాదా వేశారు. ఈ కేసు ప్రస్తుతం (C.C. No. 307 of 2025) విచారణ దశకు చేరుకుంది. గురువారం రోజున విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, నిందితురాలైన కొండా సురేఖ కోర్టుకు రాలేదు. ఆమె గైర్హాజరుకు సంబంధించి న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. -
కొండా సురేఖ వివాదంపై నాగార్జున కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. గతేడాది ఓ మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యుల్ని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో నాగార్జున.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మా కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయి. అందుకే భారత శిక్షా స్మృతి (BNS) సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’ అని నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు.కోర్టులో విచారణ కొనసాగుతుండగా.. కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా అక్కినేని కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. ఆమె వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ, అవి బాధ కలిగించాయని అంగీకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాంపల్లి ప్రత్యేక కోర్టులో పరువు నష్టం కేసుపై విచారణ జరిగింది. విచారణ సమయంలో నాగార్జున తన దావాను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకున్నారు. కొండా సురేఖ, నాగార్జున మధ్య నెలకొన్న వివాదం ముగిసినట్లైంది. I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members. I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members. I regret any unintended impression…— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025పరువు నష్టం దావా కేసు విచారణ ముందు రోజు మంత్రి కొండా సురేఖ ‘ఎక్స్’ వేదికగా అక్కినేని కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ గతంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టాలని నేను మాట్లాడలేదు. వారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది నా ఉద్దేశమే కాదు. ఆయన కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో పొరపాటు ఉంటే చింతిస్తున్నా. గతంలో నేను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా’అని పేర్కొన్నారు. -
తప్పు ఒప్పుకొన్న కొండా సురేఖ.. నాగార్జునకు క్షమాపణ
-
నాగార్జున కుటుంబంపై మరోసారి స్పందించిన కొండా సురేఖ
సినీ నటుడు నాగార్జున గురించి తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సోషల్మీడియా ద్వారా మరోసారి స్పందించారు. 'నాగార్జునకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు తన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదని స్పష్టంగా తెలుపుతున్నాను. అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలని లేదా పరువు తీయాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన ప్రకటనలలో ఏదైనా అనుకోని పొరపాటు జరిగివుంటే దానికి చింతిస్తున్నాను. ఆపై ఆ వాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను.' అని మంత్రి కొండా సురేఖ ఒక పోస్ట్ చేశారు.కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ మాట్లాడిన సంగతి తెలిసిందే. తన కుటుంబ గౌరవాన్ని కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని తప్పుబట్టిన నాగార్జున సురేఖపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members. I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members. I regret any unintended impression…— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025 -
కొండా ఫ్యామిలీ ఎపిసోడ్.. కాంగ్రెస్, రేవంత్కు నష్టమేనా?
గజం మిథ్య, పలాయనం మిథ్య అని నానుడి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఘటనలు ఇలానే ఉంటాయి. మంత్రి కొండా సురేఖ వివాదమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏదో జరిగిపోతుందన్న భావన ముందు కలుగుతుంది. ఆ తర్వాత పరిస్థితి.. అసలేమీ జరగలేదేమో అనేలా మారుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి వేళ కొండా సురేఖ నివాసానికి వెళ్లడం, ఓఎస్డీ సుమంత్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం ఆ తరువాత మంత్రి స్వయంగా అతడిని కారులో ఎక్కించుకుని రక్షించడం, అదే టైమ్లో సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనందరం చూశాము.ఆ తరువాత మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు సురేఖ. పార్టీ అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభృతులు జోక్యం చేసుకుని రేవంత్, కొండా దంపతుల మధ్య రాజీ కుదిర్చి పరిస్థితిని అదుపు చేశారు. కాంగ్రెస్ నేతలంతా గప్ చుప్ అయిపోయారు. అయితే విపక్షం ఊరుకోదు కదా! తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందని, ముఖ్యమంత్రిపై సురేఖ కూతురు సుస్మిత చేసిన ఆరోపణల మాటేమిటి? అంటూ బీఆర్ఎస్, బీజేపీలు ధ్వజమెత్తాయి. మంత్రి కొండ సురేఖ విషయం ఎందుకంత సీరియస్ అయింది? ఆ తర్వాత ఎలా సద్దుమణిగింది అన్నది ఆసక్తికరమైన అంశమే. ప్రాంతీయ పార్టీల్లో ఎవరైనా సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తే ఆ వ్యక్తి పదవి పోయినట్లే. కాంగ్రెస్లో అలా ఉండదు. ఢిల్లీలోని హైకమాండ్ పెద్దలను ఏమీ అనకుండా, రాష్ట్ర స్థాయిలో ఎవరు, ఎవరిని విమర్శించుకున్నా పెద్దగా పట్టించుకోరు. కాకపోతే పిలిచి మాట్లాడి రాజీలు చేస్తుంటారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఇందుకు కారణం కావచ్చు. అయితే సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిలు అప్రతిష్ట పాలయ్యారు. మంత్రి సురేఖ తొలుత ఆత్మరక్షణలో పడినప్పటికీ, ఆ తర్వాత వ్యూహాత్మకంగా రాజీ కుదుర్చుకోవడం ద్వారా పదవిని నిలబెట్టుకున్నారని భావించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయం కావడం, బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోందన్న భావన కలిగించే యత్నం చేస్తున్న తరుణంలో ఒక బీసీ మంత్రిని పదవి నుంచి తప్పిస్తే రాంగ్ సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం కూడా ఇందులో ఉండవచ్చు.సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఒక సిమెంట్ కంపెనీ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేయడానికి సురేఖ ఓఎస్డీ సుమంత్ తుపాకితో బెదిరించారన్న ఫిర్యాదు వచ్చింది. అతనితోపాటు మరో కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని చెబుతున్నారు. ఈ సమాచారం ఆధారంగా సీఎం ఆఫీస్ వెంటనే సుమంత్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తనకు చెప్పకుండా ఎలా చేస్తారన్నది సురేఖ ప్రశ్న. గతంలో పలుమార్లు హెచ్చరించినా మంత్రి పట్టించుకోలేదన్నది రేవంత్ కార్యాలయ వర్గాల వాదన. ఆ తర్వాత పోలీసులు సుమంత్ అరెస్టుకు ప్రయత్నించారు. మంత్రి ఇంటిలోనే రక్షణ పొందుతున్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. అది తీవ్ర కలకలం రేపింది. కానీ, సురేఖ పోలీసులకు అవకాశం ఇవ్వకుండా ఓఎస్డీని అక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. సహ మంత్రుల వద్దకు వెళ్లి ఆమె దీనిపై తన వాదన వినిపించారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్లో కీలక పాత్ర పోషిస్తున్న కొందరిని కలిసినట్లు వార్తలు వచ్చాయి.హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కావాలనే ఇలా చేశారన్నది సురేఖ వర్గం ఆరోపణగా ఉంది. సురేఖ కుమార్తె ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించి పలు ఆరోపణలు గుప్పించడం రేవంత్కు ఇరకాటంగా మారింది. రేవంత్ రెడ్డి, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, తదితరులపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు చెప్పి మరో ఆరోపణ సంధించారు. తన తల్లి సురేఖను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు. ఏకంగా రెడ్లు తమపై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేడారం వద్ద అభివృద్ది పనుల కాంట్రాక్టులు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల వివాదం మొదలైన విషయాలలో ఏర్పడిన అభిప్రాయ బేధాలు ఈ వర్గ పోరుకు కారణం అయ్యాయని చెబుతున్నారు.వరంగల్ కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో కూడా ఇదే తరహా గొడవలు నడుస్తుండటం, వారి మద్య రాజీ చేయడానికి పీసీసీ కృషి చేయడం, అవేవి ఒక కొలిక్కి రాకముందే ఈ పరిణామం సంభవించడం కాంగ్రెస్కు చికాకు అయింది. తదుపరి మీనాక్షి సమక్షంలో సురేఖ తన వాదన వినిపించి వచ్చారు. కాగా, తమ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్పై చేసిన ఆరోపణలను పట్టించుకోవద్దని, ఆవేశంలో అన్న మాటలు అని మంత్రి భర్త, ఎమ్మెల్సీ మురళీ సర్దిచెప్పే యత్నం చేశారు. సురేఖ మంత్రి పదవి వదలుకోవాల్సి వస్తుందేమో అన్న ప్రచారం జరిగింది. కానీ, ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రస్తుతానికి ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డారని అనిపిస్తుంది. కొండా దంపతులు స్వయంగా రేవంత్ను కలిసి శాలువా కప్పారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకున్న విషయాన్ని గుర్తు చేశారట. ఓఎస్డీని దూరం పెట్టండని రేవంత్ సూచించారట. తమ కుమార్తె చేసిన విమర్శలు ఆవేశంలో చేసినవని వీరు విచారం వ్యక్తం చేశారట. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రాసెస్లో కీలక భూమిక పోషించినట్లుగా ఉంది. కానీ, ఒకసారి విభేదాలు పొడసూపాక అవి అంత తేలికగా పోవు. కాంగ్రెస్లో సద్దుమణిగినప్పటికీ, పలు ప్రశ్నలు అటు రాజకీయ వర్గాలలోను, ఇటు ప్రజలలోను మిగిలే ఉంటాయి!.ఇంతకీ సుమంత్ గన్ తో బెదిరించారా లేదా? దానిపై వచ్చిన ఫిర్యాదును హ్యాండిల్ చేయడంలో రేవంత్ కార్యాలయం విఫలమైందా? అర్దరాత్రి వేళ మంత్రి ఇంటికి పోలీసులను పంపించడం తప్పు అన్న అభిప్రాయం కాంగ్రెస్ ముఖ్యనేతలలో, అధిష్టానంలో కలిగిందా? మంత్రి సురేఖ ఒక కేసులో నిందితుడికి ఆశ్రయం కల్పించడం తప్పా? కాదా? మొదలైన ప్రశ్నలన్ని అలాగే ఉండిపోయాయి. కొండా సురేఖ దంపతుల రాజకీయ ప్రస్థానం అంతా ఎప్పుడూ వివాదాలు, గ్రూపుల గొడవలు, ప్రత్యర్ధి రాజకీయ పార్టీలతో ఘర్షణలతోనే సాగిందని చెప్పాలి. సురేఖ, మురళీలు తొలుత కాంగ్రెస్ లోనే ఉండేవారు. అప్పట్లో టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకరరావుతో తీవ్రంగా ఘర్షణ పడేవారు. కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మద్దతుగా ఉండేవారు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రి రోశయ్యతో సరిపడలేదు. అంతలో వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో ఆమె ఈ పార్టీలోకి వచ్చారు.ఎమ్మెల్యే పదవిని కూడా వదలుకున్నారు. తదుపరి వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి స్వల్ప తేడాతో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. కొంతకాలం టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవారు. మళ్లీ పరిణామాలు మారడంతో ఆమె వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. రాష్ట్ర విభజన జరగడంతో ఆమె టీఆర్ఎస్కు దగ్గరవడం, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అయినా కొండా వర్గం ఆశించినట్లుగా సురేఖ మంత్రి కాలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్పైన, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్పైన విమర్శలు చేసి మళ్లీ కాంగ్రెస్ వైపు పయనించారు. కాంగ్రెస్కు కూడా జిల్లాలో గట్టిగా నిలబడే నాయకత్వం అవసరమైంది. అది కొండా దంపతులకు కలిసి వచ్చింది. 2023లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. తదుపరి రేవంత్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు.ఈ ప్రస్థానంలో మంత్రి సురేఖ ప్రజలకు కనిపించే ఫేస్ అయితే, వెనుక ఆమె భర్త మురళీ చేసే రాజకీయమే కీలకం అని చెబుతారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కుని మూడు దశాబ్దాలుగా వరంగల్ జిల్లా రాజకీయాలలో తమదైన శైలిలో ఒక ప్రముఖ పాత్రను పోషించడం కొండ దంపతుల విశిష్టత. ఏతావాతా ఈ మొత్తం ఎపిసోడ్లో అటు రేవంత్కు, ఇటు సురేఖకు నష్టం జరిగాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో కొంత పలచన అవడానికి కూడా ఇది దోహద పడిందని అంగీకరించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీఎం రేవంత్రెడ్డితో కొండా సురేఖ దంపతుల భేటీ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ పాల్గొన్నారు. ఇటీవల సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు.కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. -
కాంగ్రెస్ సర్కారుకు తిప్పలు తెచ్చి పెట్టిన కొండా సురేఖ ఓఎన్డీ వ్యవహారం
-
‘కొండా’ వివాదం సమసినట్లేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్ : సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతులు, ఆమె కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదం సమసినట్లేనా.. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కొండా సురేఖ ఇంటికి టాస్క్ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు.. ఈ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఏమిటి.. ఇంతకీ వివాదానికి కారణమైన మాజీ ఓఎస్డీ సుమంత్ ఎక్కడ.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన సురేఖ.. కీలకమై కేబినెట్ మీటింగ్కు ఎందుకు వెళ్లలేదు?.. ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్టాపిక్గా మారాయి. 48 గంటలుగా తాజా రాజకీయ పరిణామాలు వరంగల్ను హీటెక్కించాయి.సుమంత్ కోసం పోలీసులు..కలకలం రేపిన సుస్మిత వ్యాఖ్యలు..మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మధ్య విభేదాలు పక్కన పెడితే... మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు వెళ్లడం.. అక్కడ సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు. కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదే సమయంలో వరంగల్లో మీడియాతో మాట్లాడిన కొండా మురళీధర్ సీఎం రేవంత్రెడ్డితో తమకు విభేదాలు లేవని, తనకు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారన్నారు. సుస్మిత ఎక్కడ.. ఎప్పుడు.. ఏం మాట్లాడింది తనకు తెలియదని కొట్టిపారేశారు. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు? ఇంతకీ అతను ఎక్కడ ఉన్నాడు? ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతుంది? అనే అంశాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.కేబినెట్కు ఎందుకు వెళ్లలేదు..అసలేం జరుగుతోంది..?రెండు రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో గురువారం జరిగిన కీలకమైన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్టాపిక్గా మారింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసిన కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత.. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్తో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడ కలిసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మీనాక్షి నటరాజన్, మహేశ్కుమార్లను కలిసిన కొండా సురేఖ.. 48 గంటల్లో జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిసింది. పార్టీపరంగా, కొందరు ప్రజాప్రతినిధుల వల్ల తమకెదురవుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా మీడియాతో మాట్లాడిన సురేఖ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మీనాక్షి నటరాజన్, మహేశ్కుమార్తో భేటీ అయిన సురేఖ, ఆ తర్వాత జరిగిన కేబినెట్ మీటింగ్కు హాజరుకాకపోవడం కొత్త వివాదానికి తెర తీసింది. అసలు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడిన సురేఖకు వారు ఏమి భరోసా ఇచ్చారు? అక్కడినుంచి కేబినెట్ మీటింగ్కు వెళ్లాల్సిన ఆమె ఎందుకు వెళ్లలేదు? కావాలనే వెళ్లలేదా? లేక ఎవరైనా వద్దని చెప్పారా? ఈ నేపథ్యంలో కొండా దంపతులకు ఏమైన ప్రత్యేక వ్యూహం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది..? అన్న అంశాలు అన్ని వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. -
ఏదైతే అది.. మీనాక్షి మేడంతో మొత్తం చెప్పేశా !
-
పెద్దల వద్దకు ‘కొండా’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణా మాలు కలకలం రేపాయి. కొంతకాలంగా నెల కొన్న వివాదం గురువారం రాత్రి వరకు కొన సాగింది. పరిస్థితి మరీ దిగజారి రచ్చకెక్కకుండా పార్టీ పెద్దలు అతికష్టం మీద నియంత్రించగలి గారు. తనను లక్ష్యగా చేసుకొని పార్టీలో, మంత్రివర్గంలో కుట్రలు జరుగుతున్నాయని భావిస్తున్న మంత్రి సురేఖ గురు వారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశ మై తన వాదన వినిపించారు.అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్తో కూడా చర్చించారు. తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా తన దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీని ప్రభుత్వం తొలగించడాన్ని అవమానకరంగా భావించినట్లు ఆమె వారికి తెలిపినట్లు సమాచారం. పార్టీలో తనపై జరుగుతున్న దాడి గురించి మీనాక్షికి వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కాలేదు. పార్టీ పెద్దల నిర్ణయమే శిరోధార్యం: కొండా మీనాక్షి నటరాజన్తో సమావేశం అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘తాజా పరిణామాలపై పార్టీ ఇన్చార్జి, పీసీసీ అధ్యక్షుడు మహేష్మార్ గౌడ్తో సుదీర్ఘంగా చర్చలు జరిపినం. ఈ విషయంలో పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. సమస్యను పార్టీ పెద్దలు సెటిల్ చేస్తా మని చెప్పారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసా ఉంది’అని పేర్కొన్నారు. నివురుగప్పిన నిప్పులా పరిస్థితి..వరంగల్లో మంత్రి పొంగులేటి దేవాదాయ శాఖకు సంబంధించిన కాంట్రాక్టు వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ లేకుండానే సమావేశం జరగడం, ఆ తరువాత సురేఖ ఓఎస్డీ సుమంత్ను తొలగించడంతో వివాదం ముదిరింది. మేడారం అభివృద్ధి పనులను దేవా దాయ శాఖ నుంచి రోడ్లు, భవనాల శాఖకు బదలాయించడంతో మంత్రి సురేఖ ప్రమేయం లేకుండానే పనులు జరుగుతున్నాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంత్రి కుమార్తె సుష్మిత.. సీఎం పలువురు మంత్రులపై నేరుగా విమర్శలు చేశారు. బీసీ నాయకురాలైన తన తల్లి పట్ల ఓ వర్గం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం సృష్టించాయి. -
కొండా సురేఖ, కుమార్తె సుస్మితా పటేల్ విక్రమార్కను కలిసేందుకు ప్రజాభవన్ వెళ్లారు


