‘నా మాటలకు కట్టుబడి ఉన్నా.. ఫోన్‌ వచ్చింది ఇప్పుడేం మాట్లాడలేను’ | Konda Sushmitha Key Comments On OSD Issue | Sakshi
Sakshi News home page

‘నా మాటలకు కట్టుబడి ఉన్నా.. ఫోన్‌ వచ్చింది ఇప్పుడేం మాట్లాడలేను’

Oct 16 2025 12:59 PM | Updated on Oct 16 2025 1:01 PM

Konda Sushmitha Key Comments On OSD Issue

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ(konda Surekha) ఎపిసోడ్‌ తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, తాజాగా మరోసారి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని సుస్మిత చెప్పుకొచ్చారు. దీంతో, అధికార కాంగ్రెస్‌ పార్టీలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది.

కొండా సుస్మిత(konda Sushmita)  తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాత్రి నేను మాట్లాడిన మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. అధిష్టానం మాతో మాట్లాడింది. మీడియాలో ఎలాంటి అంశాలపై మాట్లాడవద్దని అదేశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని విషయాలపై మాట్లాడలేను. ఏం జరిగిందో అందరికీ తెలుసు’ అని కామెంట్స్‌ చేశారు.

మరోవైపు.. మంత్రి కొండా సురేఖకు సైతం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ నుంచి పిలుపు వెళ్లింది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి రావాలని సురేఖకు తెలిపారు. మరికాసేపట్లో ఎమ్మెల్యే క్వాటర్స్‌కి మంత్రి కొండా సురేఖ వెళ్ళనున్నారు. కేబినెట్‌ భేటీకి కూడా కొండా సురేఖ హాజరకానున్నారు. ఇదిలా ఉండగా.. మినిస్టర్ క్వార్టర్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటికి ఆమె మాజీ osd సుమంత్ భార్య డాక్టర్ మనిషా చేరుకున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: కొండా సురేఖకు బిగ్‌ షాక్‌.. 

Advertisement
 
Advertisement
Advertisement