breaking news
Hong Kong Sixes 2025
-
పాక్ బౌలర్ ఓవరాక్షన్.. టీమిండియా ప్లేయర్ల పట్ల అనుచిత ప్రవర్తన
హాంగ్కాంగ్ సిక్సస్-2025 టోర్నీలో ఇవాళ (నవంబర్ 7) భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. మాంగ్ కాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్ ఛేదిస్తుండగా వర్షం మొదలైంది. ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ను విజేతగా ప్రకటించారు.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేయగా.. పాక్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగుల స్కోర్ వద్ద ఉండగా మ్యాచ్ ఆగిపోయింది. భారత ఇన్నింగ్స్లో ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), భరత్ చిప్లి (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఆఖర్లో కెప్టెన్ దినేశ్ కార్తిక్ (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించాడు. స్టువర్ట్ బిన్ని 4, మిథున్ 6 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ముహమ్మద్ షెహజాద్ 2, అబ్దుల్ సమద్ ఓ వికెట్ తీశారు.పాక్ ఇన్నింగ్స్లో మాజ్ సదాఖత్ 7 పరుగులు చేసి ఔట్ కాగా.. మ్యాచ్ ముగిసే సమయానికి ఖ్వాజా నఫే (18 నాటౌట్), అబ్దుల్ సమద్ (16 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్లో కువైట్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 8న జరుగుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 6:40 గంటలకు మొదలవుతోంది.పాక్ బౌలర్ ఓవరాక్షన్ ఈ మ్యాచ్లో పాకిస్తాన్ పేసర్ ముహమ్మద్ షెహజాద్ భారత ప్లేయర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఉతప్ప, బిన్నీ వికెట్లు తీశాక పెదాలపై వేలు పెట్టుకొని సైలెంట్ అన్న అర్దం వచ్చేలా ఓవరాక్షన్ చేశాడు. షెహజాద్ అతిని టీమిండియా ఆటగాళ్లు పట్టించుకోకపోయినా భారత అభిమానులు మాత్రం సీరియస్గా తీసుకున్నారు.ఈ పాకిస్తాన్ ఆటగాళ్లకు ఎన్ని సార్లు బుద్ది చెప్పినా కుక్క తొక వంకర అన్న చందంగా ప్రవరిస్తారంటూ చురలంటిస్తున్నారు. షెహజాద్.. అంత ఓవరాక్షన్ వద్దంటూ సోషల్మీడియా వేదికగా ఏకీ పారేస్తున్నారు.కాగా, ఇటీవల జరిగిన ఆసియా కప్లో కూడా పాక్ ఆటగాళ్లు ఇలాగే ఓవరాక్షన్ చేశారు. ఇందుకు ప్రతిగా భారత ఆటగాళ్లు వారికి చేయాల్సిన మర్యాదంతా చేశారు. ఆ టోర్నీలో పాక్ను ఫైనల్ సహా మూడుసార్లు ఓడించి, వారి స్థాయిని వారికి చూపించారు. అయినా పాక్ ఆటగాళ్లు సిగ్గు లేకుండా భారత ఆటగాళ్లు ఎదురుపడిన ప్రతిసారి ఏదో ఓవరాక్షన్ చేస్తూ చీవాట్లు తింటూనే ఉన్నారు.ఆసియా కప్, మహిళల వన్డే ప్రపంచకప్లో వారి ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ నిరాకరించినా వారి ప్రవర్తనలో మార్పు లేదు. వారి క్రికెట్ చీఫ్ నుంచి ఆసియా కప్ను తీసుకునేందుకు నిరాకరించి, అవమానించినా తుడుచుకుని వెళ్లిపోయారు. పైగా వారి క్రికెట్ చీఫ్ సిగ్గు లేకుండా ఆసియా కప్ను ఎత్తుకెళ్లి, యావత్ క్రికెట్ సమాజం నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. పహల్గాం ఉదంతం ఆతర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్ తాట తీసిన విషయం తెలిసిందే. చదవండి: అభిషేక్ శర్మపై సూర్యకుమార్ సెటైర్లు.. ‘విధ్వంసకర’ ఓపెనర్ రియాక్షన్ ఇదే -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. హ్యాట్రిక్ సహా..!
హాంగ్ కాంగ్ సిక్సస్ టోర్నీలో (Hong Kong Sixes 2025) సరికొత్త రికార్డు నమోదైంది. నేపాల్ పేసర్ రషీద్ ఖాన్ (Rashid Khan).. ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (నవంబర్ 7) జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ సహా టోర్నీ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.🚨Hat-trick Alert🚨 A Rashid Khan you didn’t see coming 👀The Nepal pacer pulls off a sensational hat-trick vs Afghanistan in the #HongKongSixes 🎯 pic.twitter.com/X9NcP2dcAT— FanCode (@FanCode) November 7, 2025ఈ మ్యాచ్లో రషీద్ వరుస బంతుల్లో ఆఫ్ఘన్ బ్యాటర్లు సెదిఖుల్లా పచ్చా, షారాఫుద్దీన్ అష్రఫ్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్ను ఔట్ చేశాడు. తన కోటా 2 ఓవర్లలో మొత్తం 4 వికెట్లు తీసి కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రషీద్కు ముందు ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు శ్రీలంక బౌలర్ కంగనిగే తరిండు (2-0-33-4) పేరిట ఉండేవి.తాజా మ్యాచ్లో రషీద్ ఖాన్ చెలరేగినా నేపాల్ పరాజయంపాలవడం కొసమెరుపు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఓపెనర్లు కరీమ్ జనత్ (10 బంతుల్లో 35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), గుల్బదిన్ నైబ్ (10 బంతుల్లో 22; 3 సిక్సర్లు), నాలుగో నంబర్ ఆటగాడు ఫర్మానుల్లా సఫీ (9 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.టోర్నీ రూల్స్ ప్రకారం ఆరుగురు ఆటగాళ్లలో ఐదుగురు ఔటైనా ఓవర్లు మిగిలి ఉండే ఒక్కరే బ్యాటింగ్ కొనసాగించవచ్చు. ఈ మ్యాచ్లో అదే జరిగింది. రషీద్ ఖాన్ ఐదో ఓవర్ మొదటి మూడు బంతులకు హ్యాట్రిక్ వికెట్లు తీసినా.. ఫర్మానుల్లా సఫీ ఒక్కడే ఇన్నింగ్స్ను కొనసాగించాడు. ఒక్కడు కావడంతో అతడు చెలరేగి ఆడాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో నేపాల్కు కూడా సుడిగాలి ఆరంభం లభించింది. ఓపెనర్, కెప్టెన్ అయిన సందీప్ జోరా కేవలం 14 బంతుల్లోనే 53 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. సందీప్ క్రీజ్లో ఉన్నంత వరకు గెలుపు దిశగా పయనించిన నేపాల్, ఆతర్వాత నిదానించింది. అంతిమంగా నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 95 పరుగులకే పరిమితమై 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: Hong Kong Sixes 2025: పాకిస్తాన్పై భారత్ విజయం -
పాకిస్తాన్పై భారత్ విజయం.. అక్కడ కూడా భంగపాటే..!
హాంగ్కాంగ్ సిక్సస్ టోర్నీలో (Hong Kong Sixes 2025) పాకిస్తాన్పై భారత్ డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మాంగ్ కాక్ వేదికగా ఇవాళ (నవంబర్ 7) జరిగిన ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), భరత్ చిప్లి (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఆఖర్లో కెప్టెన్ దినేశ్ కార్తిక్ (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సైతం బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్లో స్టువర్ట్ బిన్ని 4, మిథున్ 6 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ముహమ్మద్ షెహజాద్ 2, అబ్దుల్ సమద్ ఓ వికెట్ తీశారు.అనంతరం పాక్ 87 పరుగుల లక్ష్య ఛేదనకు దిగగా వరుణుడు అడ్డు పడ్డాడు. వారి స్కోర్ 41/1 (3 ఓవర్లు) వద్ద ఉండగా వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ను విజేతగా ప్రకటించారు.మ్యాచ్ ముగిసే సమయానికి ఖ్వాజా నఫే (18 నాటౌట్), అబ్దుల్ సమద్ (16 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. మాజ్ సదాఖత్ (7) ఔటయ్యాడు. సదాఖత్ వికెట్ స్టువర్ట్ బిన్నికి దక్కింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్లో కువైట్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 8న జరుగుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 6:40 గంటలకు మొదలవుతోంది. కాగా, క్రికెట్లో పాకిస్తాన్పై భారత్ గెలవడం ఇటీవలికాలంలో ఇది ఐదోసారి. పహల్గాం ఉదంతం తర్వాత భారత సీనియర్ పురుషుల జట్టు పాక్ను ఆసియా కప్-2025లో మూడు సార్లు ఓడించింది. అనంతరం భారత సీనియర్ మహిళల జట్టు వన్డే ప్రపంచకప్లో పాక్ను చిత్తు చేసింది. తాజాగా సూపర్ సిక్సస్ టోర్నీలోనూ పాక్కు భారత్ చేతిలో భంగపాటు ఎదురైంది.చదవండి: పాకిస్తాన్ కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్.. -
పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఊతప్ప, డీకే..
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నీలో పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఓపెనర్ రాబిన్ ఊతప్ప మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే పాక్ బౌలర్లను టార్గెట్ చేశాడు. ఈ వెటరన్ క్రికెటర్ కేవలం 11 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్స్లతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కెప్టెన్ దినేష్ కార్తీక్, భరత్ చిప్లి కూడా బ్యాట్ను ఝూళిపించారు. భరత్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 24 పరుగులు చేయగా.. కార్తీక్ కేవలం 6 బంతుల్లోనే 17 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్లో కువైట్పై ఘన విజయం సాధించింది.కువైట్ నిర్ధేశించిన పాకిస్తాన్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో పాక్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్రిది కేవలం 12 బంతుల్లోనే 1 ఫోర్, 8 సిక్స్లతో 55 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. మరోవైపు అఫ్గానిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించింది.చదవండి: పాకిస్తాన్ కెప్టెన్ విధ్వంసం.. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ -
అఫ్గానిస్తాన్ సంచలనం.. 6 ఓవర్లలో 148 పరుగులు
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్లో అఫ్గానిస్తాన్ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం మోంగ్కాక్ వేదికగా తొలుత నేపాల్ను 17 పరుగుల తేడాతో ఓడించిన అఫ్గాన్.. తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 49 పరుగుల తేడాతో గెలుపొందింది.నైబ్ విధ్వంసం..ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 148 పరుగులు చేసింది. అఫ్గాన్ కెప్టెన్ నైబ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మోంగ్కాక్ మిషన్ రౌండ్ గ్రౌండ్లో నైబ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. తన మెరుపు బ్యాటింగ్తో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. నైబ్ కేవలం 12 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. అతడితో పాటు మరో సీనియర్ ఆల్రౌండర్ కరీం జనత్ కూడా తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. జనత్ కేవలం 11 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 50 పరుగులు చేశాడు. ప్రోటీస్ బౌలర్లలో బయోమీ రెండు వికెట్లు సాధించాడు.అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది. జోరిచ్ వాన్ షాల్క్విక్(37) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాషీఫ్ జోసెఫ్(22) రిటైర్డ్ ఔట్గా వెనుదిరగగా.. జాన్ కన్నింగ్హామ్(22) టైమడ్ ఔట్గా పెవిలియన్కు చేరాడు. మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన నైబ్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: పాకిస్తాన్ కెప్టెన్ విధ్వంసం.. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ -
పాకిస్తాన్ కెప్టెన్ విధ్వంసం.. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శుక్రవారం మోంగ్ కాక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో కువైట్పై 4 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కువైట్ నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 123 పరుగుల భారీ చేసింది.కువైట్ ఇన్నింగ్స్లో భావ్సర్(14 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 40) టాప్ స్కోరర్గా నిలవగా.. బిలాల్ తహిర్(6 బంతుల్లో 24), ఉస్మాన్ పటేల్(9 బంతుల్లో31) మెరుపులు మెరిపించారు. పాక్ బౌలర్లలో మాజ్ సదఖత్, అబ్బాస్ అఫ్రిది తలా వికెట్ సాధించారు.అఫ్రిది విధ్వంసం..అనంతరం 124 పరుగుల భారీ లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. లక్ష్య చేధనలో పాక్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన అఫ్రిది.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.ఈ క్రమంలో పాక్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన కువైట్ స్పిన్నర్ యాసిన్ పటేల్ బౌలింగ్లో అఫ్రిది.. వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. తొలి బంతిని స్ట్రైట్ డ్రైవ్ ఆడి సిక్సర్గా మలిచిన అఫ్రిది.. ఆ తర్వాత బంతిని లాంగ్ ఆన్ మీదగా స్టాండ్స్కు తరలించాడు.అనంతరం మూడు, నాలుగు బంతులను డీప్ మిడ్ వికెట్ మీదగా భారీ సిక్సర్లు బాదాడు. చివరి రెండు బంతులను లాంగ్ ఆఫ్, ఫైన్ లెగ్ మీదగా ఆడి సిక్సర్లు రాబట్టాడు. అఫ్రిది కేవలం 12 బంతుల్లోనే 1 ఫోర్, 8 సిక్స్లతో 55 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు.🚨Big win for Pakistan against Kuwait in the Hong Kong Super Sixes! 🔥They beat Kuwait by 4 wickets, with Abbas Afridi smashing six sixes in an over! 🤯#HongKongSixes pic.twitter.com/WjppEmAqTx— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 7, 2025 -
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా డీకే.. పూర్తి వివరాలు
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్కు భారత్ తమ జట్టును ప్రకటించింది. హాంకాంగ్లో నవంబరు 6 నుంచి 9 వరకు మోంగ్ కాక్ వేదికగా జరిగే ఈ పొట్టి టోర్నీలో భారత్కు.. మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) సారథ్యం వహించనున్నాడు.డీకేతో పాటు రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్లు హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్లో పాల్గొననున్నారు. అదే విధంగా.. దేశీ వెటరన్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) కూడా ఈ టోర్నీలో భాగం కానున్నాడు.ఆరు ఓవర్ల పాటు ఆట కాగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో.. ఒక్కో టీమ్లో ఆరుగురు సభ్యులు (మాజీ క్రికెటర్లు) ఉంటారు. ఆరు ఓవర్ల పాటు ఆట సాగుతుంది. ఇక ఈ షార్టెస్ట్ క్రికెట్ ఈవెంట్లో 2005లో టైటిల్ గెలిచిన భారత్.. రెండుసార్లు రన్నరప్తో సరిపెట్టుకుంది.అయితే, గతేడాది రాబిన్ ఊతప్ప కెప్టెన్సీలో కనీసం ఫైనల్ కూడా చేరలేదు టీమిండియా. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త సారథిగా డీకే రావడం విశేషం. కాగా తాజా ఎడిషన్లో పన్నెండు జట్లు పాల్గొంటున్నాయి.పన్నెండు జట్లు ఇవేభారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, నేపాల్, ఇంగ్లండ్, యూఏఈ, కువైట్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ (చైనా) ఈసారి టోర్నీలో భాగం కానున్నాయి. పూల్- ‘ఎ’ నుంచి సౌతాఫ్రికా అఫ్గనిస్తాన్, నేపాల్.. పూల్- ‘బి’ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ యూఏఈ.. పూల్- ‘సి’ నుంచి ఇండియా, పాకిస్తాన్, కువైట్... పూల్- ‘డి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ పోటీపడతాయి.హాంకాంగ్ సిక్సెస్-2025లో పాల్గొనే జట్ల వివరాలుభారత్దినేశ్ కార్తిక్ (కెప్టెన్), రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచల్.ఆస్ట్రేలియాఅలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హోబ్సన్, క్రిస్ గ్రీన్, విల్ బొసిస్టొ, ఆండ్యూ టై.ఇంగ్లండ్జో డెన్లీ (కెప్టెన్), జేమ్స్ కోల్స్, ఈథన్ బ్రూక్స్, టోబీ అల్బర్ట్, జార్జ్ హిల్ డాన్ మౌస్లే, టామ అస్పిన్వాల్.బంగ్లాదేశ్అక్బర్ అలీ (కెప్టెన్) అబు హైదర్ రోని, జిషాన్ ఆలం, మొహమ్మధ్ సైఫుద్దీన్, మొసాడెక్ హొసేన్, రకీబుల్ హసన్, టొఫేల్ అహ్మద్.యూఏఈకౌశిక్ హర్షిత్ (కెప్టెన్), ఖలీద్ షా, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ సాగిర్ ఖాన్, నిలాన్ష్ కేస్వాని, రెజిత్ కురుంగొడె, జాహిద్ అలీ.కువైట్యాసిన్ పటేల్ (కెప్టెన్), ఉస్మాన్ పటేల్, మీట్ భవ్సార్, బిలాల్ తాహిర్, రవిజ సాండరువాన్, అద్నాన్ ఇద్రీస్, మొహమద్ షఫీక్.నేపాల్శరద్ వేసావ్కర్ (కెప్టెన్), సందీప్ జోరా, లోకేశ్ బామ్, బాసిర్ అహ్మద్, ఆదిల్ ఆలం, రషీద్ ఖాన్, రూపేశ్ సింగ్.శ్రీలంకలాహిరు మధుషాంక (కెప్టెన్), ధనంజయ లక్షణ్, తనుక దబారే, నిమేశ్ విముక్తి, లాహిరు సమారకూన్, థారిందు రత్నాయక, సచిత జయతిలకె.సౌతాఫ్రికాజోర్డాన్ మోరిస్ (కెప్టెన్), అబ్దుల్లా బయోమి, ఈథన్ కన్నింగ్హామ్, బులెలొ దూబే, కషీఫ్ జోసెఫ్, బ్లేక్ సింప్సన్, జోరిచ్ వాన్ షాల్వేక్.హాంకాంగ్యాసిమ్ ముర్తజా (కెప్టెన్), బాబర్ హయత్, అన్షుమాన్ రథ్, ఐజాజ్ ఖాన్, నిజాకత్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్, నస్రుల్లా రాణా.అఫ్గనిస్తాన్గుల్బదిన్ నైబ్ (కెప్టెన్), ఇక్రామ్ అలిఖిల్, కరీం జన్మత్, షరాఫుద్దీన్ ఆష్రఫ్, ఫర్మానుల్లా సఫీ, ఐజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, సెదీకుల్లా పచా.పాకిస్తాన్అబ్బాస్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఖవాజా మొహమద్ నఫాయ్, మాజ్ సదాకత్, మొహమద్ షాజాద్, సాద్ మసూద్ షాహిద్ అజీజ్.చదవండి: యాషెస్ తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన -
ఆస్ట్రేలియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్..
హాంగ్కాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 టోర్నమెంట్ నవంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టు కెప్టెన్గా బిగ్ బాష్ లెజెండ్ అలెక్స్ రాస్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో బెన్ మెక్డెర్మాట్, ఆండ్రూ టై, క్రిస్ గ్రీన్ వంటి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.క్రిస్ గ్రీన్కు కెప్టెన్గా అపారమైన అనుభవం ఉనప్పటికి రాస్కే జట్టు పగ్గాలను సెలక్టర్లు కట్టబెట్టారు. గతేడాది ఆస్ట్రేలియా సెమీఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని కంగారులు పట్టుదలతో ఉన్నారు. కాగా ఈవెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ జట్లు భాగం కానున్నాయి. నవంబర్ 7 నుంచి 9 వరకు టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్లో జరగనుంది. ఈ సిక్సెస్ టోర్నీ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. టీమిండియా కెప్టెన్ దినేష్ కార్తీక్ వ్యవహరించనున్నాడు.హాంకాంగ్ క్రికెట్ సిక్సర్స్ కోసం ఆస్ట్రేలియా జట్టు:అలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హాబ్సన్, క్రిస్ గ్రీన్, విలియం బోసిస్టో , ఆండ్రూ టై.అసలేంటి హాంకాంగ్ సిక్సెస్?1992లో హాంకాంగ్ క్రికెట్ ఆధ్వర్యంలో మొదలైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. చివరగా 2017 వరకు జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈ టోర్నీని నిర్వహించలేదు. అయితే ఈ ఈవెంట్కు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు హాంకాంగ్ క్రికెట్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీని మళ్లీ నిర్వహించారు. గత సీజన్ విజేతగా శ్రీలంక నిలిచింది.దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు అత్యధికంగా 5 సార్లు ఈ టోర్నమెంట్ విజేతలగా నిలవగా.. పాకిస్తాన్ 4 సార్లు, శ్రీలంక రెండు సార్లు ఈ హాంకాంగ్ సిక్సెస్ ట్రోఫీని ముద్దాడింది. భారత్, ఆస్ట్రేలియా, విండీస్ జట్లు చెరో ఒక్కసారి ఛాంపియన్స్గా నిలిచాయి. గతంలో ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం ఆడారు.రూల్స్ ఇవే..ఒక మ్యాచ్లో ప్రతీ జట్టు 5 ఓవర్లు మాత్రమే ఆడుతోంది. మ్యాచ్ ఆడే రెండు జట్లలో ఆరుగురు ఆటగాళ్లు ఉండాలి. గ్రూప్ దశలో ఒక్కో ఓవర్కు ఆరు బంతులు ఉంటాయి. అదే ఫైనల్లో ఒక్కో ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి. . వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది. చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు -
పాకిస్తాన్ మరో ఫార్మాట్ కెప్టెన్గా మరో అఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు (Pakistan) ఇవాళే (అక్టోబర్ 21) మరో అఫ్రిది కెప్టెన్గా ఎంపికయ్యాడు. తొలుత వన్డే జట్టుకు షాహీన్ షా అఫ్రిదిని (Shaheen Afridi) కెప్టెన్గా ఎంపిక చేసిన పాక్ సెలెక్టర్లు.. తాజాగా సూపర్-6 ఫార్మాట్ కెప్టెన్గా అబ్బాస్ అఫ్రిదిని (Abbas Afridi) నియమించారు. హాంగ్కాంగ్ సిక్సస్ టోర్నీలో (Hong Kong Sixes 2025) పాల్గొనబోయే పాక్ జట్టుకు అబ్బాస్ అఫ్రిది కెప్టెన్గా ఎంపికయ్యాడు.అబ్బాస్ అఫ్రిది పాక్ మాజీ పేసర్ ఉమర్ గుల్కు మేనల్లుడు. అబ్బాస్ను ఇటీవలే పాక్ జట్టు నుంచి తప్పించారు. ఆసియా కప్ జట్టులో చోటు ఆశించిన అబ్బాస్కు నిరాశ ఎదురైంది. తాజాగా పాక్ సెలెక్టర్లు అబ్బాస్కు న్యాయం చేశారు. సూపర్ సిక్సస్ జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేశారు. జాతీయ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనుండటం అబ్బాస్కు ఇదే తొలిసారి.ఈ పాక్ జట్టులో అబ్బాస్తో పాటు అబ్దుల్ సమద్, మోహమ్మద్ షెహజాద్, ఖవాజా నఫాయ్, మాజ్ సదాఖత్, సాద్ మసూద్, షాహిద్ అజీజ్కు చోటు దక్కింది. డానిశ్ అజీజ్, మొహమ్మద్ ఫైక్ రిజర్వ్లుగా ఎంపికయ్యారు.హాంగ్కాంగ్ సూపర్ సిక్సస్ టోర్నీ నవంబర్ 7 నుంచి 9 వరకు హాంగ్కాంగ్లోని Tin Kwong Road Recreation Ground వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉంటారు. ఇన్నింగ్స్కు ఆరు ఓవర్లు ఉంటాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్తో పాటు భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కువైట్, హాంగ్కాంగ్, సౌతాఫ్రికా దేశాల జట్లు పాల్గొంటున్నాయి. భారత్ తరఫున ఇటీవలే ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నాడు. టీమిండియాకు దినేశ్ కార్తీక్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.కాగా, హాంగ్కాంగ్ సిక్సస్ అనే టోర్నీ 1992లో పరిచయమైంది. తొలి ఎడిషన్లో పాక్ విజేతగా నిలిచింది. ఆతర్వాత వరుసగా ఐదేళ్లు నిరంతరాయంగా సాగిన ఈ టోర్నీకి బ్రేక్ పడింది. 2001లో పునఃప్రారంభమైంది. అప్పటి నుంచి 2012 వరకు నిరాటంకంగా సాగింది. మధ్యలో 2017లో జరిగింది. తిరిగి 2024లో పునఃప్రారంభమైంది. గత ఎడిషన్ ఫైనల్లో శ్రీలంక పాక్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ 2005లో ఛాంపియన్గా నిలిచింది. చదవండి: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి -
టీమిండియా కెప్టెన్గా దినేశ్ కార్తిక్.. ప్రకటన విడుదల
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్లో భారత జట్టు కెప్టెన్గా దినేశ్ కార్తిక్ (Dinesh Karthik)ఎంపికయ్యాడు. నవంబరు 7 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో టీమిండియాకు ఈ మాజీ క్రికెటర్ సారథ్యం వహించనున్నాడు. కాగా 1992 నుంచి నిర్వహిస్తున్న హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్లో భారత్ ఇప్పటికి ఒకే ఒక్కసారి చాంపియన్గా నిలిచింది.ఇరవై ఏళ్ల క్రితం భారత జట్టు 2005 ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. ఇక గతేడాది రాబిన్ ఊతప్ప కెప్టెన్సీ భారత్ కనీసం ఫైనల్ కూడా చేరలేదు. ఈ క్రమంలో తాజా ఎడిషన్లో కెప్టెన్ను మార్పు చేయడం గమనార్హం.ప్రకటన విడుదలఇందుకు సంబంధించి హాంకాంగ్ క్రికెట్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అపార అనుభవం, నాయకత్వ లక్షణాలు, విధ్వంసకర బ్యాటింగ్తో గుర్తింపు తెచ్చుకున్న దినేశ్ కార్తిక్ ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతాడనడంలో సందేహం లేదు.భయం లేని, వినోదాత్మకమైన, వరల్డ్క్లాస్ ఆట చూపించేందుకు సిక్సెస్ దినేశ్ కార్తిక్తో సిద్ధంగా ఉంది’’ అని హాంకాంగ్ క్రికెట్ తమ ప్రకటనలో పేర్కొంది. కాగా తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల దినేశ్ కార్తిక్ వికెట్ కీపర్ బ్యాటర్.2004- 2022 వరకుటీమిండియా తరఫున 2004- 2022 వరకు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాడు. మొత్తంగా 26 టెస్టుల్లో 1025, 94 వన్డేల్లో 1752, 69 టీ20 మ్యాచ్లలో కలిపి 686 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్లో 2008- 2024 వరకు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించిన డీకే.. 257 మ్యాచ్లు ఆడి 4842 పరుగులు చేశాడు.ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తిక్.. ఈ ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటింగ్ కోచ్, మెంటార్గా వ్యవహరించాడు. పదిహేడేళ్ల కలకు తెరదించుతూ ఆర్సీబీ ఈ ఏడాది ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. దీంతో డీకే సంబరాలు కూడా అంబరాన్నంటాయి.అశూ కూడా అయితే, ఇప్పుడు హాంకాంగ్ సిక్సెస్ ద్వారా ఆటగాడిగా మరోసారి బ్యాట్తో అలరించేందుకు డీకే సిద్ధమయ్యాడు. కాగా ఈ టోర్నీలో ఒక్కో జట్టు ఆరు ఓవర్లు ఆడుతుంది. ఇక గతేడాది రాబిన్ ఊతప్ప కెప్టెన్సీలో మనోజ్ తివారి, కేదార్ జాదవ్, శ్రీవత్స్ గోస్వామి వంటి మాజీ ఆటగాళ్లు ఇందులో భాగమయ్యారు. ఈసారి దినేశ్ కార్తిక్తో పాటు టీమిండియా తాజా మాజీ ఆటగాడు, స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాడు. అయితే, భారత జట్టుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.చదవండి: IND vs AUS: శ్రేయస్ అయ్యర్ అనూహ్య నిర్ణయం.. గుడ్బై చెప్పేసి..


