CORPORATES
-
లాభాలకు తగ్గట్లు జీతాలు పెంచండి
న్యూఢిల్లీ: లాభదాయకతకు అనుగుణంగా పెట్టుబడులు, ఉద్యోగుల వేతనాలను పెంచడంపై దృష్టి పెట్టాలని కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచించారు. అప్పుడే భారత్ 6.5 శాతం పైగా ఆర్థిక వృద్ధిని నిలకడగా సాధించగలదని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలదని ఆయన చెప్పారు. పెట్టుబడుల సానుకూల వలయాన్ని వివరిస్తూ, ఇన్వెస్ట్మెంట్లతో సామర్థ్యాలు పెరగడంతో పాటు మరింత అధిక వేతనాలతో మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఇది కుటుంబాలు ఇంకాస్త ఎక్కువ పొదుపు చేసేందుకు దోహదపడుతుందని నాగేశ్వరన్ చెప్పారు. కానీ ప్రస్తుతం వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉంటోందని, వచ్చే 25 లేదా 30 ఏళ్ల పాటు ఇదే తీరు కొనసాగితే నిర్దేశించుకున్న లక్ష్య సాధన దిశగా పురోగమించలేమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి సమస్య సంపన్న దేశాల్లోనే కనిపిస్తుందే తప్ప భారత్లాంటి వర్ధమాన దేశాల్లో ఉండదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ చెప్పారు. 21వ శతాబ్దపు రెండో దశాబ్దంలో భారతీయ ప్రైవేట్ రంగ లాభదాయకత రూ. 7.2 లక్షల కోట్ల నుంచి రూ. 28.7 లక్షల కోట్లకు నాలుగు రెట్లు పెరిగినప్పటికీ, పెట్టుబడులు మాత్రం మూడు రెట్లే పెరిగాయని ఆయన చెప్పారు. ఇన్ఫ్రాలో కూడా ఇన్వెస్ట్ చేయాలి.. రాబోయే 25 ఏళ్లలో మౌలిక సదుపాయాలతో పాటు సామర్థ్యాల పెంపుపై భారత్ గణనీయంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని, ప్రైవేట్ రంగం ఇటు పెట్టుబడులు అటు ఉద్యోగుల వేతనాల మధ్య సమతూకం ఉండేలా చూసుకోవాలని నాగేశ్వరన్ పేర్కొన్నారు. కుటుంబాల ఆదాయాలు, పొదుపు పెరిగితేనే నిలకడగా వృద్ధి సాధ్యపడుతుందని వివరించారు. పెట్టుబడులతో మరిన్ని ప్రయోజనాలను రాబట్టాలంటే పరిశ్రమలపై రెగ్యులేటరీ భారం తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ప్రైవేట్ రంగం మధ్య విశ్వసనీయత పెరగాలని నాగేశ్వరన్ చెప్పారు. కొన్ని సార్లు నియంత్రణ సంస్థలపరంగా దేన్ని డీరెగ్యులేట్ చేయాలనే దానిపై స్పష్టత ఉన్నప్పటికీ ఎలా చేయాలనేది సవాలుగా ఉంటుందని ఆయన తెలిపారు. నియంత్రణల తొలగింపు అనేది కొన్ని సందర్భాల్లో అవాంఛితమైన విధంగా దురి్వనియోగానికి కూడా దారి తీసే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యాలు సాధించాలంటే ఇరుపక్షాలు పరస్పరం నమ్మకంతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాకుండా, దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం మధ్య కూడా నమ్మకం ఉండాలి. సమిష్టిగా కలిసి పని చేస్తే తప్ప వచ్చే 25 ఏళ్లలో మనం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాన్ని సాధించలేం‘ అని నాగేశ్వరన్ చెప్పారు. మరోవైపు, ఎకనమిక్ సర్వేలో పేర్కొన్నట్లు భారత్ 6.3–6.8 శాతం మధ్య వృద్ధి రేటును నమోదు చేసిందని .. రుతుపవనాలు మెరుగ్గా ఉండటం, ప్రభుత్వ పెట్టుబడుల దన్ను, పన్నులపరమైన ఉపశమనం, వడ్డీ రేట్ల తగ్గుదల తదితర సానుకూలాంశాలతో ఇదే స్థాయి వృద్ధి సుదీర్ఘకాలం పాటు కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. -
కార్పొరేట్ సంస్థలకు కళ్లెం
ప్రభుత్వాల హవా తగ్గి కార్పొరేట్లు, గుప్పెడుమంది వ్యక్తులు రాజ్యాన్ని శాసించే స్థితి ప్రపంచమంతటా వచ్చి చాన్నాళ్లవుతోంది. ఇలాంటి స్థితిలో డిజిటల్ మార్కెటింగ్ చట్టం (డీఎంఏ) ఉల్లంఘనలకు పాల్పడినందుకు అమెరికన్ బడా టెక్ సంస్థలు యాపిల్, మెటా (ఫేస్బుక్)లకు భారీయెత్తున జరిమానా విధించి యూరోపియన్ యూనియన్ (ఈయూ) కొంత సాహసాన్ని ప్రదర్శించిందనే చెప్పాలి. యాపిల్ సంస్థకు 57 కోట్ల డాలర్లు (రూ. 4,868 కోట్లుపైగా), మెటా సంస్థకు దాదాపు 23 కోట్ల డాలర్లు (రూ. 1,965 కోట్లు) ఈయూ పెనాల్టీ విధించింది. వచ్చే జూన్ చివరికల్లా యాపిల్ ఈయూ నిబంధనలకు భిన్నంగావున్న తన యాప్ స్టోర్ నిబంధనల్లో సవరణలు చేయకపోతే రోజువారీ జరిమానాలు మొదలవుతాయి. మెటా సంస్థ నిరుడు ఈయూ నోటీసు అందుకున్నాక దారికొచ్చి యాప్ స్టోర్లో మార్పులు తెచ్చింది. అందువల్ల పాత తప్పులకు మాత్రమే జరిమానా పడింది. ఈయూ తమపై కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నదని ఆ రెండు సంస్థలూ ఆరోపిస్తున్నాయి. నిజానికి ఈ రెండు సంస్థలకు విధించిన జరిమానాలూ చాలా తక్కువన్న అభిప్రాయం యూరప్ ప్రజల్లోవుంది. మ్యూజిక్ స్ట్రీమింగ్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ నిరుడు యాపిల్ సంస్థకు 205 కోట్ల డాలర్ల (రూ. 17,500 కోట్లపైమాటే), మెటా సంస్థకు 90 కోట్ల డాలర్ల (రూ. 7,685 కోట్లకుపైగా) జరిమానాలు విధిస్తున్నట్టు ఈయూ ప్రకటించింది. ఏడాదిగా ఆ సంస్థల వివరణను పరిశీలించే పేరిట తాత్సారం చేసి చివరకు తుది తీర్పు ప్రకటించింది. ఆ సంస్థలు మాత్రం ఇది కూడా అన్యాయమేనన్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నాయి.వర్తమాన పరిస్థితుల్లో ఈయూ ఈ స్థాయి జరిమానాలు విధించటం ఒకరకంగా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిష్ఠించాక లెక్కలు మారిపోయాయి. సర్వరోగ నివారిణిగా ఆయన అధిక సుంకాల మోతమోగిస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రత్యేకించి అమెరికన్ టెక్ కంపెనీల జోలికి ఎవరొచ్చినా తాట తీస్తామంటున్నారు. మొన్న ఫిబ్రవరిలో ప్యారిస్లో జరిగిన కృత్రిమ మేధ సదస్సు సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈయూపై బాహాటంగానే అక్కసు వెళ్లగక్కారు. ఏఐ ప్రగతిని అడ్డుకునేలా యూరప్ వ్యవహ రిస్తున్నదని, అమెరికా బడా సంస్థలను అతిగా నియంత్రించే పోకడలు మానుకోవాలని హెచ్చరించారు. ఆయన ప్రత్యేకించి డీఎంఏ, డిజిటల్ సర్వీసెస్ చట్టం (డీఎస్ఏ)లను ప్రస్తావించారు కూడా. జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) సైతం తమకు సమ్మతం కాదని తెలిపారు. యూరప్ దేశాల్లో నిబంధనలు తమ వ్యాపార విస్తరణకూ, లాభార్జనకూ ఆటంకం కలిగిస్తున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నట్టు వాన్స్ వివరించారు. ఈ పోకడల్ని సహించబోమన్నారు. ఇదంతా గుర్తుంచుకుంటే ఈయూ తాజా నిర్ణయంలోని ఆంతర్యమేమిటో బోధపడుతుంది. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టు ఏటా కోట్లాది డాలర్లు పన్నుల రూపంలో చెల్లిస్తున్న తమ బడా సంస్థలంటే అమెరికాకు అభిమానంవుండొచ్చు. కానీ ఆ సంస్థలు రకరకాల నిబంధనల పేరిట సాధారణ వినియోగదారుల్ని పీల్చి పిప్పి చేస్తున్నా, దివాలా తీయిస్తున్నా వేరే దేశాల వారెవరూ మాట్లాడకూడదని ట్రంప్, వాన్స్ భావించటం తెంపరితనం తప్ప మరోటి కాదు. యాపిల్ యాప్ స్టోర్లో లభించే మ్యూజిక్ యాప్ తదితరాలపై అధికంగా వసూలు చేస్తున్నారని భావించే వినియోగదారులు నేరుగా తమ వద్ద కొనుగోలు చేయొచ్చని చెప్పే డెవలపర్ల సందేశం కనబడకుండా, ఆ యాప్కు నేరుగా తీసుకెళ్లే లింక్లు పనిచేయకుండా యాపిల్ నిరోధిస్తున్నది. ఇక మెటా అయితే తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో లభ్యమయ్యే యాప్లు కావాలంటే వినియోగదారుల వ్యక్తిగత డేటా ఉపయోగించుకోవటానికి అనుమతించాలని షరతు విధిస్తోంది. అంగీకరించనివారికి ఆ యాప్లలో వాణిజ్య ప్రకటనలు కనబడేలా చేస్తోంది. అవి వద్దనుకుంటే నెలవారీ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. సాంకేతికతలు ఎంతగానో విస్తరించిన ఈ తరుణంలో బడా కార్పొరేట్ సంస్థలు వాటిపై ఆధారపడకతప్పని స్థితి జనాలకు కల్పించి చెల్లిస్తారా... చస్తారా అన్నట్టు పీక్కుతింటున్నాయి. ఈ స్థితిలో కీలెరిగి వాతపెట్టిన చందాన డీఎంఏ రంగప్రవేశం చేసింది. టెక్ కంపెనీలు ఉల్లంఘనలకు పాల్పడితే ఆ సంస్థల ప్రపంచ టర్నోవర్లో 10 శాతం, పదే పదే ఆ తప్పులు చేస్తూ పోతే ప్రపంచ టర్నోవర్లో 20 శాతం మేర జరిమానాలు విధించాలని చట్టం నిర్దేశిస్తోంది. కార్పొరేట్ సంస్థలకు వాతలుపెట్టి అనవసరంగా ట్రంప్ ఆగ్రహాన్ని చవిచూడటమెందుకని ఈయూ జంకుతున్న వైనం తాజా నిర్ణయంలో స్పష్టంగా కనబడుతోంది. వాటిపై చర్య తీసుకుంటున్నామన్న అభిప్రాయం యూరప్ ప్రజల్లో కలగాలి... అదే సమయంలో ట్రంప్ చేత చీవాట్లు తినకుండా, ఆయనగారిని మరీ నొప్పించకుండా గండాన్ని గట్టెక్కాలి అని ఈయూ భావిస్తోంది. అయితే మనకన్నా ఈయూ ఎంతో నయం. గుత్తాధిపత్య వ్యాపార ధోరణులను అరికట్టడానికున్న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కఠినంగా ఉండలేకపోతున్నది. గూగుల్ సంస్థ పోకడలను అరికట్టడంలో ఎంతో కొంత విజయం సాధించినా అది చాలినంతగా లేదు. వినియోగదారులూ, స్థానిక పరిశ్రమలూ నిలువుదోపిడీకి గురికాకుండా... టెక్ సంస్థలైనా, మరే ఇతర సంస్థలైనా ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ప్రభుత్వాలు పనిచేయాలి. అందుకు కావలసిన చట్టాలు తీసుకురావాలి. అనారోగ్యకర వ్యాపార పోకడలపై కఠినచర్యలుండాలి. బడా కార్పొరేట్ సంస్థలు తమ లాభాలను అపారంగా పెంచుకోవటం, అవి ప్రభుత్వాల్ని శాసించే స్థితికి ఎదగటం ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది. అందుకే ఈయూ చర్యల్ని స్వాగతించాలి. -
క్రీడాభివృద్ధికి ‘కార్పొరేట్’ సహకారం అవసరం
న్యూఢిల్లీ: భారత్లో క్రీడల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థల ఆర్థిక సహకారాన్ని కోరతామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. భారత్లో క్రీడల సంస్కృతి పెరిగేందుకు, అథ్లెట్ల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మనదేశంలో ప్రతీ క్రీడాంశానికి ప్రత్యేక ఎక్సలెన్సీ కేంద్రం (సీఓఈ) ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఒనగూరే ప్రయోజనాలెన్నో ఉన్నాయన్నారు. ఎక్సలెన్సీలతో ఎంతో మేలు ‘ప్రతి క్రీడ కోసం ప్రత్యేకంగా అధునాతన సదుపాయాలతో ఒలింపిక్ సెంటర్ లేదంటే ఎక్సలెన్సీ కేంద్రం నిర్మించాలనేదే నా లక్ష్యం. వచ్చే పదేళ్లలో ఇలాంటి కేంద్రాల ద్వారా ప్రతిభావంతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అప్పుడు క్రీడా ప్రగతే మారుతుంది. ఇందుకోసం ప్రముఖ కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కోరతాం. వారి నిధులతో ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో ఎక్సలెన్సీలను నిర్మించే యోచనలో ఉన్నాం. ప్రస్తుతం దేశంలో ఉన్న 23 జాతీయ ఎక్సలెన్సీ కేంద్రాలన్నీ ప్రభుత్వానివే! భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ఆధ్వర్యంలోనే ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నాం. మనకన్నా చిన్న దేశాలు ఒలింపిక్స్లో పతకాలు సాధిస్తున్నాయి. జపాన్, ఆ్రస్టేలియా, అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల మోడల్ను అధ్యయనం చేశాం. మన ఎక్సలెన్సీలకు ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు, ప్రైవేట్ భాగస్వామ్యం కూడా తోడవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. వర్గపోరును సహించం జాతీయ క్రీడా సమాఖ్యల పంథా మారాల్సిందే. ఏ సమాఖ్య అయినా సరే తమ ఆట, అథ్లెట్లకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెట్టాలి. క్రీడేతర అంశాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సమాఖ్యలో వర్గపోరును ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం. దీని వల్ల ఆ క్రీడకు, అథ్లెట్కు వాటిల్లే నష్టమెంటో మాకు తెలుసు. కాబట్టి సమాఖ్యలన్నీ కూడా ఆయ క్రీడాకారుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, వెన్నంటే తోడ్పాటు తదితర అంశాలను గుర్తుంచుకొని వ్యవహరించాలి. వర్గపోరుతో అథ్లెట్ల ప్రయోజనాల్ని దెబ్బతీసే సమాఖ్యల తీరును ఎంతమాత్రం ఉపేక్షించం. ఐక్య కార్యచరణ సమితి అవసరం భారత్ ఇదివరకు 2030 కామన్వెల్త్ క్రీడలకు బిడ్ వేసింది. దీనికి ముందే 2036 ఒలింపిక్స్ కోసం ప్రాథమిక దశలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ను దాఖలు చేసింది. ఇలా మన సత్తా, సాధన సంపత్తిని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ముందు గట్టిగా విశదీకరించేందుకు, లేదంటే ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఒక ఐక్య కార్యచరణ సమితి అవసరం ఎంతో ఉంది. మన రెజ్లింగ్ సమాఖ్యకు అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య సమస్యలెదురయ్యాయి. ఐక్య సమితి ఉంటే మన వాదన వినిపించొచ్చు. ప్రత్యేక డిజీలాకర్ ఆటగాళ్లు వారి ప్రదర్శనలు, వాళ్లకు అవసరమైన పత్రాలు, దరఖాస్తులు ఇకపై డిజిటలైజ్ చేస్తాం. అంటే ప్రతిదానికి వేర్వేరు పత్రాలు, దరఖాస్తులు అవసరముండవు. ఆటగాళ్ల ఘనతల్ని ప్రత్యేక డిజీలాకర్లో భద్రబరిచే కార్యక్రమాన్ని ఏడాదిలోగా పూర్తిచేస్తాం. ప్రతి జాతీయ క్రీడా సమాఖ్య విధిగా డిజీలాకర్ను ఏర్పాటు చేసుకోవాల్సిందే. అయితే ఒలింపిక్ పతక విజేతలకు దరఖాస్తులు, పత్రాలు వ్యక్తిగతంగా డిజీలాకర్లో నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచం యావత్తు చూసిన పతక విజేతల ఘనత ప్రత్యేకంగా లిఖించాలా? కొండంత భరోసాగా ఉద్యోగాలు క్రీడలను కెరీర్గా ఎంచుకొని కఠోరంగా శ్రమించి పతకాలు తెచ్చే క్రీడాకారులకు ఉద్యోగ భరోసా కూడా లభిస్తోంది. 25 వేల పైచిలుకు క్రీడకారులు వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. ఈ స్థిరమైన ఆర్థిక భరోసా వల్ల ఆటగాళ్లు మరింత క్రీడల్లో రాణించేందుకు, రాటుదేలేందుకు, నాణ్యమైన శిక్షణ పొందెందుకు దోహదపడుతుంది. -
కార్పొరేట్లకు.. రూపాయి టెన్షన్
రూపాయి పతనంతో ధరలు పెరిగిపోయి సామాన్యులు పడే కష్టాలు అటుంచితే కార్పొరేట్లకు కూడా టెన్షన్ తప్పట్లేదు. ముఖ్యంగా విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) తీసుకున్న కంపెనీలకు పెద్ద చిక్కే వచ్చిపడింది. గత రుణాలను తీర్చేందుకు మరింత ఎక్కువగా చెల్లించాల్సి రానుండటమే ఇందుకు కారణం. సాధారణంగా కార్పొరేట్లు తమ వ్యాపార అవసరాల కోసం, దేశీయంగా వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంటే విదేశీ మార్కెట్ల నుంచి తక్కువ వడ్డీ రేటుపై రుణాలు తీసుకుంటూ ఉంటాయి. చౌకగా వచ్చిన నిధులను వ్యాపార విస్తరణకు లేదా అధిక వడ్డీ రేటు మీద తీసుకున్న రుణాలను తీర్చేసేందుకు ఉపయోగించుకుంటూ ఉంటాయి. గత రెండేళ్లుగా మిగతా కరెన్సీలు ఒడిదుడుకులకు లోనవుతున్నా రూపాయి మాత్రం దాదాపు స్థిర స్థాయిలోనే కొనసాగింది. దీంతో కార్పొరేట్లు గణనీయంగా విదేశీ రుణాలు సమీకరించాయి. ఈ మధ్య సంగతే చూస్తే గతేడాది ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో నికరంగా 13.5 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు వచ్చినట్లు ఆర్బీఐ డేటా చెబుతోంది. గతేడాది నవంబర్లో దాదాపు 2.83 బిలియన్ డాలర్ల ఈసీబీలను సమీకరించే ప్రతిపాదనలను కంపెనీలు సమరి్పంచాయి. రూపాయి విలువ పడిపోకుండా, స్థిరంగా ఉన్నన్నాళ్లూ విదేశీ రుణాల వ్యవహారం బాగానే ఉంటోంది. కానీ ఎక్కడా ఆగకుండా పడిపోతుంటేనే సమస్యాత్మకంగా మారుతోంది. ‘‘ఆర్బీఐ లెక్కలను బట్టి చూస్తే రూపాయి వేల్యుయేషన్ ఇప్పటికే అధిక స్థాయిలో ఉంది. దాని విలువ ఇంకా తగ్గాల్సి ఉంది. అమెరికా టారిఫ్లు విధిస్తే మరింతగా పడే అవకాశం ఉంది’’ అంటూ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల ఎక్స్లో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే కార్పొరేట్లకు రూపాయి బాధ ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. లాభాలపైనా.. సాధారణంగా విమానయాన సంస్థలు ఎయిర్క్రాఫ్ట్ల లీజింగ్లు, ఇంధన కొనుగోళ్లు, ఇతరత్రా ఖర్చులను డాలర్ల మారకంలో నిర్వహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రూపాయి పతనంతో ఎయిర్లైన్స్ ఖర్చులూ పెరిగిపోయి లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు ఇండిగోను తీసుకుంటే ఇటీవలి మూడో త్రైమాసికంలో లాభం ఏకంగా 18 శాతం పడిపోయింది. రూపాయి క్షీణతతో విదేశీ టూర్లు మరింత భారంగా మారే అవకాశం ఉండటంతో ప్రయాణాలను వాయిదా లేదా రద్దు చేసుకునే అవకాశాలు ఉండటంతో టూరిజం, హాస్పిటాలిటీ లాంటి రంగాల మీద కూడా పడొచ్చని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అలాగే దిగుమతులపైన ఆధారపడిన లేక గణనీయంగా విదేశీ కరెన్సీలో రుణభారం ఉన్న రంగాల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భారం ఇలా.. 2020లో భారత్, అమెరికాలో వడ్డీ రేట్ల మధ్య దాదాపు అయిదు శాతం వ్యత్యాసం ఉన్న తరుణంలో రూపాయి మారకంలో కన్నా విదేశీ మారకంలో రుణాలు తీసుకోవడం చాలా ఆకర్షణీయంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అవే రుణాలు ఇప్పుడు గుదిబండలుగా మారుతున్నాయి. అప్పట్లో గానీ రూ. 2,000 కోట్లు విదేశీ రుణం తీసుకుని ఉంటే పెరిగిన వడ్డీ భారంతో పాటు రూపాయి కూడా క్షీణించడం వల్ల 22 శాతం అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు డాలరు విలువ రూ. 75గా ఉన్నప్పుడు 500 మిలియన్ డాలర్లు రుణం తీసుకుని ఉంటే, దేశీ కరెన్సీ విలువ 5 శాతం క్షీణించిన పక్షంలో అదనంగా రూ. 2,500 కోట్ల భారం పడుతుందని సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ ఎండీ అమిత్ పాబ్రి తెలిపారు. ఇలా ఒకవైపు అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడంతో పాటు, రూపాయి బలహీనపడిపోవడం వల్ల విదేశీ రుణాలను తీర్చడం భారంగా మారుతోంది.హెడ్జింగ్ అంతంతే..విదేశీ రుణాలు తీసుకున్నప్పుడు రూపాయి పడిపోతే నష్టపోకుండా ఉండేందుకు, తిరిగి చెల్లించేటప్పుడు ఎక్కువ భారం పడకుండా ఉండేందుకు కంపెనీలు హెడ్జింగ్ వ్యూహాన్ని పాటిస్తుంటాయి. సుమారు గత మూడేళ్లుగా భారీగా విదేశీ నిధులు సమీకరించినవి, సమీకరించడంపై కసరత్తు చేస్తున్న వాటిలో ఆర్ఈసీ (500 మిలియన్ డాలర్లు), టాటా మోటార్స్ ఫైనాన్స్ (200 మిలియన్ డాలర్లు), ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ (125 మిలియన్ డాలర్లు), టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్తో పాటు (100 మిలియన్ డాలర్లు) బజాజ్ ఫైనాన్స్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ మొదలైనవి ఉన్నాయి. అయితే, దేశీ కంపెనీలు తీసుకున్న ఈసీబీల్లో దాదాపు మూడో వంతు రుణాలకు హెడ్జింగ్ రక్షణ లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, 2023–24లో దాదాపు 38.4 బిలియన్ డాలర్ల రుణాలు రాగా ఇందులో సుమారు 11.52 బిలియన్ డాలర్ల మొత్తానికి హెడ్జింగ్ రక్షణ లేదు. ఇలా హెడ్జింగ్ చేసుకోని కంపెనీలన్నింటికీ ప్రస్తుత రూపాయి పతనం సమస్యగా మారినట్లు పేర్కొన్నాయి. ఇటీవలి ఆర్బీఐ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో సమీకరించిన మొత్తం ఈసీబీల్లో 40 శాతాన్నే పెట్టుబడి వ్యయాల కోసం కంపెనీలు ఉపయోగించుకున్నాయి. అంటే మిగతా 60 శాతాన్ని ఖరీదైన ఇతరత్రా రుణాలను తీర్చేందుకు ఉపయోగించుకుని ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
-
కూటమి నేతలకు మేతగా...!
సాక్షి, అమరావతి: కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో సంపద సృష్టిస్తామనే మాటను పక్కన పెట్టి ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపుతోంది. అంతటితో ఆగకుండా విద్యుత్ శాఖ ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించి కొందరు నేతలకు లబ్ధి కలిగించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న కార్యాలయాలను సైతం కాల్చివేసి ఖాళీ స్థలాలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. విశాఖలో రూ.100 కోట్లకుపైగా విలువైన 2.20 ఎకరాల స్థలాన్ని బహుళ అంతస్తుల భవనం పేరిట కార్పొరేట్ సంస్థకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం. సొంత లాభమే లక్ష్యంగా..విశాఖపట్నం నగరంలోని గ్రీన్ పార్క్ హోటల్ ఎదురుగా రోడ్డును ఆనుకుని సుమారు 2.20 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కార్యాలయాలు, ఉద్యోగుల అతిథి గృహం ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం ఉన్న రెండు అంతస్తుల భవనంలో విశాఖపట్నం పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ) ఆపరేషన్స్ సర్కిల్ కార్యాలయం కొనసాగుతోంది. అదేవిధంగా విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో పనుల కోసం 11 జిల్లాల నుంచి వచ్చే అధికారులు, సిబ్బందికి ఇక్కడ ఉన్న అతిథి గృహం ఒక్కటే వసతి కల్పిస్తోంది. అయితే, ఆ భవనాలను నేలమట్టం చేసి రూ.100 కోట్లకు పైగా విలువ చేసే స్థలాన్ని బహుళ అంతస్తుల భారీ భవన సముదాయాన్ని నిర్మించేందుకు కార్పొరేట్ సంస్థలకు కేటాయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు నేతలకు ఆర్థికంగా భారీ లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.ఇందులో భాగంగా కొత్తగా నిర్మించే భారీ భవనంలోని ఒకటి, రెండు అంతస్తుల్లో ఏపీఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ కార్యకలాపాలకు అవకాశం కల్పించడం, లేదా నగరంలోనే సాగర్నగర్ వద్ద నిర్మిస్తున్న మరో భవనంలోకి విశాఖ సర్కిల్ ఆఫీసును తరలించడం అనే రెండు ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం తయారు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేయాల్సిందిగా సర్కిల్ అధికారులను ఆదేశించింది. మరోవైపు తమ కార్యాలయాన్ని కాల్చివేసి విలువైన స్థలాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వార్తలతో సర్కిల్ పరిధిలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారి కంపెనీ స్థలాలను ఇలా లాక్కొని ప్రైవేట్ డెవలపర్లకు అప్పగించడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సామాజిక సేవలో కార్పొరేట్స్
సాక్షి, అమరావతి: దేశ ప్రగతిలో తమవంతు పాత్రను పోషిస్తూ సమాజ శ్రేయస్సు కోసం వివిధ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థలు తమ సేవానిరతిని చాటుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో సామాజిక భద్రతను కల్పించేందుకు ఈ కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ కార్పొరేట్ కంపెనీలు తమ సామాజిక నిధుల (సీఎస్ఆర్) వ్యయాలను పరిశీలిస్తే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా క్రీడలు, కళలు–సంప్రదాయాలు, మహిళా సాధికారిత, జంతువుల సంక్షేమం, లింగ వివక్ష రూపుమాపడం వంటి కార్యక్రమాలకు నిధులు క్రమేపీ పెరుగుతున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఐదు రంగాలకు కేటాయింపులు ఏకంగా 48 శాతం పెరిగాయి. ఈ ఐదు రంగాలకు 2021–22లో రూ.174 కోట్లు వ్యయం చేస్తే ఇపుడు రూ.1,800 కోట్లు వ్యయం చేశాయి. ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి శిక్షణ ఇవ్వడానికి కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే సీఎస్ఆర్ నిధులు క్రీడలకు 80 శాతంగా రూ.292 కోట్ల నుంచి రూ.526 కోట్లకు పెరిగాయి. అదే విధంగా దేశ సంస్కృతిని కళలను ప్రోత్సహిస్తూ ఈ రంగానికి నిధులను రూ.248 కోట్ల నుంచి రూ.441 కోట్లకు పెంచడం గమనార్హం. అత్యధికంగా విద్యారంగానికే.. మొత్తం సీఎస్ఆర్ నిధుల వినియోగం చూస్తే విద్యారంగానికే కార్పొరేట్ సంస్థలు భారీగా కేటాయింపులు చేశాయి. 2021–22లో విద్యారంగానికి రూ.6,557 కోట్లు కేటాయిస్తే ఈ సారి ఈ మొత్తం రూ.10,085 కోట్లకు చేరింది. విద్యారంగం తర్వాత అత్యధికంగా వైద్య రంగానికి కేటాయించినా గతేడాదితో పోలిస్తే నిధుల కేటాయింపు తగ్గింది. ఆరోగ్యరంగానికి సీఎస్ఆర్ నిధుల కేటాయింపు రూ.7,806 కోట్ల నుంచి రూ.,6830 కోట్లకు తగ్గింది. ఇదే బాటలో పర్యావరణం రంగానికి కూడా నిధుల కేటాయంపు రూ.2,432 కోట్ల నుంచి రూ.1,960 కోట్లకు తగ్గాయి. గ్రామీణాభివృద్ధికి, జీవన ప్రమాణాలు పెరుగుదల వంటి రంగాలకు కూడా కార్పొరేట్ సంస్థలు భారీగానే వ్యయం చేస్తున్నాయి. సీఎస్ఆర్లో హెచ్డీఎఫ్సీదే పెద్ద పీట కార్పొరేట్ సంస్థలు తమకు వచ్చిన లాభాల్లో కనీసం రెండు శాతం నిధులను సామాజిక బాధ్యతకు వినియోగించ్సా ఉంది. 2022–23 సంవత్సరంలో దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ ఫండ్ ద్వారా రూ.29,987 కోట్లు వ్యయం చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.803 కోట్లు వ్యయం చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టాటా కన్సల్టెన్సీ సంస్థ (టీసీఎస్) రూ. 774 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.743 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.477 కోట్లు, టాటాస్టీల్ రూ.454 కోట్లు వ్యయం చేశాయి. -
USA Presidential Elections 2024: అమెరికా కార్పొరేట్ల పార్టీల బాట
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అమెరికాలో రాజకీయ చీలికలు పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు రాజకీయ పార్టీలకు, నాయకులకు మద్దతు తెలపడం సాధారణం. అయితే అమెరికాలో కార్పొరేట్లు సైతం రెండు వర్గాలుగా విడిపోయాయి. చిన్న, ప్రాంతీయ సంస్థలు మొదలు టెక్, బ్యాంకింగ్ దిగ్గజాల వంటి పెద్ద సంస్థల దాకా మెజారిటీ సంస్థలన్నీ డెమొక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య విడిపోయాయి. కొన్ని సంస్థలు కమలా హారిస్వైపు, మరికొన్ని సంస్థలు డొనాల్డ్ ట్రంప్ వైపు నిలిచారు. ఈ చీలికతో ఉదారవాద, వామపక్ష భావాలు కలిగిన కమలా హారిస్కు మితవాద ట్రంప్కు మధ్య పోటీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు మారిపోయాయి. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ (ఆల్ఫాబెట్), అమెజాన్, సన్ మైక్రోసిస్టమ్స్ ఉద్యోగులు కమలా హారిస్ ప్రచారానికి మిలియన్ల డాలర్లను విరాళంగా ఇచి్చనట్లు రాజకీయరంగ విషయాలను బహిర్గం చేసే ‘ఓపెన్ సీక్రెట్స్’సంస్థ వెల్లడించింది. ట్రంప్ ప్రచారానికి వచి్చన విరాళాల కంటే కమలా హారిస్ ప్రచారానికి వచి్చన సహకారం గణనీయంగా ఉంది. ఎలాన్ మస్్క, మార్క్ జుకర్బర్గ్ వంటి టెక్ దిగ్గజాలు మాత్రం ట్రంప్కు మద్దతుగా ప్రకటించడం తెల్సిందే. హారిస్కు గూగుల్ సహా పలు సంస్థల బాసట భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్, సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా, వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్మన్ తదతరులు హారిస్కు మద్దతుగా నిలిచారు. సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ (ఆల్ఫాబెట్), దాని అనుబంధ సంస్థలు హారిస్కు దాదాపు రూ.18 కోట్లు విరాళంగా ఇచి్చనట్లు అమెరికా ఎన్నికల నిధుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థ అటు కమలకు విరాళాలు అందిస్తూ ట్రంప్కు సైతం విరాళాలు పంపుతున్నాయి. అయితే కమలతో పోలిస్తే ట్రంప్కు వస్తున్న కార్పొరేట్ విరాళాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హారిస్ ప్రచారానికి సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ దాదాపు రూ.9.2 కోట్లు విరాళం ఇచి్చంది. అమెరికా కుబేరుడు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ సంస్థ దాదాపు రూ.8.36 కోట్లు విరాళంగా ఇచ్చింది. సిలికాన్వ్యాలీలో వందకు పైగా పెద్ద పెట్టుబడిదారులు, పెద్ద టెక్ సంస్థలు హారిస్కు మద్దతుగా నిలిచాయి. ట్రంప్కు బ్యాంకింగ్,ఆయిల్ దిగ్గజాల మద్దతు కార్పొరేట్లపై పన్ను మరింత తగ్గిస్తామని, విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని, చమురు, సహజవాయువు, బొగ్గు గనుల రంగాల్లో పెట్టుబడులు పెంచుతామని ట్రంప్ ఎన్నికల వేళ హామీలు గుప్పించారు. అమెరికాలో చమురు వెలికితీతను మొదట్నుంచీ సమర్థించే ట్రంప్కు చమురురంగ సంస్థలు మద్దతు పలుకుతున్నాయి. ట్రంప్పై హత్యాయత్నం జరిగినప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్ కదలికలు సైతం ట్రంప్కు అనుకూలంగా ఉండటం గమనార్హం. చమురు వినియోగం అధికంగా ఉన్నంత మాత్రాన వాతావరణంలో ఎలాంటి మార్పులు రావని, వాతావరణ మార్పులు అనేది పచ్చి అబద్ధమని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఉన్నకాలంలో పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగేలా చేశారు. అమెరికా అభివృద్దిలో చమురు, బొగ్గుది కీలక పాత్ర అని ప్రకటించారు. దీంతో ఈ రెండు రంగాలు ట్రంప్కు మద్దతుగా నిలుస్తున్నాయి. బైడెన్ పాలనలో అమలు చేసిన కఠిన నిబంధనలను ట్రంప్ వెనక్కి తీసుకుంటారని బ్యాంకర్లు భావిస్తున్నారు. బైడెన్ సూచించిన కొత్త కఠిన బ్యాంకింగ్ నిబంధనలపై ఆ రంగం చూపుతున్న విముఖత ట్రంప్కు అనుకూలిస్తోంది. జుకర్బర్గ్, మస్క్ బహిరంగంగానే.. మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జుకర్బర్గ్ మితవాద ట్రంప్కు మద్దతు ఇస్తూ బహిరంగ ప్రకటనలు చేశారు. అయితే తర్వాత జుకర్బర్గ్ తాను తటస్థంగా, నిష్పక్షపాతంగా కనిపించాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రచారానికి జుకర్బర్గ్ ఎంత విరాళంగా ఇచ్చారనే అంశాలు ఇంకా బహిర్గతంకాలేదు. ఫేస్బుక్లో వచ్చే కంటెంట్ను సెన్సార్ చేయాలని బైడెన్ ప్రభుత్వం మెటాపై ఒత్తిడి తేవడం తెల్సిందే. ఎలాన్ మస్క్ ట్రంప్కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ట్రంప్ ప్రచారాన్ని చూసుకునే అమెరికా పీఏసీ సంస్థకు తాను వ్యక్తిగతంగా ప్రతి నెలా దాదాపు రూ.376 కోట్లు విరాళంగా పంపుతున్నానని మస్క్ జూలైలో బహిరంగంగా ప్రకటించారు. భారీ వెంచర్ క్యాపిటలిస్ట్ పీటర్ థెయిల్ సైతం ట్రంప్కు జై కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వికసిత భారత్ దిశగా సంస్కరణలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా తదుపరి సంస్కరణలను అమలు చేయగలదని కార్పొరేట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పలువురు కార్పొరేట్ దిగ్గజాలు ఎక్స్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత పురోగతి వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీజీకి శుభాకాంక్షలు. మీ దార్శనిక సారథ్యంలో భారత్ అనేక మైలురాళ్లను అధిగమించింది. ఇకపైనా దేశం వృద్ధి బాటలో ముందుకు దూసుకెడుతుందని విశ్వసిస్తున్నాం.– అనిల్ అగర్వాల్, చైర్మన్, వేదాంత గ్రూప్దేశాభివృద్ధి కొనసాగుతుంది నెహ్రూజీ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన మోదీజీకి శుభాకాంక్షలు. కొత్త కేబినెట్ ఏర్పాటుతో దేశ అభివృద్ధి, పురోగతి కొనసాగగలదని ఆశిస్తున్నాను.– సజ్జన్ జిందాల్, సీఎండీ, జేఎస్డబ్ల్యూ గ్రూప్కీలక సమయం భారతదేశ అభివృద్ధి, శ్రేయస్సుకు ఈ విడత మరింత కీలకం కాగలదని ఆశిస్తున్నాను. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్లక్ష్యానికి పటిష్ట పునాదులు ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమనేది సంస్కరణల ఎజెండా కొనసాగింపునకు దోహదపడగలదు. ఆర్థిక, సామాజికాభివృద్ధికి తోడ్పడుతూ, వికసిత భారత్ లక్ష్యానికి గట్టి పునాదులు వేసే పురోగామి విధానాలు, చర్యలను కొత్త ప్రభుత్వం తీసుకోగలదని ఆశిస్తున్నాము. – అనీష్ షా, ప్రెసిడెంట్, ఫిక్కీసంస్కరణల అమలు లక్ష్యం అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ను పటిష్టపర్చేందుకు మోదీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం తదుపరి విడత సంస్కరణలు అమలు చేయగలదని ఆశిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్, సీఐఐఎకానమీ మరింత స్పీడ్ కీలక దేశాలకు మించి అత్యధిక వృద్ధి రేటును కొనసాగిస్తూ, దేశ నాయకత్వం భారత్ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలదని కార్పొరేట్లు విశ్వసిస్తున్నారు.– దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం -
దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాయ్
న్యూఢిల్లీ: కార్పొరేట్ ప్రపంచం దేశాభివృద్ధి లక్ష్యాలతో మమేకం అవుతుందన్న విశ్వాసమున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించడంలో భాగస్వాములవుతాయని తెలియజేశారు. వెరసి శత వసంత స్వాతంత్య్ర దినోత్సవ (2047) సమయానికల్లా వికసిత్ భారత్గా ఆవిర్భవించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాలకు అత్యుత్తమ భారత్ను అందించే బాటలో ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ను సాధించేందుకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్ ః 2047: వికసిత్ భారత్– ఇండస్ట్రీ’ పేరుతో ఫిక్కీ నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. 2047కల్లా లక్ష్యాలను సాధించడంలో పారిశ్రామిక రంగం పాత్ర కీలకమన్నారు. -
Ayodhya Ram mandir: కార్పొరేట్ల జై శ్రీరామ్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర ప్రారంభ వేడుకల్లో కార్పొరేట్ సంస్థలు కూడా సందడిగా పాల్గొంటున్నాయి. కార్యక్రమాన్ని మలీ్టప్లెక్సుల్లో లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలుకుని లాభాల్లో కొంత వాటాను అయోధ్యలో ప్రసాద వితరణ కోసం విరాళాలు ఇవ్వడం వరకు వివిధ రకాలుగా పాలు పంచుకుంటున్నాయి. వినియోగ ఉత్పత్తులను తయారు చేసే పలు కంపెనీలు పెద్ద సంఖ్యలో హోర్డింగ్లు, గేట్ బ్రాండింగ్, షాప్ బోర్డులు, కియోస్్కలు మొదలైనవి ఏర్పాటు చేసి, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నేడు (జనవరి 22న) రామ మందిర ప్రారంభ వేడుకలను 70 నగరాల్లోని 160 స్క్రీన్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మలీ్టప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది. జనవరి 17 నుంచి జనవరి 31 వరకు తమ ఉత్పత్తుల విక్రయాలపై వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా ఇవ్వనున్నట్లు డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. భక్తుల రాకతో అయోధ్యలో నిత్యావసరాలకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో తమ ఉత్పత్తుల సరఫరాను డాబర్ మరింతగా పెంచింది. వెయ్యేళ్లైనా చెక్కుచెదరని నిర్మాణం: ఎల్అండ్టీ శ్రీ రామ మందిరాన్ని వెయ్యేళ్లైనా చెక్కు చెదరనంత పటిష్టంగా నిర్మించామని దిగ్గజ నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో సీఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఈ విషయంలో కేంద్రం, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తదితర వర్గాలు అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదొక ఆలయంగా మాత్రమే కాకుండా ఇంజినీరింగ్ అద్భుతంగా కూడా నిలి్చపోతుందని కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ ఎంవీ సతీష్ పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు.. ► ఐటీసీలో భాగమైన మంగళదీప్ అగరబత్తీ బ్రాండ్ ఆరు నెలల పాటు ధూపాన్ని విరాళంగా అందించింది. అలాగే ‘రామ్ కీ ఫేడీ’ వద్ద రెండు అగరబత్తీ స్టాండ్లను ఏర్పాటు చేసింది. నదీ ఘాట్లలో పూజా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పూజారులకు వేదికలను, మార్కెట్లో నీడకు గొడుగులు మొదలైనవి నెలకొలి్పంది. భారీ భక్త సందోహాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రధాన ఆలయం దగ్గర 300 బ్యారికేడ్లు, ఆలయ ముఖ ద్వారం దగ్గర 100 పైచిలుకు బాకేడ్లను కూడా ఐటీసీ అందిస్తోంది. ► అయోధ్యలో ఎలక్ట్రిక్ ఆటోల సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ తెలిపింది. త్వరలో ఉబెర్గో, ఇంటర్సిటీ ఉబెర్ సేవలను కూడా అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. ► రామ మందిరంలో లైటింగ్ ఉత్పత్తుల సరఫరా, ఇన్స్టాలేషన్ పనులను నిర్వహించడం తమకు గర్వకారణమని హ్యావెల్స్ తెలిపింది. ► తాము భారత్లో ఎన్నో ప్రాజెక్టులు చేసినప్పటికీ రామ మందిరం వాటన్నింటిలోకెల్లా విశిష్టమైనదని యూఏఈకి చెందిన ఆర్ఏకే సెరామిక్స్ అభివరి్ణంచింది. కొత్త ఆభరణాల కలెక్షన్లు.. సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ‘సియారామ్’ పేరిట, కల్యాణ్ జ్యుయలర్స్ ‘నిమహ్’ పేరిట హెరిటేజ్ జ్యుయలరీ కలెక్షన్ను ఆవిష్కరించాయి. మందిర వైభవాన్ని, సీతారాముల పట్టాభిõÙక ఘట్టాన్ని అవిష్కృతం చేసేలా డిజైన్లను తీర్చిదిద్దినట్లు సెన్కో గోల్డ్ ఎండీ సేన్ తెలిపారు. సుసంపన్న వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్స్తో నిమహ్ కలెక్షన్ను రూపొందించినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఈడీ రమేష్ కల్యాణరామన్ పేర్కొన్నారు. -
India Corporates: Sector Trends 2024: ఆర్థిక వృద్ధితో కార్పొరేట్లకు అవకాశాలు
కోల్కతా: భారత బలమైన ఆర్ధిక వృద్ధి కార్పొరేట్ కంపెనీలకు డిమాండ్ను పెంచుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ‘ఇండియా కార్పొరేట్స్: సెక్టార్ ట్రెండ్స్ 2024’ పేరుతో నివేదికను విడుదల చేసింది. పెరుగుతున్న డిమాండ్, అదే సమయంలో ముడి సరుకుల ధరల ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడం అన్నవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల మార్జిన్లను పెంచుతాయని తెలిపింది. స్థానికంగా బలమైన డిమాండ్ నేపథ్యంలో 2024–25లో జీడీపీ 6.5 శాతం వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్ధిక వ్యవస్థగా ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన వాతావరణం, ఇటీవలి ద్రవ్య పరపతి కఠినతర విధానాలున్నప్పటికీ, భారత ఆర్ధిక వ్యవస్థ బలమైన పనితీరు కొనసాగుతుందని అంచనా వేసింది. సిమెంట్, ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొంది. మౌలిక సదుపాయాల మెరుగుదల సైతం స్టీల్ డిమాండ్కు ఊతంగా నిలుస్తుందని తెలిపింది. యూఎస్, యూరోజోన్లో వృద్ధి తగ్గిపోవడంతో భారత ఐటీ కంపెనీలు మోస్తరు వృద్ధికి పరిమితం కావాల్సి వస్తుందని పేర్కొంది. వాహన విక్రయాలు కంపెనీల ఆదాయాలను పెంచుతాయని తెలిపింది. -
కార్పొరేట్ సునామీ!
బోర్డు రూం కుట్రలు, కార్పొరేట్ దిగ్గజ సంస్థలు చేతులు మారడం వగైరాలు ప్రపంచానికి కొత్త కాదు. కానీ చాట్జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐలో పుట్టుకొచ్చిన సునామీ అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. చిత్రమేమంటే... ఏం జరిగిందో అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే అనేక మలుపులు తిరిగి అది కాస్తా చప్పున చల్లారింది. ఈ మొత్తం వ్యవహారమంతా కేవలం అయిదంటే అయిదే రోజుల్లో పూర్తయింది. డైరెక్టర్ల బోర్డు బయటకు నెట్టేసిన వ్యక్తే దర్జాగా వెనక్కి రావటం, బోర్డు సభ్యులతో సహా కంపెనీలో ఎవరినైనా తొలగించే అధికారం చేజిక్కించుకోవటం, ఆయన్ను బయటికి పంపినవారే చివరకు పదవులు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడటం ఈ వివా దానికి కొసమెరుపు. కేవలం నలుగురు డైరెక్టర్లకు వ్యతిరేకంగా 95 శాతంమంది సిబ్బంది తిరగ బడటం, తామంతా రాజీనామా చేస్తామమని హెచ్చరించటం, వారితో ఇన్వెస్టర్లు సైతం చేతులు కలపటం కనీవినీ ఎరుగనిది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అద్భుతాలు సృష్టించగల ఉపకరణాలను సృష్టించటమే ధ్యేయంగా శామ్యూల్ ఆల్ట్మాన్ 2015లో స్టార్టప్ కంపెనీ ఓపెన్ ఏఐ స్థాపించాడు. మరో నాలుగేళ్లకు మైక్రోసాఫ్ట్, ట్విటర్ సహా కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులూ అందులో పాలుపంచుకున్నారు. దాని పరిశోధనలు స్వల్ప కాలంలోనే అద్భుత ఆవిష్కరణలకు దారితీసి ఓపెన్ ఏఐ సిలికాన్ వ్యాలీలో 8,000 కోట్ల డాలర్ల దిగ్గజ సంస్థగా ఆవిర్భవించింది. అది ఏడాదిక్రితం తీసుకొచ్చిన చాట్జీపీటీ స్మార్ట్ ఫోన్ తర్వాత అంతటి గొప్ప ఆవిష్కరణగా గుర్తింపుపొందింది. అంతేకాదు, అది మున్ముందు మానవాళి మనుగడకు సైతం ముప్పుగా పరిణమించవచ్చన్న భయాందోళనలూ బయల్దేరాయి. దాన్ని అదుపు చేసేందుకు ఎలాంటి చట్టాలు అవసరమో ప్రపంచ దేశాధి నేతలంతా చర్చించుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్, యూరొపియన్ యూనియన్లు ఇప్పటికే చట్టాలు చేశాయి. మన దేశం కూడా ఆ పనిలోనే వుంది. కృత్రిమ మేధతో దేశదేశాల పౌరుల గోప్య తకూ, ముఖ్యంగా మహిళల, పిల్లల భద్రతకూ రాగల ముప్పు గురించిన భయసందేహాలు అంతటా ఆవరించాయి. రక్షణ రంగ వ్యవస్థల్లోకి, మరీ ముఖ్యంగా సైనిక స్థావరాల్లోకి ఇది ప్రవేశిస్తే రెప్ప పాటులో భూగోళం బూడిదగా మారుతుందన్న హెచ్చరికలు వస్తూనే వున్నాయి. సురక్షితమైన కృత్రిమ మేధ మాత్రమే ప్రపంచానికి అవసరమంటూ అల్ట్రూయిజం వంటి టెక్ ఉద్యమాలూ బయల్దేరాయి. ఈ నేపథ్యంలో అసలు ఓపెన్ ఏఐలో ఏం జరిగిందన్న ఆసక్తి, ఆత్రుత వుండటం సర్వసాధారణం. విషాదమేమంటే సంస్థ ఎగ్జిక్యూటివ్గా వున్న శామ్ ఆల్ట్మాన్కూ, డైరెక్టర్ల బోర్డుకూ మధ్య ఏర్పడ్డ లడాయి ఏమిటన్నది వెల్లడికాలేదు. ఆల్ట్మాన్ దేన్నీ సూటిగా, స్పష్టంగా చెప్పటం లేదని ఇప్పుడు నిష్క్రమించిన డైరెక్టర్లు ఆరోపించారు. ఆయన దేన్ని దాచటానికి ప్రయత్నించాడో, ఏ విషయంలో వారికి స్పష్టత రావటంలేదో వివరించలేదు. సరిగ్గా ఇదే కీలకమైనది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న భయాందోళనలకూ, ఈ వివాదానికీ సంబంధం వుండే అవకాశం లేకపోలేదని కొందరి విశ్లేషణ. కృత్రిమ మేధతో పరిశోధనలు సాగిస్తున్నది ఓపెన్ ఏఐ మాత్రమే కాదు... దాంతోపాటు అమెరికాలోనే ఆంత్రోపిక్, స్కేల్ ఏఐ, విజ్.ఏఐ, డీప్ 6 వంటి 50 సంస్థ లున్నాయి. ఇవిగాక మన దేశంతోపాటు అనేక దేశాల్లో పలు సంస్థలు కృత్రిమ మేధపై పని చేస్తున్నాయి. ఎలాంటి నిబంధనలూ, నియంత్రణలూ లేని వర్తమాన పరిస్థితుల్లో ఆర్నెల్లపాటు కృత్రిమ మేధ పరిశోధనలపై మారటోరియం విధించాలని టెక్ నిపుణులు కొందరు ఆమధ్య సూచించారు. కృత్రిమ మేధలో పరిశోధనలు చేస్తున్న ఎలిజార్ యుడ్కోవ్స్కీ ఈ టెక్నాలజీ తెలివి తేటల్లో మనుషుల్ని మించిపోతుందని, చివరకు వారినే మింగేస్తుందని, చివరకు మనమంతా నియాండర్తల్ యుగానికి తిరోగమించటం ఖాయమని జోస్యం చెప్పాడు. అయితే కృత్రిమ మేధతో రాగల ప్రమాదాల గురించి కొందరు అతిగా మాట్లాడుతున్నారన్న విమర్శలూ వున్నాయి. మానవాళికి ముప్పు తెచ్చే అగ్ని పర్వతాలు, గ్రహశకలాలు, అణ్వాయుధా లకన్నా అదేమీ పెద్ద ప్రమాదకారి కాదని వారి వాదన. భయాందోళనల మాటెలావున్నా దాని శక్తి సామర్థ్యాలు, ఉపయోగాలు కాదనలేనివి. రెండువేల ఏళ్లనాడు వర్ధిల్లిన పురాతన లిపుల్లో ఏం నిక్షిప్తమైవున్నదో వెలికితీసింది కృత్రిమ మేధ ఆధారంగా అందుబాటులోకి వచ్చిన ఉపకరణాలే. చరిత్రలో తొలికాలపు గ్రీకులు రాసినదేమిటో అర్థం చేసుకోవటానికి మూడువేల యేళ్లు పట్టింది. మయన్లు లిఖించిన పదాల కూర్పులోని రహస్యమేమిటో తెలుసుకోవటానికి రెండు శతాబ్దాలు పట్టింది. కానీ ఏఐ అలాంటి సంక్లిష్టమైన లిపులను క్షణాల్లో తేటతెల్లం చేస్తోంది. అందువల్ల ప్రాచీన మానవుల జీవన విధానంపై మన అవగాహన పెరిగింది. ఇక వైద్యపరంగా కృత్రిమ మేధ సాధిస్తున్నది అపారం. శామ్ ఆల్ట్మాన్కు గురు సమానుడు స్టీవ్ జాబ్స్. మరొకరితో కలిసి ఆయన నెలకొల్పిన యాపిల్ సంస్థకు ఏరికోరి సీఈఓగా తెచ్చుకున్న వ్యక్తే 1985లో ఆ సంస్థనుంచి స్టీవ్ జాబ్స్ను వెళ్ల గొట్టడం, తదనంతర పరిణామాల్లో జాబ్స్ తిరిగి అదే సంస్థకు రావటం చరిత్ర. ఇప్పుడు ఆల్ట్ మాన్కు కూడా అదే జరిగింది. ఏదేమైనా ఓపెన్ఏఐలో జరిగిందేమిటో, పరిశోధనల దశ, దిశ ఎలా వున్నాయో తెలుసుకోవటం ప్రపంచ ప్రజానీకం హక్కు. అది తేటతెల్లం చేయాల్సిన బాధ్యత సంస్థ లపై వుంది. కేవలం మానవాళి మంచికి మాత్రమే ఉపయోగపడేలా, ప్రభుత్వాలతో సహా ఎవరూ ఏఐని దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైన నియంత్రణలు విధించటం తక్షణావసరం. -
చంద్రయాన్పై కార్పొరేట్ల హర్షం.. ఎవరేమన్నారంటే..
చంద్రయాన్–3 విజయవంతం కావడంపై పలువురు కార్పొరేట్లు హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్ టీమ్ను ప్రశంసించారు. గర్వకారణం... ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం. భారత అంతరిక్ష, సాంకేతిక ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ప్రధాని నరేంద్ర మోదీకి, ఇస్రో బృందానికి శుభాభినందనలు. రాబోయే తరాలకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. – ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్ సామర్థ్యానికి నిదర్శనం ఇస్రో, భారత సైంటిస్టులు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. అంతరిక్ష పరిశోధనలో భారతదేశ సామర్థ్యాలకు ఈ విజయం ఒక నిదర్శనం. ఈ అపూర్వ ఘట్టంలో భాగం కావడం మాకెంతో గర్వకారణం. – ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఎల్అండ్టీ సీఈవో జాబిల్లి చేతికి అందింది మానవ జాతి ఆరంభం నుంచి చంద్రుడిని చూస్తూ కలలు కంటూనే ఉంది. చందమామ తన మాయా జాలంతో మనల్ని స్వాప్నికులుగా మార్చింది. నేడు ఆ మాయ, సైన్స్ కలిసి జాబిల్లిని మన చేతికి అందించాయి. – ఆనంద్ మహీంద్రా, పారిశ్రామిక దిగ్గజం చారిత్రక క్షణం ఇస్రో బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం. అంతరిక్ష పరిశోధనలను విజయవంతంగా అమలు చేయగలగడం దేశానికి తన సామర్థ్యాలపై గల నమ్మకానికి నిదర్శనం. ఇది 140 కోట్ల మంది భారతీయులకు చారిత్రక క్షణం. – గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ చైర్మన్ అద్భుత ఘట్టం భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఇది మరో అద్భుత ఘట్టం.. మన అంతరిక్ష పరిశ్రమ సామర్థ్యాలకు నిదర్శనం. మూడు దశాబ్దాలుగా భారతీయ స్పేస్ ప్రోగ్రామ్తో అనుబంధం కలిగి ఉండటం మాకు గర్వకారణం. – పర్వత్ శ్రీనివాస్ రెడ్డి, ఎంటార్ టెక్నాలజీస్ ఎండీ ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం -
దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తున్న మోదీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని సామాజిక ఉద్యమ కార్యకర్త మేధా పాట్కర్ ఆరోపించారు. సంయుక్త కిసాన్ మోర్చా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో కర్షక, కార్మిక సదస్సు నిర్వహించారు. మేధా పాట్కర్ మాట్లాడుతూ పేదలకు నిత్యావసర వస్తువులను అందించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల పంటకు కనీస మద్దతు ధర రావడంలేదని, అదానీ, అంబానీలకు మాత్రం రూ.వేల కోట్లు ఆదాయం వస్తోందన్నారు. ఆదివాసీల హక్కులను దెబ్బతీస్తూ అటవీ పర్యావరణ పరిరక్షణ చట్టంలో మార్పులు చేస్తున్నారన్నారు.సంయుక్త కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు హన్నన్ ముల్లా మాట్లాడుతూ మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని 13 నెలలపాటు రైతులు చేసిన ఉద్యమం సందర్భంగా ప్రధాని ఇచ్చిన హామీల అమలు కోసం ఆగస్టులో ఆందోళనలను నిర్వహిస్తామన్నారు. రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వినర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆల్ ఇండియా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి అతుల్కుమార్ అంజన్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ విభాగం జాతీయ అధ్యక్షుడు సుఖ్పాల్ సింగ్ ఖైరా, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. -
ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్కు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఇండియా సర్వే ప్రకారం.. 2025 నాటికి దాదాపు 56 శాతం కార్పొరేట్ కంపెనీలు తమ మొత్తం ఆఫీస్ స్థలంలో 10 శాతానికి పైగా ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ ఉండాలని భావిస్తున్నాయి. ఏడాదిలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ను ఎక్కువగా ఉపయోగిస్తామని 47 శాతం కార్పొరేట్లు తెలిపారు. సామర్థ్యాలను మెరుగ్గా సద్వినియోగం చేయడంలో భాగంగా కన్సాలిడేషన్ పెరుగుతుందని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. నిపుణుల లభ్యత, మెరుగైన వసతుల కారణంగా కొన్ని కార్యకలాపాలను జనవరి–మార్చిలో ద్వితీయ శ్రేణి నగరాలకు మార్చినట్టు 13 శాతం మంది కార్పొరేట్లు తెలిపారు. 2021 డిసెంబర్ త్రైమాసికంలో ఇది 8 శాతం నమోదైంది. వచ్చే రెండేళ్లలో కార్యాలయ స్థలం మరింత అధికం అవుతుందని 75 శాతం మంది వెల్లడించారు. భారత కార్యాలయ విభాగంలో రికవరీ మెరుగ్గా ఉందని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. -
బ్యాంకింగ్లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు
ముంబై: భారత్లో బడా కార్పొరేట్లను ఎప్పటికీ బ్యాంకింగ్ వ్యాపారంలోకి అనుమతించొద్దని వెటరన్ బ్యాంకర్ ఎన్ వాఘుల్ అభిప్రాయపడ్డారు. బ్యాంకుల జాతీయీకరణకు ముందు అనుభవాల నుంచి భారత్ పాఠాలు నేర్చుకుందంటూ.. బ్యాంకింగ్లోకి కార్పొరేట్లను అనుమతించి అవే తప్పులను పునరావృతం కానీయవద్దన్నారు. రెండేళ్ల క్రితం ఆర్బీఐ చర్చా పత్రం కార్పొరేట్లను బ్యాంకుల్లోకి అనుమతించడాన్ని ప్రస్తావించింది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు కార్పొరేట్ సంస్థలు అయితే నిధులు సమీకరించే సత్తా ఉంటుందని, అది దేశ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. దీంతో వాఘుల్ ఈ విధంగా హెచ్చరించినట్టు కనిపిస్తోంది. ఆర్థిక వృద్ధికి కావాల్సిన నిధులు ప్రజల నుంచి రావాలని వాఘుల్ అన్నారు. ప్రొఫెషనల్గా నడిచే బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రజలు సానుకూలంగా ఉన్నట్టు మీడియా సమావేశంలో భాగంగా పేర్కొన్నారు. వృత్తి నిపుణుల ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులే కావాలన్నారు. వచ్చే దశాబ్దంలో అంతా డిజిటల్ బ్యాంకింగ్ హవాయేనంటూ, అంతా ఫిన్టెక్ ఆధారితంగా ఉండొచ్చన్నారు. ప్రాంతీయ బ్యాంకులు సహా అన్ని బ్యాంకులూ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. బ్యాంకింగ్పై ప్రభుత్వ నియంత్రణ తొలగిపోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వ్యాపారంలో ఉండాల్సిన అవసరం లేదన్న ప్రధాని మాటలను గుర్తు చేశారు. కనుక ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణలో ప్రభుత్వం ముందుకే వెళుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణతో నిపుణులైన బోర్డుల ఆధ్వర్యంలో బ్యాంకులు నడిచే అవకాశం ఉంటుందన్నారు. వాఘుల్ గతంలో ఐసీఐసీఐ బ్యాంకింగ్కు సారథ్యం వహించడం గమనార్హం. ఇదీ చదవండి: లాభాలతో అదరగొట్టిన పంజాబ్ సింద్ బ్యాంక్ -
అదానీ, అంబానీలపై రామ్దేవ్ బాబా కీలక వ్యాఖ్యలు
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా తాజాగా కార్పొరేట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్లు తమ సమయాన్ని 99 శాతం స్వప్రయోజనాల కోసమే కేటాయిస్తున్నారని, కానీ తమ లాంటి వారు అందరికీ మేలు చేసేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. పతంజలి ఆయుర్వేద సంస్థ సీఈవో, తన సహాయకుడు ఆచార్య బాలకృష్ణకు గోవాలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రామ్దేవ్ బాబా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను హరిద్వార్ నుంచి వచ్చి మూడు రోజులుగా ఇక్కడ ఉంటున్నాను. నా సమయం విలువ అదానీ, అంబానీ, టాటా, బిర్లాల కంటే ఎక్కువ. కార్పొరేట్లు తమ సమయాన్ని 99 శాతం స్వప్రయోజనాల కోసమే వెచ్చిస్తారు. కానీ మా లాంటివారు అలా కాదు’ అని రామ్దేవ్ బాబా పేర్కొన్నట్లు పీటీఐ వార్తా కథనం పేర్కొంది. ఆచార్య బాలకృష్ణ తన నైపుణ్యంతో పతంజలి సంస్థకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల కోట్ల టర్నోవర్ సాధించారని అభినందించారు. పతంజలి వంటి సంస్థలతో భారత్ పరమ వైభవశాలిగా మారుతుందన్నారు. -
రూ.25 లక్షల కోట్లకు పైగా రుణాలు.. ఎవరా 10 మంది?
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా సేద్యాన్ని నమ్ముకున్న కోట్ల మంది వ్యవసాయదారులకు బ్యాంకులు అందించిన రుణాలు దాదాపు రూ.20 లక్షల కోట్లు కాగా టాప్ టెన్ కార్పొరేట్లు / ప్రముఖ సంస్థలకు ఏకంగా రూ.25 లక్షల కోట్లకు పైగా రుణాలిచ్చాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని వెల్లడించినప్పటికీ, ఆ పది మంది కార్పొరేట్లు / సంస్థలు ఎవరనేది మాత్రం రహస్యంగానే ఉంచారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆ వివరాలను వెల్లడించలేమని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న టాప్ టెన్ కార్పొరేట్ రుణ గ్రహీతల వివరాలను తెలియచేయాలని లోక్సభలో ఎంపీ మనీష్ తివారీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ సమాధానం ఇచ్చారు. టాప్ టెన్ కార్పొరేట్లు గతేడాది సెప్టెంబర్ వరకు రూ.25,43,208 కోట్ల మేర రుణాలు పొందినట్లు తెలిపారు. ఆర్బీఐ చట్టం 1934 రుణ గ్రహీతల వారీగా క్రెడిట్ వివరాలు వెల్లడించటాన్ని నిషేధించినట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు గ్రూపులు, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకుల నుంచి పది మంది కార్పొరేట్లు రుణాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 14 కోట్ల మంది రైతులు.. దేశంలో 14 కోట్ల మంది రైతులకు వచ్చే ఆర్థిక ఏడాది రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను లక్ష్యంగా నిర్దేశించినట్లు బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.18 లక్షల కోట్లుగా ఉంది. ఒక పక్క దేశంలో వ్యవసాయం చేసే 14 కోట్ల మంది అన్నదాతలకు అందించే రుణాలు రూ.20 లక్షల కోట్లు కాగా కేవలం పది మంది కార్పొరేట్లకు ఏకంగా రూ.25.43 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయడం గమనార్హం. రైతులు సకాలంలో రుణాలు చెల్లించకుంటే ఆస్తుల జప్తు లాంటి చర్యలకు దిగుతున్న బ్యాంకులు కార్పొరేట్ సంస్థలను మాత్రం ఉపేక్షిస్తున్నాయనే అభిప్రాయం సాధారణ ప్రజల్లో పెరిగిపోతోంది. -
ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?
పేదలకు అత్యవసరమైన ఉచితాలను ‘పప్పు బెల్లాలు’ అంటూ చాలామంది గగ్గోలు పెడుతుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీలకు అందుతున్న రాయితీల గురించి ఎవరూ మాట్లాడరు. వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని చాలామంది ఆక్షేపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ పన్నులు తగ్గించడం అనేది ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని వీరే తప్పుడు సూత్రాలు వల్లిస్తున్నారు. గత అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను మాఫీ చేసినట్లు కేంద్రప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. అత్యంత సంపన్నుల జేబుల్లో డబ్బును తేరగా పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వం మరింతగా పెరిగింది. సంపన్నులకు యాభై సంవత్సరాలుగా లభిస్తున్న పన్ను రాయితీలు ఏమాత్రం తగ్గడం లేదని ఒక అధ్యయనాన్ని ఉల్లేఖిస్తూ ‘బ్లూమ్బెర్గ్’లో ఒక కథనం ప్రచురితమైంది. లండన్లోని కింగ్స్ కాలేజీకి చెందిన ఇద్దరు పరిశోధకులు అధునాతనమైన గణాంక విధానాన్ని ఉపయోగించడమే కాకుండా, 18 పురోగామి ఆర్థిక వ్యవస్థలు అనుసరించిన విధానాలను పరిశీలించారు. సాక్ష్యాధారాలు లేకుండా అనుభవపూర్వకంగా చాలామంది ఇంతకాలంగా చెబుతున్నదాన్ని వీళ్లు ససాక్ష్యంగా నిరూపించారు. అనేకమంది భారతీయ ఆర్థికవేత్తలు కార్పొరేట్ పన్నులను తగ్గించాల్సిన అవసరాన్ని సమర్థించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ఇద్దరు పరిశోధకుల అధ్యయనం (కొద్దిమంది ఇతరులు కూడా) స్పష్టంగా ఒక విషయాన్ని బయటపెట్టింది. పన్ను రాయితీ అనేది ఆర్థిక పురోగతికి సహాయం చేయలేదు. అది మరిన్ని ఉద్యోగావశాలను కూడా కల్పించలేదు. డబ్బును తేరగా అత్యంత సంపన్నుల జేబుల్లో పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వాన్ని మరింతగా పెంచడంలో పన్ను రాయితీ సాయపడింది. భారతదేశంలో రైతులతో సహా పేదలకు అందిస్తున్న ఉచితాలను ‘పప్పు బెల్లాల’ సంస్కృతి అంటూ ఎన్నో వార్తాపత్రికల కథనాలు ధ్వజమెత్తుతున్నాయి. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకు అంది స్తున్న భారీ స్థాయి ఉచితాల గురించి ఇవి ఏమాత్రం ప్రస్తావించడం లేదు. కొద్దిమంది వ్యాఖ్యాతలను మినహాయిస్తే– మాఫీలు, ట్యాక్స్ హాలిడేలు, ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను తగ్గింపులు వంటి కార్పొరేట్ సబ్సిడీల విస్తృతి, స్వభావాన్ని చాలామంది దాచిపెడుతున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ‘ఫలితం ఇవ్వని ఉచితాలు’ అంటూనే, ఆ మాటకు అర్థమేమిటో స్పష్టంగా నిర్వచించలేక పోయినప్పటికీ, భారత్లో కార్పొరేట్ పన్నుల తగ్గింపు కూడా ఈ విభాగంలోనే చేరతుందని అంతర్జాతీయ అధ్యయనాలు తెలుపు తున్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జెఫ్రీ సాచెస్ను గతంలో ఒక ప్రశ్న అడిగారు. పారిశ్రామిక ఉత్పత్తిని ఏమాత్రం పెంచనప్పుడు లేదా అదనపు ఉద్యోగాలను సృష్టించలేకపోయినప్పుడు కార్పొరేట్లకు భారీస్థాయి పన్ను తగ్గింపు ద్వారా ఏం ఫలితం దక్కింది అని ప్రశ్నించారు. పన్ను రాయితీల ద్వారా ఆదా అయిన డబ్బు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ల జేబుల్లో పడిందని ఆయన క్లుప్త సమాధానం ఇచ్చారు. కొన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో కేంద్ర బ్యాంకులు వాస్తవంగా అత్యంత ధనవంతుల జేబుల్లోకి చేరేలా అదనపు డబ్బును ముద్రించాయి. 2008–09 కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో పరిమాణాత్మక సడలింపు అనే పదబంధాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఈ పేరుతో ధనిక దేశాలు 25 లక్షల కోట్ల డాలర్ల అదనపు డబ్బును ముద్రించాయి. తక్కువ వడ్డీరేటుతో, అంటే సుమారు రెండు శాతంతో ఫెడరల్ బాండ్ల రూపంలో ఆ సొమ్మును సంపన్నులకు జారీ చేశాయి. ఈ మొత్తం డబ్బును వాళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లలో మదుపు చేశారు. అందుకే ఆ కాలంలో బుల్ మార్కెట్లు ఎలా పరుగులు తీశాయో చూశాం. మోర్గాన్ స్టాన్లీకి చెందిన రుచిర్ శర్మ ఒక వ్యాసంలో కరోనా మహమ్మారి కాలంలో జరిగిన తతంగంపై రాశారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 9 లక్షల కోట్ల డాలర్ల నగదును అదనంగా ముద్రించారనీ, కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపన ప్యాకేజీలను అందించడమే దీని లక్ష్యమనీ చెప్పారు. కానీ ఉద్దీపన ప్యాకేజీల కోసమని కేటాయించిన ఈ మొత్తం నగదు స్టాక్ మార్కెట్ ద్వారా అత్యంత సంపన్నుల జేబుల్లోకి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఈ భారీమొత్తం ఏ రకంగా చూసినా ఉచితాల కిందకే వస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కల్లోల పరిస్థితుల్లో ఉన్న 2008–09 కాలంలో భారతదేశంలో 1.8 లక్షల కోట్ల రూపాయలను ఆర్థిక ఉద్దీపన పేరుతో పరిశ్రమ వర్గాలకు అందుబాటులో ఉంచారు. ఈ భారీ ప్యాకేజీని ఒక సంవత్సరం తర్వాత ఉపసంహరించుకోవాలి. కానీ ఒక వార్తా నివేదిక ప్రకారం, ప్రభుత్వంలో ఎవరో ‘నల్లాను ఆపేయడం’ మర్చిపోయారు. దీని ఫలితంగా ఉద్దీపన కొనసాగుతూ వచ్చింది. మరో మాటల్లో చెప్పాలంటే, ఆ తర్వాత పదేళ్ల కాలంలో భారత పరిశ్రమ దాదాపుగా రూ. 18 లక్షల కోట్ల డబ్బును ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా అందుకుంది. దీనికి బదులుగా ఈ మొత్తాన్ని వ్యవసాయ రంగానికి అందుబాటులోకి తెచ్చి ఉంటే, ప్రధానమంత్రి కిసాన్ పథకంలో భాగంగా మన రైతులకు యేటా ఒక్కొక్కరికి 18 వేల రూపాయల మేరకు అదనంగా ప్రత్యక్ష నగదు మద్దతు కింద అంది ఉండేది. సెప్టెంబర్ 2019లో భారత పరిశ్రమకు మరోసారి రూ. 1.45 లక్షల కోట్ల పన్నులను ప్రభుత్వం తగ్గించింది. చాలామంది ఆర్థిక వేత్తలు గ్రామీణ డిమాండును ప్రోత్సహించడం కోసం ఆర్థిక ఉద్దీపనను అందించాలని కోరుతున్న సమయంలో మళ్లీ కార్పొరేట్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కరుణించింది. దాదాపు రూ.2.53 లక్షల కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని ఆర్థికవేత్తలు ఆరోపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం వల్ల ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. గత అయిదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను కొట్టేసినట్లు ప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. కార్పొరేట్ పన్నులు తగ్గించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు సగటు మనిషిని చేరుకోలేదు. సంపన్నులు మాత్రమే వాటినుంచి లబ్ధిపొందారు. ఇది సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. వ్యవసాయ రుణాలను మాఫీచేసినప్పుడు బ్యాంకులు తమకు రావలసిన అసలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేసి మరీ తీసుకుంటాయి. కానీ కార్పొరేట్ రుణాలను మాఫీ చేసినప్పుడు బ్యాంకులు పైసా డబ్బును కూడా వసూలు చేయలేక దెబ్బతింటాయి. దేశంలో రుణాలు చెల్లించే సామర్థ్యం ఉండి కూడా ఎగవేస్తున్న సంస్థలు 10 వేల వరకు ఉంటాయి. రెండు వేలమంది రైతులు తీసుకున్న రుణాలను చెల్లించలేదని జారీ చేసిన అరెస్టు వారెంట్లను కొన్ని నెలలక్రితం పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ ఉద్దేశ పూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న వారిని మాత్రం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. మునుపటి ప్రణాళికా సంఘం సబ్సిడీపై కార్యాచరణ పత్రాన్ని రూపొందించింది. న్యూఢిల్లీలో ఎకరాకు రూపాయి చొప్పున 15 ఎకరాల భూమిని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి సబ్సిడీల పేరిట అప్పనంగా ధారపోశారని ఇది బయటపెట్టింది. ఐటీ రంగంతో సహా ప్రైవేట్ ఆసుపత్రులు, పరిశ్రమలకు తరచుగానే చదరపు మీటరుకు ఒక రూపాయి చొప్పున భూమిని ధారపోస్తున్నారు. అదే సమయంలోనే మౌలిక వసతుల కల్పనకు, వడ్డీ, మూలధనం, ఎగుమతులతో పాటు విద్యుత్, నీరు, ముఖ్యమైన సహజ వనరులకు కూడా సబ్సిడీలు అందిస్తున్నారు. ఇవి చాలవన్నట్లుగా పలు రాష్ట్రాలు నూరు శాతం పన్ను మినహాయింపు, ‘ఎస్జీఎస్టీ’ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. ఈరకంగా కార్పొరేట్ ఇండియా కూడా భారీ సబ్సిడీలు, ఉచితాల మీదే ఎలా బతుకీడుస్తోంది అనేది అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. దీంతో అమూల్యమైన వనరులు హరించుకుపోతున్నాయి. పేదలకు కొద్ది మొత్తం ఉచితాలు మిగులుతున్నాయి. - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నాన్–రెసిడెంట్ కార్పొరేట్లకు ఊరట.. దానిపై పన్ను భారం తగ్గింది!
న్యూఢిల్లీ: భారతదేశంలో శాశ్వతంగా ఉంటూ కార్యకలాపాలు నిర్వహించకపోవడం లేదా స్థిర వ్యాపార స్థలం లేని నాన్–రెసిడెంట్ కార్పొరేట్ సంస్థలకు పన్ను భారం తగ్గించే కీలక నిర్ణయాలను ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) తీసుకుంది. రెమిటెన్సులు, టూర్ ప్యాకేజీలపై ఐదు శాతం టీసీఎస్ (మూలం వద్ద వసూలు చేసే పన్ను) చెల్లింపుల నుంచి ఆయా సంస్థలను మినహాయిస్తూ ప్రత్యక్ష పన్నుల (సీబీడీటీ) కేంద్ర బోర్డ్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఐటీ నియమాల్లో మార్పు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆదాయపు పన్న చట్టంలోని సెక్షన్ 206 సీ(1జీ) కింద మినహాయింపు పరిధిని (గతంలో నివాసితులు కాని వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉండేది) విస్తరిస్తున్నట్లు తెలిపింది. కాగా, తాజా నిర్ణయ నాన్–రెసిడెంట్లపై పన్ను భారాన్ని తగ్గిస్తుందని, అలాగే విదేశీ సంస్థలకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకుంటున్న భారతీయ పన్ను చట్టాలపై మరింత విశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ డైరెక్టర్ (కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్) ఓమ్ రాజ్పురోహిత్ పేర్కొన్నారు. చదవండి: బ్రిటన్ వెళ్లే భారతీయలుకు శుభవార్త.. ఓ సమస్య తీరింది! -
అందులో ఏం తప్పుంది!... కేంద్రం పై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని పార్టీలు ఉచిత రెవిడిలు(ఉచిత పథకాలను) అందిస్తున్నారంటూ నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉచితాలను ప్రజలకు ఎరగా వేసి అధికారంలోకి రాకూడదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తులకు సంబంధించి సుమారు రూ. 10 లక్షల కోట్ల రుణాలను సాక్షాత్తు కేంద్రమే మాఫీ చేసిందంటూ ఆరోపణలు చేశారు. ఈ ప్రక్రియలో పాల్గొన్నవారిని సైతం కటకటాల వెనక్కి పంపాలంటూ మండిపడ్డారు. మంత్రులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చినప్పుడూ మరీ సామాన్యులకు ఎందుకు ఉచిత పథకాలు ఉండకూడదంటూ ప్రశ్నించారు. సామాన్యులకు ఉచిత విద్య, ఉచిత నీరు కల్పించడంలో తప్పు ఏముందన్నారు. బడా కార్పోరేట్లకు పెద్ద మొత్తాల్లో ఉచితంగా రుణ మాఫీ చేయడంలో లేని తప్పు ఇందులో ఎందుకు ఉంది అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. (చదవండి: హఠాత్తుగా పెరిగిన నది ఉధృతి... ఏకంగా 14 కార్టు గల్లంతు) -
అగ్నివీరులకు కార్పొరేట్ల రెడ్ కార్పెట్:ఉద్యోగాలు పెరుగుతాయి!
న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో రిక్రూట్మెంట్కు సంబంధించి వివాదాస్పదంగా మారిన అగ్నిపథ్ స్కీముకు కార్పొరేట్ దిగ్గజాలు మద్దతు పలికారు. దీనితో కార్పొరేట్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా, బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. స్కీం విషయంలో అల్లర్లు చెలరేగడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్రా, అగ్నివీరులుగా శిక్షణ పొందిన యువతకు తమ కంపెనీలో కొలువులిస్తామని తెలిపారు. ‘అగ్నిపథ్ స్కీముపై హింసాకాండ చెల రేగడం బాధ కలిగించింది. ఈ పథకంతో క్రమశిక్షణ, నైపుణ్యాలు పొందడం వల్ల అగ్నివీరులకు ఉద్యోగార్హతలు మెరుగు పడతాయని, వారికి మరింత ప్రాధాన్యం లభించగలదని దీన్ని గతేడాది ప్రతిపాదించినప్పుడే నేను చెప్పాను. అటువంటి సుశిక్షితులైన, సమర్ధులైన యువతను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మేము స్వాగతిస్తున్నాము‘ అని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో మహీంద్రా ట్వీట్ చేశారు. ఇంతకీ మహీంద్రా గ్రూపులో అగ్నివీరులకు ఏ తరహా ఉద్యోగాలిస్తారంటూ ఒక ట్విటర్ యూజర్ వేసిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఆపరేషన్స్ మొదలుకుని అడ్మినిస్ట్రేషన్, సరఫరా వ్యవస్థ నిర్వహణ వరకూ వివిధ విభాగాల్లో వారికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. సమాజంపై సానుకూల ప్రభావం.. మహీంద్రా ట్వీట్పై స్పందిస్తూ గోయెంకా ‘ఆర్పీజీ గ్రూప్ కూడా అగ్నివీరులను నియమించుకునే అవకాశాన్ని స్వాగతిస్తోంది. మన యువతకు భవిష్యత్పై నమ్మకం కలిగించేలా మిగతా కార్పొరేట్లు కూడా మా వెంట వస్తారని ఆశిస్తున్నాను‘ అని వ్యాఖ్యానించారు. ‘క్రమశిక్షణ, నైపుణ్యాలు గల అగ్నివీరులు.. మార్కెట్ తక్షణావసరాలకు తగిన పరిష్కార మార్గాలతో ఎంతగానో తోడ్పడగలరు. సమర్ధులైన యువతను రిక్రూట్ చేసుకోవడంలో పరిశ్రమ మద్దతుగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను‘ అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి ఒక ట్వీట్లో తెలిపారు. మరోవైపు, అగ్నిపథ్ స్కీము.. సమాజంపై గణనీయ స్థాయిలో సానుకూల ప్రభావం చూప గలదని, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించగలదని టీవీఎస్ మోటర్ కంపెనీ ఎండీ సుదర్శన్ వేణు అభిప్రాయపడ్డారు. ‘రాబోయే రోజుల్లో ఆర్థిక వృద్ధి సాధనలో, సమాజాన్ని పటిష్టంగా తీర్చిదిద్దడంలో అగ్నివీరులు ముఖ్య పాత్ర పోషించగలరు‘ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయుధ బలగాల్లో చేరి దేశానికి సేవలు అందించడంతో పాటు టాటా గ్రూప్ సహా పరిశ్రమకు అత్యంత క్రమశిక్షణ గల, సుశిక్షితులైన యువతను అందించేందుకు అగ్నిపథ్ తోడ్పడగలదని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్ ద్వారా లభించే అవకాశాలను తాము స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అగ్గి రాజేసిన అగ్నిపథ్.. పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 సంవత్సరాల వయస్సు వారిని నాలుగేళ్ల పాటు సాయుధ బలగాల్లో రిక్రూట్ చేసుకునేందుకు ఉద్దేశించిన అగ్నిపథ్ స్కీమును జూన్ 14న కేంద్రం ప్రకటించింది. తర్వాత గరిష్ట వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. ఇలా తీసుకునే వారిలో 25 శాతం మందిని మరో 15 ఏళ్ల పాటు సర్వీసులో కొనసాగించే అవకాశం ఉంది. నాలుగేళ్లకు రిటైర్ అయ్యేవారికి నిర్దిష్ట ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా రూపొందించారు. అయితే, సాయుధ బలగాల్లో పూర్తి స్థాయి రిక్రూట్మెంట్పై ఆశలు పెట్టుకున్న అభ్యర్ధులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో హింసాకాండకు కూడా ఇది దారి తీసింది. ఈ నేపథ్యంలోనే స్కీములోని సానుకూల అంశాలపై అవగాహన కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. -
జోరుగా..హుషారుగా! ఐటీ రంగంలో ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు!
ముంబై: కరోనా వైరస్ తీవ్రత తగ్గిపోవడం.. సానుకూల ఆర్థిక కార్యకలాపాలు, ఎగుమతులకు డిమాండ్ వెరసి వ్యాపార వృద్ధి అవకాశాల నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ఐటీ తో పాటు ఇతర రంగాల్లో కంపెనీలు నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) తాము ఉద్యోగులను నియమించుకోనున్నట్టు 54% కంపెనీలు తెలిపాయి. ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలి స్తే 4% అధికమని టీమ్లీజ్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఏప్రిల్–జూన్ కాలానికి ‘టీమ్లీజ్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్’ను విడుదల చేసింది. దీని ప్రకారం.. కంపెనీలు రెండంకెల వృద్ధి ని అంచనా వేస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఉద్యోగులను పెద్ద ఎత్తున నియమించుకునే ధోరణిలో ఉన్నాయి. 21 రంగాలకు చెందిన 796 చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఇందు లో 16 రంగాల్లోని కంపెనీలు నియామకాలకు అను కూలంగా ఉన్నాయి. ఐటీలో 95%, విద్యా సేవల్లో 86%, ఈకామర్స్, టెక్నాలజీ స్టార్టప్లలో 81%, హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్లో 78% కంపెనీలు ఉద్యోగ నియామక ప్రణాళికలతో ఉన్నాయి. అగ్రికల్చరల్, ఆగ్రోకెమికల్స్, బీపీవో/ఐటీఈఎస్, ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాల్లో నియామకాల ధోరణి బలహీనంగా ఉందని నివేదిక వెల్లడించింది. -
కార్పొరేట్ల కోసమే నదుల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: దేశంలో నదులను తమ అధీనంలోకి తీసుకోవడానికే కేంద్రం నదుల అనుసంధానానికి కుట్రలు చేస్తోందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగసెసే పురస్కార గ్రహీత రాజేందర్సింగ్ ధ్వజమెత్తారు. కార్పొరేట్ కంపెనీల జేబుల్లోకి డబ్బులు నింపడం, అవినీతి, అక్రమాల కోసమే కేంద్రం నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టిందని మండిపడ్డారు. వాటర్ ప్రైవేటీకరణ, కమర్షియలైజేషన్, మార్కెటైజేషన్కు కుట్ర పన్ను తోందని ఆరోపించారు. నదుల అనుసంధానంతో దేశానికి చెడు జరుగుతుందని, పర్యావరణ సమతు ల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందని, అన్ని రకాలుగా ఇది ప్రజలకు తీరని నష్టాన్ని కలిగి స్తుందన్నారు. దేశంలో ఏ ఒక్క సీఎం కూడా తమ వాటా నీటిని ఇతర రాష్ట్రాలకు ఇచ్చేందుకు సిద్ధం గా లేరని గుర్తు చేశారు. జలసౌధలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియన్ పెని న్సులార్ రివర్ బేసిన్ కౌన్సిల్, ఇండియన్ హిమాల యన్ రివర్ బేసిన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్లో నదులపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. నీటి మేనిఫెస్టోను సదస్సులో విడుదల చేస్తామన్నారు. కేసీఆర్ను చూసి నేర్చుకోవాలి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇతర రాష్ట్రాల సీఎంలు తెలంగాణ సీఎం కేసీఆర్ను చూసి నేర్చుకోవాల్సి ఉందని రాజేందర్ అన్నారు. ఇక్కడ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యలు ఇతర అన్ని రాష్ట్రాలకు అనుసరణీయమని చెప్పారు. రాష్ట్రంలో జల వర్సిటీ ఏర్పాటు చేయాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ‘మిషన్ భగీరథ ద్వారా ప్రతీ గ్రామంలో పైపుల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం హర్షణీయం. తెలంగాణలో ఎక్కడా ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు అందించే పరిస్థితి లేదు. అందుకే జాతీయ సదస్సు కోసం హైదరాబాద్ను ఎంపిక చేశాం. నదులపై అవగాహన కల్పించడానికి చేపడుతున్న ఉద్యమంలో ప్రజలూ భాగస్వాములు కావాలి’ అని ఆయన చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని, మూడు చెరువుల నుంచి ఆలయానికి నీటిని సరఫరా చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ అని కితాబునిచ్చారు. కృష్ణా, గోదావరి నదులను స్వాధీనంచేసుకోవానికి కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్తో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఎకరాకు సాగునీటి కోసం రూ.3–4 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. వర్షం నీటిని ఒడిసి పట్టుకుంటే ఎకరాకు రూ.5వేల ఖర్చు మాత్రమే అవుతుందని ఉదహరించారు. -
కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు మార్కెట్కు కీలకం
ముంబై: కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ దిశా నిర్దేశం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ద్రవ్యోల్బణ లెక్కలు ట్రేడింగ్ను ప్రభావితం చేయవచ్చని చెబుతున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, డాలర్ మారకంలో రూపాయి విలువ, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ కదలికలు తదితర అంశాలూ స్టాక్ సూచీల గమనాన్ని శాసించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే దసరా పండుగ సందర్భంగా శుక్రవారం(15న) బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ‘‘నిఫ్టీకి 17450 స్థాయి వద్ద బలమైన మద్దతు లభించిన తర్వాత బౌన్స్బ్యాక్స్ అయ్యింది. ఈ సూచీ ఇప్పటికీ అధిక విలువతో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., సాంకేతికంగా దిద్దుబాటయ్యే సూచనలు సూచనలు కనిపించడం లేదు. ఈ వారంలో 18,000 స్థాయిని అధిగమించవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్స్ హెడ్ రీసెర్చ్ వినోద్ నాయర్ తెలిపారు. అధిక వెయిటేజీ దిగ్గజం రిలయన్స్తో పాటు ఐటీ, ఆటో షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 1,293 పాయింట్లను ఆర్జించింది. నిఫ్టీ 363 పాయింట్లు పెరిగింది. ఈ వారం స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలను మరింత విశ్లేషిస్తే... కార్పొరేట్ ఫలితాల సీజన్ మొదలు... ఐటీ దిగ్గజం టీసీఎస్ గత శుక్రవారం క్యూ2 ఆర్థిక గణాంకాలను వెల్లడించి ఫలితాల సీజన్కు తెరతీసింది. ఆర్థిక ఫలితాల ప్రభావం సోమవారం (11న) ట్రేడింగ్లో ప్రతిఫలించే అవకాశముంది. ఈ వారంలోనే ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అవెన్యూ సూపర్మార్ట్, డెల్టా కార్ప్, హెచ్ఎఫ్సీఎల్, సైయంట్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్తో సహా దాదాపు 50కి పైగా కంపెనీలు తమ రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు షేరు ఆధారిత ట్రేడింగ్కు ఆసక్తి చూపవచ్చు. ద్రవ్యోల్బణ లెక్కలపై దృష్టి ... కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ మంగళవారం(12న) ఆగస్ట్ నెల పారిశ్రామికోత్పత్తి, సెపె్టంబర్ రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను వెల్లడించనుంది. సెపె్టంబర్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) విడుదల కానుంది. సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.3 శాతంగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 4.3శాతంగా, ఆగస్ట్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు 11.2శాతంగా నమోదుకావచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. బాండ్ ఈల్డ్స్ భయాలు... భారత పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 18 నెలల గరిష్టస్థాయి 6.32 శాతానికి చేరుకుంది. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు మార్కెట్లో అధిక ద్రవ్యత లభ్యత ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తెలిపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ ఈల్డ్స్ మరింత పెరిగితే స్టాక్ మార్కెట్కు ప్రతికూలాంశంగా మారుతుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిస్టింగ్ నేడు.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిస్టింగ్ షేర్లు నేడు(సోమవారం) ఎక్సే్చంజీల్లో లిస్ట్కానున్నాయి. సెపె్టంబర్ 29 – అక్టోబర్ 1వ తేదిల మధ్య ఇష్యూ పూర్తి చేసుకున్న ఈ ఐపీఓ 5.25 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. ధర శ్రేణిని రూ.712 గా నిర్ణయించి కంపెనీ మొత్తం రూ.2,768 కోట్లను సమీకరించింది. గ్రే మార్కెట్లో ఈ షేర్లు చాలా తక్కువ ప్రీమియం ధరతో ట్రేడ్ అవుతున్నందున ఫ్లాట్ లేదా డిస్కౌంట్లో లిస్టింగ్ ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం. బుల్లిష్ వైఖరితో విదేశీ ఇన్వెస్టర్లు... విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) దేశీయ మార్కెట్లో ఈ అక్టోబర్లో ఇప్పటికి వరకు రూ.1,997 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.1,530 కోట్ల షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.467 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లను కొనేందుకు ఆస్తకి చూపుతున్నారు. -
రాష్ట్రానికి అండగా నిలిచిన కార్పొరేట్లకు కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 సంక్షోభ సమయంలో ఆక్సిజన్ సరఫరా చేయడం ద్వారా రాష్ట్రానికి అండగా నిలిచిన రిలయన్స్, టాటాస్టీల్, జిందాల్ స్టీల్, జేఎస్డబ్ల్యూ వంటి కార్పొరేట్ సంస్థలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వేర్వేరుగా ట్వీట్ చేశారు. కోవిడ్–19కు వ్యతిరేకంగా పోరాడుతున్న రాష్ట్రానికి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలును పంపడం ద్వారా మద్దతు తెలిపిన ముఖేష్ అంబానీకి ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో కూడా ఇదే విధమైన మద్దతు కొనసాగుతుందంటూ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికైన పరిమళ్ నత్వాని ట్విటర్ ఖాతాకు ట్యాగ్ చేస్తూ సీఎం ట్వీట్ చేశారు. I thank Mukesh Ambani ji and @ril_foundation for extending their support by sending in Oxygen Express trains to Andhra Pradesh and helping the state in its fight against #COVID19. Looking forward to your continuous support. @mpparimal — YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2021 ‘ఈ కష్టసమయంలో పార్లమెంటు సభ్యుడు, జిందాల్ గ్రూపు చైర్మన్ నవీన్ జిందాల్ రాష్ట్రానికి అండగా నిలిచారని, ఈ కష్టకాలంలో జేఎస్పీఎల్ నుంచి రాష్ట్రానికి 500 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పంపిన నవీన్ జిందాల్ను అభినందిస్తున్నా’ అంటూ మరో ట్వీట్ చేశారు. My heartfelt thanks to @TataSteelLtd for their commitment to support AP in these tough times. TATA Steel has supplied more than 1000 MT of LMO to AP, which is crucial in our fight against #COVID19. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2021 అదే విధంగా రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలుస్తూ 1,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపిన టాటాస్టీల్, రాయలసీమ ప్రాంతానికి ఆక్సిజన్ సరఫరా చేసిన జేఎస్డబ్ల్యూ గ్రూపు సీఎండీ సజ్జన్ జిందాల్లకు సీఎం కృతజ్ఞతలు తెలియచేస్తూ మరో రెండు ట్వీట్లు చేశారు. I express my gratitude to @sajjanjindal ji for supplying LMO to the Rayalaseema region from JSW Bellary. Thank you for standing with the people of Andhra Pradesh in these tough times. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2021 -
కార్పొరేట్ల ఆదాయాల్లో ఆరు శాతం పురోగతి!
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ విజృంభణతో చాలా మటుకు పరిశ్రమలకు సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్న నేపథ్యంలో 2019–20తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీ కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి సగటున 6 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఇండియా రేటింగ్స్ (ఇండ్–రా) వెల్లడించింది. అయితే, ఇది గతంలో అంచనా వేసిన 4.4 శాతం కన్నా అధికంగానే ఉంటుందని పేర్కొంది. అలాగే మహమ్మారి కారణంగా దాదాపు సగం పైగా సంవత్సరం లాక్డౌన్తోనే గడిచిపోయిన గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఆదాయ వృద్ధి ఏకంగా 21.2 శాతం స్థాయిలో నమోదు కాగలదని భావిస్తున్నట్లు ఇండియా రేటింగ్స్ వివరించింది. రెండో వేవ్లో సర్వీస్ ఆధారిత రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని.. ఫలితంగా సదరు రంగం కోలుకోవాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మించి సమయం పట్టేస్తుందని ఇండ్–రా తెలిపింది. రేట్ల పెరుగుదల, డిమాండ్తో అమ్మకాల పరిమాణం పెరిగి చాలా మటుకు రంగాల ఆదాయాలు మెరుగ్గా ఉండటం వల్ల 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022 ఆర్థిక సంవత్సరం బాగుంటుందని పేర్కొంది. అయితే, కమోడిటీల ధధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉండటం, రూపాయి క్షీణత వంటి అంశాల కారణంగా లాభాలు పరిమిత స్థాయిలోనే ఉండొచ్చని ఇండ్–రా వివరించింది. బడా కంపెనీల వృద్ధి జోరు.. చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద కంపెనీల వృద్ధి మరింత ఎక్కువగా ఉంటుందని ఇండ్–రా తెలిపింది. ఫార్మా, రసాయనాలు, సిమెంటు, ఉక్కు వంటి రంగాల సంస్థలు పెట్టుబడి వ్యయాలను కొంత పెంచుకునే అవకాశం ఉందని వివరించింది. కన్సాలిడేషన్ కారణంగా టెలికం రంగం ప్రయోజనం పొందగలదని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. సబ్సిడీల కారణంగా వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తగ్గి ఎరువుల రంగానికి లబ్ధి చేకూరగలదని వివరించింది. ఇక పటిష్టమైన జీడీపీ వృద్ధి ఊతంతో లాజిస్టిక్స్, పోర్టుల విభాగాలు మెరుగుపడగలవని తెలిపింది. డిమాండ్ పెరుగుదల.. ఐటీ, పేపర్ రంగాలకు సానుకూలమని పేర్కొంది. పరిశ్రమలు, వస్తు.. సేవలు, ఉక్కు, లాజిస్టిక్స్, సిమెంటు, నిర్మాణం, కమర్షియల్ రియల్టీ మొదలైన రంగాలు స్వల్పంగా మెరుగుపడగలవని ఇండ్–రా వివరించింది. అయితే, కమోడిటీల రేట్లు అధిక స్థాయిలో ఉండటం వల్ల చమురు.. గ్యాస్ రంగం క్షీణించవచ్చని అంచనా వేసింది. ఎయిర్లైన్స్, రెసిడెన్షియల్ రియల్టీ, హోటళ్లపై ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. ద్వితీయార్థం దాకా ఇవి కోలుకోకపోవచ్చని తెలిపింది. -
ఆరేళ్లలో ఆరు లక్షల కోట్లు.. కార్పొరేట్లకు మినహాయింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆరేళ్ళలో దేశంలోని కార్పోరేట్లకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపుల రూపంలో రూ.6,07,583.04 కోట్లను మినహాయించినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం రాజ్యసభలో సీపీఐ (ఎం) ఎంపీ కెకె రాగేష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,15,176.50 కోట్లు, 2016–17లో రూ.1,30,184.41 కోట్లు, 2017–18లో రూ.1,20,069.67 కోట్లు, 2018–19లో రూ.1,25,891.78 కోట్లు, 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,16,260.68 కోట్లు దేశంలోని పెట్టుబడిదారులకు పన్ను మినహాయిం పులు ఇచ్చినట్టు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. చట్టం ప్రకారమే.. ఆదాయ పన్ను చట్టం–1961 ప్రకారమే కార్పోరేట్లకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. దేశంలో ప్రాంతీయ అసమానతలను తొలగించే చర్యల్లో భాగంగా పెట్టుబడిదారులకి కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపులిచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. ఒక నిర్దిష్ట రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి లేదా ప్రాంతీయ అసమాన పరిస్థితులను తగ్గించడానికి సాధారణంగా పన్ను ప్రోత్సాహకం అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం పేర్కొన్న ప్రాంతాలలో వివిధ పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆయా పెట్టుబడిదారులు ఈ పన్ను మినహాయింపులను వినియోగిస్తారని మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. -
కోవిడ్, సైబర్ దాడులు, సమాచార మోసాలు..
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్, సైబర్ దాడులు, సమాచార మోసాలు ప్రధాన ముప్పుగా భారత కంపెనీలు భావిస్తున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. అంతర్జాతీయ ఇన్సూరెన్స్ బ్రోకర్ మార్స, రిస్క్ మేనేజ్మెంట్ సొసైటీ రిమ్స్ చేపట్టిన ఈ అధ్యయనంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులు, సీనియర్ రిస్క్ నిపుణులు 231మంది పాలుపంచుకున్నారు. అధ్యయనం ప్రకారం.. సాధారణ స్థితికి చేరుకోవడంతోపాటు మహమ్మారి కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కోగలమన్న గొప్ప ఆశావాదం కంపెనీల్లో ఉంది. సైబర్ దాడులు, సమాచార మోసాలు భారత్లో రిస్క్ ప్రొఫెషనల్స్ ముందున్న ప్రధాన ఆందోళన. 63 శాతం మంది కోవిడ్, 56 శాతం సైబర్ దాడులు, 36 శాతం సమాచార మోసాలు, దొంగతనం, 33 శాతం అత్యవసర మౌలిక వసతుల విఫలం, 31 శాతం ఆర్థిక సంక్షోభం, 25 శాతం మంది తీవ్రమైన వాతావరణ సంఘటనలు ప్రధాన ముప్పుగా తెలిపారు. మహమ్మారి కారణంగా కార్యాలయం వెలుపల పని చేయడం తప్పనిసరి అయిందని, దీంతో సైబర్ దాడులకు గురయ్యే అవకాశాలు పెరిగాయని 85 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
రుణానుబంధానికి మించి కార్పొరేట్తో సంబంధం!
ముంబై: కార్పొరేట్లతో కేవలం రుణాలకు సంబంధించిన సంబంధాలను నెరవేర్చడమే కాకుండా అంతకుమించి సహాయ సహకారాలను బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తుందని చైర్మన్ రజ్నీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు తన వైఖరిని ఎస్బీఐ రూపొందించుకుందని ఆయన తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) సంస్థ– హిందుస్తాన్ యునిలీవర్తో (హెచ్యూఎల్) బ్యాంక్ భాగస్వామ్య ప్రకటన సందర్భంగా ఆయన గురువారం మాట్లాడారు. కార్పొరేట్లు, అలాగే వారి సరఫరాల చైన్కు సంబంధించి అమ్మకందారులు, పంపిణీదారులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల పరిష్కారాలపై సైతం దృష్టి సారించాలన్న ధోరణిని గత కొన్నేళ్లుగా బ్యాంక్ అవలంభిస్తోందని ఆయన తెలిపారు. ఈ దిశలో హెచ్యూఎల్తో జరిగిన భాగస్వామ్యం ఎంతో కీలకమైనదని అన్నారు. రజ్నీష్ కుమార్ స్థానంలో ఆ బాధ్యతలు చేపట్టడానికి బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఎంపికచేసిన మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ ఖేరా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘కార్పొరేట్ సొల్యూషన్స్ గ్రూప్’’ను కూడా ఎస్బీఐ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హెచ్యూఎల్తో బ్యాంక్ భాగస్వామ్యం ప్రకారం, ఆ సంస్థ వద్ద రిజిస్టర్ అయిన రిటైలర్లకు కూడా రూ.50,000 ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని బ్యాంక్ కల్పించనుంది. ఎస్బీఐతో హెచ్యూఎల్ ఒప్పందం చిన్నస్థాయి రిటైలర్లు మరింత సులువుగా రుణాలను పొందేందుకు ఎస్బీఐ బ్యాంక్ తో ఎఫ్ఎంసీజీ కంపెనీ హెచ్యూఎల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తన శిఖర్ యాప్ను వినియోగించే హెచ్యూఎల్ రిటైలర్లు ఇకపై ఎస్బీఐ యోనో యాప్ నుంచి సులువుగా రుణ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ సందర్భంగా హెచ్యూఎల్ చైర్మన్ సంజీవ్ మెహతా మాట్లాడుతూ... ‘‘దేశవ్యాప్తంగా కోటి మంది రిటైలర్లు ఉన్నారు. వారు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నందున రుణ సదుపాయ అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకునేందుకు వారు పెద్దగా ఆసక్తి చూపరు. నేడు ఎస్బీఐతోకుదుర్చుకున్న ఒప్పందం ద్వారా రిటైలర్లు తెల్లకాగితం అవసరం లేకుండా సులభమైన పద్దతిలో చాలా త్వరగా రుణాలను పొందగలరు. దీని ద్వారా రిటైలర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాధ్యమైనంత వరకు సమిసిపోతుందని ఆశిస్తున్నాము’’ అన్నారు. ఈ ఒప్పందం చిన్నదైనప్పటికీ మిలియన్ల రిటైలర్లకు కొండంత బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు. -
కరోనాపై కార్పొరేట్ల యుద్ధం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ను ఎదుర్కొనే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ అనే ప్రత్యేక నిధికి కార్పొరేట్లు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. దేశంలోనే సంపన్నుడైన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.500 కోట్లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అలాగే, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ.5 కోట్లను కేటాయించింది. ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ కూడా పీఎం కేర్స్కు రూ.150 కోట్లను ప్రకటించింది. అలాగే, లౌక్డౌన్ సమయంలో ఎల్అండ్టీ తన కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించనుంది. ఇందు కోసం ప్రతి నెలా రూ.500 కోట్లను పక్కన పెట్టనున్నట్టు ఎల్అండ్టీ గ్రూపు చైర్మన్ ఏఎం నాయక్ తెలిపారు. ఇప్పటికే టాటాసన్స్, టాటా గ్రూపు కలసి రూ.1,500 కోట్లను పీఎంకేర్స్ కోసం ప్రకటించాయి. ఇక హీరో గ్రూపు సైతం కరోనా వైరస్ నివారణ చర్యల కోసం రూ.100 కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. ఇందులో రూ.50 కోట్లను పీఎం కేర్స్కు, మరో రూ.50 కోట్లను నివారణ చర్యలకు ఖర్చు చేయనుంది. పేటీఎం సైతం రూ.500 కోట్లు: పేటీఎం సైతం పీఎం కేర్స్ సహాయనిధికి రూ.500 కోట్లు అందించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తోటి పౌరుల నుంచి విరాళాలు అందించాలని ఈ సంస్థ కోరింది. యూజర్లు ఇచ్చే ప్రతీ రూ.10కి అదనంగా తాను రూ.10కూడా కలిపి పీఎం కేర్స్కు అందించనున్నట్టు ప్రకటించింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రూ.100 కోట్లు... కరోనా సహాయ చర్యల్లో భాగంగా పీఎం కేర్స్ నిధికి రూ.50 కోట్లను విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరో రూ.50 కోట్లను సొంతంగా ఖర్చుచేయనుంది. ఎన్ఎండీసీ రూ.150 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి మద్ధతుగా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) పీఎం కేర్స్ ఫండ్కు రూ.150 కోట్లు విరాళంగా అందించింది. దేశంలోని ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఇదే అతిపెద్ద సహాయమని ఈ మేరకు ఎన్ఎండీసీ సీఎండీ బైజేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అమర్రాజా గ్రూప్ రూ.6 కోట్లు..: బ్యాటరీ తయారీ సంస్థ అమర్రాజా గ్రూప్ కరోనా నియంత్రణకు రూ.6 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇందులో కంపెనీ ఉద్యోగుల ఒక రోజు వేతనం కూడా కలిపి ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.5 కోట్లు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.కోటి అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సిగ్నిటీ రూ.50 లక్షలు..: హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్ తెలంగాణ ప్రభుత్వ కోవిడ్ సహాయ నిధికి రూ.50 లక్షల విరాళంగా అందించింది. ఈ మేరకు సిగ్నిటీ సీఎండీ సీవీ సుబ్రహ్మణ్యం మంత్రి కేటీ రామారావుకు చెక్ను అందజేశారు. మ్యాన్కైండ్ రూ. 51 కోట్లు..: న్యూఢిల్లీకి చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ మ్యాన్కైండ్ కరోనా వైరస్ మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న యుద్దానికి మద్దతుగా రూ.51 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇం దులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.3 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.కోటి అందిస్తున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్సీ జునెజా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీసీ రూ.కోటి..: కన్స్ట్రక్షన్స్ ఇంజనీరింగ్ కంపెనీ ఎన్సీసీ లిమిటెడ్ కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.కోటి నిధులను అందజేసింది. ఈ మేరకు కంపెనీ ఎండీ రంగరాజు సీఎం కే చంద్రశేఖర్ రావుకు చెక్ను అందజేశారు. పరిష్కారాలకు రూ. 2.5 కోట్లు పారిశ్రామిక దిగ్గజం హర్ష మారివాలా ఆఫర్ ముంబై: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వచ్చే నెల రోజుల్లో వినూత్న పరిష్కారమార్గాలు కనుగొనే వారికి రూ. 2.5 కోట్ల బహుమతి ఇవ్వనున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం మారికో అధినేత, పారిశ్రామికవేత్త హర్‡్ష మారివాలా ప్రకటించారు. రెండు లాభాపేక్షరహిత సంస్థలతో కలిసి వ్యక్తిగత హోదాలో తాను ఇందుకోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఇన్నోవేట్2బీట్కోవిడ్ పేరిట నిర్వహిస్తున్న పోటీలో మెడ్–టెక్ ఎంటర్ప్రెన్యూర్స్, కార్పొరేటర్లు, నూతన ఆవిష్కర్తలు పాల్గొనాలంటూ మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆహ్వానించింది. స్వల్ప సమయంలోనే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అనువైన సొల్యూషన్స్పై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు మారివాలా తెలిపారు. -
ట్రంప్ పర్యటనపై కార్పొరేట్ల ఆశలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఈ నెల 24,25న భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన టూర్పై దేశీ కార్పొరేట్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ‘మినీ’ వాణిజ్య ఒప్పందం కుదరగలదని, అమెరికా కంపెనీలు మరింత పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు ఉండవచ్చని ఆశిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా ఒక చిన్న పాటి వాణిజ్య ఒప్పందమైనా కుదిరితే తదుపరి సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు పునాదిలాగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నట్లు దేశీ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. ఇరు దేశాల వాణిజ్య వర్గాలు దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయని అసోచాం సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వస్తున్న ట్రంప్.. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సదస్సులో పలువురు కార్పొరేట్ దిగ్గజాలతో భేటీ కానున్నారు. అమెరికన్ దిగ్గజ సంస్థలు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా తదితరులు ఇందులో పాల్గొనున్నారు. వివాదాల పరిష్కారంపై దృష్టి.. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల మధ్య కొన్ని అంశాలు నలుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఎగుమతి చేసే కొన్ని రకాల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా అధి క సుంకాలు విధిస్తోంది. అలాగే, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) కింద ఎగుమతి సంస్థలకు ఒనగూరే ప్రయోజనాలు ఎత్తివేసింది. వీటన్నింటినీ పునఃసమీక్షించాలని దేశీ కంపెనీలు కోరుతున్నాయి. అలాగే, వ్యవసాయం, ఆటోమొబైల్, ఇంజినీరింగ్, ఆటో పరికరాలు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా మార్కెట్లో మరిన్ని అవకాశాలు కల్పించాలంటున్నాయి. మరోవైపు, భారత్లో తమ వ్యవసాయ, తయారీ రంగ ఉత్పత్తులు, వైద్య పరికరాల విక్రయానికి తగిన అవకాశాలు కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ భారత పర్యటనకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐఐ అంచనాల ప్రకారం .. దాదాపు 100 పైగా భారతీయ కంపెనీలు అమెరికాలో 18 బిలియన్ డాలర్ల పైచిలుకు ఇన్వెస్ట్ చేశాయి. 1.13 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాయి. 20 18–19లో అమెరికాకు భారత ఎగుమతులు 52.4 బిలియన్ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు 35.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2017–18లో 21.3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరంలో 16.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. -
ప్రభుత్వ విద్యకు కార్పొరేట్ దెబ్బ
ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం దర్శి : కార్పొరేట్ యాజమాన్యాలు రాజ్యాలు ఏలితే ప్రభుత్వ విద్య పతనమవుతుందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక తాలూకా క్లబ్ సమావేశపు హాలులో యూటీఎఫ్ ప్రాంతీయ విద్యా సదస్సు ఆ శాఖ కార్యదర్శి జి.రాజశేఖర్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీతో పాటు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏడాదిలో విద్యారంగానికి రూ.21 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, బడ్జెట్లో 25 శాతం నిధులు విద్యకే కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతోందన్నారు. ఇంత చేస్తున్నా విద్యారంగంలో ఏపీ 25వ స్థానానికి ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు బడికి Ðð ళ్లరు.. పాఠాలు చెప్పరంటూ అపవాదులు మోపుతారేతప్ప పాఠశాలల్లో వసతులు, అవసరాలపై మాత్రం ఆలోచన చేయడం లేదన్నారు. ఉపాధ్యాయుల పని తీరు ఆధారంగా పీఆర్సీలు ఇస్తామన్న ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కలెక్టర్లకు కూడా పనితీరు ఆధారంగానే వేతనాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. దేశంలో 25 శాతం కార్పొరేట్ పాఠశాలలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 45 శాతం కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయన్నారు. వాటి యాజమాన్యాలే రాష్ట్రాన్ని పాలించే మంత్రులు కావడం బాధాకరమన్నారు. పదేళ్ల తర్వాత సగం మంది ఉపాధ్యాయులు కూడా ఉద్యోగాల్లో ఉంటారన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే 10 వేల పోస్టులు భర్తీ చేయకుండా పక్కన పెట్టారని, సీపీఎస్ విధానంలో పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నా ఆ పెన్షన్లు వచ్చే వరకూ ఉద్యోగాలుంటాయన్న నమ్మకం లేదన్నారు. పంచాయతీకి రూ.రెండు కోట్ల నిధులతో ఇంగ్లిష్ మీడియం స్కూలు ఏర్పాటు చేయాలని,పాఠశాలల్లో ఆధునిక అవసరాలు కల్పించాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు అండగా ఉంటా : బూచేపల్లి ఉపాధ్యాయులకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అన్నారు. సుబ్రహ్మణ్యం వంటి ఉన్నత వ్యక్తి ఎమ్మెల్సీ కావడం అభినందనీయమన్నారు. దర్శి మోడల్ స్కూల్లో హాస్టల్ను తన హయాంలో నిర్మించామని, రెండేళ్లు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, మీరైనా ప్రారంభానికి కృషి చేయాలని సుబ్రహ్మణ్యానికి సూచించారు. ఉపాధ్యాయుల సమస్యలను తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం తమ ట్రస్టు ద్వారా ఉపాధ్యాయులకు బ్యాగ్లు పంపిణీ చేశారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఎస్సీ వై శ్రీనివాసరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్ష,కార్యదర్శులు వి.రామిరెడ్డి, జేవీవీఎం సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు మీగడ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా సహాధ్యక్షుడు ఓవీ వీరారెడ్డి, ఎంపీపీ పూసల సంజీవయ్య, సర్పంచి జీసీ గురవయ్య, వైస్ ఎంపీపీ మారం శ్రీనివాసరెడ్డి, రాజసులోచన, రమణారెడ్డి, రవి, రాజేశ్వరరావు, వెంకటేశ్వర్లు, రంగారావు పాల్గొన్నారు. -
కార్పొరేట్లకే ‘మంచిరోజులు’
సందర్భం మీరు వాగ్దానం చేసిన ‘అచ్చేదిన్’ కోటీశ్వరులకు, సంఘ్పరివార్కు తప్ప సాధారణ ప్రజలకు ‘‘బూరా దిన్’’ (చెడ్డరోజులు) మాత్రమేనని భావిస్తున్నాం. వామపక్షాలు కాంగ్రెస్ వారి ఆర్థిక విధానాలపైనా, అవినీతిపైనా నిరంతరం ఎండగట్టి, పోరాటం చేస్తున్నాయి. అలాగే బీజేపీనీ విమర్శిస్తున్నాయి. కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రా యాలు తెలియనివి కావు. కాంగ్రెస్తో పాటు, వామపక్షాలపై కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మీడియాలో ఆయన వెలువరించిన వ్యాసం అందులో భాగమే. ఇదేమీ ఆశ్చర్యం కలిగించేది కాదు. అలాగే ఒకే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసినంత మాత్రాన అది నిజ మైపోదు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వామపక్షాలు అస హనంతో రగిలిపోతున్నాయని వెంకయ్యనాయుడి ఆరోపణ. అసహనం ప్రతిపక్షాలది కాదు. సంఘపరివార్ అనుయాయులదే. అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేస్తున్న సీపీఐ నాయకుడు గోవింద్ పన్సారేను, ప్రొఫెసర్ కల్బుర్గీని హత్య చేశారు. అంతకు ముందే నరేంద్ర దభోల్కర్ను హత్య చేశారు. ఈ హత్యలు చేసింది ఒక ‘సనాతన సంస్థ’. గోవా కేంద్రంగా ఇది పనిచేస్తుంది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల సతీమణులు ఇందులో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వారిపై నమోదైన కేసులను విచారణ పేరుతో ఏళ్ల తరబడి తాత్సారం చేస్తున్నారు. రచయితలు ఏం రచించాలో, ఉపాధ్యాయులు విశ్వవిద్యాలయాలలో ఏం బోధించాలో, విద్యార్థి సంఘాలు ఎలాంటి నినాదాలు ఇవ్వాలో శాసించి, దానిని అంగీకరించని వారిపైన దేశద్రోహం కేసు పెట్టారు. విద్యార్థి నాయకులని విశ్వవిద్యాలయాల నుంచి సస్పెండ్ చేశారు. గోరక్షణ పేర, గొడ్డుమాంసం పేర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దాద్రిలో అఖలక్ఖాన్ను చిత్ర వధ చేసి చంపారు. హిమాచల్ ప్రదేశ్ - పంజాబ్ సరిహద్దులలో ఇదే ఆరో పణతో ఇద్దరు యువకులని హత్య చేశారు. జార్ఖండ్లో పశువులను తోలుకుపోతున్న ఇద్దరు మైనారిటీలను ఉరివేసి చంపారు. పశుమాంస భక్షక నిరోధక చట్టం తెచ్చి, వంటింట్లో ఏం వండుకోవాలో ఆదేశించేం దుకు ప్రయత్నించారు. ఇదే నిజమైన అసహనం. అర్హతలు లేకున్నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లకు, ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ లకు, అనేక రాష్ట్రాల గవర్నర్ పదవులకు సంఘ పరివార్ కార్యకర్తలను నియమించిన బీజేపీయే, గత ప్రభుత్వం తమ పార్టీ వారి కోసమే ‘తాబేదా రులు, వందిమాగధులకు పదవులు తాకట్టు పెట్టింద’ని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వామపక్షాలు మంత్రి పదవులు, గవర్నర్ హోదాలు, సంస్థల అధ్యక్ష పదవులను తీసుకోలేదు. 37 ఏళ్లు ఒకే కుటుం బం దేశాన్ని పరిపాలించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు, బీజేపీకీ, సంఘపరివార్కూ సంబంధం లేకున్నా కేవలం నెహ్రూ కుటుంబం నుంచి తమ పార్టీ వైపునకు వచ్చిన మేనకాగాంధీకీ, ఇప్పుడు ఆమె కుమారుడు వరుణ్గాంధీకీ మంత్రి పదవులు, పార్లమెంట్ సభ్య త్వాలు ఎందుకు కట్టబెట్టినట్టు? తమ ప్రభుత్వం పేదలకు అంకితమైన ప్రభుత్వమని నరేంద్ర మోదీ రెండేళ్ల ఉత్సవాల సందర్భంగా చెప్పుకు న్నారు. ఈ రెండేండ్ల కాలంలో గుజరాత్కు చెందిన అంబానీ, ఆదాని కుటుంబాలు సహా పది కార్పొరేట్ కంపెనీలకు రూ. 20 లక్షల కోట్లు అదనపు లాభాలు వచ్చిన మాట వాస్తవమా? కాదా? అదే సమయంలో కార్పొరేట్ ట్యాక్స్ 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించి, సర్వీస్ ట్యాక్స్ లను 12 నుంచి 15 శాతం పెంచడం పేదలకు సేవ చేయడమా? కార్పొరే ట్లకు ఊడిగం చేయడమా? వామపక్షాల విమర్శలలో ఏది అసమంజసమైనదో వెంకయ్యనా యుడు గారిని చెప్పమని కోరుతున్నాను. 1). విదేశాల నుండి వంద రోజులలో నల్లధనాన్ని (80 లక్షల కోట్ల రూపాయల పై చిలుకు) తిరిగి వెనక్కి తెస్తామని చేసిన వాగ్దానం విఫలమైందని విమర్శిస్తున్నాము. 2). మేధావులు, శాస్త్రవేత్తలు, రచయితలలో మీతో విభేదించే వారందరికి కమ్యూనిస్టు ముద్రకొట్టి, దేశద్రోహం కేసుపెట్టి, విద్యార్థి నాయకుల్ని బెదిరించి ‘భావ ప్రకటన స్వేచ్ఛ’కు విఘాతం కలిగిస్తున్నారన్న వాస్తవాన్ని బహిర్గతం చేశాం. 3). 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చేసిన వాగ్దానంలో 20 శాతం కూడా సృష్టించలేదని ఆరోపిస్తున్నాం. 4) ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆరోపిస్తున్నాం. 5). మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల భూముల్ని లాక్కునేందుకు తెచ్చిన ఆర్డినెన్స్ రైతాంగ వ్యతిరేకమైనదని, పారిశ్రామికవేత్తల ప్రయోజ నాలు కాపాడేందుకని ఆరోపిస్తున్నాం. 6). కార్మిక చట్టాల సవరణ పేరుతో ట్రేడ్ యూనియన్ల హక్కులు కాలరాసేందుకు ప్రభుత్వం పూనుకుంటు న్నదని బహిర్గతం చేస్తున్నాం. 7). మీ పార్లమెంట్ సభ్యుడు సాక్షి మహ రాజ్, మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే విగ్రహాలను దేశ వ్యాపితంగా ప్రతిష్టించాలని బహిరంగ ప్రకటన చేస్తే, మరో కేంద్ర మంత్రి వీకే సింగ్ దళితుల్ని కుక్కలతో పోలిస్తే.. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షులు అమిత్షా మౌనం దాల్చడం ద్వారా పరోక్షంగా వారి వ్యాఖ్యలను ఆమో దించినట్టేనని చెబుతున్నాం. 8). మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత యూపీఏ ప్రభుత్వం కంటే ఎక్కువగా ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్లకుపైగా కార్పొరేట్ల కంపెనీలకు పన్నుల తగ్గింపు, రాయితీలు ఇస్తున్నారని దేశంలో వేల సంఖ్యలో కరువు, అప్పుల కారణంగా ఆత్మ హత్యలు చేసుకుంటున్న రైతులకు పైసా విదల్చలేదని, మీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం, కార్పొరేట్లతో నడుస్తున్న ప్రభుత్వమని ఆరోపిస్తున్నాం. 9). మతం పేరుతో ప్రజలను చీల్చేందుకు ఉత్తరప్రదేశ్లో అసత్యాలు, అబ ద్ధాలు ప్రచారం చేసి రెచ్చగొడుతున్నారని, హిందూత్వ శక్తులపైనున్న టైరిస్టు కేసులను కొట్టి వేయిస్తున్నారని, మైనారిటీలను భయభ్రాంతులను చేస్తున్నారని ఆరోపిస్తున్నాం. 10). ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పి స్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి, మాట తప్పారని విమర్శించాము. 11). అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు దేశంలో వాటి ధరలు పెంచి, ప్రపంచ ధరలు మూడో భాగానికి పడిపోయినా, ఆ సౌక ర్యం వినిమయదారులకు ఇవ్వకుండా కొత్త పన్నులు వేసి, ప్రజలను మోసం చేశారని విమర్శించాం. 12). 9,000 కోట్ల ప్రజాధనాన్ని బ్యాంకు లకు ఎగబెట్టిన విజయ్మాల్యాను, క్రికెట్ ఆటను దుర్వినియోగం చేసిన అవినీతిపరుడు లలిత్మోదీని అరెస్టు చేయకుండా విదేశాల నుండి వారిని రప్పించే చర్యల్లో కావాలనే విఫలమయ్యారని ఆరోపిస్తున్నాం. 13). విదే శాంగ విధానంలో అమెరికాకు మోకరిల్లడం ద్వారా, టెండర్లు పిలవకుండా నష్టంలో ఉన్న కంపెనీకి నాలుగు అణు విద్యుత్ కేంద్రాల కాంట్రాక్టును నాలుగు లక్షల కోట్లకు ఇచ్చి యూనిట్ ఖరీదు రూ.50 లకు కొనే వ్యాపారం చేసి, దేశానికి నష్టం చేస్తున్నారని విమర్శిస్తున్నాం. మీరు వాగ్దానం చేసిన ‘అచ్చేదిన్’ కోటీశ్వరులకు, సంఘ్పరివార్కు తప్ప సాధారణ ప్రజలకు ‘‘బూరాదిన్’’ (చెడ్డరోజులు) మాత్రమేనని భావిస్తున్నాం. వామపక్షాలు కాంగ్రెస్ వారి ఆర్థిక విధానాలపైనా, అవినీ తిపైనా నిరంతరం ఎండగట్టి, పోరాటం చేస్తున్నాయి. అలాగే బీజేపీనీ విమర్శిస్తున్నాయి. వామపక్షాల విమర్శలతో దేశాభివృద్ధి ఆగిపోతున్నదని చెప్పడం అతిశయోక్తి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతోపాటు రిటైల్ ట్రేడ్లో ఎఫ్డిఐకి వ్యతిరేకంగా దేశవ్యాపిత బంద్కు ఒకేరోజు పిలుపు ఇచ్చిన మాట గుర్తుందా? ఇప్పుడు మీరు కీలక రంగమైన డిఫెన్స్లో, రిటైల్ ట్రేడ్తో సహా దాదాపు అన్ని రంగాలలో 100 శాతం ఎఫ్డీఐ ఎందుకు తెస్తున్నట్లు? ఢిల్లీలో, బిహార్లో మీరు మా విమర్శల వల్ల ఓడిపోలేదు. మీ వాగ్దా నాలకు, చేతలకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి మిమ్మల్ని ఓడించారు. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అన్నిచోట్ల 2014తో పోలిస్తే మీ ఓట్ల శాతం అదే కారణంవల్ల పడిపోయింది. కార్పొరేట్ కంపె నీల తరఫున పనిచేసే ప్రధానిగా మాకు మోదీ కనబడుతున్నారు. ప్రజాభి ప్రాయాన్ని గౌరవించి, మీ ప్రజావ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అను కూల విధానాలను మార్చుకుంటే మంచిదని సలహా ఇస్తున్నాం. సురవరం సుధాకరరెడ్డి, వ్యాసకర్త సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మొబైల్ : 94400 66066 -
మురికివాడ ప్రజలంటే... అంత చులకనా!
సీఎం వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన పేదల ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుందని కలవరం విపక్షాల మండిపాటు బాధ్యత మరిచి.. వ్యాఖ్యలు చేయటంపై ఆగ్రహం విజయవాడ : ‘మంచి వాతారణంలో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి.. మురికి వాడల్లో ఉంటే మురికి ఆలోచనలు వస్తాయి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం నగరంలో జరగుతున్న పరిణామాలకు తోడు చంద్రబాబు నాయుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం వల్ల తాము ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. మురికివాడల్లో ప్రజలంటే చంద్రబాబుకు అంత చులకనా అనే భావన పేద ప్రజల్లో వ్యక్తమవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో ఒకలా.. ఆ తర్వాత మరోలా.. ఎన్నికల సందర్భంగా పేదల జీవితాలను మార్చేస్తానని, వారి అభ్యుదయానికి కృషిచేస్తానని చెప్పుకొచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు పేదలను ఆదుకోకపోగా, వారికి వ్యతిరేకంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని, రామవరప్పాడులో ఇళ్ల తొలగింపే దీనికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 150 పేదల ఇళ్లు తొలగించగా, మరో 500 ఇళ్లు తొలగించేందుకు నోటీసులు ఇవ్వటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మరోపక్క కాల్వల బ్యూటిఫికేషన్ పేరుతో గతంలో కాల్వగట్లను తొలగించాలని కూడా ప్రభుత్వం యోచించింది. దీంతో ఎప్పుడైనా తమ ఇళ్లు పీకేస్తారేమోనని పేదలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాక, వారికి సర్దిచెప్పలేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల్లో మరింత ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో 200కు పైగా మురికివాడలు... గతంలో నగరంలో సుమారు 200కు పైగా మురికివాడలు ఉన్నాయి. అందులో సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారని అంచనా. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో ఈ పేదల ఓట్లతోనే తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 15 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలుపొందారు. ఇప్పుడు అదే పేద ప్రజల్ని చులకన చేసి మాట్లాడుతూ కార్పొరేట్లకు చంద్రబాబు కొమ్ముకాయడంపై విపక్షాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అటు రాష్ట్రంలోనూ, ఇటు నగరపాలక సంస్థలోనూ అధికారంలో ఉన్న టీడీపీ మురికివాడల్ని అభివృద్ధి చేయకుండా వారిని విమర్శించడంపై తప్పుపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ మురికివాడల్లో ప్రజల్ని చిన్నచూపు చూస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు. మురికివాడల్ని అభివృద్ధి చేయకపోవడం ప్రభుత్వం తప్పు ఉన్నతమైన వర్గాల్లోనివారే ఉన్నతమైన ఆలోచనలు చేస్తారని, మురికివాడల్లో ఉన్నవారు మురికి ఆలోచనలు చేస్తారనుకోవడం చాలా తప్పు. మురికివాడల్ని అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం తన బాధ్యత విస్మరించి అక్కడివారిని చులకనగా మాట్లాడటం బాధాకరం. పేదల ఓట్లతో గెలిచి, గద్దెనెక్కిన చంద్రబాబు మాటల్లోనూ చేతల్లోనూ కార్పొరేట్లను పొగుడుతూ, పేదల్ని విమర్శించడం తగదు. ఈ విధంగా చేస్తే పేద ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారు. - సిహెచ్.బాబూరావు, సీపీఐ రాజధాని ప్రాంత కన్వీనర్ బాబు మానసికస్థితిపై అనుమానం వస్తోంది ఎస్సీలుగా పుట్టాలని ఎవరి కోరుకుంటారు.. మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయి.. అంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఆయన మానసికస్థితిపై అనుమానం వస్తోంది. మురికివాడల నుంచే ఐఏఎస్ అధికారులు, గొప్ప రాజకీయ నేతలు వచ్చారు. మురికివాడలను బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాగా, దానిని పక్కన పెట్టి అక్కడి ప్రజల్ని అవహేళన చేయడం సరికాదు. దేశంలో 40 శాతం ప్రజలు పేదరికంలోనే ఉన్నారు. వారి మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోబోము. - కొలనుకొండ శివాజీ, పీసీసీ అధికార ప్రతినిధి -
సర్కారీ ఆస్పత్రులు.. కార్పొరేట్ బందీలు!
ఒక్కొక్కటీ అప్పగించేందుకు యత్నాలు నిన్న డయాగ్నోస్టిక్ సేవలు.. ప్రస్తుతం ఐసీయూలు వెల్లువెత్తుతున్న విమర్శలు సర్కారీ ఆస్పత్రులు కార్పొరేట్ల చేతుల్లో బందీలు కానున్నాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వైద్యులు, సిబ్బంది నియామకాలు జరపకుండా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు సరైన వైద్యం అందడం లేదని సాకు చూపుతూ కార్పొరేట్ల వైపు మొగ్గు చూపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ (లబ్బీపేట) : రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ (వ్యాధి నిర్ధారణ) సేవలను ప్రైవేటుకు అప్పగించిన ప్రభుత్వం తాజాగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లనూ కార్పొరేట్కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సామాన్యుడికి ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకు ప్రస్తుతం పీపీపీ పద్ధతిలో నడుస్తున్న విభాగాలే నిదర్శనమని పలువురు చెపుతున్నారు. ప్రస్తుతం ఏం జరుగుతోందంటే... ఐదేళ్ల కిందట ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్ సేవలను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ చేయాలనే ఉద్దేశంతో వాటిని నెలకొల్పారు. కానీ అక్కడ నిరుపేదల కంటే ఉన్నత వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధిక ఆదాయం ఉన్నవారు సైతం ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చే సీఎంసీవో రిఫరల్ లేఖతో డయాలసిస్ చేయించేస్తున్నారు. దీంతో నిరుపేదలకు డయాలసిస్ అవసరమైతే ఖాళీ లేదని పంపించేస్తున్నారు. సూపరింటెండెంట్ చెప్పినా వినని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఐసీయూలను అప్పగించినా ఇదే పరిస్థితి తలెత్తుతుందనే వాదన వినిపిస్తోంది. వైద్యులు, సిబ్బంది లేకుండా సేవలెలా... ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది నియామకాలు జరపకుండా, వైద్యం అందడం లేదనడం సరికాదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు కల్పించి, వైద్యులు, సిబ్బంది నియామకాలు జరిపితే కార్పొరేట్కు దీటుగా సేవలు అందుతాయనేది నిపుణుల వాదన. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థలైన ఎయిమ్స్, నిమ్హాన్స్, నిమ్స్ వంటి సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో నడవటం లేదా, వాటిని ఏవైనా కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయా అని వారు ప్రశ్నిస్తున్నారు. అత్యసవర సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికే ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న వాదన అశాస్త్రీయమైనదని పేర్కొంటున్నారు. తగిన నిధులు విడుదల చేసి, సిబ్బందిని కేటాయిస్తే మన రాష్ట్రంలోని ఆస్పత్రులు సైతం ఆ స్థాయిలో నిర్వహించ వచ్చని చెపుతున్నారు. విడతల వారీగా కార్పొరేట్ చేతుల్లోకి... మొన్న జిల్లా కేంద్ర ఆస్పత్రులను క్లినికల్ అటాచ్మెంట్ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులకు అప్పజెప్పారని, నిన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ సేవలను మెడాల్కు, రేడియాలజీ సేవలను కృష్ణా డయాగ్నోస్టిక్కు ఇచ్చారని, ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల వంతు వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదంతా పరిశీలిస్తుంటే ప్రభుత్వ ఆస్పత్రులను ఒక్కసారిగా ప్రైవేటుపరం చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే విడతల వారీగా కార్పొరేట్లకు అప్పగిస్తున్నట్లు అర్థమవుతోందని చెబుతున్నారు. కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నమే ప్రభుత్వాస్పత్రుల్లోని విభాగాలను విడతల వారీగా కార్పొరేట్లకు అప్పగించడమంటే వారికి దోచిపెట్టడమే అవుతుంది. ఇది సరైన చర్య కాదు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది నియామకాలు జరిపి, అత్యాధునిక పరికరాలు సమకూర్చి, నిధులు కేటాయిస్తే ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి. - డాక్టర్ ఎం.కిరణ్, ప్రజా ఆరోగ్య వేదిక ఉపాధ్యక్షుడు సేవా దృక్పథం ఉండదు ప్రభుత్వాస్పత్రుల్లో ఐసీయూలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించటం సరైన చర్య కాదు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు సేవా దృక్పథంతోనే పనిచేస్తున్నారు. బయట ఆస్పత్రుల్లో పనిచే స్తే రూ.లక్షల్లో జీతాలు వచ్చే అవకాశం ఉన్నా, ఇక్కడ ఇచ్చే అరకొర జీతాలకు సూపర్ స్పెషలిస్టులు కూడా సేవ చేయాలనే పనిచేస్తున్నారు. వారికి కాదని, లాభాపేక్ష కలిగిన కార్పొరేట్లకు అప్పగిస్తే వైద్యం వ్యాపారంగా మారుతుంది. - డాక్టర్ పవన్కుమార్, టీచింగ్ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి -
కార్పొరేట్లకు బడ్జెట్ లో నిరాశే!
♦ ప్రోత్సాహకాలను తగ్గించే అవకాశం.. ♦ డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాలు నెరవేరకపోవడమే కారణం ♦ ద్రవ్యలోటు పెరగవచ్చన్న ఆందోళనలు కూడా... ♦ కార్పొరేట్ ట్యాక్స్ను 25 శాతానికి తగ్గిస్తామని ♦ గత బడ్జెట్లోనే కేంద్రం హామీ... న్యూఢిల్లీ: మోదీ సర్కారు రానున్న బడ్జెట్లో కార్పొరేట్ రంగాన్ని నిరాశపరచనుందా? ప్రోత్సాహకాల కోతకు తెరతీయనుందా? ప్రభుత్వ తాజా ఆర్థిక పరిస్థితులను చూస్తే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా ద్రవ్యలోటు లక్ష్యాన్ని మించి పోతుందన్న ఆందోళనలకు తోడు డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యానికి ఆమడ దూరంలోనే నిలిచిపోవడం వంటివి దీనికి కారణమని చెబుతున్నారు. దీంతో ఈ సారి బడ్జెట్లో పన్ను వసూళ్లు, ప్రభుత్వ రంగ వాటా విక్రయాలకు సంబంధించి లక్ష్యాల విధింపులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను సమర్పించనున్న సంగతి తెలిసిందే. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యానికి కోత...! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16)లో ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) లక్ష్యం జీడీపీలో 3.9 శాతం(రూ.5.55 లక్షల కోట్లు) కాగా, దీన్ని మించిపోవచ్చనే సంకేతాలు స్పష్టం కనబడుతున్నాయి. డిసెంబర్ నాటికే ద్రవ్యలోటు లక్ష్యంలో 88 శాతానికి(రూ. 4.88 లక్షల కోట్లు) చేరుకుంది. వాస్తవానికి ఈ ఏడాదే ద్రవ్యలోటును 3.6 శాతానికి కట్టడి చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం దీన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరోపక్క, ఈ ఏడాది భారీస్థాయిలో రూ.68,500 కోట్ల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించుకోగా... కేవలం రూ.12,700 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. దీంతో వచ్చే ఏడాది డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని రూ.35 వేల కోట్లకు పరిమితం చేయొచ్చన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలకు ఎలా కళ్లెం వేస్తారు, ఆదాయాలను ఎలా పెంచుకుంటారనేదానిపై రేటింగ్ ఏజెన్సీలు, ఆర్థిక వేత్తలు దృష్టిపెట్టారు. ఇప్పటికే సంకేతాలు... తాజాగా మోదీ ఒక కీలక సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేట్ రంగానికి ఇస్తున్న రాయితీలు, పోత్సాహకాలను తగ్గించాల్సి ఉందని... హేతుబద్దీకరించనున్నట్లు సంకేతాలిచ్చారు. ప్రస్తుతం కార్పొరేట్లకు రూ.62,400 కోట్ల మేర భారీ పన్ను ప్రయోజనాలు, ఇతరత్రా రాయితీలు అమలవుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, నాలుగేళ్లలో కార్పొరేట్ పన్నును ఇప్పుడున్న 30% నుంచి 25 శాతానికి తగ్గించనున్నామని గత బడ్జెట్లోనే ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా వారికిస్తున్న ప్రోత్సాహకాలను ఉపసంహరించుకుంటామని కూడా చెప్పారు. మూలధన పెట్టుబడులు, పరిశోధన-అభివృద్ధి(ఆర్అండ్డీ), అభివృద్ధి చెందని ప్రాంతాల్లో ప్రాజెక్టుల ఏర్పాటు చేసే సంస్థలకు ఇస్తున్న పన్ను ప్రయోజనాలకు జైట్లీ ఈ ఏడాది బడ్జెట్లో కోత విధించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి భారత్ను తయారీ హబ్గా మార్చడం కోసం మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో అటు దేశీయంగా, ఇటు అంతర్జాతీయంగా కంపెనీలను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు పన్ను ప్రయోజనాల్లో లొసుగులను పూడ్చే క్రమంలో వాటికి కోత వేసే చర్యలను ప్రభుత్వం గనుక చేపడితే.. అది మేక్ ఇన్ ఇండియాకు అవరోధంగా మారొచ్చని కేపీఎంజీకి చెందిన ట్యాక్స్ పార్ట్నర్ రాహుల్ మిత్రా అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుతం ఒక్కో భారతీయ కంపెనీపై అన్ని రకాల పన్నులు కలిపి దాదాపు 34%గా అంచనా. అంతర్జాతీయంగా చూస్తే ఇది చాలా ఎక్కువ. అయితే, పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ వాస్తవ రేటు 23 శాతంగా లెక్కగడుతున్నారు. అత్యధికం కస్టమ్స్, ఎక్సైజ్ రాయితీలే.. కార్పొరేట్లకు ఇస్తున్న ప్రోత్సాహకాల్లో అత్యధికం కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల రూపంలోనే ఉంటున్నాయి. మూలధన పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దీనికి సంబంధించిన పన్ను రాయితీల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి రూ. 37,000 కోట్ల మేర గండి పడిందని అంచనా. ప్రధానంగా ఐటీ, ఫార్మాతో పాటు కొన్ని తయారీ రంగ కంపెనీల విషయానికొస్తే.. పెట్టుబడులపై దాదాపు 200 శాతం వరకూ మినహాయిం పులు అమల్లో ఉన్నాయి. దీన్ని ఇప్పుడు 60 శాతానికి కుదించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పన్ను వసూళ్లు సంతృప్తికరంగా లేకపోవడంతో కార్పొరేట్ పన్ను తగ్గింపు మినహా ఈ సారి కార్పొరేట్ రంగానికి జైట్లీ పెద్దగా చేసేదేమీ లేకపోవచ్చనేది ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. స్టార్టప్ ఇండియా ప్రారంభం సందర్భంగా ప్రభుత్వ నిధి ఏర్పాటుతో పాటు మూడేళ్లపాటు పన్ను మినహాయింపులు, సరళ నిబంధనలను అమలు చేస్తామంటూ మోదీ హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేట్లపై మరీ కఠిన వైఖరిని ప్రదర్శిస్తారా అనేది వేచిచూడాల్సిందేనని ట్యాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. -
సన్నగిల్లిన వ్యాపార విశ్వాసం
న్యూఢిల్లీ: ప్రస్తుత, భవిష్యత్ వ్యాపార పరిస్థితులపై కార్పొరేట్లలో విశ్వాసం గణనీయంగా క్షీణించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటుకన్నా ముందు స్థాయికి తగ్గిపోయింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల్లో ప్రస్తుతం నెలకొన్న సెంటిమెంట్ ఆధారంగా డాయిష్ బార్స్ నిర్వహించే ఎంఎన్ఐ ఇండియా బిజినెస్ సెంటిమెంట్ ఇండికేటర్ దీనికి నిదర్శనం. ఏప్రిల్ 63.9గా ఉన్న సూచీ మే లో 2.5 శాతం తగ్గి 62.3కి తగ్గిపోయింది. గతేడాది ఏప్రిల్ నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయని ఎంఎన్ఐ ఇండికేటర్స్ చీఫ్ ఎకానమిస్ట్ ఫిలిప్ యుగ్లో తెలిపారు. ఇటు ఉత్పత్తి, అటు ఆర్డర్లు తగ్గడం వల్లే వ్యాపార కార్యకలాపాలు తగ్గాయని ఆయన వివరించారు. మేలో ఉత్పత్తి దాదాపు రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా ప్రాజెక్టు క్షేత్ర స్థాయిలో అంతగా ముందుకెళ్లడం లేదని ఈ సర్వే ద్వారా తెలుస్తోందని యుగ్లో పేర్కొన్నారు. సర్వే ప్రకారం కంపెనీలకొచ్చే దేశీ, విదేశీ ఆర్డర్లు తగ్గాయి. కొత్త ఆర్డర్లకు సంబంధించిన సూచీ 57.1కి తగ్గింది. మే 2013 తర్వాత ఇదే కనిష్ట స్థాయి. ఇక ఎగుమతుల ఆర్డర్లు 2013 జూన్ తర్వాత కనిష్టం 53.6కి తగ్గాయి. డిమాండ్ బలహీనంగా ఉండటం, పోటీ పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఒక మోస్తరు స్థాయిలోనే ఉన్నాయని సర్వే నివేదిక పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది రెండు సార్లు కీలక పాలసీ రేట్లలో కోత విధించినప్పటికీ ఆ ప్రయోజనాల ప్రభా వం పరిమితంగానే ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో జూన్ 2న జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నట్లు యుగ్లో తెలిపారు. -
మరిన్ని సంస్కరణలు కావాలి..
- రోడ్లు, విద్యుత్, బొగ్గు వంటి కీలక రంగాలపై దృష్టిపెట్టాలి - మోదీ సర్కారు ఏడాది పాలనపై అసోచామ్ సర్వేలో కార్పొరేట్ల స్పందన న్యూఢిల్లీ: కీలక రంగాల్లో కేంద్రం మరిన్ని సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక మండలి అసోచామ్ సర్వేలో కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. మోదీ సర్కారు ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా వచ్చే రెండు త్రైమాసికాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ విధమైన సూచనలు చేశారు. ‘రోడ్లు, విద్యుత్, బొగ్గు, సాంప్రదాయ ఇంధనం వంటి ప్రధానమైన రంగాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరగాలి. వ్యవసాయ రంగంలో కూడా సాగునీరు, గ్రామీణ మౌలికసదుపాయాల అభివృద్ధి, విద్యుత్ సరఫరాల్లో భారీస్థాయిలో ప్రభుత్వ పెట్టుబడులు అవసరం. దీంతోపాటు ఎరువుల రాయితీలకు సంబంధించి రైతులకు మద్దతును కొనసాగించాల్సిందే’ అని సర్వే పేర్కొంది. తొలి ఏడాది పాలనలో వ్యాపారాలకు అనువైన పరిస్థితుల కల్పన, కొన్ని మౌలిక ప్రాజెక్టులను పట్టాలెక్కించడం వంటి పలు చర్యలను చేపట్టారని.. అదేవిధంగా ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మరింత దృష్టిపెడతారని అంచనా వేస్తున్నట్లు అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన ధన యోజన వంటి పథకాలు పల్లెల్లో మంచి ఫలితాలివ్వనున్నాయని ఆయన పేర్కొన్నారు. బంగారం డిపాజిట్ స్కీమ్ మంచిదే... టెలికం, బ్యాంకింగ్, రియల్టీ వంటి కొన్ని రంగాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని.. మరోపక్క, గ్లోబల్ డిమాండ్ మందగించడంతో ఎగుమతులు కూడా నేలచూపులు చూస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కపూర్ ప్రస్తావించారు. అయితే, ప్రతిపాదిత బంగారం డిపాజిట్ పథకం అమల్లోకి వస్తే... దేశంలోకి పుత్తడి దిగుమతులు తగ్గుముఖం పట్టడంతోపాటు కరెంట్ అకౌంట్ లోటుకు కూడా కళ్లెం పడుతుందన్నారు. అత్యంత కీలక పన్ను సంస్కరణగా పేర్కొంటున్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చట్టరూపం దాల్చుతుందన్న విశ్వాసం కార్పొరేట్లలో నెలకొందని కూడా ఆయన చెప్పారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)పై కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) విధింపు వివాదం పరిష్కారం కోసం నిపుణుల కమిటీని నియమించడంపట్ల కపూర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి రేటు జోరందుకోవాలంటే.. ముందుగా దేశీ డిమాండ్ను పెంచడం, ఉద్యోగాల కల్పనతో సెంటిమెంటును మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అసోచామ్ పేర్కొంది. పర్యాటకం, విమానయానం వంటి రంగాలను ప్రోత్సహించడం ద్వారా తగిన ప్రతిఫలాన్ని అందుకోవచ్చని కూడా సూచించింది. నిర్మాణం, రియల్టీ రంగాలు పుంజుకుంటే భారీస్థాయిలో ఉద్యోగాలను సృష్టించవచ్చని కూడా అభిప్రాయపడింది. తొలి ఏడాది భారీ పెట్టుబడుల్లేవు: సీఐఐ మోదీ ప్రభుత్వం తొలి ఏడాది పాలనలో భారీ స్థాయి పెట్టుబడులేవీ రాలేదని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) పేర్కొంది. వ్యాపారాలను సానుకూల పిరిస్థితులను కల్పించడంలో ఇంకా చాలా అడ్డంకులను తొలగించాల్సి ఉందని కూడా వ్యాఖ్యానించింది. ‘పెట్టుబడులు క్రమంగా రానున్నాయి. కొన్ని నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వ వర్గాలతో చర్చలను బట్టి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం మూడు లేదా నాలుగో త్రైమాసికం నాటికి ప్రభుత్వ చర్యలు ఫలితాలివ్వడం ప్రారంభం కావచ్చనిపిస్తోంది. అని సీఐఐ ప్రెసిడెంట్ సుమిత్ మజుందార్ వ్యాఖ్యానించారు. -
భలే బోనస్..కొంచెం బోగస్..!
- ఈ ఏడాది 21 కంపెనీల బోనస్ బొనాంజా - వీటిలో చాలావరకూ టాప్ కంపెనీలే - బోనస్ చూసి షేర్లు కొనొద్దంటున్న నిపుణులు - ఏ కంపెనీకైనా ఫండమెంటల్సే ముఖ్యం ఈసారి కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలేమీ అంత బాగులేవు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ముగిసిన ఆఖరి త్రైమాసికం ఫలితాలు ఆకర్షణీయంగా లేవంటూ అంతా వాపోతుండగా... పలు కంపెనీలు షేర్హోల్డర్లకు ఆకర్షణీయమైన బోనస్ షేర్లను ప్రకటించాయి. తద్వారా తమ దగ్గర నగదు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చాటాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 21 కంపెనీలు బోనస్ ఇష్యూల్ని ప్రతిపాదించాయి. వాటిలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్ తదితర పెద్ద కార్పొరేట్లూ ఉన్నాయి. అయితే ఇటీవల బోనస్ ఇష్యూల్ని ప్రకటించిన 21 కంపెనీల్లో 9 కంపెనీల లాభాల వృద్ధి 2015 మార్చి త్రైమాసికంలో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యింది. ఆయా కంపెనీల ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నా, భవిష్యత్లో వ్యాపారం వృద్ధి చెందుతుందన్న భరోసాతో బోనస్ షేర్లను ప్రకటించాయి. బోనస్ షేర్లు అంటే... ఒక్క ముక్కలో చెప్పాలంటే... కంపెనీల వద్దనున్న మిగులు రిజర్వుల్ని (నగదుతో సహా) వాటాదార్లకు నగదు రూపంలో పంచకుండా షేర్ల రూపంలో పంచటమే!! ఇలా చేయటం వల్ల కంపెనీల ఈక్విటీ (మూలధనం) పెరుగుతుంది. అంటే నగదుతో సహా తమ దగ్గరున్న రిజర్వుల్ని మూలధనంగా మారుస్తాయన్న మాట. నిజానికి ఇది కంపెనీ ఖాతా పుస్తకాల్లో జరిగే మార్పే. అయితే మూలధనం పెరగడం వల్ల షేర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల ప్రతి షేరుకూ వచ్చే రాబడి (ఈపీఎస్) తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయినపుడు కంపెనీ సరైన వృద్ధి కనపరచటం లేదనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే భవిష్యత్తులో మరింత వృద్ధి కనబరుస్తామనే ధీమా ఉన్న సంస్థలే బోనస్ ప్రకటిస్తుంటాయి. అలా చేస్తేనేబోనస్ షేర్ల వల్ల ఇన్వెస్టర్లకు లాభం కూడా. భవిష్యత్ బాగుంటుం దని, వ్యాపారాన్ని మరింత విస్తరించే చాన్స్ వుందన్న విశ్వాసం ఆ కంపెనీ యాజమాన్యానికి ఉందనే సంకేతం బోనస్ ఇష్యూ ద్వారా వెలువడుతుంది. ఇన్వెస్టర్లకూ ఇదో అవకాశమే... అధిక ధరలో షేర్లు కొనలేని ఇన్వెస్టర్లకు బోనస్ ఇష్యూ ఒక అవకాశం. ఎందుకంటే బోనస్ షేర్లు జారీ అయ్యాక స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఆ షేరు ధర బోనస్ నిష్పత్తి ప్రకారం తగ్గుతుంది. ఉదాహరణకు ఇన్ఫోసిస్ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. బోనస్ జారీకి నిర్ణయించిన రికార్డు తేదీ నాటికి ఆ కంపెనీ షేర్లు ఎవరి దగ్గర ఉంటాయో వారికి బోనస్ షేర్లు లభిస్తాయి. నిర్ణీత తేదీ తర్వాత ఆ షేరు ధర కూడా సగానికి తగ్గిపోతుంది. దాంతో ఇన్ఫోసిస్ షేరును రూ.2000కు బదు లు రూ.1000 ధరతో కొనవచ్చు. కానీ బోనస్ ఇష్యూ తర్వాత కంపెనీ షేరు పుస్తక విలువ, ఈపీఎస్ తదితరాలు కూడా సగమైపోతాయన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. అంటే షేరు ధర తగ్గినంత మాత్రాన, కంపెనీ ఫండమెంటల్స్తో పోలిస్తే షేరు చౌక అయినట్లు కాదు. షేర్లు కొనొచ్చా బోనస్ ఇస్తామన్న కంపెనీల షేర్లను కొనడానికి రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉత్సాహపడతారు. కానీ బోనస్ ఇచ్చినంత మాత్రాన ప్రతి కంపెనీ షేరును కొనడం సరికాదని, ఆయా కంపెనీ ఫండమెంటల్స్, భవిష్యత్తు వ్యాపారాన్ని అవగాహన చేసుకునే కొనడం మంచిదనేది విశ్లేషకుల సూచన. ప్రముఖ ఫైనాన్షియల్ మేగజైన్ వెల్లడించిన సర్వే ప్రకారం 2001-2010 మధ్యకాలంలో బోనస్ ప్రకటించిన టాప్ 30 కంపెనీల్లో 24 కంపెనీల షేర్లు రికార్డు తేదీ తర్వాత ఏడాదికాలంలో ర్యాలీ జరిపాయి. ఆ సర్వే ప్రకారం అప్పట్లో బోనస్ ప్రకటించిన కంపెనీల్లో టీసీఎస్, ఎల్ అండ్ టీ, ర్యాన్బాక్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ షేర్లు రికార్డు తేదీ తర్వాత ఏడాది కాలంలో 82 శాతం వరకూ పెరిగాయి. అదే సమయంలో స్టెరిటైల్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, సీమెన్స్ షేర్లు బోనస్ జారీ తర్వాత ఏడాది కాలంలో 16-72% మధ్య నష్టపోయాయి. చాలావరకూ ఆరోగ్యకరమైన కంపెనీలే బోనస్ షేర్లను జారీచేస్తాయని, అందువల్ల అవి పెరిగే అవకాశం వుందని విశ్లేషకులు అంటుం టారు. కానీ రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు వృద్ధి అవకాశం లేని కంపెనీలు కూడా బోనస్లను ప్రకటిస్తాయని, వాటి పట్ల ఆప్రమత్తంగా వుండాలన్నది వారి హెచ్చరిక. షేరు ధర పెరుగుతుందా.. కంపెనీ రిజర్వుల్ని మూలధనంగా మార్చి బోనస్ ఇచ్చినంత మాత్రాన షేరు ధర పెరుగుతుందన్న గ్యారంటీ లేదు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఏప్రిల్ 24న బోనస్ ప్రకటించింది. తరవాత రెండ్రోజుల్లో 10 శాతంపైగా పతనమైంది. ఆ ప్రకటనకు ముందునాటి ధర రూ. 2,150తో పోలిస్తే ఇప్పటికీ దాని ధర 5 శాతం తక్కు వే ఉంది. అయితే గత రెండు దశాబ్దాలుగా పలు బోనస్ ఇష్యూల్ని ఇన్ఫోసిస్ ప్రకటించింది. అటు తర్వాత కొద్ది త్రైమాసికాలకు ఆ షేరు పెరుగుతూ వచ్చింది. ఆ పెరుగుదలకు అనుగుణంగానే కంపెనీ లాభాలు ఎప్పటికప్పుడు వృద్ధి చెందడం ఇందుకు కారణం. అదే కోటక్ బ్యాంక్ మే 5న బోనస్ ప్రతిపాదించాక వెనువెంటనే 8% ర్యాలీ జరిపింది. మధ్యలో క్షీణించినా, ఇప్పటి ధర బోనస్ ప్రకటనకు ముందునాటి ధరతో పోలిస్తే 5 శాతం ఎక్కువగానే వుంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ 2009 అక్టోబర్లో 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది. అప్పటి ధరతో పోలిస్తే ఆరేళ్లు గడిచినా ఇప్పటికీ 25 శాతం తక్కువగానే వుంది. రిలయన్స్ గ్యాస్ క్షేత్రాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో కంపెనీ ఆశించిన ఫలితాల్ని ఇవ్వక ధర తగ్గిందనేది గమనించాలి. -
కార్పొరేట్లను రప్పించడమే అభివృద్ధా: కారత్
హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం సరళీకృత ఆర్థికవిధానాలను దూకుడుగా అమలు చేస్తుండడంతో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని సీపీఎం మాజీ ప్రధానకార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఎర్రతివాచీ పరచి, వాటికి తలుపులు బార్లా తెరవడమే అభివృద్ధా.. అని ప్రశ్నించారు. మంగళవారం సీపీఎం సిద్ధాంతకర్త పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ప్రగతినగర్లో నిర్మించిన సుందరయ్య భవన్ను కారత్ ప్రారంభించారు. అనంతరం ‘మారుతున్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులు’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, అన్ని రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. భూసేకరణ చట్టానికి సవరణల ద్వారా రైతన్నల భూమిని కంపెనీలు, సంపన్నవర్గాలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని విశాల ప్రాతిపదికన ఉద్యమాన్ని మొదలుపెడతామన్నారు. కులవ్యవస్థను బద్ధలు కొట్టకుండా, భూ పంపిణీ చేయకుండా దేశం అభివృద్ధి చెందబోదని సీపీఎం పొలిట్బ్యూరోసభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. ‘ప్రైవేట్రంగంలో రిజర్వేషన్లు’పై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగం నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రైవేట్రంగంలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే దేశం ముందడుగు వేస్తుందన్నారు. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రసంగిస్తూ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వేల ఎకరాల భూములను తాము పేదలకు పంపిణీ చేస్తే, ఇప్పుడు వాటిని పెద్దలకు కట్టబెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
కమతాలన్నీ కార్పొరేట్లు దున్ని..
రెండోమాట సాధారణంగా మోతుబరులే చిన్న రైతులకు భూములను కౌలుకిస్తారు. ఆ పరిస్థితిని ఆగ్రో-బిజినెస్ కార్పొరేట్లు తారుమారు చేస్తున్నాయి. సంప్రదాయ బడా రైతు వ్యవసాయేతర వ్యాపారాల్లోకి విస్తరిస్తున్నాడు. ఇదెలా జరుగుతుందంటే, కొత్తగా అవతరిస్తున్న బడా రైతురుణ భారం నుంచి తేరుకోలేని సామాన్య రైతుల నుంచి భూములను ముదరాగా గుంజేసుకోవడం ద్వారా లేదా నష్టాలతో వ్యవసాయంపై భ్రమలు కోల్పోతున్న రైతుల నుంచి భూముల్ని కొనేసుకోవడం ద్వారా, అని వ్యవసాయ విద్యాలయం నిర్వహించిన సర్వే చెప్పింది. ‘వ్యవసాయమూ, రైతాంగమూ నేడు రుణాల ఊబిలో దిగబడిపోయాయి. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని వ్యవసాయాన్ని వ్యాపార ప్రయోజనాల వైపు మళ్లించడానికి కార్పొరేట్/ కాంట్రాక్టు శక్తులు రంగంలోకి దిగాయి. క్రమంగా బడా కార్పొరేట్ సంస్థలు చొచ్చుకుపోతున్నాయి. రుణ బాధతో గత ఏడాది లోనే (2014) రెండు లక్షల మంది పంజాబ్ రైతులు పొలాలను విడిచి వ్యవ సాయేతర వృత్తుల వైపు మళ్లవలసి వచ్చింది. వ్యవసాయాధార వ్యాపార సంస్థలు (ఆగ్రో బిజినెస్)కు పన్ను రాయితీలూ, లాభాలు చేకూర్చే సౌక ర్యాలూ ప్రభుత్వం కల్పించినందువల్ల, ఇటు వీరికి వ్యవసాయవ్యయాలు తడిసి మోపిడవుతున్నందున రైతులు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఫలితంగా రైతులు తమ భూములను ఆగ్రో బిజినెస్ కంపెనీలకు కౌలుకు ఇచ్చుకోవలసిన దుస్థితి నెలకొన్నది.’ {పొఫెసర్ సుఖ్పాల్ (పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో) రైతాంగ, రైతు కూలీ, వ్యవసాయాధార వృత్తుల వారి మౌలిక ప్రయోజ నాలను దెబ్బతీసే ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక ‘సంస్కరణల’ పత్రాల మీద పాలకులు 1991లో సంతకాలు చేశారు. నేడు దేశం అనుభవిస్తున్న అనేక దుష్ఫలితాలకు కారణం అదే. పాలకులు, వారి బ్రాండ్లు (కాంగ్రెస్- యూపీఏ/ బీజేపీ- ఎన్డీయే/ బీజేపీ-టీడీపీ) ఏమైనప్పటికీ ఈ విషయంలో వాటి ఆచరణకు సంబంధించి ఎలాంటి తేడాను చూడలేం. పీవీ-మన్మోహన్ -సోనియా/ వాజపేయి-మోదీ- చంద్రబాబుల పాలన వరకు అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్న చందంగానే దేశ విదేశ గుత్త వ్యాపార ప్రయో జనాలతో పాటు, భూస్వామ్య వ్యవస్థ అడుగుబడుగు అవశేషాలను కాపాడేం దుకే యత్నించారని లేదా యత్నిస్తున్నారని ఆచరణ రుజువు చేస్తున్నది. ఆ ఆచరణ కోసమే వారు అవసరమైన పాత చట్టాలకే దుమ్ము దులిపి, అవే చట్టా లకు కొత్త రంగులు అద్దుతున్నారని గమనించాలి. అవసరమైనప్పుడు దేశ, రాష్ట్రాల చట్టసభల వేదికల మీద బ్రూట్ మెజారిటీ ఆధారంగా కాలాన్నీ, కార్యాన్నీ పాలకులు డొల్లించుకుపోయేందుకు తపన పడుతున్నారన్నది కూడా ఒక వాస్తవం. ఒకరు తాను ‘చాయ్ వాలా’నని ప్రకటించుకుని, తరు వాత కార్పొరేట్ దిగ్గజాల ఛాయగా మారిపోయారు. ఇంకొకరు ైరె తు బాంధ వుడినని చెప్పి, ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని నిర్మాణానికి భూసేకరణ పేరిట రైతులకే (విజయవాడ-గుంటూరు ప్రాంతంలో) ఎసరు పెట్టారు. కాంట్రాక్ట్/ కార్పొరేట్ వ్యవసాయానికంటే ఇంకా ముందే ఇజ్రాయిలీ వ్యవసాయానికి హారతి పట్టి, పంటభూముల సరి హద్దులు చెరిపేసి నవ్వుల పాలైనది కూడా ఆయనేనన్న సంగతి విస్మ రించరానిది. ఇలాంటి కాంట్రాక్ట్/ కార్పొరేట్ వ్యవసాయమే ‘ఆగ్రో బిజినెస్’ రూపంలో పంజాబ్ రైతులనూ, గ్రామాలనూ చుట్టబెడుతోంది. న్యాయ, చట్ట వ్యవస్థల కన్నుగప్పే యత్నం పాలనా విధానాలలో, పాలకుల ఆచరణలో మార్పు లేకుంటే విసిగిపోయిన ప్రజలు నెగెటివ్ ట్రయల్గా ప్రత్యామ్నాయాన్ని అభిలషించడం సహజం. కానీ నెగెటివ్ ఓటు మీద కూడా అధికారంలోకి వచ్చి, శాసన నిర్మాణ వేది కలను ప్రజా వ్యతిరేక సంస్కరణలకు అనుకూలంగా ఉపయోగించుకోవడమే దారుణం. పైగా ‘ధర్మాసన చైతన్యాన్ని’ (జ్యుడీషియల్ యాక్టివిజమ్)ను పాల కులు తప్పు పట్టడం ఇటీవల ఒక అలవాటుగా మారడం మరో విషాదం. రాజ్యాంగం ప్రకారం శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య విధులకు సంబంధించి పరిధులను స్పష్టంగా నిర్వచించినప్పటికీ జ్యుడీషియరీకి ప్రభుత్వ నిర్ణయాలనూ, ప్రతిపాదనలనూ సమీక్షించే హక్కు అదనంగా ఉన్న దని మరచిపోరాదు. కానీ, ధర్మాసనానికి తన వ్యవహారాల నిర్వహణలో ఉన్న స్వేచ్ఛను, హక్కును తోసిపుచ్చి ప్రభుత్వమే జాతీయ స్థాయిలో న్యాయ మూర్తుల ఎంపికకు, నియామకాలకు ప్రత్యేక జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జోసెఫ్ కురియన్ వ్యాఖ్యను పరిశీలించాలి: ‘శాసన సంబం ధమైన అతివేలానికీ, సాహసానికీ మా సమాధానం- ధర్మాసన చైతన్యమే. అది న్యాయమూర్తులుగా మా బాధ్యత’. నిజానికి భూసేకరణ బిల్లుకు చట్ట రూపం ఇవ్వడానికి పార్లమెంటు ఉభయ సభలలో ఎక్కడా ఆమోదం పొంద లేని పరిస్థితి ఎదురైతే అది పాలకులకు దుర్భరమే. అందుకు విరుగుడుగా భావిస్తూ చేసిన పనే ఆర్డినెన్స్ విడుదల. ఆ చట్టం తెస్తేగానీ దేశ విదేశ గుత్త పెట్టుబడులూ, బహుళ జాతి కంపెనీలకూ మరింత ఉధృతంగా రావడానికి వీలుండదు. ఈ రంధే ఇప్పుడు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పాలకులను పట్టి పీడిస్తున్నది. ఏపీ విషాదానికి అద్దం పడుతున్న పంజాబ్ పంజాబ్ పరిణామాలూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పేరిట నిర్వహి స్తున్న తంతూ ఇందుకు తాజా ఉదాహరణలు. పంజాబ్లోని మన్యా జిల్లాకు చెందిన మల్సింగ్వాలా అనే గ్రామం కేంద్రంగా ప్రారంభమైన కార్పొరేట్ వ్యవసాయం దేశవ్యాప్తంగా (ఆంధ్రప్రదేశ్ సహా) వ్యవసాయ రంగంలో రానున్న విష పరిణామాలకు సూచిక. ఈ గ్రామ పంచాయతీ కార్పొరేట్లకు (అగ్రీ బిజినెస్) అప్పగించే ముందు చేసిన తీర్మానం రేపటి వ్యవసాయ భార తం అనుభవించనున్న ఫలితాలకు అద్దం పడుతోంది. ఒకే ఒక చోట గంప గుత్తగా 100 ఎకరాల చొప్పున తమ వాణిజ్య వ్యవసాయ కార్యకలాపాలకు భూములను తమకు అప్పగిస్తే ‘ఇంత’ని నిర్ణీత డబ్బు ఇస్తామని ఆగ్రో బిజి నెస్ వ్యవస్థలు చెప్పాయి. ఆ పంచాయతీ ‘గ్రామాన్నే కార్పొరేట్లకు కౌలు కిచ్చేస్తాం’ అని రుణ బాధల కారణంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా ‘ఎదురు కాళ్లు’ (రివర్స్ టెనెన్సీ) ఒక వ్యవస్థగా వ్యవసాయంలో రూపుదిద్దు కుంటోందని పంజాబ్ వ్యవసాయ విద్యాలయం సర్వే నివేదిక వెల్లడించింది. ఇది కూడా రేపటి పరిణామాలకు హెచ్చరిక. వ్యవసాయ క్షేత్ర (పొలం) పరి మాణాలు కూడా మారిపోతున్నాయి. సంపన్న రైతులకు సన్నకారు, పేద రైతులు తమ భూముల్ని కౌలుకి ఇచ్చుకుంటున్నారు. రివర్స్ గేర్లో కౌళ్లు అంటే ఇదే. సాధారణంగా మోతుబరులే చిన్న రైతులకు భూములను కౌలుకి స్తారు. ఆ పరిస్థితిని ఆగ్రో-బిజినెస్ కార్పొరేట్లు తారుమారు చేస్తున్నాయి, ప్రభుత్వాల ప్రోత్సాహంతో. సంప్రదాయ బడా రైతు వ్యవసాయేతర వ్యాపా రాల్లోకి విస్తరిస్తున్నాడు. ఇదెలా జరుగుతుందంటే, కొత్తగా అవతరిస్తున్న బడా రైతు, రుణ భారం నుంచి తేరుకోలేని సామాన్య రైతుల నుంచి భూము లను ముదరాగా గుంజేసుకోవడం ద్వారా లేదా నష్టాలతో వ్యవసాయంపై భ్రమలు కోల్పోతున్న రైతుల నుంచి భూముల్ని కొనేసుకోవడం ద్వారా అని వ్యవసాయ విద్యాలయం నిర్వహించిన సర్వే స్పష్టంగా వెల్లడించింది. నిజానికి ఆగ్రో-బిజినెస్లో ఉన్న కంపెనీలు తాముగా వ్యవసాయం చేయటం లేదు. మరి ఏం చేస్తున్నాయి? ‘మీరు ఆహార పంటలు మానేసి వాణిజ్య పం టలు వేసుకోమ’ని రైతులకు సలహాలిస్తున్నాయి! పెట్రోలియం తవ్వకాలలో ఉన్న అంతర్జాతీయ గుత్త వ్యాపార సంస్థలకు గోరు చిక్కుళ్ల జిగురు (క్లస్టర్ బీన్స్) అవసరం గనుక ఆహార పంట మాని, ఆ పంట వేసుకోమంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఆహార పంటలకు గిరాకీ ఉండదు. ఈ మళ్లింపు ఎలా జరుగు తోంది? ఎవరు కారకులు? వాజపేయి (బీజేపీ) ప్రధానిగా పదవిలోకి రాగానే అమెరికా కనుసన్నల్లో మెసలే ప్రపంచ బ్యాంకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆ నమ్మలేని నిజాలు చూడండి: లాభాలు తెచ్చిపెట్టలేని పంటల్ని తగ్గించి పారేయండి. ఎగుమతులకు అనుకూలమైన పంటల్నే ఉత్పత్తి చేయండి; ఆ మేరకు ఆహార ధాన్యా లను విదేశాల నుంచి దిగుమతి చేయండి. భారతీయ వ్యవసాయం విదేశాలలోని వ్యవసాయంతో పోటీ పడాలి.ఎరువులు, నీటి పారుదలకు, విత్తనాలకు ఇచ్చే రుణాలు సబ్సిడీలను తగ్గించేయండి, క్రమంగా వీటిని ఎత్తివేయండి.దేశీయ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపైన ఆంక్షలు వద్దు.విదేశీ వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ఎలాంటి ఆంక్షలూ ఉండటా నికి వీల్లేదు.ధాన్యం, గోధుమ, బియ్యం కొనుగోళ్లు, రవాణా, గిడ్డంగులలో భద్రప రిచే బాధ్యతల నుంచి భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)ను తొలగిం చేయాలి!! ఈ వినాశకర కార్యక్రమంతోనే ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా లాంటి ధాన్యాగారాలను ఆహార పంటల నుంచి దూరం చేసిన ప్రపంచ బ్యాంకు ‘మీకు డాలర్లు కావాలి కాబట్టి, ఆహార పంటలు మానుకుని పండ్లు వగైరా వాణిజ్య పంటలపై దృష్టి కేంద్రీకరించండి. గోధుమలు మేం సరఫరా చేస్తాం. మనుషులు నాజూగ్గా ఉండాలంటే గోధుమలనే తినండి’’ - ‘ఈట్ వీట్’ అనే బోర్డులు తగిలించి మూడేళ్లలో ఆ దేశాలని అమెరికా, బ్యాంకు కలసి శంకర గిరి మాన్యాలు పట్టించాయని మరవొద్దు. కొన్ని దశాబ్దాల నాడే ఆచార్య వినోబా భావే - ‘అమెరికా గోధుమలతో పాటే అమెరికా బుద్ధులూ దిగుమతి అయ్యాయి’ అని చెప్పిన సంగతిని గుర్తు చేసుకోవాలి. (వ్యాసకర్త మొబైల్: 9848318414) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
యూహెచ్సీల పగ్గాలు కార్పొరేట్లకు
♦ 14 ఏళ్లు ‘ఎ’ గ్రేడ్లో ఉన్న సెంటర్లకు తాజాగా ‘సి’ గ్రేడ్ ♦ ఖర్చు నుంచి తప్పించు కునేందుకు సర్కార్ కుట్ర ♦ ఎన్యూహెచ్ఎంతో పుష్కలంగా నిధులు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఆధీనంలోని అర్బన్ హెల్త్ సెంటర్లను (యూహెచ్సీ) కార్పొరేట్లకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్నుతోంది. ఇందులో భాగంగా హెల్త్ సెంటర్ల పనితీరుపై ఇటీవలే సర్వే నిర్వహించి ‘సి’ గ్రేడ్ ఇచ్చింది. పధ్నాలుగేళ్లపాటు ‘ఎ’ గ్రేడ్లో పనిచేసిన సెంటర్లు ఒక్కసారిగా ‘సి’ గ్రేడ్కు పడిపోవడం వెనుక సర్కార్ గూడుపుఠాణీ దాగుం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్ పరిధిలో 22 యూహెచ్సీలు పనిచేస్తున్నాయి. ఏడాదిన్నర క్రితమే ఐదు సెంటర్లను నేషనల్ రూరల్ హెల్త్కేర్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం)కు అప్పగించారు. ఈ సెంటర్లకు మందులు, వైద్యులు, ఉద్యోగులకు జీతాలు ఎన్ఆర్హెచ్ఎం ద్వారా మంజూరవుతున్నాయి. మిగిలిన 17 సెంటర్లను నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (ఎన్యుహెచ్ఎం)కు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం చొప్పున నిధులు సమకూర్చాలనేది ఒప్పందం. ఈ నెల నుంచే ఈ విధానం అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ జాప్యం చోటుచేసుకుంది. తప్పించుకునేందుకే.. అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా తాను భరించాల్సిన 25 శాతం వాటా నుంచి తప్పించుకోవాలన్నది సర్కార్ ఎత్తుగడ. ఈ మేరకు కొన్ని కార్పొరేట్ సంస్థలతో చర్చలు సాగించినట్లు సమాచారం. స్వచ్ఛంద సేవ ముసుగులో కార్పొరేట్లకు పెత్త నం అప్పగిస్తే పేదలకు ఏ మేరకు వైద్యసేవలు అందుతాయన్న ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి. గడిచిన పదిహేనేళ్లుగా ఎన్జీవోల భాగస్వామ్యంతో నడుస్తున్న అర్బన్ హెల్త్సెంటర్లు పేద వర్గాలకు వైద్యసేవల్ని అందిస్తున్నాయి. విద్య, వైద్య రంగాల్లో హవా కొనసాగిస్తున్న కార్పొరేట్ సంస్థలు అర్బన్ హెల్త్ సెంటర్లలో బడుగు వర్గాలకు ఏ మేరకు వైద్య సేవలు అందిస్తాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలంకారప్రాయమేనా? ఎన్యూహెచ్ఎంలో భాగంగా సిటీ అర్బన్ హెల్త్ సొసైటీని ఏర్పాటు చేశారు. చైర్మన్గా మేయర్, కన్వీనర్గా కమిషనర్, ఎంపీ, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. డిప్యూటీ డెరైక్టర్ స్థాయి అధికారిని ప్రాజెక్ట్ ఆఫీసర్గా నియమించారు. వైద్యులు, ఏఎన్ఎంల నియామకాలను ఈ కమిటీయే పర్యవేక్షించాల్సి ఉంటుంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ పదవులు అలంకారప్రాయమయ్యే ప్రమాదం లేకపోలేదు. నిధులుండీ లాభం లేదు.. నగరంలో ప్రతి 6 వేల మందికి ఒక ఏఎన్ఎం ఉండాల్సి ఉండగా 20 వేల మందికి ఒకరు సేవలందిస్తున్నారు. కేదారేశ్వరపేట, మధురానగర్, పటమట, కండ్రిక, వాంబేకాలనీ, రాణీగారి తోట, లంబాడీపేట, వించ్పేట హెల్త్సెంటర్లలో ఆయుర్వేదిక్, లబ్బీపేట సెంటర్లో హోమియో వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.11 వేల జీతానికి ఎంబీబీఎస్లు ముందుకు రాకపోవడంతో వీరితోనే నెట్టుకొస్తున్నారు. ఎన్యుహెచ్ఎం ఆధీనంలోకి వెళితే ఏఎన్ఎంలకు చెల్లిస్తున్న రూ.5 వేల జీతం రూ. 12 వేలకు చేరుతోంది. అలాగే వైద్యులకు రూ.30 వేల పైబడి జీతం అందే అవకాశం ఉంది. టెక్నీషియన్స్, హెల్త్ విజిటర్స్, రెండు సెంటర్లకు ఒక స్టాఫ్నర్సు, నెలకు మందుల కొనుగోళ్లకు లక్ష రూపాయలు చొప్పున మంజూరవుతాయని నగరపాలక సంస్థ మెడికల్ ఆఫీసర్ ఇక్బాల్ హుస్సేన్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ లెక్కన అర్బన్ హెల్త్ సెంటర్ల పూర్తి స్వరూపమే మారుతుంది. -
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కార్పొరేట్లు
ఆ దిశగా ముందుకు వెళుతున్నామన్న సింగపూర్ మంత్రి 7 అభివృద్ధి కారిడార్లకు ప్రణాళిక వాటి నిర్మాణంలోనూ సింగపూర్ వ్యాపార దిగ్గజాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో సింగపూర్కు చెందిన కార్పొరేట్ కంపెనీలు రంగప్రవేశం చేయనున్నాయి. ఆయా కంపెనీలు రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం వివిధ ప్రాజెక్టులు చేపట్టబోతున్నాయి. సింగపూర్కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ మధ్యవర్తిగా వ్యవహరించి తయారు చేయించిన మొదటి విడత ప్రణాళికను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందజేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన రెండు దశల ప్రణాళికలు పూర్తయిన అనంతరం కార్పొరేట్ దిగ్గజాలు రంగంలోకి దిగనున్నాయి. ఈ విషయాన్ని మార్చి 30న సింగపూర్లో మాస్టర్ప్లాన్ అందజేసిన సమయంలో ఆదేశ వాణిజ్య శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ స్పష్టం చేశారు. రాజధానికి సంబంధించి మిగిలిన రెండు ప్రాజెక్టులు (రెండు దశల ప్రణాళికలు) నిర్దేశించిన సమయంలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని, సింగపూర్ కంపెనీలకు అవకాశం లభించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి ముందుకు వెళుతున్నామని ఆ సందర్భంగా ఈశ్వరన్ పేర్కొన్నారు. దాన్ని బట్టి రానున్న రోజుల్లో రాజధాని కోసం చేపట్టే ప్రాజెక్టుల్లో సింగపూర్ కార్పొరేట్ దిగ్గజాలు రంగంలోకి వస్తాయన్న విషయం రూఢీ అవుతోంది. ఇది ఇలావుండగా, రాజధాని మాస్టర్ ప్లాన్ను సింగపూర్ కార్పొరేట్ సంస్థలు తయారు చేశాయి. అయితే మాస్టర్ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం రూపొందించి అందజేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ (ఐఈ-సింగపూర్) సంస్థ మాస్టర్ప్లాన్ తయారు చేయలేదు. ఆ మాస్టర్ప్లాన్ తయారు చేసే బాధ్యతను సింగపూర్లోని మరో రెండు కార్పొరేట్ సంస్థలకు ఐఈ అప్పగించింది. సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్, జురాంగ్ కన్సల్టెంట్స్ల ద్వారా ఈ మాస్టర్ప్లాన్ తయారు చేయించినట్టు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్వయంగా తెలియజేశారు. ఈ సంస్థలే సమీప భవిష్యత్తులో రాజధానిలో రంగ ప్రవేశం చేయనున్నాయని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. కారిడార్లలోనూ కాలు పెట్టనున్న కంపెనీలు పలు రంగాలకు చెందిన ఏడు అభివృద్ధి కారిడార్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అభివృద్ధి కారిడార్లు ఏర్పాటయ్యే ప్రాంతాలు, రంగాలను మాస్టర్ప్లాన్లో నిర్దేశించారు. ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారన్న వివరాలను ‘సాక్షి’ సేకరించింది. నూతన రాజధానిలో మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వైపు రెండు అభివృద్ధి కారిడార్లను నెలకొల్పుతారు. వాటిల్లో నందిగామ కారిడార్లో ఫార్మా, బయోటెక్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ రంగాలను అభివృద్ధి చేస్తారు. గుడివాడ కారిడార్లో హరిత పరిశ్రమలు, అక్వా కల్చర్ రంగాలను అభివృద్ధి చేస్తారు. అలాగే విశాఖ నుంచి చెన్నై వైపు మరో రెండు కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. దీనిలో గన్నవరం కారిడార్లో ఐటీ, ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్స్/హార్డ్వేర్, ఆటోమోటివ్, ఏరోస్పేస్ రంగాలను అభివృద్ధి చేస్తారు. గుంటూరు కారిడార్లో ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్స్, టెక్స్టైల్స్, నాన్ మెటాలిక్స్ ఉత్పత్తుల రంగాలను అభివృద్ధి చేస్తారు. ఇక తెనాలి కారిడార్లో లాజిస్టిక్స్, టూరిజం, ఎంటర్టైన్మెంట్ రంగాలను, సత్తెనపల్లి కారిడార్లో టూరిజం, నాలెడ్జ్ సెంటర్ను అభివృద్ధి చేస్తారు. నూజివీడు కారిడార్లో వ్యవసాయ అధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తారు. వీటిలోనూ విదేశీ కార్పొరేట్ సంస్థలే రంగప్రవేశం చేస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలిక లీజుపై భూముల కేటాయింపు నూజివీడు, గుడివాడ, తెనాలి, సత్తెనపల్లి, నందిగామ, గుంటూరు చుట్టుపక్కల, తాడేపల్లి ప్రాంతాలను పట్టణాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు భూములను 99 ఏళ్ల లీజు విధానంలో కేటాయించనున్నారు. రాజధాని చుట్టూ హైస్పీడు రైలు మార్గాన్ని నెలకొల్పనున్నారు. విశాఖ నుంచి చెన్నై మధ్య హైస్పీడ్ రైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. గుంటూరు-తెనాలి-గన్నవరం-నందిగామలను కలుపుతూ రీజినల్ ఎక్స్ప్రెస్ వే ఏర్పాటు చేస్తారు. మచిలీపట్నం-చిలకలూరిపేట-నరసరావుపేట-సత్తెనపల్లి-నందిగామ-ఏలూరుల మీదుగా ఔటర్ రీజినల్ ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నారు. -
యాదాద్రికి కార్పొరేట్ల దన్ను!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదగిరిగుట్ట అభివృద్ధికి బడా కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయా? రాష్ట్రంలోనే అత్యద్భుత ఆధ్మాత్మిక కేంద్రంగా యాదాద్రిని తీర్చిదిద్దాలనుకుంటున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుకు సహకరించేందుకు టాటా, అంబానీలు సిద్ధమయ్యారా? అవుననే సమాధానమిస్తున్నాయి రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు. శ్రీలక్ష్మీ నారసింహుడు కొలువైన పుణ్యక్షేత్రం సమగ్రాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలు కూడా పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కార్యక్రమం కింద యాదాద్రిపై సౌకర్యాల కల్పనకు దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేసేందుకు రిలయన్స్, టాటా కంపెనీలు ముందుకొచ్చినట్లు సమాచారం. కొండ చుట్టూ, కొండపైనా భారీ మార్పుచేర్పులకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. కల్యాణ మంటపాలు, వేద పాఠశాలలు, అభయారణ్యం, వసతి సముదాయాలు వంటి వాటి నిర్మాణానికి సుమారు రూ. వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీంతో ఇందులో సగం మేర నిధులు అందించేందుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకు వస్తుండటం విశేషం. సీఎం చెప్పిన విధంగానే.... గుట్ట అభివృద్ధికి పెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని సీఎం కేసీఆర్ కూడా ఇటీవల చెప్పారు. చినజీయర్ స్వామితో కలసి ఈ నెల 5న గుట్టకు వచ్చిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించినట్లు తెలిసింది. ‘గుట్టలో దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా, రిలయన్స్ లాంటి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. గుట్ట అభివృద్ధి విషయంలో నిధుల కోసం ఆలోచించాల్సిన పనిలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారని, గుట్ట అభివృద్ధికి భూ సేకరణ కూడా పూర్తయిన నేపథ్యంలో పనులు వేగంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం రెండు వేల ఎకరాల స్థల సేకరణ కూడా పూర్తయింది. అందులో వెయ్యి ఎకరాలకుపైగా భూమిని ఇప్పటికే గుట్ట డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించారు. ఇక రాయగిరిలో దిల్ సంస్థకు ఇచ్చిన భూమికి పక్కనే(ఇప్పుడు ఆ భూమిని కూడా గుట్ట అభివృద్ధి కోసం కేటాయించారు) మరో 300 ఎకరాలకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. దీన్ని కూడా గుట్ట అథారిటీకి కేటాయించారని, ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం సీసీఎల్ఏ వద్ద ఉందని అధికారులు చెబుతున్నారు. పుణ్యం.. పురుషార్థం యాదగిరిగుట్టలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అటు దైవకార్యంలో పాలుపంచుకోవడంతోపాటు కేంద్ర నిబంధనల మేరకు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)నూ నెరవేర్చినట్లు అవుతుందనే బడా సంస్థలు ముందుకు వస్తున్నట్లు గుట్ట అధికారులు చెబుతున్నారు. ‘వాస్తవానికి టాటా, రిలయన్స్ లాంటి కంపెనీలకు రూ. 500 కోట్ల నిధులు పెద్ద విషయమేమీ కాదు. సీఎస్ఆర్ నిబంధన ప్రకారం రూ. 100 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్న కంపెనీలు.. అందులో రెండు శాతం మేర నిధులను సామాజిక బాధ్యత కింద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది’ అని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే నిధులను గుట్ట కింద అభివృద్ధి కోసమే వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. యాదగిరికొండపై ఉన్న 14.5 ఎకరాల భూమి లో 6 ఎకరాల స్థలంలో ప్రధానాలయం ఉంది. అలాగే పాత గుట్టతోపాటు గోశాల, నవగిరుల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 156 ఎకరాలు ప్రస్తుతం దేవాదాయ శాఖ పరి ధిలో ఉంది. ఈ భూమిలో కార్పొరేట్ కంపెనీ లు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవని, ఈ ప్రాంతంలో అభివృద్ధి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుట్ట కింద నిర్మించే కాటేజీలు, లక్ష్మీనృసింహ అభయారణ్యం, పార్కులు, పార్కింగ్ సౌకర్యం వంటి వాటికి కార్పొరేట్ నిధులను వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే కంపెనీలే కాటేజీలను నిర్మిస్తే వాటి నిర్వహణ బాధ్యతను కూడా వాటికే అప్పగిం చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే గుట్ట పరిసరాల అభివృద్ధి, ఖరీదైన హోటళ్లు, గుట్టకు రహదారి సౌకర్యాల కల్పన, ఇప్పటికే ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడం, మోనోరైలు ఏర్పాటు వంటి వాటికి కూడా ఈ నిధులను వెచ్చించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
కార్పొరేట్ల ‘రుణం తీర్చుకునే’ బడ్జెట్: సోనియా
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కారు తొలిసారి పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో మద్దతిచ్చిన బడా కార్పొరేట్ల ‘రుణం తీర్చుకునేలా’ (ధన్వాపసీ) ప్రభుత్వం బడ్జెట్ను కార్పొరేట్లకు అనుకూలంగా రూపొందించిందని దుయ్యబట్టారు. లోక్సభలో కాంగ్రెస్పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్లు కూడా ఈ బడ్జెట్ను ‘ధన్వాపసీ’ కార్యక్రమంగా అభివర్ణించారు. ప్రభుత్వ ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ వాటి సాధనకు అవసరమైన ‘రోడ్మ్యాప్’ బడ్జెట్లో కొరవడిందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ విమర్శించారు. బిహార్కు ప్రత్యేక ఆర్థిక సాయం, ఎయిమ్స్ తరహా వైద్య సంస్థను ప్రకటించినందుకు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. -
'కార్పోరేట్ సంస్థలను రక్షించాలనే రహస్య ఎజెండా'
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని భారత్ కు తెప్పించడానికి ఎలాంటి చర్యల్ని తీసుకుంటుందో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సీపీఎం సీతారాం ఏచూరి అన్నారు. కేవలం నల్ల కుబేరుల పేర్లను వెల్లడించడమే కాకుండా.. నల్ల ధనాన్ని భారత్ తెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీకి అండగా నిలిచిన కార్పోరేట్ సంస్థలను రక్షించాలనే రహస్య ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని బీజేపీ హామీ చేసిందని, అయితే మళ్లీ ఈ అంశాన్ని సుప్రీం కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకెళ్తోందని సీతారాం ఏచూరి ప్రశ్నించారు. నల్ల కుబేరుల జాబితాను బుధవారం ఉదయం సుప్రీం కోర్టుకు కేంద్రం సమర్పించిన సంగతి తెలిపిందే. -
ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు
- ఎంపీ ఫండ్ నుంచి రూ.25 లక్షలు - కార్పొరేటర్లతో ఎంపీ కవిత సమావేశం నిజామాబాద్ అర్బన్ : ఇందూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ కల్వకుంట్ల కవిత కార్పొరేటర్లకు సూచించారు. శుక్రవారం తన నివాసంలో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ.. నగరంలో చైన్స్నాచింగ్లు జరుగుతున్నాయని, వీటి నివారణకు ఇతర వాటికి కూడా ఉపయోగపడేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు ముఖ్యమన్నారు. కార్పొరేటర్లు తమ డివిజన్లలో ప్రధాన కూడళ్లను గుర్తిం చి సీసీ కెమెరాల ఏర్పాటుకు కార్పొరేషన్కు ప్రతి పాదనలు ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సం బంధించి జిల్లా ఎస్పీతో మాట్లాడుతానని ఎంపీ పేర్కొన్నారు. ఈ ఏర్పాటుకు ఎంపీ ఫండ్ కింద రూ. 25 నుంచి సుమారు రూ.50 లక్షల వరకు నిధులు అం దిస్తానని అన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి సం బంధించి కృషి చేయాలన్నారు. మాస్టర్ ప్లాన్ రూ పొం దించి నగర అభివృద్ధికి పాటుపడాలన్నారు. వీధి దీపా ల ఏర్పాటు, ప్రధాన కూడళ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి సీఎం ఫండ్ నుంచి అధిక నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయాల న్నారు. సమావేశంలో మేయర్ ఆకుల సుజాత ,కార్పొరేటర్లు విశాలినిరెడ్డి, సూదం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సైనికులకు ఉద్యోగాలివ్వండి
న్యూఢిల్లీ: మాజీ సైనికోద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కార్పొరేట్ సంస్థలను కోరారు. ‘సుశిక్షితులైన, క్రమశిక్షణ కలిగిన సిబ్బంది కార్పొరేట్ సంస్థలకు అవసరం. అలాంటి వారు మాజీ సైనికుల్లో విరివిగా లభిస్తారు. విధి నిర్వహణలో వారి నిబద్ధత శిఖరసమానమైనది. అత్యంత క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహించిన ఘనత వారిది...’ అని తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన మాజీ సైనికోద్యోగుల పునరావాస సదస్సులో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల నిర్వహణలో మాజీ సైనికులను వినియోగించవచ్చని సూచించారు. ప్రతి ఏటా సుమారు 60 వేల మంది సాయుధ బలగాల సిబ్బంది పదవీ విరమణ తీసుకుంటారనీ, వీరిలో 44 శాతం మంది 40-50 ఏళ్లు, 33 శాతం మంది 35-40 ఏళ్ల వారేననీ తెలిపారు. మరో 12 శాతం మంది 30-35 ఏళ్ల ప్రాయంలో రిటైర్ అవుతుంటారని చెప్పారు. కాగా, ఎక్స్ సర్వీస్మెన్కు ఉద్యోగాలు కల్పించేందుకు భారతీయ పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ), సైన్యం ఈ సదస్సు సందర్భంగా సంయుక్తంగా కృషిచేస్తాయి. -
సాహసోపేత సంస్కరణలకు చాన్స్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఎన్డీయేకి స్పష్టమైన ఆధిక్యం రావడాన్ని కార్పొరేట్లు స్వాగతించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా విధానపరంగా సాహసోపేతమైన, నిర్ణయాత్మకమైన సంస్కరణలు చేపట్టగలరని ధీమా వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, అధిక పెట్టుబడులను ఆకర్షించేందుకు, తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకునేలా ఈ స్పష్టమైన మెజార్టీ తోడ్పాటు అందించగలదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా పేర్కొన్నారు. మరోవైపు, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు మెజార్టీ ఉపయోగపడగలదని అసోచాం ప్రెసిడెంట్ రాణా కపూర్ తెలిపారు. రాబోయే 18-24 నెలల్లో ఎకానమీ నిలకడైన 10% వృద్ధి సాధించడానికి ఆస్కారం ఏర్పడినట్లయిందని ఆయన చెప్పారు. అటు వెల్స్పన్ రెన్యూవబుల్స్ ఎనర్జీ వైస్ చైర్మన్ వినీత్ మిట్టల్ .. ఇది ప్రజా విజయం అని వ్యాఖ్యానించారు. రియల్టీకి ఊతం..: కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం వల్ల ప్రాపర్టీ మార్కెట్లు మళ్లీ కళకళ్లాడగలవని రియల్టీ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. నివాస గృహాలు, ఆఫీస్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరగగలదని అభిప్రాయపడ్డాయి. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి గానీ పెరిగిన పక్షంలో ముందుగా లాభపడేది రియల్ ఎస్టేట్ రంగమేనని సీబీ్రఆ దక్షిణాసియా సీఎండీ అన్షుమన్ మ్యాగజైన్ చెప్పారు. గుజరాత్లో సుపరిపాలన అందించిన మోడీపై తమకు భారీ అంచనాలు ఉన్నాయని, రియల్టీ మార్కెట్లో సెంటిమెంటు గణనీయంగా మెరుగుపడగలదని రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్ చైర్మన్ లలిత్ జైన్ చెప్పారు. విధాన చర్యలు కావాలి: ఇన్ఫ్రా సంస్థలు మౌలికం తదితర ప్రధాన రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఎన్డీయే ప్రభుత్వం విధానపరమైన చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని ఇన్ఫ్రా పరిశ్రమ కోరింది. చైనా స్థాయిలో ఎదగాలంటే కొత్త ఆర్థిక మంత్రిగా ఎవరు వచ్చినా సరే.. దేశం వేగవంతమైన వృద్ధి సాధించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేపీఎంజీ ఇండియా డిప్యుటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దినేష్ కనబార్ తెలిపారు. రహదారులు, విద్యుత్ మొదలైన రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పన్ను చట్టాలపై అస్పష్టతను తొలగించడం, జీఎస్టీని అమల్లోకి తేవడం, ద్రవ్యోల్బణ కట్టడికి చర్యలు తీసుకోవడం మొదలైనవి కొత్త ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యతలు కావాలి. - చందా కొచ్చర్, ఎండీ, ఐసీఐసీఐ బ్యాంక్ నూతన ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలి. ద్రవ్యోల్బణం .. ద్రవ్య లోటు కట్టడి, ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మెరుగుపర్చే చర్యలు తీసుకోవడం ముఖ్యం. - కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్ మరింత మంది ప్రముఖుల అభిప్రాయాలు ఇవీ.. కొత్త ప్రభుత్వం.. వైద్య, ఆరోగ్య రంగంపై వ్యయాలను గణనీయంగా పెంచాలి. అందరికీ వైద్యం అందించే దిశగా తగిన ప్రణాళికను రూపొందించాలి. అలాగే, ప్రత్యక్ష పన్నుల కోడ్, జీఎస్టీని అర్జెంటుగా అమల్లోకి తేవాల్సిన అవసరం ఉంది. - ప్రతాప్ రెడ్డి, చైర్మన్, అపోలో హాస్పిటల్స్ స్పష్టమైన ఆధిక్యం లభించడంతో దేశ ప్రజలకు, పరిశ్రమకు మేలు చేసే ఆర్థిక విధానాలను కొత్త ప్రభుత్వం అమలు చేయడానికి ఆస్కారం లభించింది. అధిక వృద్ధి సాధించేందుకు ఇది అనువైన వాతావరణాన్ని కల్పించగలదు. - జీవీకే రెడ్డి, సీఎండీ, జీవీకే పవర్ గుజరాత్లో మంచి పాలన అందించిన అనుభవం మోడీకి ఉంది. ఆయన నాయకత్వంపై ప్రజలు నమ్మకం ఉంచారు. ఈ ఎన్నికల ఫలితాలు.. రాజకీయ స్థిరత్వానికి, అధిక వృద్ధికి, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి దోహదపడగలవు. - శ్రీచంద్ హిందుజా, చైర్మన్, హిందుజా గ్రూప్ సోషల్ మీడియా పాత్ర కీలకం ధనం, అసంబద్ధమైన హామీలు వంటి వాటికి లొంగకుండా అభివృద్ధి కోసం ఓటు వేసిన వారందరికీ అభినందనలు. ఈ ఎన్నికల్లో యువత సోషల్ మీడియా ద్వారా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన మోడీ, చంద్రబాబు, చంద్ర శేఖర్లకు అభినందనలు తెలపడమే కాకుండా అభివృద్ధి పరంగా ఆయా ప్రాంతాలను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం ఉంది. - డాక్టర్. బీవీఆర్ మోహన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సైయంట్ -
కార్పొరేట్లకు బ్యాంకు లెసైన్సులొద్దు: స్థాయీ సంఘం
న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థలకు కొత్త బ్యాంకు లెసైన్సులు ఇచ్చే అంశాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం వ్యతిరేకించింది. దీని వల్ల బ్యాంకింగ్ రంగ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశముందని అభిప్రాయపడింది. ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని, భారత్ ఇందుకు మినహాయింపు కాదని స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది. మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత యశ్వంత్ సిన్హా సారథ్యంలోని స్థాయి సంఘం(ఆర్థిక) ఈ నివేదికను రూపొందించింది. లెసైన్స్ల విషయంలో ఆర్బీఐకి ఇచ్చిన విచక్షణాధి కారాలవల్ల ఏకపక్షంగా దరఖాస్తులను ఆమో దం/తిరస్కరణ అధికారం లభిస్తుందనేది సభ్యుల వాదన. కొత్త బ్యాంక్ లెసైన్సులను జారీ చేసేందుకు 2001 నాటి మార్గదర్శకాలే ప్రాతిపదికగా ఉండాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. -
12.5% పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (2013-14, ఏప్రిల్-సెప్టెంబర్ 17 వరకూ) 12.5 శాతం పెరిగాయి. రూ.2,38,325 కోట్లుగా నమోదయ్యాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లలో వృద్ధి దీనికి ప్రధాన కారణం. వేర్వేరుగా చూస్తే- కార్పొరేట్ పన్ను వసూళ్లు 7.97% వృద్ధితో రూ.1,46,610 కోట్లుగా నమోదయ్యాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 21.08 శాతం ఎగసి రూ.89,006 కోట్లుగా నమోదయ్యాయి. ఇక సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) వసూళ్లు రూ.2,210 కోట్లుగా ఉన్నాయి. సంపద పన్ను వసూళ్లు రూ. 309 కోట్లు. సెప్టెంబర్ క్వార్టర్లో నికర ముందస్తు పన్ను వసూళ్లు 9.14% వృద్ధితో రూ.1,14,320 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను వసూళ్లు (7.97 శాతం వృద్ధి) రూ.1,03,374 కోట్లుకాగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (24% వృద్ధి) రూ. 10,946 కోట్లు.