-
దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాయ్
న్యూఢిల్లీ: కార్పొరేట్ ప్రపంచం దేశాభివృద్ధి లక్ష్యాలతో మమేకం అవుతుందన్న విశ్వాసమున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించడంలో భాగస్వాములవుతాయని తెలియజేశారు. వెరసి శత వసంత స్వాతంత్య్ర దినోత్సవ (2047) సమయానికల్లా వికసిత్ భారత్గా ఆవిర్భవించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాలకు అత్యుత్తమ భారత్ను అందించే బాటలో ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ను సాధించేందుకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్ ః 2047: వికసిత్ భారత్– ఇండస్ట్రీ’ పేరుతో ఫిక్కీ నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. 2047కల్లా లక్ష్యాలను సాధించడంలో పారిశ్రామిక రంగం పాత్ర కీలకమన్నారు. -
Ayodhya Ram mandir: కార్పొరేట్ల జై శ్రీరామ్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర ప్రారంభ వేడుకల్లో కార్పొరేట్ సంస్థలు కూడా సందడిగా పాల్గొంటున్నాయి. కార్యక్రమాన్ని మలీ్టప్లెక్సుల్లో లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలుకుని లాభాల్లో కొంత వాటాను అయోధ్యలో ప్రసాద వితరణ కోసం విరాళాలు ఇవ్వడం వరకు వివిధ రకాలుగా పాలు పంచుకుంటున్నాయి. వినియోగ ఉత్పత్తులను తయారు చేసే పలు కంపెనీలు పెద్ద సంఖ్యలో హోర్డింగ్లు, గేట్ బ్రాండింగ్, షాప్ బోర్డులు, కియోస్్కలు మొదలైనవి ఏర్పాటు చేసి, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నేడు (జనవరి 22న) రామ మందిర ప్రారంభ వేడుకలను 70 నగరాల్లోని 160 స్క్రీన్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మలీ్టప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది. జనవరి 17 నుంచి జనవరి 31 వరకు తమ ఉత్పత్తుల విక్రయాలపై వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా ఇవ్వనున్నట్లు డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. భక్తుల రాకతో అయోధ్యలో నిత్యావసరాలకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో తమ ఉత్పత్తుల సరఫరాను డాబర్ మరింతగా పెంచింది. వెయ్యేళ్లైనా చెక్కుచెదరని నిర్మాణం: ఎల్అండ్టీ శ్రీ రామ మందిరాన్ని వెయ్యేళ్లైనా చెక్కు చెదరనంత పటిష్టంగా నిర్మించామని దిగ్గజ నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో సీఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఈ విషయంలో కేంద్రం, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తదితర వర్గాలు అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదొక ఆలయంగా మాత్రమే కాకుండా ఇంజినీరింగ్ అద్భుతంగా కూడా నిలి్చపోతుందని కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ ఎంవీ సతీష్ పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు.. ► ఐటీసీలో భాగమైన మంగళదీప్ అగరబత్తీ బ్రాండ్ ఆరు నెలల పాటు ధూపాన్ని విరాళంగా అందించింది. అలాగే ‘రామ్ కీ ఫేడీ’ వద్ద రెండు అగరబత్తీ స్టాండ్లను ఏర్పాటు చేసింది. నదీ ఘాట్లలో పూజా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పూజారులకు వేదికలను, మార్కెట్లో నీడకు గొడుగులు మొదలైనవి నెలకొలి్పంది. భారీ భక్త సందోహాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రధాన ఆలయం దగ్గర 300 బ్యారికేడ్లు, ఆలయ ముఖ ద్వారం దగ్గర 100 పైచిలుకు బాకేడ్లను కూడా ఐటీసీ అందిస్తోంది. ► అయోధ్యలో ఎలక్ట్రిక్ ఆటోల సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ తెలిపింది. త్వరలో ఉబెర్గో, ఇంటర్సిటీ ఉబెర్ సేవలను కూడా అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. ► రామ మందిరంలో లైటింగ్ ఉత్పత్తుల సరఫరా, ఇన్స్టాలేషన్ పనులను నిర్వహించడం తమకు గర్వకారణమని హ్యావెల్స్ తెలిపింది. ► తాము భారత్లో ఎన్నో ప్రాజెక్టులు చేసినప్పటికీ రామ మందిరం వాటన్నింటిలోకెల్లా విశిష్టమైనదని యూఏఈకి చెందిన ఆర్ఏకే సెరామిక్స్ అభివరి్ణంచింది. కొత్త ఆభరణాల కలెక్షన్లు.. సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ‘సియారామ్’ పేరిట, కల్యాణ్ జ్యుయలర్స్ ‘నిమహ్’ పేరిట హెరిటేజ్ జ్యుయలరీ కలెక్షన్ను ఆవిష్కరించాయి. మందిర వైభవాన్ని, సీతారాముల పట్టాభిõÙక ఘట్టాన్ని అవిష్కృతం చేసేలా డిజైన్లను తీర్చిదిద్దినట్లు సెన్కో గోల్డ్ ఎండీ సేన్ తెలిపారు. సుసంపన్న వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్స్తో నిమహ్ కలెక్షన్ను రూపొందించినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఈడీ రమేష్ కల్యాణరామన్ పేర్కొన్నారు. -
India Corporates: Sector Trends 2024: ఆర్థిక వృద్ధితో కార్పొరేట్లకు అవకాశాలు
కోల్కతా: భారత బలమైన ఆర్ధిక వృద్ధి కార్పొరేట్ కంపెనీలకు డిమాండ్ను పెంచుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ‘ఇండియా కార్పొరేట్స్: సెక్టార్ ట్రెండ్స్ 2024’ పేరుతో నివేదికను విడుదల చేసింది. పెరుగుతున్న డిమాండ్, అదే సమయంలో ముడి సరుకుల ధరల ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడం అన్నవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల మార్జిన్లను పెంచుతాయని తెలిపింది. స్థానికంగా బలమైన డిమాండ్ నేపథ్యంలో 2024–25లో జీడీపీ 6.5 శాతం వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్ధిక వ్యవస్థగా ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన వాతావరణం, ఇటీవలి ద్రవ్య పరపతి కఠినతర విధానాలున్నప్పటికీ, భారత ఆర్ధిక వ్యవస్థ బలమైన పనితీరు కొనసాగుతుందని అంచనా వేసింది. సిమెంట్, ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొంది. మౌలిక సదుపాయాల మెరుగుదల సైతం స్టీల్ డిమాండ్కు ఊతంగా నిలుస్తుందని తెలిపింది. యూఎస్, యూరోజోన్లో వృద్ధి తగ్గిపోవడంతో భారత ఐటీ కంపెనీలు మోస్తరు వృద్ధికి పరిమితం కావాల్సి వస్తుందని పేర్కొంది. వాహన విక్రయాలు కంపెనీల ఆదాయాలను పెంచుతాయని తెలిపింది. -
కార్పొరేట్ సునామీ!
బోర్డు రూం కుట్రలు, కార్పొరేట్ దిగ్గజ సంస్థలు చేతులు మారడం వగైరాలు ప్రపంచానికి కొత్త కాదు. కానీ చాట్జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐలో పుట్టుకొచ్చిన సునామీ అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. చిత్రమేమంటే... ఏం జరిగిందో అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే అనేక మలుపులు తిరిగి అది కాస్తా చప్పున చల్లారింది. ఈ మొత్తం వ్యవహారమంతా కేవలం అయిదంటే అయిదే రోజుల్లో పూర్తయింది. డైరెక్టర్ల బోర్డు బయటకు నెట్టేసిన వ్యక్తే దర్జాగా వెనక్కి రావటం, బోర్డు సభ్యులతో సహా కంపెనీలో ఎవరినైనా తొలగించే అధికారం చేజిక్కించుకోవటం, ఆయన్ను బయటికి పంపినవారే చివరకు పదవులు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడటం ఈ వివా దానికి కొసమెరుపు. కేవలం నలుగురు డైరెక్టర్లకు వ్యతిరేకంగా 95 శాతంమంది సిబ్బంది తిరగ బడటం, తామంతా రాజీనామా చేస్తామమని హెచ్చరించటం, వారితో ఇన్వెస్టర్లు సైతం చేతులు కలపటం కనీవినీ ఎరుగనిది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అద్భుతాలు సృష్టించగల ఉపకరణాలను సృష్టించటమే ధ్యేయంగా శామ్యూల్ ఆల్ట్మాన్ 2015లో స్టార్టప్ కంపెనీ ఓపెన్ ఏఐ స్థాపించాడు. మరో నాలుగేళ్లకు మైక్రోసాఫ్ట్, ట్విటర్ సహా కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులూ అందులో పాలుపంచుకున్నారు. దాని పరిశోధనలు స్వల్ప కాలంలోనే అద్భుత ఆవిష్కరణలకు దారితీసి ఓపెన్ ఏఐ సిలికాన్ వ్యాలీలో 8,000 కోట్ల డాలర్ల దిగ్గజ సంస్థగా ఆవిర్భవించింది. అది ఏడాదిక్రితం తీసుకొచ్చిన చాట్జీపీటీ స్మార్ట్ ఫోన్ తర్వాత అంతటి గొప్ప ఆవిష్కరణగా గుర్తింపుపొందింది. అంతేకాదు, అది మున్ముందు మానవాళి మనుగడకు సైతం ముప్పుగా పరిణమించవచ్చన్న భయాందోళనలూ బయల్దేరాయి. దాన్ని అదుపు చేసేందుకు ఎలాంటి చట్టాలు అవసరమో ప్రపంచ దేశాధి నేతలంతా చర్చించుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్, యూరొపియన్ యూనియన్లు ఇప్పటికే చట్టాలు చేశాయి. మన దేశం కూడా ఆ పనిలోనే వుంది. కృత్రిమ మేధతో దేశదేశాల పౌరుల గోప్య తకూ, ముఖ్యంగా మహిళల, పిల్లల భద్రతకూ రాగల ముప్పు గురించిన భయసందేహాలు అంతటా ఆవరించాయి. రక్షణ రంగ వ్యవస్థల్లోకి, మరీ ముఖ్యంగా సైనిక స్థావరాల్లోకి ఇది ప్రవేశిస్తే రెప్ప పాటులో భూగోళం బూడిదగా మారుతుందన్న హెచ్చరికలు వస్తూనే వున్నాయి. సురక్షితమైన కృత్రిమ మేధ మాత్రమే ప్రపంచానికి అవసరమంటూ అల్ట్రూయిజం వంటి టెక్ ఉద్యమాలూ బయల్దేరాయి. ఈ నేపథ్యంలో అసలు ఓపెన్ ఏఐలో ఏం జరిగిందన్న ఆసక్తి, ఆత్రుత వుండటం సర్వసాధారణం. విషాదమేమంటే సంస్థ ఎగ్జిక్యూటివ్గా వున్న శామ్ ఆల్ట్మాన్కూ, డైరెక్టర్ల బోర్డుకూ మధ్య ఏర్పడ్డ లడాయి ఏమిటన్నది వెల్లడికాలేదు. ఆల్ట్మాన్ దేన్నీ సూటిగా, స్పష్టంగా చెప్పటం లేదని ఇప్పుడు నిష్క్రమించిన డైరెక్టర్లు ఆరోపించారు. ఆయన దేన్ని దాచటానికి ప్రయత్నించాడో, ఏ విషయంలో వారికి స్పష్టత రావటంలేదో వివరించలేదు. సరిగ్గా ఇదే కీలకమైనది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న భయాందోళనలకూ, ఈ వివాదానికీ సంబంధం వుండే అవకాశం లేకపోలేదని కొందరి విశ్లేషణ. కృత్రిమ మేధతో పరిశోధనలు సాగిస్తున్నది ఓపెన్ ఏఐ మాత్రమే కాదు... దాంతోపాటు అమెరికాలోనే ఆంత్రోపిక్, స్కేల్ ఏఐ, విజ్.ఏఐ, డీప్ 6 వంటి 50 సంస్థ లున్నాయి. ఇవిగాక మన దేశంతోపాటు అనేక దేశాల్లో పలు సంస్థలు కృత్రిమ మేధపై పని చేస్తున్నాయి. ఎలాంటి నిబంధనలూ, నియంత్రణలూ లేని వర్తమాన పరిస్థితుల్లో ఆర్నెల్లపాటు కృత్రిమ మేధ పరిశోధనలపై మారటోరియం విధించాలని టెక్ నిపుణులు కొందరు ఆమధ్య సూచించారు. కృత్రిమ మేధలో పరిశోధనలు చేస్తున్న ఎలిజార్ యుడ్కోవ్స్కీ ఈ టెక్నాలజీ తెలివి తేటల్లో మనుషుల్ని మించిపోతుందని, చివరకు వారినే మింగేస్తుందని, చివరకు మనమంతా నియాండర్తల్ యుగానికి తిరోగమించటం ఖాయమని జోస్యం చెప్పాడు. అయితే కృత్రిమ మేధతో రాగల ప్రమాదాల గురించి కొందరు అతిగా మాట్లాడుతున్నారన్న విమర్శలూ వున్నాయి. మానవాళికి ముప్పు తెచ్చే అగ్ని పర్వతాలు, గ్రహశకలాలు, అణ్వాయుధా లకన్నా అదేమీ పెద్ద ప్రమాదకారి కాదని వారి వాదన. భయాందోళనల మాటెలావున్నా దాని శక్తి సామర్థ్యాలు, ఉపయోగాలు కాదనలేనివి. రెండువేల ఏళ్లనాడు వర్ధిల్లిన పురాతన లిపుల్లో ఏం నిక్షిప్తమైవున్నదో వెలికితీసింది కృత్రిమ మేధ ఆధారంగా అందుబాటులోకి వచ్చిన ఉపకరణాలే. చరిత్రలో తొలికాలపు గ్రీకులు రాసినదేమిటో అర్థం చేసుకోవటానికి మూడువేల యేళ్లు పట్టింది. మయన్లు లిఖించిన పదాల కూర్పులోని రహస్యమేమిటో తెలుసుకోవటానికి రెండు శతాబ్దాలు పట్టింది. కానీ ఏఐ అలాంటి సంక్లిష్టమైన లిపులను క్షణాల్లో తేటతెల్లం చేస్తోంది. అందువల్ల ప్రాచీన మానవుల జీవన విధానంపై మన అవగాహన పెరిగింది. ఇక వైద్యపరంగా కృత్రిమ మేధ సాధిస్తున్నది అపారం. శామ్ ఆల్ట్మాన్కు గురు సమానుడు స్టీవ్ జాబ్స్. మరొకరితో కలిసి ఆయన నెలకొల్పిన యాపిల్ సంస్థకు ఏరికోరి సీఈఓగా తెచ్చుకున్న వ్యక్తే 1985లో ఆ సంస్థనుంచి స్టీవ్ జాబ్స్ను వెళ్ల గొట్టడం, తదనంతర పరిణామాల్లో జాబ్స్ తిరిగి అదే సంస్థకు రావటం చరిత్ర. ఇప్పుడు ఆల్ట్ మాన్కు కూడా అదే జరిగింది. ఏదేమైనా ఓపెన్ఏఐలో జరిగిందేమిటో, పరిశోధనల దశ, దిశ ఎలా వున్నాయో తెలుసుకోవటం ప్రపంచ ప్రజానీకం హక్కు. అది తేటతెల్లం చేయాల్సిన బాధ్యత సంస్థ లపై వుంది. కేవలం మానవాళి మంచికి మాత్రమే ఉపయోగపడేలా, ప్రభుత్వాలతో సహా ఎవరూ ఏఐని దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైన నియంత్రణలు విధించటం తక్షణావసరం. -
చంద్రయాన్పై కార్పొరేట్ల హర్షం.. ఎవరేమన్నారంటే..
చంద్రయాన్–3 విజయవంతం కావడంపై పలువురు కార్పొరేట్లు హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్ టీమ్ను ప్రశంసించారు. గర్వకారణం... ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం. భారత అంతరిక్ష, సాంకేతిక ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ప్రధాని నరేంద్ర మోదీకి, ఇస్రో బృందానికి శుభాభినందనలు. రాబోయే తరాలకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. – ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్ సామర్థ్యానికి నిదర్శనం ఇస్రో, భారత సైంటిస్టులు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. అంతరిక్ష పరిశోధనలో భారతదేశ సామర్థ్యాలకు ఈ విజయం ఒక నిదర్శనం. ఈ అపూర్వ ఘట్టంలో భాగం కావడం మాకెంతో గర్వకారణం. – ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఎల్అండ్టీ సీఈవో జాబిల్లి చేతికి అందింది మానవ జాతి ఆరంభం నుంచి చంద్రుడిని చూస్తూ కలలు కంటూనే ఉంది. చందమామ తన మాయా జాలంతో మనల్ని స్వాప్నికులుగా మార్చింది. నేడు ఆ మాయ, సైన్స్ కలిసి జాబిల్లిని మన చేతికి అందించాయి. – ఆనంద్ మహీంద్రా, పారిశ్రామిక దిగ్గజం చారిత్రక క్షణం ఇస్రో బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం. అంతరిక్ష పరిశోధనలను విజయవంతంగా అమలు చేయగలగడం దేశానికి తన సామర్థ్యాలపై గల నమ్మకానికి నిదర్శనం. ఇది 140 కోట్ల మంది భారతీయులకు చారిత్రక క్షణం. – గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ చైర్మన్ అద్భుత ఘట్టం భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఇది మరో అద్భుత ఘట్టం.. మన అంతరిక్ష పరిశ్రమ సామర్థ్యాలకు నిదర్శనం. మూడు దశాబ్దాలుగా భారతీయ స్పేస్ ప్రోగ్రామ్తో అనుబంధం కలిగి ఉండటం మాకు గర్వకారణం. – పర్వత్ శ్రీనివాస్ రెడ్డి, ఎంటార్ టెక్నాలజీస్ ఎండీ ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement