న్యూఢిల్లీ: ప్రస్తుత, భవిష్యత్ వ్యాపార పరిస్థితులపై కార్పొరేట్లలో విశ్వాసం గణనీయంగా క్షీణించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటుకన్నా ముందు స్థాయికి తగ్గిపోయింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల్లో ప్రస్తుతం నెలకొన్న సెంటిమెంట్ ఆధారంగా డాయిష్ బార్స్ నిర్వహించే ఎంఎన్ఐ ఇండియా బిజినెస్ సెంటిమెంట్ ఇండికేటర్ దీనికి నిదర్శనం. ఏప్రిల్ 63.9గా ఉన్న సూచీ మే లో 2.5 శాతం తగ్గి 62.3కి తగ్గిపోయింది. గతేడాది ఏప్రిల్ నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయని ఎంఎన్ఐ ఇండికేటర్స్ చీఫ్ ఎకానమిస్ట్ ఫిలిప్ యుగ్లో తెలిపారు.
ఇటు ఉత్పత్తి, అటు ఆర్డర్లు తగ్గడం వల్లే వ్యాపార కార్యకలాపాలు తగ్గాయని ఆయన వివరించారు. మేలో ఉత్పత్తి దాదాపు రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా ప్రాజెక్టు క్షేత్ర స్థాయిలో అంతగా ముందుకెళ్లడం లేదని ఈ సర్వే ద్వారా తెలుస్తోందని యుగ్లో పేర్కొన్నారు. సర్వే ప్రకారం కంపెనీలకొచ్చే దేశీ, విదేశీ ఆర్డర్లు తగ్గాయి. కొత్త ఆర్డర్లకు సంబంధించిన సూచీ 57.1కి తగ్గింది. మే 2013 తర్వాత ఇదే కనిష్ట స్థాయి.
ఇక ఎగుమతుల ఆర్డర్లు 2013 జూన్ తర్వాత కనిష్టం 53.6కి తగ్గాయి. డిమాండ్ బలహీనంగా ఉండటం, పోటీ పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఒక మోస్తరు స్థాయిలోనే ఉన్నాయని సర్వే నివేదిక పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది రెండు సార్లు కీలక పాలసీ రేట్లలో కోత విధించినప్పటికీ ఆ ప్రయోజనాల ప్రభా వం పరిమితంగానే ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో జూన్ 2న జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నట్లు యుగ్లో తెలిపారు.
సన్నగిల్లిన వ్యాపార విశ్వాసం
Published Thu, May 28 2015 1:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పూజలు
బుధవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2024
నిండు వేసవిలో..
విద్యార్థులు పట్టుదలతో చదవాలి
అకాలవర్షం.. అమ్ముకోకుండా చేస్తోంది
ప్రజాస్వామ్యంలో ఓటు విలువైంది..
అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక పూజలు
Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
అలర్ట్గా ఉన్నాం..
ఆరోగ్యశ్రీతో ఆసుపత్రి మరింత అభివృద్ధి
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement