Care Hospital
-
మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్?.. కేర్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెదక్ నర్సాపూర్కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పటివరకు వైద్య ఖర్చులు కోసం పేషెంట్ బంధువులు రూ.5 లక్షలు చెల్లించారు.నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న వెంకటేష్ తెల్లారేసరికే మృతిచెందారు. విషయం చెప్పకుండా మరో రూ.4 లక్షలు చెల్లించాలని వైద్యులు తెలిపారు. అనుమానంతో ఐసీయూలోకి దూసుకెళ్లిన బంధువులు.. వెంకటేష్ మృతిచెంది ఉండటంతో కోపోద్రిక్తులయ్యారు. మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేశారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. -
Cardiovascular Disease: కోలుకున్న క్లిష్టమైన సమస్యల రోగి
తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి అద్భుతమైన రీతిలో ఆరోగ్యవంతుడయ్యాడు. క్లిష్టమైన హృద్రోగ సమస్యతో పాటు శరీరంలోని పలు అవయవాల ఆరోగ్యం నశించి విషమ స్థితిలో బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరిన ప్రవాస భారతీయునికి ఆస్పత్రి వైద్యులు అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి, మూడు నెలల పాటు శ్రమించి రోగిని ఆరోగ్యవంతుడిని చేశారు. కేర్ ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు వివరాలు వెల్లడించారు. భారత సంతతికి చెందిన భాస్కర్ పొనుగంటి (43) ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఇతను కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస ఆడక పోవడంతో పాటు తీవ్రమైన హద్రోగ సమస్యతో దాదాపు మూడు నెలల క్రితం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో భాస్కర్ చేరారు. రోగికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆ రోగి ‘ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్‘ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల రోగికి మూత్రపిండాల వైఫల్యం, ఎడమవైపు పక్షవాతం కలిగించే మెదడు పోటు బ్రెయిన్ స్ట్రోక్ కలిగి రోగి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న ఆ రోగి వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ అత్యవసర శస్త్ర చికిత్స చేయడమే సరైన మార్గమని ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్, కార్డియాలజీ విభాగాధిపతి డా. వి.సూర్యప్రకాశరావు నేతత్వంలోని వైద్య బందం నిర్ధారించింది. క్లిష్టమైన శస్త్ర చికిత్సను (హై రిస్క్ సర్జరీ) నిర్వహించి రోగిని సాధారణ స్థాయికి తీసుకొచ్చారు. సీనియర్ కార్డియోథొరాసిక్, హార్ట్ ట్రా ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డా. నగేష్ ఆధ్వర్యంలో వైద్య బందం ‘మెకానికల్ వాల్వ్‘ వైద్యవిధానం ద్వారా రోగి బహద్దమని కవాట మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. దీంతో రోగి ఆరోగ్యం కుదుటపడింది. తరువాత రోగి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో రోగిని మెడికల్ ఐసీయూలో ఉంచి.. ఆస్పత్రి అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, క్రిటికల్ కేర్ విభాగాధిపతి డా. జి.భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య సాయం అందించారు. న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఇంటెన్సివిటీ, కార్డియాక్ విభాగాలు.. సమన్వయంతో నిరంతర పర్యవేక్షణలో కఠినమైన ఫిజియోథెరపీతో కూడిన బహుళ వైద్య చికిత్స విధానాలను రోగికి అందించాయి. అధునాతన వైద్య సంరక్షణతో ఏం సాధించవచ్చో ఈ కేసు ద్వారా వైద్య బందం నిరూపించిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. -
బ్లాక్స్టోన్ చేతికి కేర్ హాస్పిటల్స్ - వివరాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ తాజాగా హైదరాబాద్కు చెందిన కేర్ హాస్పిటల్స్లో మెజారిటీ వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. టీపీజీ రైజ్ఫండ్స్లో భాగమైన ఎవర్కేర్ హెల్త్ ఫండ్ నుంచి 72.5 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు మొత్తం మీద 700 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5,827 కోట్లు) వెచ్చిస్తున్నట్లు వివరించింది. ఈ లావాదేవీ కోసం కేర్ హాస్పిటల్స్ సంస్థ విలువను రూ. 6,600 కోట్లుగా లెక్కగట్టారు. మరోవైపు, కేరళకు చెందిన కిమ్స్హెల్త్ సంస్థలో కేర్ హాస్పిటల్స్, టీపీజీ 80 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ కింద బ్లాక్స్టోన్ 300 మిలియన్ డాలర్లు, టీపీజీ 100 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు వివరించాయి. దీంతో బ్లాక్స్టోన్ దేశీయంగా ఆరోగ్య సేవల విభాగంలోకి ప్రవేశించినట్లవుతుంది. ఈ రెండు డీల్స్ ద్వారా మొత్తం 1 బిలియన్ డాలర్ల పైచిలుకు ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. సంయుక్త నెట్వర్క్లో టీపీజీ చెప్పుకోతగ్గ స్థాయిలో వాటాలున్న మైనారిటీ షేర్హోల్డరుగా ఉంటుంది. భారత హెల్త్కేర్ సర్వీసుల రంగంలో తొలిసారిగా పెట్టుబడులు పెట్టడం, దేశీయంగా అతి పెద్ద హెల్త్కేర్ నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు టీపీజీతో జట్టు కట్టడం తమకు సంతోషకరమైన అంశాలని బ్లాక్స్టోన్ ఎండీ గణేష్ మణి తెలిపారు. భారీ హాస్పిటల్స్ నెట్వర్క్లో ఒకటిగా.. కేర్ హాస్పిటల్స్కు హైదరాబాద్, వైజాగ్తో పాటు ఔరంగాబాద్, నాగ్పూర్ తదితర నగరాల్లో ఆస్పత్రులు ఉన్నాయి. కిమ్స్ హెల్త్కేర్ మేనేజ్మెంట్ సంస్థ .. కేరళలోనే అతి పెద్ద ప్రైవేట్ హెల్త్కేర్ ప్రొవైడర్గా ఉంది. కిమ్స్హెల్త్ చేరికతో దేశీయంగా భారీ హాస్పిటల్స్ చెయిన్లో ఒకటిగా కేర్ హాస్పిటల్స్ నెట్వర్క్ ఆవిర్భవించనుంది. ఈ సంయుక్త నెట్వర్క్కు 11 నగరాల్లో 23 ఆస్పత్రులు, 4,000 పైచిలుకు పడకలు ఉంటాయి. ప్రస్తుతం కిమ్స్హెల్త్కు నేతృత్వం వహిస్తున్న ఎంఐ సహాదుల్లా ఇకపైనా దాని సారథ్య బాధ్యతల్లో కొనసాగుతారు. -
‘అరుణ తార’కు అంతిమ వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్/చిక్కడపల్లి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యానికి పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు అంతిమ వీడ్కోలు పలికారు. శనివారం రాత్రి ఆమె హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం విదితమే. స్వరాజ్యం పార్థివ దేహాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు నల్లగొండలోని సీపీఎం కార్యాలయా నికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. సీపీఎం కేంద్ర, రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు స్థానిక మర్రిగూడ బైపాస్ రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీగా నిర్వహిం చారు. సీపీఎం కేంద్ర పొలిట్బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ, బీవీ రాఘవులు, రాష్ట్ర నేతలు తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, జి నాగయ్య, మాజీ ఎంపీ మధు, నంద్యాల నర్సింహ్మారెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి నివాళులర్పించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్, సీపీఎం జిల్లా నాయకులు, కాంగ్రెస్ నేతలు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్రెడ్డి తదితరులు మల్లు స్వరాజ్యం పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి నల్లగొండ మెడికల్ కళాశాల వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ‘స్వరాజ్యం అమర్రహే’, ‘జోహార్ మల్లు స్వరాజ్యం’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాలు హోరెత్తాయి. అనంతరం మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించారు. మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మల్లు లక్ష్మి, జ్యోతి, సీతారాములు, వెంకట్, జూలకంటి, నారాయణ, చాడ, సుభాషిణి అలీ, రాఘవులు, తమ్మినేని, మధు తదితరులు ఎంబీ భవన్లో నేతల నివాళి... అంతకుముందు... ఆదివారం ఉదయం ఆరుగంటలకు హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రి నుంచి సీపీఎం రాష్ట్ర కార్యాలయం మాకినేని బసవపున్నయ్య భవన్కు స్వరాజ్యం భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. భౌతికకాయంపై పార్టీ నేతలు, కుమారుడు మల్లు నాగార్జునరెడ్డి, కోడలు మల్లు లక్ష్మి ఎర్రజెండాను కప్పారు. కొడుకు మల్లు గౌతంరెడ్డి, కూతురు పాదూరి కరుణ, మనవళ్లు, మనవరాళు, ఆమె సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెను కడసారి చూసేందుకు సీపీఎం కార్యకర్తలతోపాటు వివిధ వామపక్ష, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, బంధువులు, అభిమానులు భారీగా ఎంబీ భవన్కు తరలివచ్చి, నివాళుర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ముఠాగోపాల్, సీపీఎం నేతలు డి.జి. నరసింహారావు, టి.జ్యోతి, ఏపీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ నేతలు కె నారాయణ, చాడ, పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ. వీఎస్ బోస్, కందిమళ్ల ప్రతాప్రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, వివిధ వామపక్ష పార్టీల నేతలు, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్, బీజేపీ నాయకుడు స్వామిగౌడ్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని మోస్తున్న మహిళా నాయకులు ఆమె పోరాటం అందరికీ ఆదర్శం తెలంగాణ సాయుధ పోరాటంలో వెన్ను చూపని వీరవనిత మల్లు స్వరాజ్యం. ఆమె జీవితం, పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం. పీడిత ప్రజలు, మహిళల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. పార్టీకీ, ప్రజలకు ఆమె లేని లోటు తీరనిది. –సుభాషిణి అలీ, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు పోరాటం స్వరాజ్యం ఊపిరి పోరాటమే స్వరాజ్యం ఊపిరి. తుదిశ్వాస వరకు పోరుబాట వదల్లేదు. ఆమె పోరాట పటిమ ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఆ స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి. – బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు మహిళలను చైతన్యం చేసిన వ్యక్తి 80 ఏళ్ల పాటు వెన్ను చూపకుండా పోరాటం చేసిన ధీర మల్లు స్వరాజ్యం. ఆమె చూపిన బాటలో నడిచి, ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక శకం ముగిసింది ‘మల్లు స్వరాజ్యం మరణంతో ఒక శకం ముగిసినట్టుగా ఉన్నది. తెలంగాణ సమాజానికే ఆమె స్పూర్తి. నిజాం ప్రభుత్వం ఆమెపై రివార్డు ప్రకటించడమంటే ఎంత గొప్ప పోరాటం చేశారో అర్థమవుతున్నది. రెండోదశ తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో ఆమె కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నాం.’ – కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ -
మల్లు స్వరాజ్యంను పరామర్శించిన కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కమ్యూనిస్టు నేత మల్లు స్వరాజ్యంను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన వైద్యులను వాకబు చేశారు. కిషన్రెడ్డితో పాటు నగరానికి చెందిన పలువురు బీజేపీ నేతలున్నారు. -
రజకాభివృద్ధి సంస్థ వ్యవస్థాపకుడు అంజయ్య కన్నుమూత
కవాడిగూడ: టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రజకాభివృద్ధి సంస్థ జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ ఎం.అంజయ్య (78) గుండెపోటుతో కన్నుముశారు. తీవ్ర అస్వస్థతకు గురైన డాక్టర్ ఎం. అంజయ్య బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఒంగోలు జిల్లాకు చెందిన డాక్టర్ ఎం.అంజయ్య రజకాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి ఉమ్మడి ఏపీలో అనేక కార్యక్రమాలను చేపట్టారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్తో దేశవ్యాప్త ఉద్యమం చేసి అసెంబ్లీలో తీర్మానానికి ఒత్తిడి తెచ్చారు. రజకాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో పాటు, నిరుపేద రజకులకు ఇళ్లనిర్మాణం, దోబిఘాట్ల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్గా నియమితులయ్యారు. ఆలిండియా సాయిసే వా సమాజ్ అధ్యక్షులుగా కొనసాగుతూ లోయర్ ట్యాంక్బండ్ ద్వారకా నగర్లో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. అంజ య్య మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు పలు బీసీ, రజక సంఘాల నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అనంతరం బన్సీలాల్పేట హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. -
హీరో బాలకృష్ణకు సర్జరీ
నందమూరి హీరో బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు. ఆయన కుడి భుజం నొప్పి తీవ్రం కావడంతో బాలయ్య కేర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ క్రమంలో వైద్యులు ఆయన కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు కేర్ ఆసుపత్రి వైద్యులు ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని కూడా వైద్యులు స్పష్టం చేశారు. చదవండి: ఎవడు బ్రో నీకు చెప్పింది.. ఓ వెబ్సైట్పై రానా అసహనం పునీత్ను అలా చూసి బాలయ్య కంటతడి..వీడియో వైరల్ -
‘దిశ’ పోలీసు క్షతగాత్రుల రిపోర్టుల్లేవు!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్కౌంటర్లో క్షతగాత్రులైన పోలీస్ కానిస్టేబుల్ ఏ అరవింద్గౌడ్కు గచ్చబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స చేసిన కన్సల్టెంట్ ఆర్థోపెడిషన్ సర్జన్ డాక్టర్ రాజేశ్ రచ్చను వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ శుక్రవారం విచారించింది. కమిషన్ తరఫున న్యాయవాది విరూపాక్ష దత్తాత్రేయగౌడ్ పలు ప్రశ్నలను సంధించారు. అరవింద్ చికిత్స ఫైనల్ రిపోర్ట్లన్నీ విచారణ అధికారికి ఒరిజినల్స్తో సహా సమర్పించామని, తమ వద్ద ఎలాంటి పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లు లేవని రాజేశ్ వాంగ్మూలం ఇచ్చారు. చదవండి: ఐసీయూలో 3 రోజులు.. ఇచ్చింది పారాసెటమాల్ మెడికో లీగల్ కేస్(ఎంఎల్సీ)లో కూడా సీటీ స్కాన్ కాపీలు ఆసుపత్రి వద్ద ఉండవని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ గచ్చిబౌలి ఆసుపత్రిలో 2019, డిసెంబర్ 6న ఉదయం 10:18 గంటలకు బెడ్ నంబర్ 11 కేటాయిస్తూ అడ్మిట్ చేసుకున్నట్లు ఓపీ రికార్డ్లో ఉంది. కానీ, షాద్నగర్ ఇన్స్పెక్టర్ నుంచి ‘వైద్యం సమాచార లేఖ’ మాత్రం 2019, డిసెంబర్ 7న మధ్యాహ్నం 12 గంటలకు చేరింది. ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించగా.. తెలియదని సమాధానమిచ్చారు. అతనికి ఐసీయూలో చికిత్స చేయాల్సినంత గాయాలేవీ కాలేదని చెప్పారు. చదవండి: ఊరికి వెళ్తుండగా విషాదం.. కారు పల్టీలు కొట్టి.. డిశ్చార్జి సమ్మరీలో ఎక్స్రే గురించి ఎందుకు రాయలేదని ప్రశ్నిచగా.. అందులో పేషెంట్ చికిత్స తాలూకు అన్ని వివరాలను నమోదు చేయమని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో మరణించిన చెన్నకేశవులు ఎడమ చేతిలో లభ్యమైన కాటన్ స్వాబ్ను పరీక్షిస్తే నెగెటివ్ వచ్చిందని హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బాలిస్టిక్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వీ వెంకటేశ్వర్లు.. కమిషన్ ముందు వాం గ్మూలం ఇచ్చారు. న్యూఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీబీఐ) బాలిస్టిక్ రిటైర్డ్ డైరెక్టర్ అండ్ హెచ్ఓడీ ఎన్బీ బర్ధన్ను కూడా కమిషన్ విచారించింది. కాగా, సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
ఐసీయూలో 3 రోజులు.. ఇచ్చింది పారాసెటమాల్
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్కౌంటర్ ఘటనలో గాయపడిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, అరవింద్గౌడ్లకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స చేసిన కన్సల్టెంట్ న్యూరోసర్జన్ పి.విశ్వక్సేన్రెడ్డిని సిర్పుర్కర్ కమిషన్ గురువారం విచారించింది. కమిషన్ తరఫున న్యాయవాది విరూపాక్ష దత్తాత్రేయగౌడ్ ఆయనను ప్రశ్నించారు. 2019 డిసెంబర్ 6న ఉదయం 8 గంటలకు కేర్ ఆస్పత్రికి వచ్చినప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు స్పృహలోనే ఉన్నారని విశ్వక్సేన్రెడ్డి వివరించారు. కుడి కను బొమ్మపై 2 సెంటీమీటర్ల పొడవు గాయమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు.. ఆస్పత్రి అత్యవసర సేవల విభాగంలో పారాసెటమాల్ ఇచ్చామని, కడుపులోని మంటను తగ్గించే పాంటోప్, ఐవీ ఫ్లూయిడ్స్తో చికిత్స చేశామని కమిషన్కు తెలిపారు. ఇవి తప్ప వేరే ఏ రకమైన చికిత్స చేయలేదని, దీనిని రికార్డ్లోనూ నమోదు చేశామని వివరించారు. నొప్పి, వాపును తగ్గించే వోవెరాన్, టీటీ ఇంజెక్షన్లను కానిస్టేబుల్ బయటే ఇప్పించుకున్నారని, కేర్ ఆస్పత్రిలో ఇవ్వలేదని తెలిపారు. గాయం 2 సెంటీమీటర్లు ఉన్నట్టుగా ఎలా లెక్కించారని కమిషన్ ప్రశ్నించగా.. గాయాన్ని కొలిచే ఉపకరణం (క్యాలిబర్) తన వద్ద లేదని, కేవలం ఓ అంచనాతోనే చెప్పానని, దాన్నే రికార్డ్లో నమోదు చేశానని సమాధానమిచ్చారు. ‘సంచలనం సృష్టించిన లేదా మెడికో లీగల్ (ఎంఎల్సీ) కేసుల్లో డిశ్చార్జి సమ్మరీలో క్షతగాత్రుల గాయాల గురించి స్పష్టంగా రాయాల్సి ఉంటుందని.. మరి మీరెందుకు నమోదు చేయలేద’ని జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ ప్రశ్నించగా.. ప్రస్తుతం సమాధానం చెప్పలేనంటూ డాక్టర్ విశ్వక్సేన్రెడ్డి దాటవేశారు. అంతర్గతంగా రక్తస్రావమైతేనే వ్యక్తి మరణిస్తారని, వేరే ఇతర సందర్భాల్లో అలా జరగదని చెప్పిన విశ్వక్సేన్.. కేర్ ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లకు అలాంటి తీవ్ర గాయాలేవీ లేవని, సాధారణ గాయాలే ఉన్నాయని వివరించారు. షాద్నగర్ సీహెచ్సీ రికార్డ్లో కానిస్టేబుల్ స్పృహ కోల్పోయారని ఉందని, అందువల్లే ఐసీయూలో అడ్మిట్ చేశామని, అంతే తప్ప చికిత్సలో ఆ రికార్డులను అనుసరించలేదని చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన రోజే ఉదయం 8:30 గంటలకు ఐసీయూలో చేర్చుకున్నామని.. మూడు రోజుల పాటు చికిత్స అందించామని తెలిపారు. ఫోన్లో చెప్తే రికార్డ్లో నమోదు మంగళవారం షాద్నగర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ (సీహెచ్సీ) సర్జన్ గోనె నవీన్ కుమార్ విచారణ అసంపూర్తిగా ముగియగా.. గురువారం ఉదయం తిరిగి కొనసాగించారు. కేర్ ఆస్పత్రి నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లకు సంబంధించిన డిశ్చార్జి సమ్మరీని ఎవరూ తన వద్దకు తీసుకురాలేదని.. ఎవరో ఫోన్లో చెబితే ఎంఎల్సీ రికార్డ్లో నమోదు చేశానని నవీన్కుమార్ తెలిపారు. డిశ్చార్జి సమ్మరీలో క్షతగాత్రులకు ఎక్స్రే తీసినట్టు లేదని.. కానీ డాక్టర్స్ నోట్లో మాత్రం ఉందేమిటని ప్రశ్నించగా.. ‘డాక్టర్స్ నోట్ను ఇప్పుడే తొలిసారి చూస్తున్నా’నని నవీన్ సమాధానమిచ్చారు. కేర్ ఆస్పత్రి రికార్డుల్లో అరవింద్గౌడ్కు ఎడమ భుజం మీద సన్నని వెంట్రుకలాంటి చీలిక ఏర్పడి ఉందని, దాన్ని మీరెందుకు షాద్నగర్ ఎంఎల్సీ రికార్డ్లో నమోదు చేయలేదని ప్రశ్నించగా.. డాక్టర్ నవీన్ సమాధానం ఇవ్వకుండా 15 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారు. ఎన్కౌంటర్లో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు నడుచుకుంటూ షాద్నగర్ సీహెచ్సీకి వచ్చారని నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ముందు వాంగ్మూలం ఇచ్చిన నవీన్ కుమార్.. త్రిసభ్య కమిటీ ముందు మాత్రం స్పృహ కోల్పోయి వచ్చారని తెలిపారు. పైగా ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను కేర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనలేదు. దీనిపై కమిషన్ ప్రశ్నించగా.. అన్నింటికీ ‘ఏమీ లేదు’అంటూ సమాధానం ఇచ్చారు. నేడు సజ్జనార్ విచారణ సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను సిర్పుర్కర్ కమిషన్ శుక్రవారం విచారించనుంది. ఈ మేరకు ఆయనకు తాజాగా సమన్లు జారీ చేసింది. వాస్తవానికి ఈనెల 4వ తేదీనే సజ్జనార్ విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు ఇతర సాక్షుల విచారణ సుదీర్ఘంగా కొనసాగడంతో సజ్జనార్ విచారణ వాయిదా పడింది. కమిషన్ మూడు రోజుల పాటు సజ్జనార్ను విచారించనున్నట్టు సమాచారం. -
ఆలస్యం చేయకండి..!
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంపై ఒకవైపు కరోనా వైరస్.. మరోవైపు సీజనల్ వ్యాధులు విశ్వరూపం చూపుతున్నాయి. జ్వరాలపట్ల అలసత్వంగా ఉన్నా, చికిత్సకు ఆలస్యం చేసినా పంజా విసిరి జనాలను ఆగం చేస్తున్నాయి. కరోనాలోనూ, మలేరియా, డెంగీ, టైఫాయిడ్లోనూ జ్వరమే సాధా రణంగా కనిపించే లక్షణం. కరోనా కాలంలో ఎవరిలో? ఏ జ్వరం ఉందో? గుర్తించడం బాధితులకే కాదు.. వైద్యులకూ ఇబ్బందిగా మారింది. చాలామంది కరోనా జ్వరాలను కూడా సాధారణ జ్వరంగా భావించి చికిత్సను నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం టెస్టు కూడా చేయించుకోవడం లేదు. ముఖ్యంగా యాభై ఐదేళ్లు పై బడిన బీపీ, షుగర్, ఆస్తమా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు చికిత్సను నిర్లక్ష్యం చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుం టున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటి పోతుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేక నిస్సహా యతను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మృతి చెందిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుసహా ప్రముఖ గాయకుడు నిస్సార్, బహుజన మేధావి ఉ.సా, ప్రముఖ జర్నలిస్టు పీవీరావుతోపాటు పలువురిలో అక స్మాత్తుగా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో.. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన బాధితుల్లో 40 ఏళ్లలోపువారు 57.1 శాతం మంది ఉండగా, ఆపై వయసు వారు 48.8 శాతం మంది ఉన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలోనూ హైపర్ టెన్షన్, మధుమేహం, ఆస్తమా ఇలా ఏదో ఒక ఇతర అనారోగ్య సమస్య ఉంటుంది. సాధారణ యువకులతో పోలిస్తే వీరిలో రోగనిరోధకశక్తి తక్కువ. వీరిలో చాలామంది తమ పని ప్రదేశాల్లో 35 ఏళ్లలోపు సాధారణ యువకులతో కలిపి పని చేస్తుంటారు. యువకులు అసింప్టమేటిక్గా ఉంటున్నారు. వీరిలో చాలామందికి తమకు వైరస్ సోకిన విషయమే తెలియడం లేదు. వీరంతా తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా, శానిటైజర్ ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. అసింప్టమేటిక్ బాధితుల నుంచి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే 55 ఏళ్లు పైబడినవారికి వైరస్ సోకుతోంది. వీరిలో చాలామంది సాధారణ జ్వరం, జలుబు, దగ్గుగా భావించి టెస్టులు, చికిత్సలను లైట్గా తీసుకుంటున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుండటంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ శాతం పడి పోయి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి వచ్చిన వీరిని కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమిం చాల్సి వస్తోంది. పరిస్థితి విషమించి చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అంతేకాదు, పడకలు, వైద్య సిబ్బంది నిష్పత్తికి మించి బాధితులు వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేయాల్సి వస్తోంది. అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే... సాధారణ ప్రజలతో పోలిస్తే.. వైరస్పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే చికిత్స లను ఎక్కువ నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒంట్లో ఏ చిన్న లక్షణం కన్పించినా చాలామంది వెంటనే అప్రమత్తమైపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వివిధ కషాయాలు తాగుతూ పౌష్టికాహారం తీసుకుంటూ ప్రాణాయామం వంటి యోగాసనాలు చేస్తూ వైరస్ను జయిస్తు న్నారు. కానీ, వైద్యంపై కనీస అవగాహన లేని ఇలాంటివారితో పోలిస్తే.. ఉన్నత చదువులు చదివి, వైరస్పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఇటీవల వెలుగు చూసిన పలు ఘటనలు పరిశీలిస్తే అవగతమవుతుంది. వీరు అతి తెలివిగా ఆలోచించి, చివరకు చిక్కుల్లో పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు మొదలు.. చికిత్స వరకు... ఇలా ప్రతి విషయంలోనూ దాటవేత ధోరణినే అవలం బిస్తూ చివరకు తమ ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వైరస్ను ముందే గుర్తించి అప్రమత్తమైతే... ప్రమాదం నుంచి బయట పడేవారని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్వాసనాళాలపైనే ఎక్కువ ప్రభావం.. ప్రస్తుతం కంటికి కన్పించని ప్రమాదకరమైన కరోనా వైరస్తో పోరాడుతున్నాం. ఇది ఒకరి నుంచి మరొకరికి ముక్కు, కన్ను, చెవి, నోరు వంటి భాగాల ద్వారా ప్రవేశిస్తుంది. ముందు గొంతు, శ్వాసనాళాలు, ఆ తర్వాత గుండె, మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. వృద్ధులు, మధుమేహులు, ఆస్తమా బాధితులపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వైరస్ బారి నుంచి బయటపడొచ్చు. నిర్లక్ష్యం చేయడం ద్వారా వైరస్ శ్వాసనాళాల పనితీరును దెబ్బతీస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. శరీరంలో ఆక్సిజన్ శాతం పడిపోతుంది. ఆకస్మిక గుండెపోటుకు కారణమవుతుంది. ముందుగానే టెస్టు చేయించుకుని, చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. కానీ, చాలామంది ఈ వైరస్ను నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. – డాక్టర్ రఫీ, పల్మనాలజిస్ట్, కేర్ ఆస్పత్రి -
మంత్రి సబితకు స్వల్ప అస్వస్థత
సాక్షి, రంగారెడ్డి : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పిరావడంతో కుమారుడు కార్తిక్రెడ్డి ఆమెను హుటాహుటిన బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆమెను డిశ్చార్జి చేశారు. నగరంలోని శ్రీనగర్కాలనీలో నివాసం ఉంటున్న సబిత గురువారం రాత్రి 10.58 గంటలకు ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఈసీజీ, 2డీ ఎకో తదితర గుండె సంబంధమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అన్ని రిపోర్టులు కూడా నార్మల్ ఉన్నాయని, ఆందోళన అక్కర్లేదని వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలో సబితను పలువురు మంత్రులు పరామర్శించారు. -
అన్ని సేవలను ప్రారంభిస్తున్నాం: కేర్ హాస్పిటల్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించిన కారణంగా ఔట్ పేషంట్ డిపార్ట్మెంట్స్(ఓపీడీ), ఎలిక్టివ్ కేర్ సేవలు సహా అన్ని రకాల వైద్య సేవలను పునః ప్రారంభిస్తున్నట్లు కేర్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. భౌతిక దూరం, రోగులు, ఉద్యోగుల భద్రత వంటి అంటు వ్యాధుల నియంత్రణ మార్గదర్శకాలను విధిగా అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మార్గదర్శకాలను గురించి కేర్ హాస్పిటల్స్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ ఏకే దాస్ మాటాడుతూ.. ‘చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే వారిపట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆస్పత్రిలో సీనియర్ వైద్య సిబ్బంది బృందం, ప్రతి రోజూ పరిస్థితులను సమీక్షించడంతో పాటుగా నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరిస్తారనే భరోసాను పేషెంట్లలో కలిగిస్తాం' అని ఆయన వివరించారు. చదవండి: వారికి క్వారంటైన్ అవసరం లేదు కేర్ హాస్పిటల్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నిఖిల్ మాథుర్ మాట్లాడుతూ.. ‘ఆస్పత్రికి వచ్చే రోగుల ఆరోగ్యం, భద్రత అనేవి మాకు ముఖ్యమైనవి. అంటువ్యాధుల నియంత్రణ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం ద్వారా భద్రతకు, ఆరోగ్యానికి హామీనిస్తున్నామని' ఆయన పేర్కొన్నారు. -
పోయిన ప్రాణాన్ని దాచారు!
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మహిళ చనిపోయినా.. తమకు సకాలంలో తెలియజేయలేదని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే ఆందోళనకు దిగారు. ఈ ఘటన రాంనగర్ కేర్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలి కుమార్తె లీలాకుమారి, సోదరుడు ఎన్.మోహనరావు తెలిపిన వివరాల ప్రకారం.. తాటిశెట్టి కుసుమ (65) ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో నివసిస్తున్నారు. ఇటీవల షుగర్, బీపీ హఠాత్తుగా పెరగడంతో కుసుమను కుటుంబ సభ్యులు రాంనగర్ కేర్ ఆస్పత్రిలో ఈనెల 15న సాయంత్రం 6.30 గంటలకు జాయిన్ చేశారు. అప్పటి నుంచి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా సకాలంలో వైద్యం అందుతున్న కారణంగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకూ అందరితో మాట్లాడింది. బుధవారం ఉదయం సమీప బంధువు కుసుమను చూసేందుకు ఉదయం 10 గంటలకు ఆస్పత్రికి రాగా రోగి నిద్రపోతోందని, ఆమెను కదిలించవద్దంటూ సెక్యూరిటీ సిబ్బంది ఐసీయూలోకి అనుమతించలేదు. అదేవిధంగా రోగి సోదరుడు మోహనరావు హైదరాబాద్ నుంచి వచ్చి ఐసీయూలోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని సెక్యూరిటీ అడ్డుకున్నారు. సాయంత్రం 6 గంటలకు బలవంతంగా లోనికి వెళ్లి చూసేసరికి అప్పటికీ కుసుమ అపస్మారక స్థితిలో ఉంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కుసుమ ఉదయమే చనిపోయి ఉంటుందని, ఈ విషయాన్ని రాత్రి 9.30 గంటల వరకూ దాచిపెట్టారని బంధువులు వాపోయారు. డబ్బులు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ధ రోగుల మీద చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను సెక్యూరిటీ అడ్డుకున్నారు. మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. -
కేర్ ఆస్పత్రికి ఎన్హెచ్ఆర్సీ బృందం
సాక్షి, హైదరాబాద్ : దిశ నిందితుల ఎన్కౌంటర్లో గాయపడ్డ ఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ స్టేట్మెంట్ను ఎన్హెచ్ఆర్సీ బృందం రికార్డు చేసింది. ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాలను ఆ బృందం అడిగి తెలుసుకుంది. కాగా దాడిలో ఎస్ఐ వెంకటేశ్వర్లుకు కుడి నుదుటి భాగంలో గాయం కాగా, కానిస్టేబుల్ అరవింద్గౌడ్ కుడి భుజా నికి గాయమైంది. ఇరువురికీ స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనలతో హైటెక్సిటీలోని కేర్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ బృందం తొలిరోజు ఎన్కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలించింది. పోస్టుమార్టం నివేదికను అధ్యయనం చేసింది. అనంతరం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఎన్కౌంటర్ జరిగిన చటాన్పల్లి సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలించింది. చదవండి: అసలు ఇదంతా ఎలా జరిగింది? మరోవైపు దిశ నిందితుల కుటుంబసభ్యులను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ కేసులో A-1,ఆరిఫ్ తండ్రి హుస్సేన్, A-2, జొల్లు శివ తండ్రి జొల్లు రాజప్ప, A-3 జొల్లు నవీన్ తల్లి లక్ష్మీ, A-4 చెన్నకేశవులు తండ్రి కూర్మప్పను నిన్న రాత్రి 10 గంటలకు ఇంటికి పంపించి ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీసులు తీసుకువెళ్లారు. అయితే వారిని ఎక్కడకు తరలించారనే దానిపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇక హైకోర్టు ఆదేశాలతో ఎన్కౌంటర్లో మృతి చెందిన నిందితుల మృతదేహాలను మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం విభాగంలోనే ఉంచారు. భారీ భద్రత మధ్య పోస్ట్మార్టం విభాగంలోని ఫ్రీజర్లో వాటిని భద్రపరిచారు. సోమవారం రాత్రి 8గంటల వరకూ వాటిని అక్కడే ఉంచనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ -
లోకోపైలెట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన లోకో పైలెట్ చంద్రశేఖర్ (35) కుడికాలును గురువారం తొలగించారు. ఎంఎం టీఎస్, ఇంటర్సిటీ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న ఈ ఘటనలో 17 మంది గాయపడటం, వీరిలో ఆరుగురు బాధితులు కేర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిద్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన కుడి మోకాలి పైభాగం వరకు కాలును పూర్తిగా తొలగించాల్సి వచ్చిందని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. -
కృష్ణంరాజుకు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా తీవ్రమైన నిమోనియాతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి, నటుడు కృష్ణంరాజు (79) చికిత్స కోసం బుధవారం రాత్రి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. కృష్ణంరాజు ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన తరపు ప్రతినిధి వెల్లడించారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. -
లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది
-
ఆమె త్యాగం.. ‘సజీవం’
ముస్తాబాద్ (సిరిసిల్ల): తాను మరణించినా మరో నలుగురికి ప్రాణదానం చేశారా మానవతామూర్తి. కలకాలం తోడూనీడగా ఉంటుందనుకున్న భార్య.. అనూహ్య రీతిలో బ్రెయిన్డెడ్ కాగా.. ఆమె అవయవాలు దానం చేసి త్యాగనిరతిని ప్రదర్శించారు భర్త. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన ఎరవెల్లి వినిల్ – సరిత దంపతులు. వినిల్ హైదరాబాద్లో దంత వైద్యుడిగా వైద్యసేవలు అందిస్తున్నారు. రెండురోజుల క్రితం సరిత అధిక రక్తపోటుకు గురై ఇంట్లో కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. తలలో రక్తనాళాలు చిట్లిపోయి తీవ్ర రక్తస్రావం జరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు సరిత బ్రెయిన్డెడ్ అయినట్లు డాక్టర్లు తేల్చారు. తన భార్యను రక్షించుకోలేక పోయా మని భర్త వినిల్ కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఒక వైద్యుడిగా అంతకు మించి మానవతావాదిగా ఆలోచించిన భర్త వినిల్.. బ్రెయిన్డెడ్ అయిన భార్య సరిత అవయవాల దానానికి అంగీకరించారు. శుక్రవారం సరిత గుండె, కాలేయం, కార్నియా, మూత్ర పిండాలను వైద్యులు సేకరించారు. హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో గుండె అవసరమున్న ఓ యువతికి ఆ గుండెను అమర్చేందుకు గ్రీన్చానల్ ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి నుంచి 5 కి.మీ. దూరంలోని నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి సరిత గుండెను పది నిమిషాల్లో తరలించారు. 18 ఏళ్ల యువతికి గుండెను అమర్చారు. అలాగే సరిత మూత్ర పిండాలు, కార్నియా, కాలేయం మరో ముగ్గురికి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిత మరణించినా ఆమె నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. సరిత స్వగ్రామం పోత్గల్లో ఆమె త్యాగాన్ని గ్రామస్తులు స్మరించుకుంటున్నారు. భర్త వినిల్ మానవతావాదిగా.. నాలుగు కుటుంబాలకు జీవితాన్ని ఇచి్చన వ్యక్తిగా అభినందిస్తున్నారు. -
గొంతులో ఇరికిన ఎముక..
సాక్షి, సిటీబ్యూరో: భోజనం చేస్తుండగా గొంతులో ఇరికిన ఎముకను కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. లేజర్ సహాయంతో ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా మటన్బోన్ను తొలగించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకోవడంతో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. హైదరాబాద్కు చెందిన యువకుడు (30) ఇటీవల ఓ విందుకు హాజరయ్యాడు. విందులో మాంసాహారం భోజనం చేస్తుండగా మాంసం ఎముక గొంతు మధ్యలో ఇరుక్కుని అన్న వాహికకు అడ్డుపడింది. ఎముక ముక్క గొంతు లోపలి భాగంలో రెండు వైపులా గుచ్చుకోవడంతో గాయమైంది. అన్నవాహిక వాపుతో పాటు తీవ్రమైన నొప్పితో బాధ పడటమే కాకుండా ఇటు మింగలేక.. అటు కక్కలేని పరిస్థితుల్లో ఉన్న అతడిని బంధువులు చికిత్స కోసం ఈ నెల 12న బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈఎన్టీ నిపుణుడు డాక్టర్ విష్ణుస్వరూప్రెడ్డి, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ భవానీరాజు, యూరాలజిస్ట్ వంశీకృష్ణల నేతృత్వంలోని వైద్య బృందం బాధితుడికి చికిత్స చేసింది. తొలుత ఎండోస్కోపీ సహాయంతో తొలగించాలని వైద్యులు భావించారు. అది కుదరక పోవడంతో లేజర్ సాంకేతిక పరిజ్ఞానంతో.. గొంతుకు అడ్డుగా ఉన్న ఎముకను రెండు ముక్కలుగా కట్ చేసి, ఆ తర్వాత వాటిని తొలగించారు. సాధారణంగా ఈ లేజర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో ఉపయోగిస్తారు. గొంతులో ఇరికిన ఎముకను తొలగించడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కేర్ వైద్యులు ఉపయోగించడం విశేషం. -
కేర్లో అరుదైన గుండె చికిత్స
సాక్షి, హైదరాబాద్: నైజీరియాకు చెందిన 13 ఏళ్ల అగతకు అరుదైన శస్త్రచికిత్స చేసి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వైద్యులు కొత్త జీవితం ప్రసాదించారు. ఆ పాప పుట్టుకతోనే అరుదైన గుండె సంబంధ సమస్యలతో బాధపడుతుండేదని, వాటిని సరిదిద్దామని కేర్ ఆస్పత్రి పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. గుండె కుడివైపు ఉన్న గదులకు (కుడి కర్ణిక, కుడి జఠరిక) మధ్య ఉన్న కవాటం (ట్రైకస్పిడ్ వాల్వ్) ఆమెకు పుట్టినప్పటి నుంచి సరిగా పనిచేయట్లేదని, ఇలా ఉండటాన్ని ‘ఎబెస్టిన్స్ అనోమలీ’అంటారని పేర్కొన్నారు. సాధారణంగా ఉండాల్సిన స్థానం కన్నా ఈ కవాటం కిందకు ఉందని, ఆ కవాటం కూడా చాలా అసాధారణ స్థితిలో ఉందని చెప్పారు. ఈ సమస్య ప్రతి 2 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందని తెలిపారు. దీంతో కుడి కర్ణిక ఎక్కువ విశాలంగా ఉండి అందులోకి ఎక్కువ రక్తం చేరేదని వివరించారు. ఈ కారణంగా కుడి, ఎడమ కర్ణికల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఏర్పడి ఈ రెండింటి మధ్య చెడు, మంచి రక్తం మార్పిడి జరుగుతుండేదని డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా గుండె పనితీరు సరిగా ఉండదని, ఒక్కోసారి గుండె వైఫల్యం చెందే ప్రమాదం ఉందని చెప్పారు. కేర్ హాస్పిటల్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జీనా మఖీజా నేతృత్వంలో శస్త్రచికిత్స జరిపి ఆమె కవాటాన్ని సరిచేశారు. రెండు కర్ణికల మధ్య గోడకు ఉన్న రంధ్రాన్ని మూసేశారు. శస్త్రచికిత్స జరిగిన రెండో రోజే ఆమెను డిశ్చార్జి చేశారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత 11 రోజుల వ్యవధిలోనే ఆమె పూర్తిగా కోలుకునేలా చేయగలిగామని డాక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కత్తిగాటు లేకుండా..రక్తపు చుక్క కారకుండా
సాక్షి, హైదరాబాద్: పొట్టపై కత్తిగాటు లేకుండా... రక్తం చిందించకుండా.. కనీసం నొప్పి కూడా తెలియకుండా బరువు తగ్గించే ప్రక్రియను కేర్ ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. కొవ్వు కరిగింపు చర్యలో భాగంగా బెరియాట్రిక్ సర్జరీల్లో ఇప్పటి వరకు అనుసరించిన కీహోల్కు బదులు.. తాజాగా రోబోటిక్ ఎండోస్కోపిక్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, స్లీప్ ఆప్నీయా వంటి సమస్యలతో బాధపడుతున్న స్థూలకాయులకు ఈ పద్ధతి ఓ వరం లాంటిది.బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా తొలిరోజే ముగ్గురు బాధితులకు విజయవంతంగా చికిత్స చేయడం విశేషం. ఈ మేరకు శుక్రవారం హోటల్ గోల్కొండలో ఈ అంశంపై ప్రముఖ రోబోటిక్ బెరియాట్రిక్ సర్జన్ డాక్టర్ మోహిత్ బండారి, కేర్ ఫెసిలిటీ చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్ డాక్టర్ రియాజ్ ఖాన్లు విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. ఆ రెండు చికిత్సలకు భిన్నంగా.. బరువు తగ్గించే చికిత్సలు రెండు రకాలు. ఒకటి లైఫోసక్షన్. దీనిలో సూదుల ద్వారా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును బయటికి లాగేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదంతో కూడినది. రెండోది బెరియాట్రిక్ శస్త్రచికిత్స. ఈ ప్రక్రియలో పొట్టపై మూడు నుంచి నాలుగు చిన్నపాటి రంధ్రాలు చేసి(కీ– హోల్)బెలూన్ తో పెద్దపేగు సైజును తగ్గించే పద్ధతి. ఈ రెండు చికిత్సలూ ప్రమాదకరమైనవే. వీటికి ప్రత్యామ్నాయంగా శస్త్రచికిత్స అవసరం లేని ‘ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రో ప్లా స్టీ’అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ల్లో మాత్రమే ఈ తరహా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. బెరియాట్రిక్, లైఫో సక్షన్కు భిన్నంగా ఈ ఎండోస్కోపిక్ పద్ధతి లో చేస్తారు. అత్యాధునిక కెమెరాతో తయారు చేసిన రోబోటిక్ ఎండోస్కోపిని నోటి ద్వారా పొట్టలోకి పంపించి, పెద్ద పేగు సైజు ను తగ్గించి కుట్లు వేసే ప్రక్రియే ఈ చికిత్స. పొట్ట సైజును 1/4 శాతం తగ్గిస్తారు. తక్కువ ఆహారానికే కడుపు నిండిపోవడం, ఎక్కువ ఆహారం తీసుకోలేక పోవడం వల్ల క్రమంగా బరువు తగ్గుతుంది. ఇలా 25 నుంచి 30 కేజీల వరకు తగ్గుతారు. ఈ తరహా చికిత్సలో కత్తిగాటు లేకపోవడమే కా దు..కనీసం నొప్పి కూడా తెలియదు. ఇన్ఫెక్షన్ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. బరువు తగ్గింపునకిది శాశ్వత పరిష్కారంగా వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొలి రోబోటిక్ బెరియాట్రిక్ సర్జన్ ఆయనే దేశంలో రోబోటిక్ బెరియాట్రిక్ సర్జరీలు నిర్వహించిన తొలి వైద్యుడు డాక్టర్ మోహిత్ బండారే. ఆయన ఇప్పటి వరకు 11 వేలకు పైగా కొవ్వు కరిగింపు చికిత్సలు చేశారు. కేవలం 11 గంటల్లో 25 చికిత్సలు చేసి, లిమ్కాబుక్లో చోటు సంపాదించారు. 2012లో 350 కేజీల బరువు ఉన్న ఆసియా మహిళకు ఆయన చికిత్స చేశారు. 2013లో ఆరేళ్ల బాలునికి బెరియాట్రిక్ నిర్వహించి ఖ్యాతి గాంచారు. -
పదిలంగా.. ఆ గుండె ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రి, నాంపల్లిలోని కేర్ ఆస్పత్రి మధ్య మార్గం అది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాల సరాసరి వేగం 25 కిలోమీటర్లకు మించదు. గురువారం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం డోనర్ గుండె(లైవ్ హార్ట్)ను ఆ మార్గంలో తీసుకెళ్లేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ‘గ్రీన్ చానల్’ఇచ్చారు. ఫలితంగా ఈ 8 కి.మీల మార్గాన్ని అంబులెన్స్ కేవలం 7 నిమిషాల్లో అధిగమించింది. మధ్యాహ్నం 12.46కు యశోద ఆస్పత్రి నుంచి అంబులెన్స్ బయలుదేరగా.. కేర్ ఆస్పత్రికి 12.53కు చేరుకుంది. అనంతరం ప్రారంభమైన ఆపరేషన్ సాయంత్రం వరకు సాగింది. ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు 6 గంటలకు ప్రకటించారు. మధ్యాహ్నం మొదలైన ‘ఆపరేషన్’.. నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మోగాయి. ‘నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేక ఆదిలక్ష్మీ అనే మహిళకు గుండె మార్పిడి చేయాల్సి ఉంది. ఆమెకు శస్త్రచికిత్స మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. డోనర్ ఇస్తున్న గుండె మధ్యాహ్నం 12.45 గంటలకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరుతుంది’అన్నది వాటిలో వినిపించిన సందేశం సారాంశం. దీంతో అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. 12.10 గంటల నుంచే ఈ రూట్లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలుపెట్టారు. నిరంతర పర్యవేక్షణ.. డోనర్ ఇచ్చిన గుండె ఉన్న బాక్స్ను తీసుకెళ్తున్న అంబులెన్స్ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 8 కి.మీల దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. మహంకాళి ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్కు ఎస్కార్ట్గా వెళ్లడానికి సిద్ధమైంది. అలాగే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్బాగ్ కమిషనరేట్లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ప్రయాణం ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసుల సహకారం మరువలేం మా అమ్మకి మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేషన్ మొదలైంది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో డోనర్ ఇచ్చిన లైవ్ హార్ట్ ఆపరేషన్ థియేటర్లోకి చేరినట్లు సమాచారం వచ్చింది. సాయంత్రం 5.20 వరకు సర్జరీ సాగగా.. సక్సెస్ అయినట్లు వైద్యులు 6 గంటలకు ప్రకటించారు. ఇందులో భాగస్వామ్యులైన పోలీసులు, ఆస్పత్రి వైద్యులకూ ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతటి సహాయం చేసిన వారి సహకారం మరువలేనిది. –సునంద, ఆదిలక్ష్మీ కుమార్తె ఇదీ గుండె ప్రయాణం.. మధ్యాహ్నం 12.46 గంటలకు ‘లైవ్ హార్ట్ బాక్స్’తో ఉన్న అంబులెన్స్ సికింద్రాబాద్ యశోద నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి ప్యాట్నీ, బైబిల్ హౌస్, కార్బలా మైదాన్, ట్యాంక్బండ్, అంబేడ్కర్ విగ్రహం, లిబర్టీ, బషీర్బాగ్ ఫ్లైఓవర్, ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్, ఉదయ్ ఆస్పత్రి, నాంపల్లి స్టేషన్ రోడ్, తాజ్ ఐలాండ్, గాంధీభవన్ మీదుగా ప్రయాణించి సరిగ్గా మధ్యాహ్నం 12.53కు నాంపల్లి కేర్కు చేరింది. ఈ మార్గంలోని అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు గ్రీన్ చానల్ ఇవ్వడంతో 7 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. -
పుట్టకముందే పునర్జన్మ!
సాక్షి, హైదరాబాద్: తల్లి గర్భంలో ఉండగానే ఓ శిశువు గుండెకు కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరిచి జన్మించకముందే పునర్జన్మ ప్ర సాదించారు. ఇలాంటి చికిత్స దేశంలోనే తొలిదని వైద్యులు తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో డాక్టర్ కె.నాగేశ్వరరావు, డాక్టర్ టీవీఎస్ గోపాల్, డాక్టర్ శ్వేతబాబు, డాక్టర్ జగదీశ్, డాక్టర్ రియాజ్ఖాన్, డాక్టర్ రాఘవరాజు వివరాలను మీడియాకు వెల్లడించారు. 25వ వారంలో బయటపడ్డ లోపం కడప జిల్లా చిన్నమడెంకు చెందిన కీర్తి క్రిస్టఫర్(31)కు ఏడాది కింద వివాహమైంది. ఆమె గర్భం దాల్చింది. రెగ్యులర్ చెకప్లో భాగంగా 25వ వారంలో ఆమెకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా, కడు పులో ఉన్న బిడ్డ గుండె (పల్మనరీ వాల్వ్)రక్తనాళం మూసుకుపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. పరిష్కారం కోసం రాయచూర్, కడపలోని వైద్య నిపుణులను సంప్రదించారు. వారి సూచన మేరకు మే చివరిలో కేర్ వైద్యులను సంప్రదించారు. పీడియాట్రిక్ హృద్రోగ నిపుణుడు డాక్టర్ నాగేశ్వర్రావు వైద్య పరీక్షలు చేశారు. గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే పల్మ నరీ వాల్వ్ మూసుకుపోవడంతో బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలలో లోపమున్నట్లు గుర్తించారు. చికిత్స అందించకుంటే కుడివైపు ఉన్న జఠరికం చిన్నగా మారుతుందని అన్నారు. శిశువు జన్మించాక ఊపిరితిత్తులకు రక్తం సరఫరా కాక, బిడ్డ శరీరం నీలం రంగులోకి మారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని, చికిత్స చేస్తే బతికించొచ్చని తెలి పారు. కీర్తి క్రిస్టఫర్ అంగీకరించడంతో జూన్ తొలివారంలో చికిత్స చేశారు. చికిత్స ఎలా చేశారంటే? చికిత్స సమయంలో బిడ్డ కదలికలతో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో కడుపులోని బిడ్డ కదలికలను నియంత్రించేందుకు ముందు 18జీ సూదితో తల్లి ఉదరభాగం నుంచి బిడ్డ తొడభాగానికి ఇంజెక్షన్ ద్వారా అనస్థీషియా ఇచ్చారు. ఆ తర్వాత తల్లికి మత్తుమందు ఇచ్చారు. అల్ట్రాసౌండ్ సాయంతో తల్లి గర్భం నుంచి బిడ్డ గుండె వరకు సూదిని పంపారు. అదే సూది ద్వారా ఓ బెలూన్ను రక్త నాళంలోకి పంపి, మూసుకుపోయిన రక్తనాళాన్ని తెరిపించారు. ఈ ప్రక్రియ కు 48 నిమిషాల సమయం పట్టింది. ఇదే సమయంలో మరో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. అప్పుడు కడుపులోని బిడ్డ వయసు ఇరవై ఆరున్నర వారాలు మాత్రమే. ఇటీవల కీర్తి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బిడ్డ 3.2 కేజీల బరువు ఉంది. బిడ్డ పుట్టిన రెండోరోజే రెండో బ్లాక్నూ బెలూన్ సాయంతో తెరిపించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ నాగేశ్వరరావు చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి చికిత్సలు ఐదు చేయగా, మూసుకుపోయిన గుండె రక్తనాళం తెరిపించడం ఇదే మొదటి సారని వివరించారు. -
బొమ్మలపై వైద్యం!
చూసేందుకు అది బొమ్మే కానీ.. ఛాతిపై స్టెతస్కోప్ పెడితే లబ్డబ్మంటుంది. మణికట్టు వద్ద నాడీపట్టి చూస్తే పల్స్రేటు తెలిసిపోతుంది. శరీరంపై కత్తిగాటు పడితే రక్తం బయటికిచిమ్ముతుంది. ఇంజక్షన్ నీడిల్ గుచ్చితే కలిగే ఆ నొప్పికి ఏకంగా భోరున ఏడ్వటమే కాదు.. కన్నీరూ కారుస్తుంది. ఐసీయూలో చికిత్స చేసే సమయంలో రోగి నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో అచ్చం అలాంటి అనుభూతులే మిగుల్చుతున్నాయి సిమ్యులేషన్ బొమ్మలు.తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలకు.. ప్రాక్టీసు తోడైనప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయి.ఆ ఉద్దేశంతోనే నగరంలోనే తొలిసారిగా కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ దీనిని ప్రారంభించింది. మృతదేహాల కొరతతో శిక్షణకు నోచుకోలేక పోతున్న వైద్యులకే కాదు నర్సులు, పారామెడికల్ స్టాఫ్కు సైతం ఈ సిమ్యులేషన్ బొమ్మలపై శిక్షణనిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో :కారు మెకానిక్ నేర్చుకోవాలంటే ఓ పాతకారుపై శిక్షణ పొందితే సరిపోతుంది. ఈ సమయంలో ఏదైనా పొరపాటు జరిగిన మరోసారి నేర్చుకునే అవకాశం ఉంది. కానీ అదే వైద్య చికిత్సల్లో ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి. సర్జరీల సమయంలో చేసే ఒంటిపై చేసే కోతలు, స్టంట్ల అమరికలు, కట్లు, కుట్ల విషయంలో సరైన అనుభవం లేకపోయినా.. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా రోగి ప్రాణాలకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వైద్య విద్యను బోధించేందుకు నగరంలో పలు ప్రైవేటు వైద్య కళాశాలలు, నర్సింగ్, పారామెడికల్ ఇనిస్టిట్యూట్లు ఉన్నప్పటికీ.. ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలు మినహా ప్రైవేటు ఇనిస్టిట్యూట్లలో శిక్షణకు అవసరమైన మృతదేహాలు లేకపోవడం, ప్రభుత్వపరంగా వాటికి అనుమతులు లేకపోవడంతో కనీస శిక్షణను కూడా పొందలేకపోతున్నారు. నిజానికి తరగతి గదిలో గురువు బోధించే పాఠాలు వైద్యంపై అవగాహన కల్పిస్తున్నాయే కానీ.. చికిత్సల్లో మెలకువలను, అనుభవాన్ని ఇవ్వలేక పోతున్నాయి. ఈ లోపాన్ని గుర్తించి కేర్ ఇనిస్టిట్యూట్ రెండు వేలకుపైగా సిమ్యులేషన్బొమ్మలను సమకూర్చుకుని వీటిపై శిక్షణ ఇస్తున్నాయి. సర్జరీలు ఎలా చేయాలి.. విరిగిన ఎముకలకు కట్లు ఎలా కట్టాలి... గాయాలకు కుట్లు ఎలా వేయాలి.. ఇంజక్షన్ ఎలా వేయాలి..? వంటి అంశాలపై సిమ్యులేషన్ పద్ధతిలో శిక్షణనిస్తున్నారు. ప్రాక్టీస్ సమయంలో అచ్చం రోగిలాగే ఈ బొమ్మలు కూడా స్పందనలు తెలియజేస్తుండటం వైద్య విద్యార్థులకు మంచి అనుభూతిని మిగుల్చుతున్నాయి. సిమ్యులేషన్ పద్ధతిలో శిక్షణ పొందిన వారు తమ పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు మంచి ఉపాధి అవకాశాలను పొందుతుండటంతో ఈ కోర్సులకు ఇటీవల డిమాండ్ పెరిగిందంటున్నారు కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్సైన్స్ ప్రెసిడెంట్ మహేంద్రపాల. అనస్థీషియా ఇవ్వడం మొదలు ప్రసవాల వరకు ఇక్కడ శిక్షణఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. -
పోలీసుస్టేషన్ ముందే నిప్పంటించుకున్నాడు
హైదరాబాద్: తల్లిదండ్రులు, సోదరుడిపై తన మామ కేసు పెట్టినందుకు కోపంతో ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే పోలీసులు మంటలు ఆర్పి, అతడిని ఆస్పత్రికి తరలించారు. బీహెచ్ఈఎల్ సమీపంలోని బీరంగూడకు చెందిన సతీశ్(24) డ్రైవర్గా పని చేస్తున్నాడు. గతేడాది ఏప్రిల్ 7న బంజారాహిల్స్ రోడ్ నెం.5లోని దేవరకొండ బస్తీకి చెందిన శివానితో అతడికి వివాహం జరిగింది. ఇటీవల అత్తమామలకు, శివానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఈనెల 12న సతీశ్ తల్లి సీతాదేవి, తండ్రి మనోజ్కుమార్, సోదరుడు సాయికుమార్ దేవరకొండ బస్తీలోని శివాని ఇంటికి వచ్చారు. చెప్పకుండా పుట్టింటికి ఎందుకు వచ్చావంటూ గొడవ పడ్డారు. అక్కడే ఉన్న శివాని తల్లిదండ్రులు షగుప్తా, మనోజ్కుమార్లపై దుర్భాషలాడారు. దీంతో శివాని తండ్రి ఈ నెల 13న బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న సతీ‹శ్.. తీవ్ర ఆగ్రహంతో మామకు ఫోన్ చేసి వెంటనే కేసు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అల్లుడు తనను బెదిరిస్తున్న విషయాన్ని ఆయన పోలీసులకు చెప్పడంతో వారు సతీశ్కు ఫోన్ చేశారు. కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పి స్టేషన్కు రమ్మన్నారు. మట్టి పోసి మంటలు ఆర్పిన పోలీసులు... బుధవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు వచ్చిన సతీశ్.. మరోసారి మామకు ఫోన్ చేశాడు. కేసు వెనక్కి తీసుకోకుంటే చచ్చిపోతానని బెదిరించాడు. ఆయన సరిగా స్పందించకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకున్నాడు. మామను దుర్భాషలాడుతూ అగ్గిపుల్ల గీసి అంటించుకున్నాడు. ఒక్కసారిగా ఎగసిపడిన మంటల్లో చిక్కుకుని అటూ ఇటూ పరుగులు పెడుతున్న సతీశ్ను.. అక్కడే ఉన్న పోలీసులు కాపాడారు. అతడి మీద మట్టి పోసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి డీఆర్డీఏ అపోలోకు తరలించారు. ప్రస్తుతం సతీశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని..భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. -
పెళ్లి ఇష్టంలేక యువతి ఆత్మహత్య
సాక్షి, విశాఖ క్రైం : పెళ్లి ఇష్టం లేని యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గురుద్వార కూడలి శాంతిపురం అరుణ అపార్టుమెంట్లో సత్తరు అప్పన్న, నారాయణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సత్తరు రేవతి (20), కుమారుడు చైతన్య ఉన్నారు. అప్పన్న నెల్లూరులో మెకానిక్గా పనిచేస్తున్నారు. కుమార్తె రేవతి డిగ్రీ పరీక్షలు రాసింది. రేవతికి బావతో పెళ్లి కుదిర్చారు. ఈనెల 22న వివాహం నిర్ణయించారు. ఈ క్రమంలో పెళ్లి పనుల్లో భాగంగా సోమవారం పెళ్లి కార్డుల పంపిణీకి రేవతి కుటుంబ సభ్యులు వెళ్లారు. ఈ నేపథ్యంలో రేవతి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ హుక్కు చున్నితో ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రేవతి తల్లి, కుటుంబ సభ్యులు తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో గట్టిగా తోసి లోపలకు ప్రవేశించారు. ఇంటిలో సిలింగ్ హుక్కుకు వేలాడుతున్న రేవతిని చూశారు. వెంటనే ఆమెను కిందకు దించి కేర్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రేవతి తల్లి నారాయణమ్మ ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన హెడ్ కానిస్టేబుల్ తులసీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం రేవతి మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. చదువుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న రేవతి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసు విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్లడ్ గ్రూప్ వేరైనా కిడ్నీ మార్పిడి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో అరుదైన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. బ్లడ్ గ్రూప్ వేరైనా కిడ్నీ మార్పిడిని విజయవంతంగా చేశారు. ‘బి’పాజిటివ్ బ్లడ్గ్రూప్ స్వీకర్తకు ‘ఎ’పాజిటివ్ దాత కిడ్నీని ‘ఏబీవో ఇన్కాంపిటెబుల్’పద్ధతిలో వైద్యులు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం దాత, స్వీకర్తలిద్దరూ కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్జరీకి సంబంధించిన వివరాలను నెఫ్రాలజీ వైద్యనిపుణుడు డాక్టర్ విక్రాంత్రెడ్డి వెల్లడించారు. అస్సాంకు చెందిన నిలాధన్ సింఘా(42) కిడ్నీ సంబంధిత సమస్యతో కేర్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులు పరీక్షించి కిడ్నీ పనితీరు దెబ్బతిన్నట్లు గుర్తించారు. క్రియాటిన్ 16.0 గా నమోదైంది. యాంటీబాడీస్ బాగా తగ్గిపోవడంతో కిడ్నీ మార్పిడి అనివార్యమైంది. స్వీకర్త బ్లడ్ గ్రూప్నకు సంబంధించిన దాతలెవరూ కిడ్నీ దానానికి ముందుకు రాలేదు. చివరకు ఆయన భార్య లువాంగ్ సింఘా(37) కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే, స్వీకర్త బ్లడ్గ్రూప్ ‘బి’పాజిటివ్ కాగా, దాతది ‘ఎ’పాజిటివ్. సాధారణంగా రెండు వేర్వేరు బ్లడ్గ్రూప్ల మధ్య అవయవదాన మార్పిడి శస్త్ర చికిత్సలు చేయరు. ఒకవేళ చేసినా స్వీకర్త శరీరం దాత అవయవాన్ని తిరస్కరిస్తుంది. చికిత్సకు మరోదారి లేకపోవడంతో వైద్యులు ఏప్రిల్ మొదటివారంలో ‘ఏబీవో ఇన్కాంపిటెబుల్ ట్రాన్స్ప్లాంటేషన్’పద్థతిలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. -
కేర్ సెంటర్
గర్భిణి అయ్యాక కేర్ తీసుకోవాలి. ప్రసవం అయ్యాక కేర్ తీసుకోవాలి.కనీసం ఐదేళ్ల వరకైనా..కంట్లో ఒత్తులు వేసుకుని బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని కేర్ తీసుకోవాలి.బిడ్డ కేర్ ఒక్కటే కాదు.. తల్లి కేర్ కూడా... ఇంత కేర్ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని కాల్ సెంటర్ తీసుకుంటోంది.అందుకే అది..కాల్ సెంటర్ మాత్రమే కాదు. కేర్ సెంటర్ కూడా! ‘‘హలో.. లక్ష్మమ్మా.. ఆరోగ్యం ఎలా ఉంది.. ఈ నెల డాక్టర్ దగ్గరకు పోయినవా.. స్కానింగ్ చేసిండ్రా.. మందులు వేసుకుంటున్నవా.. ఏం ప్రాబ్లం లేదు కదా.. పండంటి బిడ్డను కనాలే’’ – ఫోన్లో ఓ ఆత్మీయ పలకరింపు.‘‘నా ఆరోగ్యం అదీ మంచిగనే ఉంది. డాక్టర్ దగ్గరకు పోయిన.. స్కానింగ్ చేసి కడుపుల బిడ్డ మంచిగనే ఉందని చెప్పిండ్రు.. నా బరువు ఇంకా పెరగాలే అని చెప్పిండ్రు.. అది సరే.. ఇంతకీ మీరెవరమ్మా.. నేను కడుపుతో ఉన్న అని మీకెట్ల తెలుసు. నా నంబరు మీకెవరు ఇచ్చిండ్రు’’ అవతలి నుంచి సమాధానం.‘‘అమ్మా.. మేము సంగారెడ్డి సర్కారు దవాఖానా కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నం. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నట్లు మీ ఏరియా ఎఎన్ఎం ద్వారా మాకు తెలిసింది. మీ ప్రసవం జరిగి, పుట్టే పిల్లలకు ఐదేళ్ల టీకాలు వేసే దాకా మేం అప్పుడప్పుడు ఫోన్ చేస్తం. మీ ఆరోగ్యం ఎట్ల ఉందో ఎప్పటికప్పుడు చెప్తూ ఉండండి’’.సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ.. గర్భిణులు, బాలింతల కోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా ప్రతీ రోజూ వెళ్లే సుమారు వంద ఫో¯Œ కాల్స్ సంభాషణ.. ఇంచు మించు ఈ రీతిలోనే సాగుతూ ఉంటుంది. మాతృత్వం ఓ వరం గర్భం దాల్చింది మొదలు.. ప్రసవం.. శిశు సంరక్షణ వరకు తల్లీ బిడ్డల ఆరోగ్య రక్షణ ఓ సవాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ అంశాలపై చాలా మందికి అవగాహన ఉండదు. ఇలాంటి వారి కోసం గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన మాణిక్కరాజ్ కణ్ణన్ ఓ వినూత్న ఆలోచన చేశారు. రెడ్క్రాస్ సొసైటీ ఛైర్మన్గా కూడా వ్యవహరించే జిల్లా కలెక్టర్.. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య పరమైన సూచనలు అందించేందుకు ప్రత్యేకంగా ఓ ‘కాల్ సెంటర్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత ఏడాది ఫిబ్రవరి 10న జిల్లా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమైన ఈ కాల్ సెంటర్ ఏడాదిలో దాదాపు 32వేల మంది గర్భిణులు, బాలింతలకు వైద్య పరమైన సూచనలు, సలహాలు అందించింది. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, సబ్ సెంటర్ ఎఎన్ఎంలు అక్కడి గర్భిణుల సమాచారం సేకరించి, వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ వెబ్సైట్లో నమోదు చేస్తారు. ఈ సమాచారం నేరుగా ‘కాల్ సెంటర్’ డాష్ బోర్డు మీదకు చేరుతుంది. ఇలా ప్రతీ రోజూ సుమారు వంద మంది గర్భిణులు, బాలింతలకు వైద్య పరమైన సూచనలు, సమాచారాన్ని కాల్ సెంటర్ ఉద్యోగులు చేరవేస్తూ ఉంటారు. రెడ్క్రాస్ సొసైటీ నేతృత్వ నిర్వహణలో ఉన్న ఈ కాల్ సెంటర్ ద్వారా గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 6812 మంది చిన్నారులకు వేక్సినేషన్ లభించింది. ప్రయోగాత్మకం.. ఫలితం అద్భుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పనిచేసే ఈ కాల్ సెంటర్ ఆదివారం, ప్రభుత్వ సెలవు రోజులను మినహాయించి.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తుంది. పల్లెలు, పట్టణం అనే తేడా లేకుండా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయి నుంచి సేకరించి, ఆన్లైన్లో నమోదు చేస్తారు. గర్భిణులకు సంబంధించి మూడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు నాలుగు పర్యాయాలు కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తారు. స్కానింగ్ చేయించుకున్నారా, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారా, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారా, డాక్టర్ను కలిశారా, బరువు పెరుగుతోందా, మందులు వాడుతున్నారా, స్కానింగ్లో కానీ రిపోర్టుల్లో ఏమైనా సమస్య ఉన్నట్లు డాక్టర్లు చెప్పారా.. వంటి ప్రశ్నలు అడుగుతారు. వారు చెప్పే విషయాల్లో.. ఏదైనా సమస్య ఉంటే కాల్ సెంటర్ ఉద్యోగులు నమోదు చేసుకుని డీఎంహెచ్ఓ ద్వారా సంబంధిత వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్తారు. పనిలో పనిగా వారికి సమీపంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రులు, అందుబాటులో ఉండే సేవలు తదితరాల గురించి వివరిస్తారు. రక్తహీనతతో ఎదురయ్యే సమస్యలు, ఐరన్, ఫోలిక్ మాత్రల వినియోగం వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. డెలివరీ తేదీ దగ్గరపడే సమయంలో వారు ఏ ఆసుపత్రిలో చేరాలనుకుంటున్నారో ముందే తెలుసుకుని.. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలనుకుంటే వైద్యులకు కాల్ సెంటర్ ద్వారా ముందే సమాచారం ఇస్తారు. రిటర్న్ కాల్స్తో.. కొత్త ఉత్సాహం కాల్ సెంటర్ ప్రారంభమైన నాటి నుంచి ఒక్కో గర్భిణి లేదా బాలింతతో కనీసం డజను సార్లు మాట్లాడి ఉంటాం. మా నుంచి ఫోన్ వెళ్లిన వెంటనే.. వాళ్లే మమ్మలను ఎలా ఉన్నారని పలకరిస్తారు. ప్రసవం తర్వాత చాలా సార్లు రిటర్న్ కాల్ చేసి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. వారి నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మాలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. చాలా సార్లు కాల్సెంటర్ పనివేళలతో సంబంధం లేకుండా ఫోన్లు వచ్చినా.. వివరాలు చెప్తూ ఉంటాం. ఇక్కడ జిల్లా ఆసుపత్రిలో ప్రసవించే వారు.. తమ శిశువును చూసి వెళ్లాల్సిందిగా ఆత్మీయంగా ఆహ్వానిస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ విచిత్ర అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. డెలివరీ డేట్ దగ్గర పడినందున ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా ఓ నిండు గర్భిణికి సూచించాం. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఆ మహిళ భర్త ఫోన్ చేసి.. తన భార్యకు నొప్పులు రావడం లేదంటూ ఆందోళన పడుతూ ఫోన్ చేశాడు. అక్కడున్న డాక్టర్లు చూసుకుంటారు, ఆందోళన పడొద్దని చెప్పాం.. మరుసటి రోజు ఫోన్ చేసి తాను టెన్షన్ పడి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు కోరాడు. ఏదేమైనా.. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగినట్లు మాకు వచ్చే రిటర్న్ కాల్స్ చెప్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న అపోహలను తొలగించడమే మా విధి.. బాధ్యత. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు గత ఏడాది జూన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే వారికి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్లను అందిస్తోంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే లక్ష్యంతో గత ఏడాది ఫిబ్రవరిలో కాల్ సెంటర్ను ఏర్పాటు చేశాం. రెడ్ క్రాస్ ద్వారా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి.. నిర్వహణకు సంబంధించి శాలిని, గౌతమి అనే ఇద్దరు యువతులకు శిక్షణ ఇప్పించాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి, డాక్టర్లు ఏ సమయంలో అందుబాటులో ఉంటారు, ప్రసవానికి ఎప్పుడు ఆసుపత్రికి రావాలి అనే ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు సిబ్బంది తేదీల వారీగా తెలియ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కాల్ చేయడమే కాదు.. అవతలి నుంచి వచ్చే అనుమానాలు, ఫిర్యాదులు, ఇబ్బందులు.. ఏవైనా దృష్టికి తెస్తే కాల్ సెంటర్ ఉద్యోగులు ఓపికగా వారికి సూచనలు ఇస్తారు. నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ కాల్సెంటర్ పనితీరును ఇటీవలే పరిశీలించి వెళ్లారు. – డాక్టర్ శశాంక్ దేశ్పాండే, కాల్ సెంటర్ ఇన్చార్జి – దండు దయానందం, సాక్షి, సంగారెడ్డి -
ఫ్యామిలీ డాక్టర్
గుండె సమస్య కాదంటున్నారు... మరెందుకీ నొప్పి? నా వయసు 39 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను. కార్డియాలజిస్టును కలిసి గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. సమస్య ఏమీ లేదని అంటున్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళల్లో నొప్పి మరీ ఎక్కువ అవుతోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా? – ఆంజనేయరెడ్డి, కర్నూలు మీరు తెలిపిన వివరాలు, పేర్కొన్న లక్షణాలను బట్టి మీకు ఆహార వాహికకు సంబంధించిన ‘రిఫ్లక్స్ డిసీజ్’తో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. అందులో మీ రిఫ్లక్స్ డిసీజ్ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువ అంటున్నారు కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలసి, ఆ నొప్పిని తగ్గించుకునే మందులు వాడండి. మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాలు మీ సమస్యను తీవ్రతరం చేస్తాయి. వాటిని వాడటం వల్ల లక్షణాలు పెరుగుతాయి. వాటిని గుర్తించి, వాటినుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి మార్పులతో మీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఛాతీలో మంట.. తగ్గేదెలా? నా వయసు 42 ఏళ్లు. నేను చాలా రోజుల నుంచి ఛాతీలో మంటతో బాధపడుతున్నాను. యాంటాసిడ్ సిరప్ తాగినప్పుడు మంట తగ్గుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి? నాకు తగిన సలహా ఇవ్వగలరు. – అనిల్కుమార్, మిర్యాలగూడ మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యమిది. మీ రోజువారీ జీవనశైలినీ, ఆహారపు అలవాట్లనూ సరిచేసుకుంటే ఈ వ్యాధి చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని సూచనలివి... మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం కాఫీ, టీలను పూర్తిగా మానేయడం ∙పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయడం, మద్యం అలవాటుకు దూరంగా ఉండటం ∙బరువు ఎక్కువగా ఉంటే దాన్ని సరైన స్థాయికి తగ్గించడం ∙భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాస్త సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి తలవైపున పడక కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకోవాలి. పై సూచనలతో పాటు మీ డాక్టర్ సలహా మీద పీపీఐ డ్రగ్స్ అనే మందులు వాడాలి. అప్పటికీ తగ్గకపోతే ఎండోస్కోపీ చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి. హెచ్బీఎస్ఏజీ పాజిటివ్... పరిష్కారం చెప్పండి నా వయసు 32 ఏళ్లు. నేను ఒక సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఇటీవల మా సంస్థ నిర్వహించిన మెడికల్ క్యాంప్లో నాకు హెచ్బీఎస్ఏజీ పాజిటివ్ వచ్చిందని తెలిసింది. దీనివల్ల కాలేయం చెడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. నిజమేనా? నా వ్యాధి మందులతో తగ్గిపోతుందా? తగిన సలహా చెప్పి, పరిష్కారం చూపండి. – ఎమ్.ఎస్.ఎస్. హైదరాబాద్ మీరు హెపటైటిస్–బి అనే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ వైరస్ రక్తంలో ఉన్నంత మాత్రాన కాలేయం చెడిపోయే అవకాశం లేదు. రక్తంలో ఈ వైరస్ ఉండే దశను బట్టి లివర్ చెడిపోయే అవకాశం ఉంటుంది. వైరస్ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. లివర్ ఫంక్షన్ పరీక్షలో తేడా వస్తే ఒకసారి మీకు దగ్గర్లో ఉండే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ను కలిసి చికిత్స తీసుకోవచ్చు. కడుపులో అల్సర్, పిత్తాశయంలో రాయి...! నా వయసు 40 ఏళ్లు. గత నెలరోజులుగా కడుపులో మంట, నొప్పి వస్తుంటే డాక్టర్ను సంప్రదించాను. పరీక్షల్లో కడుపులో అల్సర్ (చిన్న పుండు) ఉంది అని తేలింది. అల్ట్రాసౌండ్లో పిత్తాశయంలో రాయి ఉన్నట్లుగా వచ్చింది. ఈ సమస్య మందులతో తగ్గుతుందా, ఆపరేషన్ అవసరమా? – మల్లయ్య, వరంగల్ సాధారణంగా వయసు పెరిగేకొద్దీ పిత్తాశయంలో (గాల్బ్లాడర్లో) రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నంతమాత్రాన ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రాళ్ల వల్ల తరచూ నొప్పి వస్తుంటే అప్పుడు గాల్బ్లాడర్ను తొలగించాల్సి ఉంటుంది. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీకు యాసిడ్ పెప్టిక్ డిసీజ్తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీకు వచ్చే నొప్పి పిత్తాశయానికి సంబంధించినది కాదు. కాబట్టి మీరు భయపడాల్సిందేమీ లేదు. ఒకసారి వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నవజాత శిశువుకు అరుదైన చికిత్స
సాక్షి, హైదరాబాద్ : గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ నవజాత శిశువుకు కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. చికిత్స అనంతరం శిశువు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. హృద్రోగ నిపుణుడు డాక్టర్ తపన్ కె.దాస్, డాక్టర్ నాగేశ్వర్ గురువారం ఇక్కడ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చికిత్స వివరాలు వెల్లడించారు. నగరంలోని పాతబస్తీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్ దంపతులకు ఇటీవల మగశిశువు జన్మించాడు. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతున్న శిశువును స్థానిక వైద్యుల సూచన మేరకు తల్లిదండ్రులు కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో శిశువు పుట్టుకతోనే హృద్రోగ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం మూసుకుపోయినట్లు గుర్తించారు. రక్తనాళ మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. మైట్రల్వాల్వ్ పునరుద్ధరణ ద్వారా... సాధారణంగా ప్రతి వందమంది పిల్లల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్యతో జన్మిస్తుంటారు. తల్లిదండ్రుల అంగీకారంతో 11 రోజుల క్రితం శిశువుకు ఓపెన్హార్ట్ సర్జరీ చేసి, మైట్రల్వాల్వ్ను పునరుద్ధరించారు. సాధారణం గా ఇలాంటి కేసుల్లో ఆవు ద్వారా సేకరించిన రక్తనాళం కానీ మెటల్వాల్వ్ కానీ రీప్లేస్ చేస్తారు. గుండె కండరాలకు అతుక్కుపోయిన రక్తనాళాన్ని కట్ చేసి సరి చేశారు. 2.6 కేజీల బరువుతో జన్మించిన శిశువుకు ఇలాంటి సర్జరీ చేయడం ప్రపంచంలోనే చాలా అరుదని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి చికిత్సలకు రూ.ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుండగా, శిశువు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వైద్య ఖర్చులో 50శాతం రాయితీ ఇచ్చినట్లు ఆస్పత్రి సీఈవో రియాజ్ తెలిపారు. శిశువుకు భవిష్యత్లో ఎలాంటి సమస్య ఉండదని, మరోసారి సర్జరీ చేయాల్సిన అవసరం కూడా రాబోదని డాక్టర్ తపన్ కె.దాస్ స్పష్టం చేశారు. -
రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ ఇకలేరు
-
రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ ఇకలేరు
పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ (77) కన్నుమూశారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత శుక్రవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. ఆయన భౌతికకాయాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబర్7లోని స్వగృహానికి తరలించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ ముఖ్య సలహాదారు పరకాల ప్రభాకర్, లోక్సత్తా అధినేత జయప్రకాశ్నారాయణ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన కుమారుడు సంజీవి ప్రసాద్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, ఎంవీఎస్ ప్రసాద్, చెంగప్ప, రాంబాబు, ఎన్వీ భాస్కర్రావు, బీవీ రామారావు, కృష్ణారావు, సత్యనారాయణ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు సమాచార సలహాదారుగా ప్రసాద్ పనిచేశారు. టీటీడీ ఈవోగా తిరుమల విశిష్టతపై పలు రచనలు చేశారు. కేసీఆర్, చంద్రబాబు సంతాపం..: ప్రసాద్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్రావు, చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సమాచార సలహాదారుగా ప్రసాద్ పనిచేశారని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. పీవీఆర్కే ప్రసాద్ సమర్థవం తమైన అధికారిగా వ్యవహరించారని, ప్రభుత్వానికి విశేషమైన సేవలు అందిం చారని చంద్రబాబు కొనియాడారు. టీటీడీ ఈవోగా పనిచేసిన కాలంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించారన్నారు. పీవీఆర్కే ప్రసాద్ మృతిపై జగన్ సంతాపం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో పీవీఆర్కే ప్రసాద్ (77) మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. ప్రసాద్ కుటుంబసభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలు కీలక పదవుల్లో పనిచేసిన ఆయన విధి నిర్వహణలో చిత్తశుద్ధిగా వ్యవహరించారన్నారు. -
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూత
నేడు గుణదలలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి, టీడీపీ సీని యర్ నేత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)(62) సోమవారం ఉదయం 5.20 గంటలకు హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా అనా రోగ్యంతో ఉన్న ఆయన కేర్ ఆస్పత్రిలో చికిత్స పొంది, రెండు రోజుల క్రితం డిశ్చార్జయి హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున తిరిగి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. దేవినేనికి భార్య లక్ష్మి, కుమారుడు అవి నాష్, కుమార్తె ఉన్నారు. దేవినేని భౌతిక కాయాన్ని సోమవారం మధ్యాహ్నం విజయవాడ గుణదలలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. ఆయన అంత్యక్రియలు గుణదలలోని వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం నిర్వహిస్తారు. రాజకీయ ప్రస్థానం: విద్యార్థి నేతగా రాజ కీయ జీవితాన్ని ప్రారంభించిన దేవినేని ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లాలో కీలక రాజకీయ నేతగా గుర్తింపుపొందారు. దేవినేని విజయవాడలో 1982లో యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (యూఎస్వో)ను స్థాపించారు. 1982లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. టీడీపీ తరçఫున 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో కృష్ణా జిల్లా కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో ఎన్టీరామారావు మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 1995లో ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి దింపేందుకు చంద్రబాబు చేసిన వైస్రాయ్ కుట్ర సమయంలో నెహ్రూ ఎన్టీరామారావు వెంట నిలిచారు. ఎన్టీఆర్ మరణానంతరం 1996లో లక్ష్మీపార్వతి నేతృత్వంలోని ఎన్టీఆర్ టీడీపీ తరఫున విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. అనంతరం కాంగ్రెస్లో చేరిన ఆయన 1999లో కంకిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ నుంచే కంకిపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009, 2014లో విజ యవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కుమారుడు అవి నాష్ కూడా విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2016లో టీడీపీలో చేరారు. నిబద్ధత గల వ్యక్తి: ఏపీ సీఎం బాబు ఎన్టీఆర్కు నెహ్రూ అత్యంత సన్నిహితులని, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. త్వరలోనే జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో ఒక భారీ సమావేశం ఏర్పాటు చేయాలని దేవినేని భావించారని.. ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ అంటే ఎనలేని అభిమానం దేవినేనికి దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానం. తన రాజకీయ జీవితానికి ఇద్దర్నీ రెండు కళ్లుగా భావించేవారు. తనకు రాజకీయ జీవితం ఎన్టీఆర్ ప్రసాదించారని, వైఎస్ వ్యక్తిత్వం చూసి ఆయనకు ఆకర్షితుడ్ని అయ్యానని పలుమార్లు బహిరంగంగానే చెప్పేవారు. కాంగ్రెస్ పార్టీ వీడి రెండవసారి టీడీపీలో చేరేవరకు వైఎస్సార్ జిల్లాకు చేసిన సేవల్ని కొనియాడేవారు. బాబును, తెలుగుదేశంపార్టీ నేతల్ని ఘాటుగా విమర్శించేందుకు వెనుకాడేవారు కాదు. ఆయన పట్టిసీమను వ్యతిరేకించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని స్వాగతించారు. కృష్ణాడెల్టా రైతు ఉద్యమాల్లో ముందుండేవారు. తాను నమ్ముకున్న పార్టీ కోసం పనిచేయడం నెహ్రూ స్వభావం. ఆయన టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా ఎక్కువ కాలం కాంగ్రెస్లోనే ఉన్నారు. 1982 నుంచి 1996వరకు 14ఏళ్లు టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీలో కొనసాగారు. 1996 నుంచి 2016 వరకు 20 ఏళ్లు ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. దేవినేనికి దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానం. తన రాజకీయ జీవితానికి ఇద్దర్నీ రెండు కళ్లుగా భావించేవారు. తనకు రాజకీయ జీవితం ఎన్టీఆర్ ప్రసాదించారని, వైఎస్ వ్యక్తిత్వం చూసి ఆయనకు ఆకర్షితుడ్ని అయ్యానని పలుమార్లు బహిరంగంగానే చెప్పేవారు. కాంగ్రెస్ పార్టీ వీడి రెండవసారి టీడీపీలో చేరేవరకు వైఎస్సార్ జిల్లాకు చేసిన సేవల్ని కొనియాడేవారు. బాబును, తెలుగుదేశంపార్టీ నేతల్ని ఘాటుగా విమర్శించేందుకు వెనుకాడేవారు కాదు. ఆయన పట్టిసీమను వ్యతిరేకించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని స్వాగతించారు. కృష్ణాడెల్టా రైతు ఉద్యమాల్లో ముందుండేవారు. తాను నమ్ముకున్న పార్టీ కోసం పనిచేయడం నెహ్రూ స్వభావం. ఆయన టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా ఎక్కువ కాలం కాంగ్రెస్లోనే ఉన్నారు. 1982 నుంచి 1996వరకు 14ఏళ్లు టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీలో కొనసాగారు. 1996 నుంచి 2016 వరకు 20 ఏళ్లు ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. -
దేవినేని నెహ్రూకి లోకేష్ నివాళి
విజయవాడ : గుణదలలో దేవినేని నెహ్రు పార్థీవ దేహానికి ఏపీ మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమ నివాళులర్పించారు. అనంతరం నారా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనకంటూ మార్క్ ఏర్పరచుకున్న వ్యక్తి నెహ్రు అని కొనియాడారు. మంత్రిగా, ఎమ్మెల్యే గా నిరంతరం ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఆయనని, 45 రోజులుగా నాకు రాజకీయాల గురించి అనేక సలహాలు ఇచ్చారని తెలిపారు. సిద్దాంతాలను నమ్ముకున్న వ్యక్తి నెహ్రూ అని, ఆయన కుటుంబాన్ని, కార్యకర్తలను టీడీపీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నెహ్రూ కుమారుడు అవినాష్కు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం దేవినేని ఉమ మాట్లాడుతూ.. బెజవాడ రాజకీయాలలో నెహ్రూ మరపురానీ వ్యక్తి అని, ఈ రోజు మన నుంచి దూరం అవ్వడం నిజంగా శోచనీయమన్నారు. నిత్యం ప్రజలో ఉండే వ్యక్తి నెహ్రూ..తన అనుకున్న వారి కోసం దేనికీ వెనుకాడబోని నాయకుని కోల్పోయామని చెప్పారు. -
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూత
-
దేవినేని నెహ్రూ కన్నుమూత
-
చిరు గుండెకు రెండు గంటల్లో చికిత్స
గుండె నిర్మాణంలో లోపం.. పునర్జన్మ ప్రసాదించిన కేర్ వైద్యులు సాక్షి, హైదరాబాద్: గుండె నిర్మాణ లోపంతో బాధపడుతూ మృత్యువు తో పోరాడుతున్న ఓ శిశువుకు హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆస్ప త్రి వైద్యులు చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. చీఫ్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ తపన్ దాస్, చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ నాగే శ్వర్రావు, ఆనంద్, రామకృష్ణ, రజేన్లతో కూడిన వైద్యబృందం చిన్నారి కి విజయవంతంగా చికిత్స చేసింది. ఈ వివరాలను శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ కు చెందిన పుష్పలత, నవీన్ దంపతులకు ఇటీవల తక్కువ బరువు(1400 గ్రాముల)తో శిశువు జన్మించింది. చిన్నారి పుట్టుకతోనే గుండె నిర్మాణ లోపం ఉంది. దీంతో స్థానిక వైద్యు ల సూచన మేరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డను మార్చి 7న కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బిడ్డ గుండెలో ఎడమవైపు ఉండాల్సిన భాగం కుడివైపు, కుడివైపు భాగం ఎడమవైపు ఉన్నట్లు గుర్తించారు. 12 మందితో కూడిన వైద్య బృందం రెండు గంటలపాటు శ్రమించి చికిత్స చేసింది. పాప పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్ తపన్దాస్ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో శిశువుకు ఉచితంగా చికిత్స చేసినట్లు తెలిపారు. -
మూడ్రోజుల బిడ్డకు అరుదైన శస్త్రచికిత్స
-
మానవతకు పాతరేసిన వారిపై కేసులు
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నెలలు నిండకుండానే పుట్టిన పాపానికి మూడురోజుల పసికందుకు మరణ శిక్ష వేయాలనుకున్న వారిపై కేసులు నమోదయ్యాయి. ప్రాణాలతోనే శిశువును పాతిపెట్టేందుకు ప్రయత్నించిన ఉదంతం సంచలనం సృష్టించింది. సాక్షిలో ‘మానవతకు పాతర’ శీర్షికతో కథనం ప్రచురితమైన నేపథ్యంలో పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ మళ్ల మహేశ్ బుధవారం తెలిపారు. శిశువును పూడ్చి పెట్టడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డు లక్ష్మణ్, శిశువు తండ్రి రాంబాబులతోపాటు కృష్ణా క్రిటికల్ కేర్ ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఒడిశాలో కేర్ ఆసుపత్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కేర్ హాస్పిటల్స్, ఒడిశా ప్రభుత్వం చేతులు కలి పాయి. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలోని జార్సుగూడలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆసుపత్రిని 15 ఏళ్లపాటు కేర్ నిర్వహించనుంది. 100 పడకల సామర్థ్యంతో రానున్న ఈ సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ కేర్ హాస్పిటల్కు ప్రభుత్వం రూ.75 కోట్ల వ్యయం చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటవుతున్న ఈ హాస్పిటల్ నిర్మాణం రెండేళ్లలో పూర్తి అవుతుంది. పశ్చిమ ఒడిశాలో ఇటువంటి ఆసుపత్రి ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. హాస్పిటల్ సామర్థ్యంలో 50 శాతం పేదలకు కేటాయిస్తారు. వీరికి ఉచితంగా సేవలు అందిస్తారు. ఒడిశా రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో మంగళవారం ఒప్పందం జరిగింది. కార్యక్రమానికి కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ బి.సోమరాజు, సీవోవో కసి రాజు పాల్గొన్నారు. కేర్ ఖాతాలో ప్రస్తుతం 14 ఆసుపత్రులు ఉన్నాయి. -
ఆరిపోతూ వెలుగిచ్చిన జీవన దీపం
పాతపోస్టాఫీసు: కొన్ని జీవితాలను చూస్తే విధికి ఎందుకంత కంటగింపో ఎవరు చెప్పగలరు? విధి వైచిత్రిని, వైపరీత్యాన్ని ఎవరు ఊహించగలరు? మృత్యు కెరటంలా విరుచుకుపడే విధి ఎన్నో కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచెత్తుతుంది. అనూహ్య పరిణామాలతో జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది. ఎంవీపీ కాలనీకి చెందిన పిళ్లా ధనలక్ష్మి కుటుంబం పరిస్థితీ అదే విధంగా మారింది. ఏడాది వ్యవధిలో మృత్యువు ఆమె భర్తను, తర్వాత ఆమెను దిగమింగడంతో ఇద్దరు పిల్లల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇంత విషాదంలోనూ ఆమె బం ధువులు, పిల్లలు అవయవదానానికి సమ్మతించడంతో ధనలక్ష్మి జీవితం కడతేరినా, మరికొందరికి ప్రాణదానం చేసి నట్టురుుంది. ఎంవీపీ కాలనీకి చెందిన పిల్లా ధనలక్ష్మి (35) శుక్రవారం అనకాపల్లిలోని బంధువుల గహ ప్రవేశానికి వెళ్లి బావ గోవింద్ ద్విచక్రవాహనంపై నగరానికి వస్తుండగా సబ్బవరం దేవీపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలయ్యారు. తలకు దెబ్బ తగలడంతో ఆమెను రాంనగర్ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. శనివారం ఉదయం ధనలక్ష్మి బ్రెరుున్డెడ్ అరుునట్టుగా వైద్యులు నిర్ధారించారు. తర్వాత వారి సూచన ప్రకారం ఆమె బంధువులు, పిల్లలు అవయవదానానికి సమ్మతించారు. నగరంలోని మొహిసిన్ ఐ బ్యాంక్కు కళ్లను, లివర్ను అపోలో ఆస్పత్రికి, ఒక కిడ్నీని కేర్కు, ఒక కిడ్నీని సెవన్ హిల్స్ ఆస్పత్రికి అందజేయడానికి అంగీకరించారు. గత ఏడాది ధనలక్ష్మి భర్త గుండె పోటుతో మరణించారు. ఇప్పుడు తల్లికూడా మరణించడంతో వుడాపార్క్ చేరువలోని గాయత్రి విద్యాపరిషత్ పాఠశాలలో టెన్త చదువుతున్న హేమంత్ (15), ఎంవీపీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న రమ్యశ్రీ (11) రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. -
విధి ముందు తలవంచింది
మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి హర్షిత - కారుణ్యమరణం కోసం గతంలో హెచ్ఆర్సీని ఆశ్రయించిన తల్లిదండ్రులు - వైద్య, ఆరోగ్య మంత్రి ఆదేశాలతో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స - కాలేయం కోసం జీవన్దాన్లో పేరు నమోదు.. ముందుకు రాని దాతలు - చివరకు రక్తపు వాంతులు చేసుకుని..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత సాక్షి, హైదరాబాద్: మృత్యువుతో కడవరకూ పోరాడిన చిన్నారి హర్షిత చివరికి విధి ముందు తలవంచక తప్పలేదు. కుమార్తె ప్రాణాలతో దక్కుతుందని ఆశించిన ఆ తల్లిదండ్రులకు చివరికి కడుపుకోతే మిగిలింది. మహబూబ్నగర్ జిల్లా ఉప్పునూతల(జగద్గిరిగుట్టలో తాత్కాలిక నివాసం)కు చెందిన రాంచంద్రారెడ్డి, శ్యామల దంపతుల కుమార్తె హర్షిత(11) కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చికిత్స కోసం బంజారాహిల్స్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించగా.. వైద్యులు బాలికను పరీక్షించి కాలేయ మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. కారుణ్య మరణానికి అనుమతించాలని.. బిడ్డ ఆరోగ్య పరిస్థితి చూడలేక, ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక హర్షిత కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రాంచంద్రారెడ్డి దంపతులు జూలై 14న ఎస్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ‘మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించండి’ శీర్షికతో ‘సాక్షి’లోనూ కథనం ప్రచురితమైంది. దీంతో చిన్నారికి వైద్యం చేయించాలని హెచ్ఆర్సీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి వైద్య మంత్రి లక్ష్మారెడ్డి స్పందించి హర్షిత చికిత్సకయ్యే ఖర్చంతా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. కాలేయ మార్పిడికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సదరు ఆస్పత్రికి లేఖ కూడా రాశారు. ఆస్పత్రి ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. రక్తపు వాంతులు: బిడ్డకు కాలేయాన్ని దాన ం చేసేందుకు తండ్రి రాంచంద్రారెడ్డి ముందుకు రావడంతో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అయితే తండ్రి కాలేయంలో ఆల్కహాల్ శాతం అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా జీవన్దాన్లో పేరు నమోదు చేశారు. మూడు నెలలు కాలేయ దాత కోసం ఎదురు చూసినా ఫలితం లేక పోయింది. చిన్నారి హర్షిత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత రక్తపు వాంతులు చేసుకోవడంతో చికిత్స కోసం మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం హర్షిత మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన హర్షిత మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమని బాధితురాలి బంధువులు, కాంగ్రెస్ నేత మల్లు రవి ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. కుమార్తెకు కాలేయాన్ని దానం చేసేందుకు తండ్రి ముందుకొచ్చినా వైద్యులు చికిత్సలో జాప్యం చేశారని ఆరోపించారు. హర్షిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, చికిత్సలో జాప్యం చేసిన వైద్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే హర్షితకు చికిత్స అందించడంలో వైద్య పరమైన నిర్లక్ష్యం ఏమీ లేదని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. జీవన్దాన్లో పేరు నమోదు చేయించినా.. దాతలు దొరక్కపోవడం వల్లే కాలేయ మార్పిడి చికిత్స చేయలేకపోయామని వివరించింది. -
అవసరమైతేనే అక్కడికి వెళ్లాలంటా!
రాయదుర్గం: వైద్య రంగంలో సాంకేతికంగా వస్తున్న మార్పులను ప్రజలు అందిపుచ్చుకోవాలని కేర్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ సోమరాజు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ‘చేంజింగ్ రోల్ ఆఫ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్, ఇండస్ట్రీ ప్రస్పెక్టివ్’ అంశంపై ఒక రోజు జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఎవరికివారు షుగర్ లెవల్స్, బ్లడ్ప్రెషర్ తెలుసుకునే పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు, ఆస్పత్రులను పరిశుభ్ర వాతావరణంలో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రుల నిర్వహణా లోపం, వైద్యుల తప్పిదాల కారణంగా ఏటా 98 వేల మంది రోగులు మృత్యువాత పడుతున్నారన్నారు. పరిస్థితులకు అనుగుణంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, ప్రతి చిన్న రోగానికి ఆస్పత్రికి వెళ్లడం మంచిది కాదన్నారు. డీఎంఈ డాక్టర్ ఎం రమణి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించిందన్నారు. మెరుగైన వైద్య సేవలు, అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ రాజశేఖర్, డాక్టర్ సీత, డాక్టర్ జీవిఆర్కె ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మారథాన్ అదిరింది!
- ఉత్సాహంగా సాగిన ఎయిర్టెల్ హైదరాబాద్ రన్ - నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగిన పరుగు - 10కే మహిళా విభాగంలో నల్లగొండ బిడ్డ దూకుడు సాక్షి, హైదరాబాద్: టీనేజీ కుర్రాళ్లు.. పాతికేళ్ల యువకులు.. ఉద్యోగులు.. మహిళలు.. రిటైరైన పెద్దలు.. ఒకరి అడుగులో ఒకరు అడుగులేస్తూ సాగిపోయారు.. వెనకబడ్డ వారికి ముందున్న వారు స్ఫూర్తి రగిల్చారు.. పోటీ పడుతూనే తోటివాళ్లు కూడా లక్ష్యాన్ని అందుకోవాలని ఆశపడ్డారు.. అన్ని వయసుల వారు ఎంతో ఉత్సాహంగా పరుగులు పెట్టారు. దాదాపు 11 వేల మంది ఔత్సాహికులు పాల్గొన్న ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ ఉల్లాసంగా సాగింది. ఆదివారం నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగిన ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్లో హైదరాబాదీలతో పాటు ఇతర రాష్ట్రా లు, విదేశాలకు చెందిన రన్నర్లు పాల్గొన్నారు. మహిళల విభాగంలో విజేతలు.. ఫుల్ మారథాన్ (42.195 కిలోమీటర్లు)లో మహారాష్ట్రకు చెందిన జ్యోతి గవాటే 2 గంటల 59 నిమిషాల 9 సెకన్లతో (2:59:09)తొలిస్థానంలో నిలిచింది. ఇథియోపియాకు చెందిన రుత్ ఎంజరి 2:17:39 గంటలు, హివోటా టీ 2:33:5 గంటలతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. హాఫ్ మారథాన్ (21.1 కి.మీ.)లో పంజాబ్కు చెందిన అమన్దీప్ (1:31:52 గంటలు), సీమ (1:32:15 గంటలు), సిమ్టా (1:44:26 గంటలు) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 10కే రన్ విభాగంలో 40 నిమిషాల 27 సెకన్ల (40:27)తో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వై.నవ్య తొలి స్థానంలో నిలిచింది. 40:52 నిమిషాలతో యామిని, 43:46 నిమిషాలతో శిల్ప ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. పురుషుల విభాగంలో విజేతలు.. ఫుల్ మారథాన్లో ఇథియోపియాకు చెందిన మెస్ఫిన్ మెల్సె బల్లక్ 2:32:16 గంటలతో తొలిస్థానం ఆక్రమించాడు. 2:32:21 గంట లతో ఫిలిప్ రెండో స్థానంలో, 2:33:5 గంటల తో టిటస్ మూడో స్థానంలో నిలిచారు. హాఫ్ మారథాన్లో పంకజ్ కుమార్ 1:10 :25 గంటలు, శంకర్ క్షేత్రి 1:11:44 గంటలు, దీపక్ కుమార్ 1:12:56 గంటలతో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 10కే రన్ను కుల్దీప్ 32:33 నిమిషాలు, సతేందర్ 32:35 నిమిషాలు, విపిన్ కుమార్ 32:51 నిమిషాల్లో పూర్తిచేశారు. వీరందరికీ భారతి ఎయిర్టెల్ తెలంగాణ, ఏపీ సీఈవో వెంకటేశ్ విజయ రాఘవన్, ఈవెంట్ అంబాసిడర్ ఫిల్ మాఫిటోన్, నగర రేస్ డెరైక్టర్ మురళి, కేర్ ఆస్పత్రి తరఫున మహేందర్ పాల్ నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. -
విశాఖ కేర్ ఆస్పత్రి ముందు ఉద్రిక్తత
-
మాజీ ఎమ్మెల్యే విఠల్ రావు దేశ్పాండే కన్నుమూత
హైదరాబాద్సిటీ: ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రావు దేశ్పాండే(84) కన్నుమూశారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన నాంపల్లిలోని కేర్ ఆసుపత్రిలో చేరారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం విఠల్రావు తుదిశ్వాస విడిచారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి 1962లో శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిన్నారికి కన్నీటి వీడ్కోలు
-
చిట్టితల్లీ... కళ్లు తెరువమ్మా..!
- రమ్య మృతదేహం చూసి తల్లడిల్లిన తల్లి రాధిక - అంబర్పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు హైదరాబాద్ : ‘అమ్మా రమ్యా.. చిట్టి తల్లీ.. ఒక్కసారి కళ్లు తెరువమ్మా... ఒక్కసారి లేచి మాట్లాడమ్మా... నువ్వు లేకుండా ఇక నేనెందుకు బతకాలి’... బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి రమ్య మృతదేహాన్ని చూసి తల్లడిల్లిన కన్న తల్లి రాధిక రోదన ఇది. రాధిక ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న కుటుంబీకులు ఆఖరి నిమిషం వరకు రమ్య మృతిచెందిన వార్త తెలియనీయలేదు. ఉస్మానియా ఆస్పత్రిలో రమ్య మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షలకు తరలించే ముందు మాత్రమే చూపించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులు బాగ్అంబర్పేట డీడీ కాలనీలోని తాతయ్య సురేంద్రనాథ్ నివాసానికి చిన్నారి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. రమ్యను చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘అక్కకు ఏమైంది నాన్నా’ అంటూ రమ్య చెల్లెలు రష్మీ అమాయకంగా అడుగుతుంటే... అంతా బోరున విలపించారు. అంబర్పేట శ్మశానవాటికలో సాయంత్రం రమ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. చికిత్స పొందుతోందని చెప్తూ... పంజగుట్ట ఠాణా పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని పంజగుట్ట హిందూ శ్మశానవాటిక వద్ద ఈ నెల 1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రమ్య చిన్నాన్న రాజేష్ అక్కడిక్కడే మరణించారు. చిన్నారితో పాటు తల్లి రాధిక తీవ్రంగా గాయపడగా.. మరో చిన్నాన్న రమేష్, తాత మధుసూదనాచారి క్షతగాత్రులయ్యారు. రాధిక యశోద ఆస్పత్రిలో, రమ్య కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొమ్మిది రోజుల పాటు కోమాలో ఉండి, మృత్యువుతో పోరాడిన రమ్య శనివారం తుదిశ్వాస విడిచింది. అయితే రాధిక ఆరోగ్య పరిస్థితి రీత్యా కుటుంబీకులు ఈ విషయం ఆమెకు తెలియనీయలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందనే చెప్పుకుంటూ వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి ముందు... యశోద ఆస్పత్రితో ఉన్న రాధికను అంబులెన్స్లో కేర్ ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చి, అసలు విషయం చెప్పారు. స్ట్రెచర్పై చిన్నారి మృతదేహాన్ని రాధిక ఉన్న అంబులెన్స్ వద్దకు తీసుకువచ్చి చూపించారు. తీవ్ర గాయాలతో ఉన్న రాధిక... కుమార్తె మృతదేహాన్ని చూసి ‘చిట్టితల్లీ.. చిట్టితల్లీ’ అంటూ గుండెలవిసేలా రోదించడం అక్కడున్నవారందరినీ కదిలించింది. వాళ్లకు తగిన శిక్ష పడాలి ‘ఆ రోజు మేము మా కారులో నెమ్మదిగా వెళ్తున్నాం. తాగిన మైకంలో ఉన్న ఆరుగురు యువకులతో కూడిన మరో కారు అదుపు తప్పిన వేగంగా వచ్చి డివైడర్ పైనుంచి ఎగిరి మా కారుపై పడింది. నా మరిది రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు నా కూతుర్నీ కోల్పోయాను. ఈ ప్రమాదానికి కారకులైన వారికి తగిన శిక్ష పడాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దు.’ - రమ్య తల్లి రాధిక -
చిన్నారికి కన్నీటి వీడ్కోలు
చిట్టితల్లి రమ్య మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచింది. ఈనెల 1వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని పంజగుట్ట హిందూ శ్మశానవాటిక ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ్య చిన్నాన్న రాజేష్ అక్కడిక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ రమ్యను కేర్ ఆస్పత్రికి, తల్లి రాధికను యశోద ఆస్పత్రికి తరలించారు. ఆదివారం కన్నబిడ్డను కడసారి చూసి తల్లి తల్లడిల్లిన తీరు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. అంబర్పేట: బంజారాహిల్స్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి రమ్య మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం కన్నుమూసింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ గారాలపట్టి ఇక తిరిగి రాని లోకాలు వెళ్లిపోయిందని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. బంధు, మిత్రులు, కాలనీవాసుల రోదనలతో అంబర్పేట డీడీ కాలనీ శోకసంద్రంగా మారింది. బంజారా హిల్స్లో జరిగిన ప్రమాదంలో జూబ్లీహిల్స్లో నివసించే వెంకటరమణ, రాధికల పెద్ద కుమార్తె రమ్య గాయపడ్డ విషయం తెలిసిందే. చికిత్సపొందుతూ రమ్య తుది శ్వాశ విడవడంతో పోస్టుమార్టం అనంతరం ఉస్మానియా ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని ఆదివారం బాగ్ అంబర్పేట డీడీ కాలనీలో అమ్మమ్మ విజయలక్మి, తాతయ్య సురేంద్రనాథ్ల నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే తండ్రి, అమ్మమ్మ, తాతయ్యలకు ఒక్కసారిగా దుఃఖ కట్టలు తెంచుకుంది. నిర్జీవంగా పడివున్న రమ్యను చూసి బోరుమన్నారు. ఇదే ప్రమాదంలో గాయపడ్డ తల్లీ రాధిక మంచంపై కదలలేని స్థితిలో ఉంది. పక్కనే ఉన్న కూతురి మృతదేహాన్ని చూస్తూ కన్నీరుపెట్టుకున్న ఆమె ను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కూతురి మృతదేహం ఒక పక్క, గాయపడి కదలేని స్థితిలో భార్య మరోపక్క ఉండటంతో వెంకటరమణ పరిస్థితి వర్ణనాతీతం. అంతేకాకుండా ఆయన సోదరుడు రాజేష్ ఘటనా స్థలంలోనే మృతితో శోకసంద్రంలో ఉన్న ఆ కుటుంబాన్ని చిన్నారి రమ్య మృతి మరింత కృంగదీసింది. బంధు, మిత్రుల సందర్శన అనంతరం చిన్నారి రమ్య మృతదేహాన్ని అంబర్పేట శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి రమ్య కుటుంబసభ్యులను పరామర్శించి, సంతాపం తెలియజేశారు. దురదృష్టకరం : మంత్రి తలసాని గన్ఫౌండ్రీ: బంజారాహిల్స్ జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారి రమ్య మృతదేహానికి ఆదివారం ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని ఉస్మానియాకు వచ్చి రమ్య బంధువులను పరామర్శించారు. -
నటుడు కృష్ణంరాజుకు అస్వస్థత
హైదరాబాద్: రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం గురి కావడంతో ఆదివారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ లో ఆయనను చేర్చారు. డాక్టర్ సోమరాజు నేతృత్వంలో వైద్య బృందం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం హీరో ప్రభాస్ గంటపాటు ఆస్పత్రిలో కృష్ణంరాజు వద్ద ఉన్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కేర్ వైద్యులు వెల్లడించారు. -
ఈ చిన్నారి.. చిరంజీవి
♦ ఐదుగురికి జీవితాన్నిచ్చిన18 నెలల బాలుడు ♦ కన్నపేగు కోత దిగమింగి..తల్లిదండ్రుల స్ఫూర్తి ♦ చిన్నారి అవయవదానం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రథమం సాక్షి, విశాఖపట్నం : అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు హఠాత్తుగా ప్రమాదానికి గురయ్యాడు. పద్దెనిమిది నెలల ప్రాయంలోనే బ్రెయిన్డెడ్ అయ్యాడు.నిన్నటి దాకా గోరుముద్దలు తినిపించిన తమ చిన్నారి ఇక లేడని తెలియడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేదు. అయినా దానిని దిగమింగుకొని ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే నిర్ణయం తీసుకున్నారు. తమ చిన్నారి అవయవదానానికి అంగీకరించి ఆదర్శప్రాయంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే... విశాఖలోని ఆరిలోవలో ఉంటున్న మద్ది వెంకటనారాయణరాజు చిన్న కుమారుడు రోహిత్ (18 నెలలు) మర్రిపాలెంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి ఈనెల 11న తల్లితో వెళ్లాడు. ఆ రాత్రి ఆడుకుంటూ బయటకు వచ్చిన రోహిత్పై అక్కడే పార్క్ చేసి ఉన్న బైక్ పడింది. తలకు తీవ్రగాయాలైన బాలుడిని నగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం చిన్నారి బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయాన్ని తండ్రికి తెలియజేశారు. అవయవదానంపై అవగాహన కల్పించడంతో ఆ తండ్రి తన కుమారుడి అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. దీంతో రోహిత్ను నగరంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. జీవన్దాన్ సంస్థ ద్వారా అవయవదానం ప్రక్రియను రాత్రి 10.30 గంటలకు పూర్తి చేశారు. రోహిత్ రెండు కళ్లు మోహిసిన్ ఐ బ్యాంకుకు, రెండు కిడ్నీలు, కాలేయాన్ని విశాఖ కేర్ ఆస్పత్రిలోని రోగులకు దానం చేశారు. దీంతో ఆ చిన్నారి తాను మరణించి మరో ముగ్గురికి ప్రాణదానం, ఇద్దరికి చూపును ప్రసాదించి ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. పద్దెనిమిది నెలల వయసులో ఓ చిన్నారి అవయవాలను దానం చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రథమమని జీవన్దాన్ ప్రతినిధులు ‘సాక్షి’కి చెప్పారు. -
ఛత్తీస్లో ఎన్కౌంటర్
ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చింతూరు: ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా అటవీప్రాంతంలో శనివారం నక్సల్స్, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని పఖంజూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఛోటేబేటియా అటవీప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో బీఎస్ఎఫ్ 117వ, 122వ బెటాలియన్, జిల్లా పోలీసు బృందం సంయుక్తంగా గాలింపు చేపట్టింది. రాత్రి దాదాపు 2.30గంటలకు ఈ బృందం అడవిలో బేచా గ్రామ సమీపంలోని చిన్న నది దగ్గరకు చేరుకోగానే పోలీసులను చూసి నక్సల్స్ ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దాదాపు గంటపాటు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రగాయాలైన బీఎస్ఎఫ్ జవాన్లు విజయ్ కుమార్, రాకేశ్ నెహ్రాలను చికిత్స నిమిత్తం రాయ్పూర్కు హెలికాప్టర్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. రాయ్పూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో జవాను మృతిచెందారు. కొందరికి రాయ్పూర్లోని రామకృష్ణ కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు కాంకేర్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ జయంత్ వైష్ణవ్ పీటీఐతో చెప్పారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో శనివారం ఓ యాత్రికుల బస్సును దగ్ధం చేసిన మావోయిస్టులు సుక్మా జిల్లా భెర్జీ వద్ద ఓ ఆటోను తగలబెట్టారు. -
విధి చిదిమేసింది..
ఆ యువకుడికి భవిష్యత్పై ఎన్నో ఆశలు.. మరెన్నో బరువు బాధ్యతలు.. వాటన్నిటినీ మోయడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించాలనుకున్నాడు. అందుకు ప్రభుత్వ ఉద్యోగమే సరైనదని భావించేవాడు. అందుకోసం కష్టపడి చదివేవాడు. ప్రతిభావంతుగా పేరు తెచ్చుకున్నాడు. వారం రోజుల్లో స్టీల్ప్లాంట్లో జరిగే జూనియర్ ఇంజినీర్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే విధికి క న్నుకుట్టింది. అతని కలలనూ, కొడుకుపై పెట్టుకున్న ఆశలనూ రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చి చిదిమేసింది. ఈ విషాదగాథ రోడ్డు ప్రమాదంలో గాయపడి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్డెడ్ అయి, అవయవదానం చేసిన అల్లాడ సాయికుమార్ది. విశాఖపట్నం/అల్లిపురం: సాయికుమార్ నగర శివారులోని రఘు ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. కాలేజీలో 80 శాతం మార్కులు సాధిస్తూ ప్రతిభావంతుడిగానే గాక బుద్ధిమంతుడిగానూ పేరు సంపాదించాడు. తల్లిదండ్రులు చంద్రశేఖర్, కోటలక్ష్మిల పేదరికాన్ని చూసిన సాయికుమార్ అమ్మానాన్నలు పంపే డబ్బును అతి పొదుపుగా ఖర్చు పెట్టేవాడు. తాను తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుని స్నేహితులతో బయటకు కూడా వెళ్లేవాడు కాదు. తొందరగా ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వోద్యోగం సంపాదించాలని తరచూ స్నేహితులతో చెప్పేవాడు. తన ఉద్యోగంతో అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించాలని చెబుతుండేవాడు. ఇటీవల జరిగిన ‘గేట్ 2016’ పరీక్ష కూడా బాగానే రాశాడు. ఈ నెల 28న జరిగే స్టీల్ప్లాంట్ జూనియర్ ఇంజనీర్ పరీక్షకు హాజరవుతున్నాడు. హాల్టిక్కెట్టు కూడా తీసుకున్నాడు. ఈ పరీక్ష కోసం రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నాడు కూడా. తల్లిదండ్రులకు సాయికుమార్ ఒక్కడే కొడుకు. మరొక కుమార్తె ప్రియాంక. ఈమె బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ‘నిన్ను ఎమ్మెస్సీ చదివిస్తాను బాగా చదువు చెల్లెమ్మా!’ అంటుండేవాడు. ఎదిగివచ్చిన కొడుకు కొన్నాళ్లలోనే ఉద్యోగంలో చేరతాడని, తమ కష్టాలు తీరతాయని ఎన్నో కలలు కంటున్నారు. ఇంతలోనే పిడుగులాంటి వార్త! సాయికుమార్ బైకు ప్రమాదంలో గాయపడ్డాడని. కొడుకు తొందరగా కోలుకోవాలని తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్నేహితులు కోటి దేవుళ్లకు మొక్కుకున్నారు. కానీ ఏ దేవుడూ కనికరించలేదు. సాయికుమార్ బ్రెయిన్డెడ్ అయి బతకడని వైద్యులు గుండెలు పిండేసే చేదు నిజాన్ని వెల్లడించారు. ఒకపక్క పుట్టెడు విషాదంలో ఉన్న వారంతా గుండె నిబ్బరం చేసుకుని సాయికుమార్ అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ఫలితంగా సాయికుమార్ మరణించాక కూడా ముగ్గురికి ప్రాణదానం, మరో ఇద్దరికి వెలుగు ప్రసాదించగలిగాడు. విషణ్ణవదనంతో బంధుమిత్రులు, స్నేహితులు సాయికుమార్ మృతదేహాన్ని స్వగ్రామం కేడీపేటకు తరలించారు. జీర్ణించుకోలేకపోతున్నాం.. సాయికుమార్ స్నేహితులతో చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు. ఒకసారి స్నేహం చేస్తే ఎవరూ ఆయనను వదులుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడూ చదువుపైనే ధ్యాస. ఎక్కడికైనా వెళ్దామన్నా వచ్చేవాడు కాదు. మా ఫ్రెండ్ ఇక లేడన్న నిజాన్ని మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం. - జిలానీ బాషా, సాయికుమార్ స్నేహితుడు -
కేర్ హాస్పిటల్స్ భారీ విస్తరణ
♦ కొత్తగా మరిన్ని ఆసుపత్రులు ♦ అడ్వెంట్ వాటా అబ్రాజ్ గ్రూప్ చేతికి ♦ సాక్షితో కేర్ ఫౌండర్ డాక్టర్ బి.సోమరాజు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కేర్ హాస్పిటల్స్ భారీగా విస్తరిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రతిపాదిత హెల్త్ సిటీలో ఔట్ పేషెంట్ సెంటర్ను ఏడాదిలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బంజారాహిల్స్ ఔట్ పేషెంట్ కేంద్రం మాదిరిగా దీనిని నిర్మించనున్నారు. వైజాగ్ హెల్త్ సిటీలో రూ.100 కోట్లతో 250 పడకల హాస్పిటల్ ఏడాదిలో సాకారం కానుంది. ఈ నగరంలో సంస్థ ఇప్పటికే మూడు కేంద్రాలను నిర్వహిస్తోంది. విజయవాడలో కేర్కు 4 ఎకరాల స్థలం ఉంది. 250 పడకలతో కొత్తగా ఆసుపత్రి నిర్మించే అవకాశం ఉంది. లేదా ఇప్పటికే విజయవాడలో ఉన్న ఏదైనా ఆసుపత్రిని కొనుగోలు చేసే అంశాన్నీ పరిశీలిస్తున్నట్టు కేర్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ బి.సోమరాజు బుధవారమిక్కడ వెల్లడించారు. కేర్లో ప్రధాన వాటాదారుగా ఉన్న అడ్వెంట్ వాటాను దుబాయికి చెందిన అబ్రాజ్ గ్రూప్ కొనుగోలు చేస్తోంది. ఈ విశేషాలను ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో పంచుకున్నారు. అందుబాటు ధరలో వైద్య సేవలు అందించడంపై ఇరు సంస్థలు ఫోకస్ చేస్తాయని చెప్పారు. ప్రారంభానికి సిద్ధంగా.. భాగ్యనగరిలో రాయదుర్గం వద్ద ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. సామర్థ్యం 250 బెడ్స్ కాగా, రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఈ కేంద్రాన్ని మార్చిలో ప్రారంభించేందుకు కేర్ సమాయత్తమవుతోంది. అలాగే రూ.100 కోట్లతో నిర్మిస్తున్న భువనేశ్వర్ కేంద్రాన్ని ఈ ఏడాదే తెరుస్తామని సోమరాజు పేర్కొన్నారు. హైదరాబాద్సహా 9 నగరాల్లో సంస్థ 16 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. పడకల సంఖ్య 2,600 పైమాటే. కేర్ చరిత్రలో ఇప్పటి వరకు 60 లక్షల మంది ఔట్పేషెంట్లు, 10 లక్షలకుపైగా ఇన్పేషెంట్లకు వైద్య సేవలను అందించింది. భారత్లో 5వ అతిపెద్ద వైద్య సంస్థగా ఎదిగింది. వైద్యం ఇప్పుడు ఖరీదైందని.. వైద్య పరికరాలు, ఔషధ తయారీ సంస్థలు కొన్ని సందర్భాల్లో వైద్య రం గాన్ని శాసిస్తున్నాయని సోమరాజు చెప్పారు. ప్రభుత్వం తన పాత్ర మర్చిపోయిందన్నారు. పరిశ్రమలో నియంత్రణ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. కేర్లోకి అబ్రాజ్ గ్రూప్.. కేర్లో ప్రధాన వాటాను అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ 2012 ఏప్రిల్లో రూ.523 కోట్లకు కొనుగోలు చేసింది. కేర్లో మొత్తంగా అడ్వెంట్ రూ.650 కోట్లదాకా పెట్టుబడి చేసింది. అడ్వెంట్ ఇంటర్నేషనల్కు సంస్థలో 72 శాతం, సోమరాజుతోసహా ఇతర వాటాదారులకు 28 శాతం వాటా ఉంది. సంస్థలో అడ్వెంట్కు ఉన్న వాటాను అబ్రాజ్ గ్రూప్ కొనుగోలు చేస్తోంది. మార్చికల్లా ఈ డీల్ పూర్తి కానుంది. ఇందుకోసం అబ్రాజ్ గ్రూప్ సుమారు రూ.1,800 కోట్లు వెచ్చిస్తోందని సమాచారం. వాటాలు మారినప్పటికీ మేనేజ్మెంట్లో ఎటువంటి మార్పు లేదని సోమరాజు వెల్లడించారు. ఈ సంస్థ కేర్లో ప్రస్తుతం రూ.200 కోట్లు పెట్టుబడి పెడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని కొత్త ఆసుపత్రులకు వెచ్చిస్తామని చెప్పారు. -
33 వారాల పాపకు పునర్జన్మ
- పుట్టుకతోనే మూసుకుపోయిన రెండు నాసికా రంధ్రాలు - ‘నాసల్ ఎండోస్కోపి’తో పునరుద్ధరించిన ‘కేర్’ వైద్యులు సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే రెండు నాసికా రంధ్రాలు మూసుకుపోయిన 33 వారాల శిశువుకు కేర్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మ ఇచ్చారు. ముక్కు రంధ్రాలు లేకపోవడంతో నోటి ద్వారా అతికష్టం మీద శ్వాస తీసుకుంటున్న పాపకు ‘నోసల్ ఎండోస్కోపి’ ద్వారా కొత్త ఊపిరి పోశారు. గురువారం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ విష్ణుస్వరూప్రెడ్డి శస్త్రచికిత్స వివరాలను తెలిపారు. చాంద్రాయణగుట్ట బార్కస్కు చెందిన గర్భిణి నెల రోజుల క్రితం నైస్ ఆస్పత్రిలో 1.10 కేజీల బరువున్న ఆడ శిశువు(షరీపా ఫాతిమా)కు జన్మనిచ్చింది. అయితే పాపకు పుట్టుకతోనే రెండు నాసికా రంధ్రాలు మూసుకుపోయి ఉండటంతో స్థానిక వైద్యులు వెంటిలేటర్ సహాయంతో నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించారు. మెరుగైన చికిత్స కోసం కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈఎన్టీ వైద్యనిపుణుడు డాక్టర్ విష్ణుస్వరూప్రెడ్డి పాపకు పలు వైద్యపరీక్షలు చేసి ఊపిరితిత్తులకు శ్వాసను అందించే రెండు నాసికా రంధ్రాలు లోపలి భాగంలో నాళాలకు ఎముక అడ్డుగా రావడంతో మూసుకుపోయినట్లు గుర్తించారు. ప్రతి ఏడు వేల మందిలో ఒక్కరికి మాత్రమే ఇలాంటి సమస్య తలెత్తుతుంది. అది కూడా ఒక రంధ్రం మూసుకుపోయి మరో రంధ్రం తెరచి ఉంటుంది. కానీ ఈ పాపకు రెండు రంధ్రాలు మూసుకుపోయాయి. నాసికారంధ్రాలకు అడ్డుగా ఉన్న ఎముకకు శ్వాస తీసుకునేందుకు వీలుగా రంధ్రం చేసేందుకు ప్రత్యేకంగా ఓ డ్రిల్లర్ను వైద్యులు రూపొందించారు. 4 వారాల క్రితం పాపకు ‘నాసల్ ఎండో స్కోపి’ పద్ధతిలో నాళానికి అడ్డుగా ఉన్న ఎముకకు రంధ్రం చేసి మూసుకుపోయిన నాసిక రెండు నాళాలను తెరిచారు. తాత్కాలికంగా ఓరల్ ఎయిర్వేస్ లైఫ్ సేవింగ్ పైప్స్ను అమర్చామని, 6 వారాల తర్వాత పైపులను తొలగించనున్నట్లు విష్ణుస్వరూప్రెడ్డి తెలిపారు. ఆ తర్వాత పాప ముక్కు ద్వారా స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటుందన్నారు. ఈ తరహా శస్త్రచికిత్స దేశంలోనే మొదటిదని పేర్కొన్నారు. -
కేజీహెచ్ పై దిగివచ్చిన ప్రభుత్వం
విశాఖ మెడికల్: కేజీహెచ్లో గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిన కేర్ ఆస్పత్రికి అప్పగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఎట్టకేలకూ వెనక్కుతీసుకొంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే కార్డియోథొరాసిక్ సర్జన్లు అందుబాటులో లేకపోవడంతో పీపీపీ విధానంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి సర్జన్లను రప్పించి శస్త్రచికిత్సలు చేయించాలని ప్రభుత్వం భావించింది. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్యా సంచాలకుల సూచనల మేరకు కేజీహెచ్లో గుండె శస్త్రచికిత్సలను కేర్ ఆస్పత్రి కార్డియోథొరాసిక్ సర్జన్ల పర్యవేక్షణలో నిర్వహించాలని తొలుత నిర్ణయించి ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై ఈ నెల 16న సాక్షిలో ‘కేజీహెచ్ గుండె ప్రైవేటు పరం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఇతర పలు ప్రజాసంఘాలు, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టాయి. దీంతో ప్రభుత్వం కేర్ ఆస్పత్రితో ఒప్పందాన్ని రద్దుచేసుకుంది.ఖాళీగా ఉన్న ఓపెన్ హార్ట్ సర్జన్ పోస్టును భర్తీచేసింది. దాదాపు ఏడాదిన్నర తరువాత ఓపెన్ హార్ట్ సర్జరీలకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. -
వెజిటేరియన్లలో విటమిన్ బి12 లోపిస్తే..!
మనం ఏ పని చేయాలన్నా అవసరమైనది మన మెదడు, నాడీ వ్యవస్థ చక్కగా ఉండటం. ఆ మెదడు నుంచి అన్ని అవయవాలకూ ఆదేశాలు సక్రమంగా అందడం. అందుకు ఉపయోగపడే అత్యంత కీలకమైన పోషకమే... ‘విటమిన్-బి12’. ఇది కేవలం మెదడు నుంచి అన్ని అవయవాలకూ ఆదేశాలు అందేలా చేయడమే కాదు... రక్తం పుట్టుకలోనూ పాలుపంచుకుంటుంది. ప్రతి కణంలో జరిగే జీవక్రియల్లో భాగస్వామ్యం తీసుకుని డీఎన్ఏ పుట్టుకలో, అమైనో యాసిడ్స్ కార్యకాలాపాల్లో (మెటబాలిజమ్లో) పాలుపంచుకుంటుంది. మాంసాహారంలోనే పుష్కలంగా లభించే విటమిన్ బి12... శాకాహార నియమాన్ని చాలా కఠినంగా పాటించేవారిలో చాలా తక్కువగా ఉంటుంది. దాంతో వారికి కొన్ని సమస్యలు రావడం సాధారణం. వాటిని అధిగమించి, మన నాడీవ్యవస్థనూ, కణాల్లోని జీవక్రియలనూ సక్రమంగా పనిచేయించడం ఎలాగో చెప్పుకుందాం. శాకాహారుల్లో విటమిన్ బి12 ఎందుకు తక్కువ... విటమిన్ బి12ను మొక్కలుగానీ, ఫంగస్గానీ... ఆ మాటకొస్తే జంతువులుగానీ సృష్టించలేవు. కేవలం బ్యాక్టీరియా దాంతో పాటూ ఆర్చియా అనే ఏకకణ జీవులు మాత్రమే ఈ విటమిన్ను సృష్టించగలవు. ఆర్చియా అనేది ఎంత చిన్న జీవి అంటే ఏకకణజీవికంటే కూడా తక్కువ స్థాయి జీవి. ఈ ఏకకణానికి న్యూక్లియస్ (కేంద్రకం) ఉండదు. ఇదొక కణమనీ, కణంలోని భాగాలని అని నిర్దిష్టంగా చెప్పేందుకు వాటి విభాగాలూ, పైపొరలూ కూడా ఉండవు. కానీ బ్యాక్టీరియా, ఆర్కియా వెలువరించే ఎంజైముల సంయోగంతో ఈ ప్రపంచంలో విటమిన్-బి12 స్వాభావికంగా తయారవుతుంది. పైగా దీని నిర్మాణం చాలా సంక్లిష్టమైనది. ఇది జంతువులకు మేలు చేసే బ్యాక్టీరియా మనుగడ సాగించే చోట... అంటే... జంతువుపై ఆధారపడి బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా వెలువరించే పదార్థాలతో జంతువులూ ఇలా పరస్పరం సహాయం (సింబయాసిస్) చేసుకుంటూ ఉండే ప్రదేశాలలో మాత్రమే ఈ విటమిన్ పుడుతుంది. అందుకే ఇది జంతుమాంసం, జంతు ఉత్పాదనల వనరులనుంచే ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. అందుకే శాకాహార నియమాన్ని చాలా కఠినంగా పాటించేవారిలో ఇది చాలా తక్కువ. విటమిన్ బి12 లోపం ఉంటే... ⇒ విటమిన్ బి12 లోపం ఉన్నవారు ఎప్పుడూ చాలా అలసటగా, నీరసంగా ఉంటారు. నిస్సత్తువ ఆవరించి ఉన్నట్లుగా ఫీలవుతుంటారు. ⇒ విటమిన్ బి12 లోపం వల్ల ఆక్సిజన్ను అన్ని అవయవాలకూ తీసుకెళ్లే ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ కండిషన్ను ‘విటమిన్-బి12 అనీమియా’ అంటారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మన శరీరం చాలా పెద్దసైజు ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటినే మెగాలోబ్లాస్టిక్, మ్యాక్రోసైటిక్ ఎర్రరక్తకణాలంటారు. ఇవి తమ విధిని సక్రమంగా నిర్వహించలేవు. ⇒ విటమిన్-బి12 అనీమియా వల్ల అలసట, నిస్సత్తువలతో పాటు ఒక్కోసారి ఊపిరి సరిగా అందకపోవడం జరగవచ్చు. ⇒ తలనొప్పి, చెవుల్లో ఏదో హోరు వినిపించడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. మరింత నిర్దిష్టమైన లక్షణాలు : చర్మం పసుపుపచ్చరంగులోకి మారడం నాలుకపూయడం నోట్లో పుండ్లు కొన్ని ప్రదేశాల్లో స్పర్శజ్ఞానం కోల్పోవడం నొప్పి ఎక్కువగా తెలియకపోవడం నడుస్తున్నప్పుడు పడిపోవడానికి అవకాశం చూపు సరిగా లేక స్పష్టంగా కనిపించకపోవడం క్షణక్షణానికీ మూడ్స్ మారిపోవడం డిప్రెషన్కు లోనుకావడం మతిమరపు రావడం. శాకాహారులతో పాటు... ఇంకా ఎవరెవరిలో తక్కువ... సాధారణంగా 75 ఏళ్లకు పైగా వయసు పైబడిన వారిలో ఇది తక్కువ పుట్టుకతో వచ్చే జబ్బు అయిన పెర్నీషియస్ అనీమియా అనే కండిషన్ ఉన్నవారిలో ఇది తక్కువ. ఈ కండిషన్ ఉన్నవారిలో ఒక ప్రోటీన్ లోపం వల్ల జీర్ణమైన ఆహారం నుంచి విటమిన్ బి12 ను సంగ్రహించే సామర్థ్యం లోపిస్తుంది. అందుకే ఇలాంటి కుటుంబ చరిత్ర ఉన్న వారిలో 60 ఏళ్లు దాటిన మహిళల్లో ఇది ఎక్కువ ఇక పొట్ట లోపలిపొర పలచబారిన వారిలోనూ ఇది తక్కువ పొట్టలో పుండ్లు (అల్సర్స్) ఉన్నవారిలో పొట్టలోని కొంతభాగాన్ని సర్జరీ ద్వారా తొలగించిన వారిలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారిలో చాలాకాలంగా అజీర్తి మందులు (ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ -పీపీఐ) వాడుతున్నవారిలోనూ విటమిన్ బి12 పాళ్లు తక్కువ. నిర్ధారణ : సాధారణంగా రక్తపరీక్ష ద్వారా విటమిన్ బి12 లోపం తెలుసుకుంటారు. ఇక ఎర్రరక్తకణాల సైజ్ను బట్టి కూడా విటమిన్ బి12 లోపాన్ని అంచనావేస్తారు. విటమిన్ బి12కు చికిత్స విటమిన్ బి12 తక్కువగా ఉందని రక్తపరీక్షలో నిర్ధారణ అయితే... అలాంటి రోగులకు సాధారణంగా ఆరు బి12 ఇంజెక్షన్లతో ఈ లోపాన్ని భర్తీ చేస్తారు. ఇది రోజుకు ఒకటిగానీ లేదా రెండు నుంచి నాలుగు రోజులకు ఒకటి చొప్పున ఇస్తారు. ఈ విటమిన్ బి12 అంతా కాలేయంలో నిల్వ అయి ఉంటుంది. కొన్ని నెలలపాటు శరీరానికి అవసరమైన జీవక్రియలకోసం శరీరం తన విటమిన్-బి12 అవసరాల కోసం దాన్ని కాలేయం నుంచి తీసుకొని వాడుకుంటుంది. ఒకవేళ పెర్నీషియస్ అనీమియా కారణంగా విటమిన్ బి12 లోపం ఉన్నవారైతే... జీవితకాలం పాటు డాక్టర్లు చెప్పిన మోతాదుల్లో విటమిన్ బి12ను తీసుకుంటూ ఉండాలి. ఇలా విటమిన్ బి12 తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. ఇక కొందరిలో ఇది పెర్నీషియస్ అనీమియా వల్ల కాకుండా పోషకాహారలోపం వల్ల విటమిన్ బి12 లోపం ఏర్పడితే అప్పుడు ఇంజెక్షన్ రూపంలో కాకుండా సైనకోబాలమైన్ టాబ్లెట్ల రూపంలోనూ దీన్ని శరీరానికి అందిస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఎవరికి వారుగా విటమిన్-బి12 టాబ్లెట్లను, ఇంజెక్షన్లను తీసుకోకూడదు. డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వీటిని తీసుకోవాలి. ఎందుకంటే... ఈ ఇంజెక్షన్లనూ, మాత్రలనూ తీసుకునే వారు ఒకవేళ ఇతర మాత్రలనూ వాడుతుంటే... విటమిన్ బి12 ఇంజెక్షన్లూ, మాత్రలూ వాటి కార్యకలాపాలకు అడ్డుపడకుండా చూసేలా డాక్టర్లు మోతాదులను నిర్ణయిస్తారు. నివారణ మాంసాహారంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది గుడ్లు, సముద్రపు చేపలు, పాలలో ఇది ఎక్కువ. మాంసాహారం తీసుకోడానికి ఇష్టపడని వారు ఈ కింది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విటమిన్ బి12ను పొందవచ్చు. శాకాహారులు పుష్కలంగా విటమిన్ బి 12 పొందాలంటే... విటమిన్ బి12తో సమృద్ధం చేసిన (విటమిన్ బి12 ఫోర్టిఫైడ్) బాదం పాలలో ఇది ఎక్కువ విటమిన్ బి12తో సమృద్ధం చేసిన కొబ్బరిపాలలోనూ ఇది చాలా ఎక్కువ పులిసిపోయే స్వభావం ఉన్న ఆహారంలోని ఈస్ట్ (న్యూట్రిషనల్ ఈస్ట్)తోనూ ఈ లోపాన్ని తొలగించుకోవచ్చు విటమిన్ బి12తో సమృద్ధం చేసిన సోయాపాలతో తక్షణం తినగలిగే తృణధాన్యాలు (సి రేల్స్)లో తక్కువ కొవ్వు ఉన్న పాలు తోడుబెట్టి చేసిన పెరుగులోనూ పాలలోనూ, చీజ్లోనూ, వెనిలా ఐస్క్రీమ్లోనూ విటమిన్ బి12 ఎక్కువ. అందుకే శాకాహారులు పైన పేర్కొన్న ఆహారంపై ఆధారపడవచ్చు. - డాక్టర్ ఎమ్. గోవర్థన్ సీనియర్ ఫిజీషియన్,కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
రేపు ఆస్తమా అవగాహనా సదస్సు
హైదరాబాద్ : ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్నెం.10లోని కేర్ ఆస్పత్రి అవుట్పేషంట్ విభాగం గ్రౌండ్ఫ్లోర్లో రేపు ఉదయం 11 గంటల నుంచి ఆస్తమా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. డాక్టర్ కె. శుభాకర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం ఉంటుందని, హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్ జనరల్ మైఖేల్ ములిన్స్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం 9866822286 నంబర్ను సంప్రదించవచ్చని వెల్లడించారు. -
‘కేర్’లోకి మరో హాస్పిటల్
* రూ. 200 కోట్లతో అలగ్జాండ్రియా మెడిసిటీ కొనుగోలు * 250 పడకల హాస్పిటల్కు కేర్ హైటెక్ సిటీగా పేరు మార్పు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హాస్పిటల్స్ను కొనుగోలు చేయడం ద్వారా కేర్ హాస్పిటల్స్ వేగంగా విస్తరిస్తోంది. ఈ మధ్యనే వైజాగ్లో 100 పడకల హాస్పిటల్ను కొనుగోలు చేసిన కేర్ తాజాగా హైదరాబాద్లో మరో హాస్పిటల్ను కొనుగోలు చేసింది. హైటెక్ సిటీ సమీపంలోని 250 పడకల అలగ్జాండ్రియా మెడిసిటీని రూ. 200 కోట్లకు కోనుగోలు చేసినట్లు ప్రకటించింది. కేర్ హైటెక్ సిటీగా ఈ హాస్పిటల్ పేరు మార్చామని, ఇందులో గుండె, నాడీ మండలం, మూత్ర పిండాల వ్యాధుల చికిత్సలకు తోడు ఆంకాలజీ, అవయవాల మార్పిడి చికిత్సలపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు కేర్ హాస్పిటల్ ప్రతినిధి తెలిపారు. ఈ హాస్పిటల్ టేకోవర్కు కావల్సిన నిధులను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ సమకూర్చింది. ఈ హాస్పిటల్ చేరికతో అధునాతనమైన అన్ని రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చినట్లు కేర్ హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్. బి. సోమరాజు తెలిపారు. త్వరలోనే గచ్చిబౌలి సమీపంలో వివిధ హాస్పిటల్స్కు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కొత్త హాస్పిటల్ నిర్మాణం చేపట్టే యోచనలో కేర్ ఉంది. కేర్ హైటెక్ సిటీ రాకతో కేర్ గ్రూప్ హాస్పిటళ్ల మొత్తం పడకల సంఖ్య 2,400కు చేరింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 3,000కు చేరనుంది. -
వైద్యుల పర్యవేక్షణలో మంత్రి పోచారం
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం సాధారణ వైద్య పరీక్షల కోసం కేర్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. దీంతో డాక్టర్ సోమరాజు నేతృత్వంలో వైద్యబృందం మంత్రిని ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తె లిపారు. -
మరో బ్రెయిన్ డెడ్ కేసులో అవయవాలు దానం
విశాఖపట్నం:ఇచ్ఛాపురానికి చెందిన కృష్ణారావు అనే వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అతని మెదడు పనిచేయకపోవటంతో వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. కృష్ణారావు ఊపిరితిత్తులు, కిడ్నీలను సావిత్రిబాయి పూలే ట్రస్టుకు దానం చేశారు. ఆయన రెండు కిడ్నీలను కేర్, అపోలో ఆస్పత్రులకు అందించారు. అలాగే ఊపిరితిత్తులను కేర్ ఆస్పత్రికి అందించారు. ఈ నెల ఆరంభంలో ఇదే తరహా ఘటన ఒకటి చోటు చోసుకున్న సంగతి తెలిసిందే. విజయవాడలో3వ తేదీన సెంటినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద తోట మణికంఠ(21) మోటారు సైకిల్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో మణికంఠ బ్రెయిన్డెడ్ కావడంతో అతని అవయవాలను నలుగురికి దానం చేశారు. -
విజృంభిస్తున్న స్వైన్ఫ్లూ
హైదరాబాద్: స్వైన్ఫ్లూ మరింత బలపడుతోంది. ఎలాంటి వాతావరణంలోనైనా విస్తరించేలా తన పరిధిని పెంచుకుంటోంది. కేవలం చలి తీవ్రతలోనే వైరస్ వ్యాప్తి ఉంటుం దన్న వాదనకు కాలం చెల్లుతోంది. వేడి వాతావరణాన్ని కూడా తట్టుకునే శక్తిని హెచ్1ఎన్1 వైరస్ సాధించింది. సాధారణ జ్వరం, ఒళ్లునొప్పులు ఇతరత్రా కొద్దిపాటి లక్షణాలున్న వారికి కూడా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2009లో ఎంతో తీవ్రమైన వైరస్గా ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు స్వైన్ఫ్లూ తన విస్త్రృతి పెంచుకుంది. వైరస్ వ్యాప్తి చెందే సమయంలో యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం.. తర్వాత అది వాతావరణంలోకి మరింత విస్తరించడంతో అనేకమందికి సోకుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రెండు నెలల్లోనే 61 మంది మృతి స్వైన్ఫ్లూ థర్డ్ క్లాస్ ైవె రస్ అని... కాస్తంత ఎండలు కాస్తే అది పోతుందని స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నెలల క్రితం పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయనన్నట్లు స్వైన్ఫ్లూ మాత్రం ఇప్పుడలా లేదు. ఇప్పటికీ తన ఉధృతిని చాటుకుంటోంది. 2009లో జనవరి నుంచి డిసెంబర్ వరకు తెలంగాణ ప్రాంతంలో 638 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఆ ఏడాది 43 మంది చనిపోయారు. అది అప్పట్లో అత్యంత సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి మార్చి 6వ తేదీ నాటికి రెండు నెలల కాలంలో 5,419 శాంపిల్స్ను పరీక్షించగా... 1,731 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో ఏకంగా 61 మంది చనిపోవడం భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది రెండు నెలల కాలంలోనే అంతమంది చనిపోవడంపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. వైరస్ వాతావరణంలోకి విస్తరించిందంటున్నారు. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. దీనికితోడు పరీక్షల్లో స్వైన్ఫ్లూతో పాటు రెండు మూడు పరీక్షలు సాధారణంగా చేస్తార ని.. అదనంగా ఇంకేమైనా కొత్త వైరస్ ఉందా అన్న విషయం ప్రస్తుతం చేస్తున్న పరీక్షల్లో వెల్లడి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్లోనే ఆ వివరాలు బయటపడతాయని అంటున్నారు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. పాలమూరులో మూడుస్వైన్ఫ్లూ కేసులు మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో తాజాగా మూడు స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. రెండురోజుల క్రితం మహబూబ్నగర్ జిల్లా వనపర్తికి చెందిన శ్రీశైలం, తెల్కపల్లికి చెందిన బాలరాజు అనారోగ్యం బారినపడటంతో జిల్లా ప్రధాన ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. వీరికి స్వైన్ఫ్లూ లక్షణాలు ఉండటంతో నమూనాలు సేకరించి హైదరాబాద్కు పంపించారు. వ్యాధి నిర్ధారణ కావడంతో వారిని ప్రత్యేకవార్డులో ఉంచి చికిత్సలు చేస్తున్నారు. అలాగే జడ్చర్ల పట్టణానికి చెందిన కిరణ్మయికి స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పరీక్షలు చేయించకుండా నేరుగా హైదరాబాద్లోని హోమియోపతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది. నిర్లక్ష్యం ఫలితమే.. 2009లో తీవ్ర వైరస్గా ఉన్న హెచ్1ఎన్1 వైరస్... ఇప్పుడు సర్వసాధారణంగా మారినా... దాని సాంద్రత పెరిగిందని కనీస లక్షణాలున్న వారికి కూడా సోకుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొద్దిపాటి జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉన్నా కూడా చాలామందికి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే ప్రభుత్వ యంత్రాంగంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. మొదట్లో తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. సీఎం కేసీఆర్ అప్పట్లో ప్రత్యేకంగా పర్యవేక్షించడంతో ఉరుకులు పరుగులతో కదిలిన యంత్రాంగం.. ఇప్పుడు కాస్తంత విశ్రాంతి స్థితిలోకి వెళ్లారు. ప్రత్యేక సెల్ కూడా సీరియస్గా ఫోన్కాల్స్ను స్వీకరించడం లేదన్న ఆరోపణలున్నాయి. వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేయాలి స్వైన్ఫ్లూ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం హెచ్1ఎన్1, హెచ్2ఎన్3, ఇన్ఫ్లూయెంజా-ఎ పరీక్షలు మూడూ ఒకేసారి చేస్తున్నారు... అందులో ఒకట్రెండు పాజిటివ్ వస్తున్నాయి. హెచ్1ఎన్1 కాకుండా అదనంగా మరో వైరస్ ఏదైనా ఉందేమోనన్న అనుమానాలు కూడా ఉంటున్నాయి. అందువల్ల ప్రత్యేక పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో పరీక్షించే ల్యాబ్లో అది సాధ్యం కాదు. పుణేలో ఉన్న జాతీయ వైరాలజీ ల్యాబ్లో శాంపిల్స్ను పరీక్షిస్తే స్వైన్ఫ్లూతోపాటు ఇంకేమైనా వైరస్ వృద్ధి చెందుతుందా అన్న విషయం బయటపడుతుంది. అందువల్ల హైదరాబాద్లోనూ వైరాలజీ ల్యాబ్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. -డాక్టర్ ఎస్.ఎ.రఫీ, శ్వాసకోశ, వైద్య నిపుణులు, కేర్ ఆసుపత్రి. -
ఎస్పీవై రెడ్డికి స్వైన్ ఫ్లూ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి స్వైన్ ఫ్లూ సోకినట్లు, చికిత్స కోసం హైదరాబాద్లోని గత నెలలో కేర్ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారని కూడా తెలిసింది. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని ఆయన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. అయితే వైద్యశాఖ అధికారులు ఈ విషయం ధ్రువీకరించడం లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎస్పీవై రెడ్డి దగ్గు, జలుబు చికిత్స కోసం గత నెల 10వ తేదీన కేర్లో చేరారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు స్వైన్ ఫ్లూ సోకిందని జనవరి 17వ తేదీన నిర్ధారించారు. -
అమ్మ కడుపే ఆపరేషన్ టేబుల్!
మెడికల్ వండర్ కాబోయే ఆ తల్లి గుండె గతుక్కుమంది. కడుపులో ఉన్న చిన్నారి గుండె బాగాలేదని తెలిసింది. శిరీష కడుపులోని నలుసు వయసు 23 వారాలే! అయితే, శిరీషకు అప్పటికే ఓ గైనిక్ సమస్య వచ్చింది. అబార్షన్ జరగకుండా గర్భాన్ని నిలపడానికి శస్త్రచికిత్స జరిగింది. గండం గడిచిందనుకుంటే మళ్లీ పిండానికి గుండెజబ్బు! పాతికేళ్ల శిరీష రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ గ్రామంలో సైన్స్ టీచర్. గర్భవతి కాబట్టి రొటీన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంది. ‘ఆయోర్టిక్’ కవాటంలో లోపం వల్ల పిండం గుండె ఎడమవైపు కింది గదిలోని రక్తం పంప్ కావడం లేదని తేలింది. సమస్య అక్కడితో ఆగిపోలేదు. మైట్రల్ వాల్వ్ కూడా లీకవుతోంది. వీటివల్ల గుండె ఎడమవైపున ఉండే గదులు కుంచించుకుపోతున్నాయి. బిడ్డ హృదయం విశాలం చేయమంటున్న తల్లి వేదన డాక్టర్ల హృదయాలను కదిలించింది. హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రి హృద్రోగ నిపుణులు సోమరాజు, చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల స్పెషలిస్ట్ కె.నాగేశ్వరరావు ప్రత్యేక ఆపరేషన్కు సంకల్పించారు. చిన్న కత్తెర్లు కావాలి కడుపులో ఉండగానే చిన్నారికి చికిత్స చేద్దామన్నది డాక్టర్ల ఆలోచన. శస్త్రచికిత్సకు మామూలుగా వాడే ఉపకరణాలు సరిపోవు. చిన్నారి పిండానికి గాటు పెట్టేంత చిన్ని చిన్ని కత్తెర్లు కావాలి. అంత చిన్న గుండెలోకి ప్రవేశపెట్టేంత అతి సన్నటి నాళాలు తేవాలి. అక్కడికి వెళ్లాక అడ్డంకులను వెడల్పు చేసే ప్రత్యేక బెలూన్లు సమకూర్చుకోవాలి. ఇవి ప్రత్యేకంగా రూపొందించుకోవడం ఒక ఎత్తై, ఆర్థిక వనరులను సమీకరించుకోవడం మరో సవాలు. వాటన్నింటినీ కలగలుపుకొని తమ నైపుణ్యాలను అత్యంత శిఖరాగ్ర స్థాయిలో ప్రదర్శించడం మరో ఎత్తు! డాక్టర్లకు ఆపరేషన్ థియేటర్లో సహాయం చేయడానికి అవసరమైన సిబ్బందికి అదనపు శిక్షణ అవసరం. తొలి ప్రయత్నం విఫలం ఆపరేషన్ చేస్తున్న నాగేశ్వరరావుకు బాసటగా డాక్టర్లు మాల్జినీ, కామశ్రీ, సాయిలీల, జగదీశ్, టీవీఎస్ గోపాలు, విద్యాసాగర్, కమల, ఇతర సాంకేతిక సిబ్బందితో పాటు మరో పన్నెండు మంది డాక్టర్ల బృందమూ ముందుకొచ్చింది. పిండం 26 వారాల వయసున్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు. పిండం అనుకూల దిశలో తిరిగి లేనందువల్ల ఆ ప్రయత్నం విఫలమైంది. కాబోయే తల్లిదండ్రులు నిరాశపడ్డా, డాక్టర్ల సంకల్పం సడలలేదు. వారం తర్వాత శిరీషను మళ్లీ ఆసుపత్రికి పిలిపించారు. ఈ సారి వ్యూహం మార్చారు. తొలుత తల్లికి మత్తు ఇచ్చారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టుగా... అమ్మ కడుపుకోతను ఆపడానికి అవసరమైన కోతను మొదట పెట్టారు. తర్వాత పిండాన్ని చేరారు. బిడ్డ కదులుతూ ఉంటుంది కాబట్టి అనుకూల దిశకు రాగానే ఆగేందుకు దాని తొడకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ‘ఫీటల్ అనస్థీషియా’తో కదలికలు ఆగగానే డాక్టర్ల చేతుల కదలికలు మొదలయ్యాయి. ఒక సూది ద్వారా ఒక నాళం తల్లి కడుపు నుంచి బిడ్డ ఛాతీకీ, ఆ ఛాతీలోని గుండె ఎడమవైపు కింది గదికీ చేరింది. నాళం చివరి బెలూన్ ఉబ్బింది. గది తలుపును తెరిచినట్లుగా బెలూన్ ఆయోర్టిక్ వాల్వ్ను తెరిచింది. అడ్డంకిని తొలగించింది. ఆపరేషన్ సక్సెస్! రెండ్రోజుల తర్వాత, పిండం గుండె స్పందనల తీరును ఫీటల్ హార్ట్ స్కాన్తో తెలుసుకున్నారు. అంతా సవ్యం. తల్లీ బిడ్డా క్షేమం. దేశంలోనే ఈ తరహా శస్త్రచికిత్సల్లో ఇది మొదటిది. అమ్మ కడుపులోనే ఆపరేషన్ చేయించుకున్న ఆ బిడ్డ తన తొమ్మిది నెలల గడువు ముగించుకుని, భూమ్మీదకు వచ్చి, డాక్టర్ అంకుల్స్కు థాంక్స్ చెప్పడానికి ఎదురుచూస్తూ ఉంది! - యాసీన్ -
పెరుగుతున్న స్వైన్ ప్లూ కేసులు
-
నేడు వెంకటస్వామి అంత్యక్రియలు
-
వెంకటస్వామి కన్నుమూత
-
వెంకటస్వామి కన్నుమూత
* ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన కాకా * తీవ్ర అస్వస్థతతో ఐదు నెలలుగా కేర్లో చికిత్స * అవయవాలు విఫలమవడంతో మృతిచెందిన కాకా * పంజాగుట్ట శ్మశాన వాటికలో నేడు అంత్యక్రియలు * అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం ప్రకటన * కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిగా, ఎంపీగా వెంకటస్వామి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో కాకలు తీరిన నేతగా.. కాంగ్రెస్వాదుల్లో ‘కాకా’గా చెరగని ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(85) ఇకలేరు. కార్మిక నేతగా ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. సోమవారం రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురై దాదాపు ఐదు నెలలుగా ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారం క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలోకి మార్చారు. క్రమంగా శ్వాస సరిగా తీసుకోలేకపోవడంతోపాటు మూత్రపిండాల పనితీరు మందగించింది. దీంతో ఆయన్ను వెంటిలేటర్పై ఉంచి డయాలసిస్ చేస్తూ వచ్చారు. వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన కన్నుమూసే సమయంలో కుమారులు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్తో పాటు కూతురు, మనుమళ్లు, మనుమరాళ్లు అక్కడే ఉన్నారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ప్రజా గాయకుడు గద్దర్, మాజీ ఎంపీలు రాజయ్య, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి తదితరులు కేర్ ఆసుపత్రికి చేరుకుని వెంకటస్వామి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వెంకట స్వామి మృతదేహాన్ని సోమాజిగూడలోని వివేక్ ఇంటికి తరలించారు. ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల సందర్శనార్థం మంగళవారం ఉదయం నుంచి ఆయన భౌతిక కాయాన్ని గాంధీభవన్లో ఉంచుతారు. అనంతరం ఊరేగింపుగా పంజగుట్ట శ్మశా న వాటికకు తీసుకువెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరోవైపు కాకా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వెంకటస్వామి మృతికి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరాటపడిన వ్యక్తి వెంకటస్వామి అని సీఎం గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు కాకా భౌతికకాయాన్ని సందర్శించి సీఎం నివాళులు అర్పించనున్నారు. -
కన్ను మూసిన కాకా
హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి 1969 తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం ముల్కీ ఉద్యమంలోనూ కీలక పాత్ర జిల్లా అభివృద్ధిలో విశేష కృషి సాక్షి, మంచిర్యాల : కాంగ్రెస్ కురువృద్ధుడు.. ఏఐసీసీ శాశ్వత సభ్యుడు.. ‘కాకా’గా సుపరిచితుడైన గడ్డం వెంకటస్వామి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొన్ని రోజులుగా హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఎస్సీ సామాజిక వ ర్గానికి చెందిన కాకా కాంగ్రెస్ పార్టీలో కే ంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కీలక రాజకీయ పదవులతోపాటు మంత్రి పదవులు చేపట్టారు. జిల్లా కీర్తిని దేశవ్యాప్తంగా చాటారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తొలిసారిగా వాదించింది వెంకటస్వామియే. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వాదాన్నీ వినిపించిన ఘనత కూడా కాకాకే దక్కింది. ముక్కు సూటిగా మాట్లాడే కాకా.. సమస్యల పరిష్కారం విషయంలో ప్రతిపక్షాలనే కాదూ స్వపక్షంలోనూ నాయకులపైనా విమర్శలు గుప్పించారు. పలుసార్లు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర మంత్రులు, ముఖ్యమంత్రులను కూడా వదలిపెట్టలేదు. పార్టీ విధానాలకు కట్టుబడి పని చేసిన కాకా పార్టీ నిర్ణయాలు.. సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టడంలో దిట్టగా పేరొందారు. ‘తెలంగాణ వచ్చిన తర్వాతే చస్తా..’ వెంకటస్వామి 1929 అక్టోబర్ 5న హైదరాబాద్లో జన్మించారు. 1969లో తొలిసారిగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడల్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన గళం వినిపించారు. పదేళ్ల క్రితం జరిగిన మలి ఉద్యమంలోనూ ఆయన పాల్గొనడంతోపాటు తెలంగాణ వాదాన్ని చాటారు. ఆ సమయంలో ఆరోగ్య క్షీణించగా..‘నేను ఇప్పుడే చనిపోను.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే చనిపోతా..’ అని చెప్పిన మాటల్ని జిల్లా ప్రజలు నెమరువేసుకుంటున్నారు. జిల్లా అభివృద్ధిలో తనవంతు.. 1957 నుంచే వెంకటస్వామికి జిల్లాతో అనుబంధం ఉంది. సిర్పూర్ ద్విసభ్య నియోజకవర్గం ఉన్నప్పుడు 1957లో తొలిసారిగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి పీఎస్పీ పార్టీకి చెందిన రామన్నపై 8821 ఓట్లతో గెలుపొందారు. అప్పటి నుంచి తూర్పు ప్రాంతాభివృద్ధిలో తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. మంచిర్యాలలో ఓవర్బ్రిడ్జి నిర్మాణం.. రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగాయి. రూ.24 కోట్ల వ్యయంతో మంచిర్యాల పట్టణ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా పథకాన్ని కూడా కాకా హయాంలోనే ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించేందుకు విశేష కృషి చేసిన కాకా చివరకు అనుకున్నది సాధించారు. 1998 నుంచి కార్మికులు పెన్షన్ పొందుతున్నారు. కార్మిక సంఘాలను స్థాపించిన ఘనత కూడా కాకాకే దక్కింది. రాజకీయ ప్రస్ధానం..! వెంటకస్వామి.. మూడు సార్లు సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా, పెద్దపల్లి ఎంపీగా నాలుగుసార్లు గెలిచారు. సిర్పూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, పీవీ న రసింహారావు కేబినెట్లో కార్మిక, గ్రామీణాబివృద్ధి, జౌళిశాఖ మంత్రిగా పని చేశారు. 2002-04లో ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ అధ్యక్షుడిగా, 1982-84 వరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. రాష్ట్రంలో అంజయ్య, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారి కేబినెట్లో సేవలందించారు. గడ్డం వినోద్కుమార్, గడ్డం వివేకానంద కాకా తనయులు. కాగా వారు రాజకీయంగా ఎదిగేందుకు తండ్రి ఆశీస్సులు ఎంతగానో ఉన్నాయి. -
'కాకా పరిస్థితి విషమంగానే ఉంది'
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కేర్ డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కేర్ ఆస్పత్రి డాక్టర్లు.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. గత కొంతకాలంగా కాకా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నేత వెంకటస్వామికి తీవ్ర అస్వస్థత
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా వెంకటస్వామికి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నట్లు సమాచారం. కాగా మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ...కాకాను పరామర్శించారు. -
ఎస్కార్ట్ ప్రమాద బాధితులకు అందిన సాయం
* మెరుగైన వైద్యసేవలు డిప్యూటీ సీఎంకు, ‘సాక్షి’కి బాధితుల కృతజ్ఞతలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఎస్కార్ట్ వాహనం ఢీకొని తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించింది. ఇందుకు అవసరమైన బిల్లును మంజూరు చేయడంతో వారిని మంగళవారం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నవంబర్ 30వ తేదీన వరంగల్ జిల్లా రఘునాధపల్లి సమీపంలోని యశ్వంత్పూర్ వద్ద రాజయ్య ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన నయీముల్లాఖాన్, బంధువులు గులాంగౌస్, ఆయన భార్య సాదిక్ ఉన్నీసా బేగం తీవ్రంగా గాయపడ్డారు. వీరికి జనగాం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. వీరికి చేసిన వైద్యానికి సంబంధించి పెద్ద మొత్తంలో బిల్లు చెల్లించాల్సి ఉంది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధితుల గోడును ఈ నెల 6న ‘సాక్షి’ ప్రచురించింది. దీనికి ఉపముఖ్యమంత్రి రాజయ్య స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు బాధితుల వైద్య చికిత్స బిల్లులను చెల్లించారు. పరిస్థితి మెరుగుపడటంతో బాధితులు గులాంగౌస్, సాదిక్ ఉన్నీ సాబేగం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉపముఖ్యమంత్రి రాజయ్యకు, ‘సాక్షి’కి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. -
రాజమౌళి ప్రాయం 4..బరువు 3
సారధి (రాజాం): ఈ ఫొటోలో కనిపిస్తున్న బాబు పేరు రాజమౌళి. తుళ్లింతలు, కేరింతలతో గడవాల్సిన ఈ బాలుడి బాల్యాన్ని విధి చిదిమేసింది. గాజుబొమ్మలా మిగిల్చింది. రాజాం నగర పంచాయతీ పరిధిలోని సారధి గ్రామానికి చెందిన మజ్జి గణేష్, నాగమణి దంపతుల కుమారుడైన రాజమౌళి పుట్టి నాలుగేళ్లయినా మూడు కిలోలకు మించి బరువు పెరగలేదు. పుట్టినప్పుడు బాగానే ఉన్నా కొద్దికాలానికే అతనిలో ఎదుగుదల నిలిచిపోయింది. బొమ్మలా తయారయ్యాడు. శరీరం ఇష్టమొచ్చిన రీతిలో ఒంగిపోతుంటుంది. ఆకలి. నిద్ర అన్నవే తెలియవు. అసలు ఈ లోకంతోనే సంబంధం లేనట్లు దిక్కులు చూస్తుంటాడు. నోరు తెరిచినప్పుడు మాత్రమే ఆహారం అందివ్వాలి. 24 గంటలూ ఎవరో ఒకరు సంరక్షిస్తూ ఉండాల్సిందే. తాపీమేస్త్రీ పని చేసుకునే గణేష్ తన తాహ తుకు మించి ఎన్నో చోట్ల.. ఎంతో మంది వైద్యులకు కొడుకును చూపించి, ఆరోగ్యవంతుడిని చేయడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం గణేష్ దంపతులకు ఏడాది వయసున్న కుమార్తె పూజిత కూడా ఉంది. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. కొడుకు పరిస్థితే వారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. అచేతన స్థితిలో ఉన్న రాజ మౌళిని గణేష్ తల్లిదండ్రులు రాము, భాగ్యం ప్రస్తుతం కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పుట్టిన వెంటనే చిన్న సమస్యే అనుకున్నామని, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేకపోయామంటూ వారంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. అంతుచిక్కని లోపం ఇంగ్లీష్, ఆయుర్వేదం, హోమియోపతి.. ఇలా అన్ని రకాల వైద్యాలు చేయించినా రాజమౌళి పరిస్థితి ఏ డాక్టర్కూ అంతు చిక్కలేదు. తొలుత 2010లో విజయవాడలోని ఓ కార్పొరే ట్ ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యనిపుణులు అన్ని రకాల పరీక్షలు జరిపాబాలుడి మెదడు అభివృద్ధి చెందడం లేదని, తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. కనీసం పరీక్షల నివేదికలు కూడా వీరికి ఇవ్వలేదు.దీంతో ఏడాది క్రితం రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రిలో చూపిస్తే హైదరాబాద్లో అత్యాధునికమైన చికిత్స అందే అవకాశముందని, అది చాలా ఖరీదైన ప్రక్రియ అని చెప్పారు. శస్త్రచికిత్స చేస్తే రూ.15 లక్షలు ఖర్చవుతుందని, అయినా సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు చాలా స్వల్పమని తేల్చి చెప్పారు. బతికున్నంత కాలం బాబును కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచించారు. దీంతో ఏం చేయాలో తోచక ఆ పేద తల్లిదండ్రులు దిక్కులు చూస్తున్నారు. తమ కుమారుడు సాధారణ స్థితికి వచ్చి, తమను అమ్మానాన్నలుగా గుర్తించి అందరు పిల్లల మాదిరిగా తమ కళ్లెదుట తిరుగాడాలన్న ఆకాంక్ష నెరవేర్చే దయార్ధ్ర హృదయుల కోసం ఎదురు చూస్తున్నారు. మానవతావాదులు ముందుకురావాలని, చేయూతనివ్వాలని గణేష్, నాగమణి(ఫోన్ నెం: 9010765420) వేడుకుంటున్నారు. -
గర్భంలో శిశువుకు గుండె ఆఫరేషన్
-
బాధితులకు కేర్ ఆస్పత్రి రూ.50 లక్షల విరాళం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకోసం కేర్ ఆస్పత్రి యాజమాన్యం రూ.50 లక్షల విరాళం ప్రకటించింది. కేర్ ఆస్పత్రి అధినేత సోమరాజు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో కలిసి ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ.50 లక్షల చెక్కును అందజేశారు. రాష్ట్రంలో హుదూద్ తుఫాను సృష్టించిన విలయం అంతాఇంతా కాదని, తుపాను బాధితులను ఆదుకోవడానికి తమ వంతు సాయంగా రూ.50 లక్షలు ఇచ్చినట్టు సోమరాజు పేర్కొన్నారు. ప్రకృతి విలయాలు సంభవించిన సందర్భాల్లో తమ వంతు బాధ్యతగా సాయమందించేందుకు ఎప్పుడూ ముందుంటామని కేర్ ఆస్పత్రి అధినేత తెలిపారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన శిశువు
ఛాతీ వెలుపల గుండెతో పుట్టిన వైనం ఫలించని వైద్యుల ప్రయత్నం హైదరాబాద్: ఇటీవల ఛాతీ వెలుపల గుండెతో పుట్టిన అరుదైన శిశువు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. 36 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. పసికందును బతికించేందుకు కేర్ ఆస్పత్రి వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. చంపాపేట్ డివిజన్ సామ నర్సింహారెడ్డి కాలనీకి చెందిన ఓ మహిళ గతనెల 6న కర్మన్ఘాట్ కృష్ణసాయి ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చింది. వీరిలో రెండో శిశువుకు ఛాతీ లోపల ఉండాల్సిన గుండె.. ఛాతీ వెలుపల గుండె వేలాడుతోంది. దీంతో శిశువును నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కార్డియాలజిస్టులు లేకపోవడంతో నిమ్స్కు తరలించారు. ఈ అరుదైన శిశువుకు చికిత్స చేసేందుకు కేర్ వైద్యుల బృందం ముందుకొచ్చింది. పుట్టిన నాలుగు రోజుల తర్వాత శిశువును కేర్ ఆస్పత్రికి తరలించారు. సర్జన్ డాక్టర్ తపన్ ద్యాస్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలోని వైద్యబృందం గతనెల 9న శస్త్రచికిత్స చేసి ఛాతీ వెలుపల ఉన్న గుండెను లోపల అమర్చింది. అప్పటికే ఇన్ఫెక్షన్ సోకడంతో శిశువు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. గుండె పనితీరు మెరుగు పడినా, ఇన్ఫెక్షన్ వల్ల మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరు దెబ్బతింది. దీంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ శిశువు కేర్ ఆస్పత్రిలోనే కన్నుమూసింది. -
విసు సంస్థల అధినేత సీసీ రెడ్డి కన్నుమూత
హైదరాబాద్: ప్రభుత్వ మాజీ సలహాదారు, ప్రముఖ సినీ నిర్మాత, విసు సంస్థల అధినేత సీసీరెడ్డి (చవ్వా చంద్రశేఖర్రెడ్డి, 76) సోమవారం రాత్రి 7.10 గంటలకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో మృతి చెందారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయనకు డయాలసిస్ చేస్తున్న సమయంలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కక్కడికక్కడే మృతి చెందినట్లు కేర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సీసీ రెడ్డి కడప జిల్లా పులివెందుల సమీపంలోని చినకుంట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 24న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చవ్వా రామలక్ష్మమ్మ, చవ్వా వెంగళరెడ్డి ఇద్దరూ ఉపాధ్యాయులు. తొమ్మిదిమంది సంతానమున్న పెద్ద కుటుంబం. దీంతో పేదరికంలోనే ఆయన తన విద్యాభ్యాసం పూర్తిచేశారు. తల్లిదండ్రుల పట్టుదలతో నే ఆయన న్యాయశాస్త్రం చదివారు. సినిమా, పారిశ్రామిక, విద్యా, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డికి ఆయన అత్యంత ఆప్తుడు. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆయనకు నలుగురు కుమార్తెలు. సీసీరెడ్డి మరణవార్త తెలియగానే వైఎస్సార్సీపీ నాయకులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుని నివాళులు అర్పించారు. సమీప బంధువులైన సినీనటుడు మంచు విష్ణు, నటి మంచు లక్ష్మి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అంత్యక్రియలు గురువారం.. సీసీరెడ్డి అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నట్లు ఆయన సోదరుని అల్లుడు వై.సురేష్కుమార్రెడ్డి చెప్పారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం అభిమానుల దర్శనార్థం సీసీరెడ్డి ఇంటివద్ద ఆయన భౌతికకాయాన్ని ఉంచుతామని స్పష్టం చేశారు. కుమార్తెలు, కుమారులు, ముఖ్య బంధువులు అమెరికా నుంచి రావాల్సి ఉందని తెలిపారు. బుధవారం చంద్రగ్రహణం ఉండటంతో అంత్యక్రియలను గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సదా శివపేటలోని సీసీరెడ్డి తోటలో నిర్వహించనున్నట్లు చెప్పారు. విసు సంస్థలతో విఖ్యాతి ‘విసు’ సంస్థల అధిపతిగా విద్యార్థి లోకానికి సుపరిచితులైన సీసీ రెడ్డి న్యాయవాదిగా కడపలో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా, కార్మిక సంఘాల నాయకునిగా అనేక ఉద్యమాల్ని, ప్రజాహిత కార్యక్రమాల్ని నిర్వహించారు. వీకే కృష్ణమీనన్ తదితరులతో కలిసి వివిధ దేశాల్లో జరిగిన అం తర్జాతీయ న్యాయ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. 1973లో అమెరికాలో వ్యాపారం అనంతరం 1983లో తిరిగి స్వదేశానికి వచ్చి ‘విసు’ సంస్థను నెలకొల్పారు. వేలమంది విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు వైస్ చాన్స్లర్గా పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభు త్వ హయాంలో 2004లో రాష్ట్ర ప్రభుత్వానికి విదేశీ పెట్టుబడుల సలహాదారుగా నియమితులై ఏడేళ్లపాటు కొనసాగారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విసు ఫిలిమ్స్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ‘మీ శ్రేయోభిలాషి’, ‘గౌతమ్ ఎస్ఎస్సీ’, ‘రూమ్మేట్స్’ చిత్రాలు నిర్మించారు. రాజేంద్రప్రసాద్ హీరోగా నిర్మించిన ‘మీ శ్రేయాభిలాషి’ చిత్రం మూడు బంగారు నందుల్ని, అనేక అంతర్జాతీయ బహుమతుల్ని పొందింది. అమెరికా వాసులు సీసీ రెడ్డిని లైఫ్ టైమ్ ఎచీవ్మెంటు అవార్డుతో సత్కరించారు. రారా, కొడవటికంటి, శ్రీశ్రీ లాంటి సాహితీవేత్తలతో సాన్నిహిత్యం ఉంది. సవ్యసాచి, తెలుగు స్వతంత్య్ర మొదలైన పత్రికల్లో వ్యాసాలు, కథలు, కవితలు రాశారు. ‘ఈభూమి’ పేరుతో వారపత్రికను నడిపారు. సీసీ రెడ్డి మృతికి జగన్ సంతాపం రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీరెడ్డి మృతిపట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసింద న్నారు. సీసీరెడ్డి మృతికి నివాళులర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. సీసీ రెడ్డి జీవితం కమ్యూనిస్టు పార్టీతో, కార్మికోద్యమంతో పెనవేసుకుందని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కె.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలో లేకున్నా ప్రతి సందర్భంలోనూ వామపక్ష ఉద్యమానికి శ్రేయోభిలాషిగా వ్యవహరించారని, ఆయన మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఇతర నేతలు జి.ఓబులేసు, జి.ఈశ్వరయ్య తదితరులు కూడా సీసీ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. -
నిమజ్జనానికి వెళ్తూ బోల్తా పడిన ఆటో
-
నిమజ్జనానికి వెళ్తూ బోల్తా పడిన ఆటో
హైదరాబాద్: వినాయకుడ్ని హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి తీసుకువెళ్తున్న ఆటో ట్రాలీ సోమవారం ఎంజే మార్కెట్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు సృహా కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయాపడ్డారు. దాంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనలో వినాయకుడి విగ్రహాం ధ్వంసమైంది. డ్రైవర్ ఆటోను మలుపు తిప్ప బోయారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. -
కడుపులోనే పరీక్షలూ...పుట్టగానే చికిత్సలు...!
నేడు డాక్టర్స్ డే డాక్టర్ తపన్ దాష్, డాక్టర్ కె. నాగేశ్వరరావు పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్స్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఆమె మార్కెట్ యార్డులో పనిచేసే ఒక సాధారణ వ్యక్తి భార్య. గర్భవతి. మెదక్ జిల్లా కొండాపూర్కు చెందిన అనూరాధ అనే ఆ మహిళ ఎప్పటిలాగే రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్లు ఆమెను పరీక్షిస్తూ ఒక అసాధారణ అంశాన్ని గమనించారు. ఆమె కడుపులో ఉన్న పాప ‘హార్ట్ ఫెయిల్యూర్’తో చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. ఎలాగైనా పెద్ద ప్రాణాన్నీ, కడుపులోని పసిపాపనూ... ఇద్దర్నీ రక్షించాలని నిర్ణయించుకున్నా డాక్టర్లు. పాప అనూరాధ గర్భంలో ఉండగానే ‘ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ’ అనే పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్ష ఫలితం వచ్చింది. పాప ‘అబ్స్ట్రక్టివ్ ఇన్ఫ్రాడయాఫ్రమాటిక్ టోటల్ అనామలస్ పల్మనరీ వీనస్ డ్రయినేజ్’ (టీఏపీవీఆర్) అనే అత్యంత అరుదైన వ్యాధితో తీవ్రంగా బాధపడుతోంది. సాధారణంగా శుద్ధమైన రక్తం ఊపిరితిత్తుల్లో శుభ్రపడి అక్కడ్నుంచి గుండె తాలూకు ఎడమ ఏట్రియమ్కు చేరాలి. ఈ కండిషన్లో అది గుండె ఎడమ ఏట్రియమ్కు బదులు కాలేయానికి తన దిశ మార్చుకుంటుంది. దాంతో పాపకు ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. పాప కడుపులో ఉన్నంతసేపు ఎలాగూ బతికేస్తుంది. కానీ పుట్టీ పుట్టగానే పాపలో తనదైన రక్తప్రసరణ వ్యవస్థ మొదలవుతుంది. అయితే ఈ ప్రక్రియలో శుద్ధమైన రక్తం గుండె ఎడమ ఏట్రియమ్కు చేరకుండా కాలేయానికి చేరితే శుద్ధమైన రక్తం అందని కారణంగా పాప పుట్టిన కొద్దిసేపట్లోనే చనిపోవచ్చు. అనూరాధకు 2014 జనవరి 4న సిజేరియన్ చేసి కడుపులోంచి పాపను బయటకు తీశారు డాక్టర్లు. ఉదయం గం. 6.45 నిమిషాలకు పుట్టిన పాపను వెంటనే వెంటిలేటర్పై ఉంచారు. పుట్టీపుట్టగానే చిన్నారిని అత్యవసరంగా ఆపరేషన్ థియేటరకు తరలించారు. ఉదయం 8.30కి మొదలైన సర్జరీ 11.30 కల్లా విజయవంతంగా ముగిసింది. గంటల పాపపై డాక్టర్ల శస్త్రచికిత్స సత్ఫలితాలిచ్చింది. రక్తనాళాల్లోని రక్తంతో పాటు... మృత్యువూ తన దారి మార్చుకుని, పాప నుంచి దూరంగా వెళ్లింది. ఈ సందర్భంగా తమకు తోడ్పడ్డ డాక్టర్ శ్రీనివాసమూర్తి, డాక్టర్ మాల్జిని, డాక్టర్ పల్లవి, డాక్టర్ విజయ... ఇతర సహాయక సిబ్బంది సేవలను స్మరించారు డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ తపన్దాష్. -
కేర్ హాస్పిటల్స్ నెట్వర్క్ విస్తరణ...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాణ్యమైన వైద్య సేవలందించే హైదరాబాద్కు చెందిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్ నెట్వర్క్ విస్తరణలో మరో ముందడుగు వేసింది. ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో బిలాస్పూర్, రాయ్ఘడ్ ప్రాంతాల్లో తాజాగా రెండు హాస్పిటల్స్ తన నెట్వర్క్లో కలుపుకోవడంతో ఆ రాష్ర్టంలో అతిపెద్ద నెట్వర్క్ స్థాయిని సొంతం చేసుకుందని కేర్ హాస్పిటల్స్ గ్రూప్ సీఈవో దిలీప్ జోస్ తెలిపారు. ఈ విస్తరణతో కేర్ గ్రూప్ నెట్వర్క్ దక్షిణ, మధ్య భారత్లో 15 హాస్పిటళ్లతో 2000 పడకల స్థాయికి ఎదిగిందన్నారు. బిలాస్పూర్ కేంద్రాన్ని ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ బుధవారం ప్రారంభించారు. కాగా హైదరాబాద్ బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్స్లో ఈ ఏడాది అదనంగా మరో 50 పడకల సామర్థ్యాన్ని అందుకోనున్నామని దిలీప్ జోస్ చెప్పారు. 2015లో మరో రెండు ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని దీని ద్వారా 350 పడకల సామర్థ్యం జతకూడనుందని ఆయన అన్నారు. -
ఆళ్లగడ్డ కంటతడి!
ఆళ్లగడ్డ టౌన్, న్యూస్లైన్: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి అకాల మృతితో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ అభిమాన నాయకురాలు ఇక లేరని ప్రజలు దుఃఖసాగరంలో మునిగారు. బుధవారం రాత్రి తమ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రతి క్షణం ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోయారు. ప్రమాద సంఘటన స్థలాన్ని, గాయపడిన ఎమ్మెల్యేను ఆసుపత్రికి తరలించిన దృశ్యాలను టీవీల్లో చూస్తూ అభిమానులు కంటతడి పెట్టారు. ఆమె కోలుకోవాలని కులమతాలకు అతీతంగా ప్రజలు దేవుళ్లను ప్రార్థించారు. గురువారం ఉదయం ఎమ్మెల్యేను హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించిన తర్వాత కోలుకుంటారని అందరూ భావించారు. అయితే ఆమె మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించినట్లు టీవీల్లో న్యూస్ రావడంతో తట్టుకోలేక పోయారు. మహిళలు, వృద్ధులు దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు. తమ అభిమాన నాయకురాలు లేరని తెలుసుకుని ఆళ్లగడ్డలోని భూమా నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎమ్మెల్యే చూపిన ఆప్యాయతను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. మారు మూల గ్రామాలకు చెందిన వ్యక్తి అయినా కనిపిస్తే పేరు పెట్టి ఆప్యాయంగా పలకరించేవారని, ఆమె కంటే కొంచెం వయస్సులో పెద్ద వారిని బాగున్నావా.. అన్నా.. అని ఎంతో మమకారంతో పిలిచేదని కొందరు చెప్పారు. ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతి వార్త తెలుసుకున్న ఆళ్లగడ్డ పట్టణ వ్యాపారులు దుకాణాలు మూసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. దీంతో అన్ని వీధులు నిర్మానుష్యంగా మారాయి. -
కోడ్ ఉపసంహరణ
ఎన్నికల సంఘం ప్రకటన నేటి నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు యథాతథం మున్నార్ నుంచి తిరిగివచ్చిన ముఖ్యమంత్రి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇకమీదట యధావిధిగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని పేర్కొంది. లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఎన్నికల నియమావళి అమలులో ఉంది. ఈ నెల 17న ఒకే దశలో రాష్ట్రంలోని మొత్తం 28 లోక్సభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. అయితే ఓట్ల లెక్కింపు జరిగే మే 16 వరకు నియమావళి అమలులోనే ఉంటుంది. దీని వల్ల ప్రభుత్వ కార్యక్రమాలకు అవరోధం ఏర్పడుతోందని, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన కమిషన్, అధికారులతో మంత్రులు సమీక్షలు, సమావేశాలు జరుపుకోవచ్చని, జిల్లా పర్యటనలూ చేపట్టవచ్చని సూచిస్తూ నియమావళిని పాక్షికంగా సడలించింది. తాగు నీటి ఎద్దడి తదితర అత్యవసర సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించింది. అయితే సిబ్బంది బదిలీలు లాంటి వ్యవహారాలకు సంబంధించి ముందుగా ఎన్నికల కమిషన్ అనుమతిని తీసుకోవాలని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులతో మంత్రులు సమావేశాలు నిర్వహించకూడదని షరతు విధించింది. ఎన్నికలు ముగిసి, ఈవీఎంలు స్ట్రాంగ్ రూములలో భద్రంగా ఉన్న నేపథ్యంలో నియమావళి కొనసాగింపు హేతుబద్ధంగా లేదని భావించిన ఎన్నికల కమిషన్, గురువారం నుంచి పూర్తిగా సడలించింది. దరిమిలా శుక్రవారం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు యధావిధిగా సాగనున్నాయి. విశ్రాంతి కోసం కేరళలోని మున్నార్కు వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరిగి వచ్చేశారు. -
కారు డ్రైవర్ కనిపించట్లేదు...
నంద్యాల, న్యూస్లైన్: శోభా నాగిరెడ్డి కారు డ్రైవర్ నాగేంద్ర(32) నంద్యాలలోని సాయివాణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిపించకుండాపోయాడు. బుధవారం రాత్రి ప్రమాదంలో గాయపడిన అతన్ని పోలీసులు తొలుత ఆళ్లగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బంధువులు మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి నంద్యాలకు తరలించారు. శరీరంపై గాయాలు లేకపోయినా కడుపు, ఛాతీలో నొప్పితో బాధపడుతుండటంతో వైద్యులు చికిత్స చేశారు. గురువారం ఉదయం 9 గంటల తర్వాత నాగేంద్ర తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వెంటనే మేడమ్ను చూడాలని ఆసుపత్రి సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇతను ఎక్కడా కనిపించకపోవడం పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అదృశ్యమైన నాగేంద్ర స్వస్థలం ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరుగా, తండ్రి సుబ్బరాయుడుగా ఆసుపత్రిలో వివరాలు నమోదయ్యాయి. -
డ్రైవర్ దూకుడుగా నడపడంవల్లే ప్రమాదం
సాక్షి, కర్నూలు: శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో గన్మెన్లు మహబూబ్బాషా, శ్రీనివాసులు గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తీరు వారి మాటల్లోనే.. కారు స్పీడ్ తగ్గించాలని చెప్పాం మాది గోనెగండ్ల మండలం ఐరన్బండ గ్రామం. 2009లో ఏఆర్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. రెండు వారాల కిందటే అక్క (శోభా నాగిరెడ్డి) వద్ద డ్యూటీలో చేరాను. నంద్యాల నుంచి షర్మిలమ్మ పర్యటన ముగించుకుని రాత్రి ఆళ్లగడ్డకు అవుట్లాండ్ కారులో అక్కతో పాటు నేను, మరో గన్మెన్ శ్రీనివాసులు బయలుదేరాం. రెగ్యులర్ డ్రైవర్ కాకుండా నాగేంద్ర అనే మరో డ్రైవర్ వచ్చాడు. అతను మొదటినుంచి కారును చాలా దూకుడుగా నడపటం గమనించి స్పీడ్ తగ్గించమని కూడా చెప్పాం. వరి ధాన్యం కుప్ప పక్కనే ఉన్న రాళ్లను ఎక్కించగానే... ఏయ్ అని అరవడంతో సడన్గా స్టీరింగ్ తిప్పేశాడు. దీంతో 140-150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. గన్మెన్లిద్దరం తేరుకునేలోపే అక్కను ఆసుపత్రికి తరలించారు. - ఎన్.మహబూబ్బాషా, గన్మన్ ఎప్పుడూ సీటు బెల్టు పెట్టుకునేవారు మాది గోస్పాడు మండలం యాళ్లూరు. నేను 2009లో ఏఆర్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాను. అక్క (శోభా నాగిరెడ్డి) వద్ద గన్మన్గా గత సంవత్సరం జూలైలో చేరాను. బుధవారం ఉదయం 7.30 గంటలకు గ్రామాల్లో ఎన్నిక ల ప్రచారానికి బయలుదేరాం. తర్వాత సాయంత్రం 4.30 గంటలకు నంద్యాలలో షర్మిలక్క ప్రచారంలో పాల్గొన్నాం. రాత్రి 11 గంటలకు ఆళ్లగడ్డ బయలుదేరాం. అక్క (శోభానాగిరెడ్డి) ముందు సీట్లో కూర్చున్నారు. ఉదయం, సాయంత్రం ఆ రోడ్డునే వెళ్లినా... రోడ్డుపక్కగా ఉన్న వరి ధాన్యం కుప్పలను మేము పెద్దగా గమనించలేదు. ప్రమాదం ధాటికి అక్క కారులోంచి ఎగిరి పడినట్లున్నారు. కారులో అక్క ఎప్పుడూ సీటు బెల్టు పెట్టుకునే కూర్చునేవారు. కానీ నిన్న అలసిపోయి బెల్టు పెట్టుకోవడం మరిచిపోయినట్లున్నారు. -శ్రీనివాసులు, గన్మన్ -
సీమ రాజకీయాల్లో ‘మహిళా శోభ’
నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన మహిళా నేత బలమైన ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొన్న శోభా నాగిరెడ్డి సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమలో భూమా శోభా నాగిరెడ్డి తిరుగులేని మహిళా నేత. 1997లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన శోభ.. తనదైన ముద్రతో సీమ రాజకీయాలకు వన్నె తెచ్చారు. అత్యంత సమస్యాత్మకమైన ఆళ్లగడ్డలో రెండు బలమైన వర్గాలైన గంగుల, ఇరిగెలను ఎదుర్కొని నాలుగు పర్యాయాలు విజయం సాధించటమే కాదు.. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఆమె ఎనలేని కృషి చేశారు. తొలుత టీడీపీ, ఆ తర్వాత పీఆర్పీ.. తదనంతరం తుదివరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.. ఎక్కడ ఉన్నా కీలక నేతగానే ఉన్నారు. తను కొనసాగుతున్న పార్టీపై విమర్శలు వస్తే దీటుగా తిప్పికొట్టగలిగే నేర్పు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. సీమ జిల్లాల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల ప్రజలతో శోభకు ప్రత్యేక అనుబంధం ఉంది. సీమలో తాగు, సాగునీటి కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. రాజకీయ కుటుంబంలో జననం... మాజీ మంత్రి ఎస్.వి.సుబ్బారెడ్డి, దివంగత నారాయణమ్మ దంపతుల ఐదో సంతానం శోభా నాగిరెడ్డి. 1969 డిసెంబర్ 16న జన్మించారు. శోభకు నాగలక్ష్మమ్మ, నాగరత్నమ్మ అక్కలు కాగా.. ఎస్.వి.ప్రసాదరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్రెడ్డి అన్నలు. 1986లో భూమా నాగిరెడ్డితో వివాహమైంది. కూతుర్లు అఖిలప్రియ, నాగమౌనిక, కుమారుడు జగత్విఖ్యాత్రెడ్డి. తండ్రి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్, ఆళ్లగడ్డ, పత్తికొండ ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. సోదరి నాగరత్నమ్మ పత్తికొండ మేజర్ పంచాయతీ సర్పంచ్ కాగా, సోదరుడు ఎస్.వి.మోహన్రెడ్డి ఎమ్మెల్సీగా పనిచేశారు. శోభ భర్త భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. బావలు భూమా శేఖరరెడ్డి ఎమ్మెల్యే గాను, భూమా భాస్కర్రెడ్డి ఎంపీపీగా పదవుల్లో ఉంటూనే చనిపోయారు. నాలుగుసార్లు వరుస విజయాలు... తండ్రి మాజీ మంత్రి ఎస్.వి.సుబ్బారెడ్డి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, భర్త భూమా నాగిరెడ్డి సాహచర్యంలో 1997, 1999, 2009, 2012 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికైన మహిళా ప్రతినిధిగా శోభానాగిరెడ్డి రికార్డును సొంతం చేసుకున్నారు. 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 1999 లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. 2002 నవంబర్ 7న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. టీడీపీలో జనరల్ సెక్రటరీగా, పార్టీలో కీలక సభ్యురాలిగా పనిచేశారు. ఆ తర్వాత సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో భర్తతో పాటు శోభ ఆ పార్టీలో చేరారు. అక్కడ కూడా కీలకమైన అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కేవలం 18 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అందులో రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీ తరఫున మహిళా ఎమ్మెల్యేగా శోభా నాగిరెడ్డి మాత్రమే గెలుపొందారు. వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా...: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం.. వై.ఎస్. కుటుంబంతో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో భూమా దంపతులు ఆ కుటుంబం వెంట నడిచారు. పీఆర్పీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012లో ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున శోభానాగిరెడ్డి సుమారు 37 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అక్రమ నిర్బంధంలో ఉండగా గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మకు శోభ తోడునీడగా నిలిచారు. ఆ ప్రాంతాల వారితో విడదీయరాని బంధం: జిల్లాలో కర్నూలు, నంద్యాల, పత్తికొండ, ఆళ్లగడ్డ నియోజకవర్గాల వారితో భూమా శోభా నాగిరెడ్డికి విడదీయరాని బంధం ఉంది. ఆళ్లగడ్డ జన్మస్థలం కావడంతో ఆ ప్రాంత వాసులు పార్టీలతో నిమిత్తం లేకండా భూమా కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. నంద్యాల ప్రజల్లో శోభా నాగిరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. తండ్రి ఎస్.వి.సుబ్బారెడ్డి ప్రాతినిధ్యం వహించిన పత్తికొండ ప్రజలతోనూ ఆమెకు అనుబంధం ఉంది. సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ, ఎస్.వి.మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి కావడంతో నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. తాగు, సాగునీటి కోసం పోరాటం: కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రైతులకు సాగు, తాగునీటి ప్రధాన కాలువ కేసీ కెనాల్ రైతుల కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీశారు. తాగు, సాగునీటి కోసం జరిగిన సాగునీటి సలహా మండలి, డీడీఆర్సీ సమావేశాలకు ఎవరు హాజరు కాకపోయినా.. ఎమ్మెల్యే హోదాలో శోభా నాగిరెడ్డి హాజరయ్యే వారు. ఆమె వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు, అధికారులు నీళ్లు నమిలేవారు. ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రజల తరఫున ఆమె గళం వినిపిస్తూ ప్రత్యేకతను సంతరించుకున్నారు. రాజకీయాలకు స్ఫూర్తి భూమానే శోభా నాగిరెడ్డి రాజకీయాలకు స్ఫూర్తి భర్త భూమా నాగిరెడ్డే. రాయలసీమ రాజకీయాల్లో మహిళలు నిలదొక్కుకోవడం ఎంతో కష్టం. అలాంటిది ఆళ్లగడ్డ లాంటి సమస్యాత్మక నియోజకవర్గంలో ఓ మహిళ 13 ఏళ్ల పాటు ప్రజాప్రతినిధిగా సేవలందించడం అబ్బురపరచే విషయం. ఇందుకు భర్త, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి ప్రోత్సాహమే ప్రధాన కారణం. ‘మీ రాజకీయ గురువు ఎవర’ని ఎవరైనా అడిగితే తడుముకోకుండా భర్త భూమా నాగిరెడ్డి పేరు చెప్పేవారామె. 1997లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. శాసనసభకు వెళ్లేందుకు జంకుతుండగా భూమా స్వయంగా తీసుకెళ్లి అందరినీ పరిచయం చేశారు. శాసనసభ సమావేశాల్లో ఎలాంటి ప్రశ్నలు వేయాలనే విషయంపైనా ఆమె భర్తతో చర్చలు జరిపేవారని సన్నిహితులు చెప్తారు. -
శోభా నాగిరెడ్డి మరిలేరు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి(46) ఇకలేరు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని 18వ జాతీయ రహదారిపై గూబగుండంమిట్ట వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభ... గురువారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కటెముకలు విరిగిపోవడంతో ఊపిరి పీల్చుకోలేక అపస్మారక స్థితిలో ఉన్న శోభను మెరుగైన చికిత్స కోసం గురువారం ఉదయానికి బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై ఉంచి వైద్యులు చికిత్స చేశారు. అయితే ఈ ప్రయత్నం ఫలించకపోవడంతో ఉదయం 11.05 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి నంద్యాలలో షర్మిల బహిరంగసభలో పాల్గొని ఆళ్లగడ్డకు తిరిగి వెళుతుండగా శోభా నాగిరెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద స్థలిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన శోభను ఆళ్లగడ్డకు తరలించగా అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ల సూచనల మేరకు ఆమెను నేరుగా హైదరాబాద్ కు తరలించారు. ఉదయం 7.30కు అక్కడకు చేరుకోగానే ఆమె పరిస్థితిని ‘బ్రెయిన్ డెడ్’ (మెదడు పనిచేయని స్థితి)గా వైద్యులు అంచనా వేశారు. 11 గంటలకుపైగా మృత్యువుతో పోరాడిన శోభ ఉదయం 11.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. నంద్యాల వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు చికిత్స జరుగుతున్నపుడు ఆసుపత్రిలోనే ఉన్నారు. శోభ తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారన్న వార్త తెలియగానే ఆ కుటుంబసభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. భూమా నాగిరెడ్డి సృ్పహతప్పి పోవడంతో వైద్యులు తక్షణం చికిత్సను అందించారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే అభిమానులు, ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచే భారీస్థాయిలో ఆసుపత్రికి చేరుకున్నారు. నేత్రదానం: శోభ తన కళ్లను దానం చేస్తూ గతంలో అంగీకారపత్రం ఇవ్వడంతో వైద్యులు ఆమె నేత్రాలను తొలగించి ‘ఐ బ్యాంక్’కు పంపారు. శోభ కళ్లను శుక్రవారం ఇద్దరు అంధులకు అమర్చనున్నట్లు హైదరాబాద్ జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమం అధికారి డాక్టర్ రవీందర్గౌడ్ తెలిపారు. విజయమ్మ సహా పలువురి సందర్శన: శోభ పార్థివదేహం కేర్ ఆసుపత్రిలో ఉండగానే వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో సహా పలువురు ప్రముఖులు సందర్శించారు. శోభ భౌతికకాయాన్ని చూడగానే విజయమ్మ దుఖాన్ని ఆపుకోలేక విలపించారు. చికిత్స జరుగుతున్నపుడే ఎంవీ మైసూరారెడ్డి, డీఏ సోమయాజులు, లక్ష్మీపార్వతి, విజయచందర్, వాసిరెడ్డి పద్మ, అల్లు అరవింద్, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్.పి.మీనా, టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, మాజీ డీజీపీ దినేష్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఆర్.ఆనంద్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారి చంద్రశేఖరరెడ్డి, సినీ నటులు మంచు మనోజ్, మంచు లక్ష్మి, రాజా, జీవిత, రాజశేఖర్, ప్రొఫెసర్ ఆర్.వేణుగోపాల్రెడ్డితో పాటు పలువురు శోభ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆళ్లగడ్డలో నేడు అంత్యక్రియలు శోభా నాగిరెడ్డి పార్థివదేహానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఇంటి వద్దే ఉంచనున్నారు. ఆ తర్వాత భూమా నివాసం నుంచి పాతబస్టాండ్, ఇండోర్స్టేడియం, జాతీయరహదారి, చిన్నకందుకూరు రస్తా మీదుగా అంతిమయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జాతీయ రహదారి సమీపంలోని సుద్దపల్లి క్రాస్ రోడ్డు వద్ద సొంత స్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు. భూమా నివాసం శోకసంద్రం ఆళ్లగడ్డ, న్యూస్లైన్: భూమా శోభా నాగిరెడ్డి మరణవార్తతో ఆళ్లగడ్డ శోకసంద్రమైంది. ఆమె పార్థివదేహం ఆళ్లగడ్డలోని నివాసానికి చేరుకోగానే ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు. శోభా నాగిరెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అమ్మా ఎక్కడికి పోతివమ్మా అంటూ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి దించగానే కుమార్తెలు బోరున విలపించారు. అమ్మా లేమ్మా... అంటూ రోదిస్తున్న వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. శవపేటికపై తలపెట్టి ఏడుస్తున్న కొడుకును చూసి అక్కడి వారంతా కన్నీరు పెట్టారు. మేనమామ ఎస్వీ మోహన్రెడ్డి వారిని ఓదార్చారు. ఆళ్లగడ్డలో మధ్యాహ్నం నుంచి స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు జనాలు బారులు తీరారు. భూమా నివాస ప్రాంగణంలో మిత్రులు, కుటుంబసభ్యులు ఆప్తులు, సన్నిహితులు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. ‘‘ఎమ్మెల్యేగా తప్పక గెలుస్తుంది. మంత్రి అవుతుందనే ఆశించాం. మీకు ఇలా జరుగుతుందని ఊహించలేదు తల్లీ’’ అంటూ మహిళలు బోరున విలపించారు. ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది: వైద్యులు అపస్మారక స్థితిలో ఉన్న శోభానాగిరెడ్డిని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చిన వెంటనే డాక్టర్ సోమరాజు నేతృత్వంలోని క్రిటికల్ కేర్, ఆర్థో, న్యూరో విభాగం వైద్యబృందం ఆమెకు పలు పరీక్షలు చేసింది. ఉదయం 9 గంటలకు తల, ఛాతీ, మెడ భాగంలో సీటీస్కాన్ తీయించారు. తలకు తగిలిన బలమైన గాయంవల్ల మెదడులో రక్తం గడ్డకట్టడంతో పాటు చెవి, ముక్కు నుంచి అధిక రక్తస్రావమైనట్లు గుర్తించారు. పక్కటెముకలు విరిగి గుండె, ఊపిరితిత్తులకు ఆనుకోవడంతో గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్నట్లు, శ్వాస కూడా తీసుకోలేకపోతున్నట్లు నిర్ధారించారు. మెడలోని నరాలు కూడా చిట్లిపోయినట్లు ఉదయం 10 గంటలకు విడుదల చేసిన మెడికల్ బులెటిన్లో వైద్యులు స్పష్టం చేశారు. ఆపరేషన్ చేసి గుండెకు ఆనుకుని ఉన్న పక్కటెముకలను సరిచేయాలని వారు నిర్ణయించారు. అదే సమయంలో అకస్మాత్తుగా పల్స్రేటు పడిపోయింది. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. దీంతో శోభానాగిరెడ్డి చికిత్స పొందుతూ ఉదయం 11.05 నిమిషాలకు మృతి చెందినట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపీకృష్ణ ప్రకటించారు. ఆమెను కాపాడేందుకు నాలుగు గంటలపాటు తామెంతో శ్రమించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. -
జగన్ దిగ్భ్రాంతి
శోభా నాగిరెడ్డి మృతితో వైఎస్సార్సీపీలో తీవ్ర విషాదం జగన్, విజయమ్మ, షర్మిల ప్రచారం రెండ్రోజులు వాయిదా పార్టీ కార్యాలయంలో నివాళులు, జెండా అవనతం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉప నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డి మరణవార్తతో పార్టీలో విషాదం అలముకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సోదరి షర్మిల, సతీమణి భారతి ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. శోభ మృతికి సంతాప సూచకంగా గురు, శుక్రవారాలు జగన్, విజయమ్మ, షర్మిల పర్యటనలతో పాటు అన్ని ప్రచార కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆళ్లగడ్డలో శోభ అంత్యక్రియలకు పార్టీ పెద్దలంతా హాజరవుతారని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శోభా నాగిరెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాను అవనతం చేశారు. పార్టీ నేతలు పీఎన్వీ ప్రసాద్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఆళ్లగడ్డకు జగన్ పార్టీలో అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే తమ ఆత్మీయురాలు మరణించారని తెలిసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సోదరి షర్మిల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గుంటూరు జిల్లాలో రెండ్రోజులపాటు విస్తృతంగా పర్యటించి బుధవారం రాత్రికి పొన్నూరుకు చేరుకున్న జగన్కు శోభా నాగిరెడ్డి ప్రమాదవార్త తెలియడంతో హతాశులయ్యారు. ఆమెను కేర్ ఆస్పత్రికి తరలించారని తెలియడంలో ఆయన ఆస్పత్రి వర్గాలతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి పరిస్థితి తెలుసుకుంటూ వచ్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందనడంతో గురువారం ఉదయం పొన్నూరులో క్లుప్తంగా ప్రసంగించి హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. అయితే శోభ ఉదయం 11 గంటలకే మృతి చెందడంతో భౌతిక కాయాన్ని స్వస్థలం ఆళ్లగడ్డ తీసుకువెళ్లారు. గురువారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్న జగన్ శుక్రవారం ఆళ్లగడ్డకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో హెలికాప్టర్లో ఆళ్లగడ్డకు వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అంత్యక్రియలకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. హుటాహుటిన వచ్చిన విజయమ్మ శోభా నాగిరెడ్డి ప్రమాదానికి గురయ్యారన్న సమాచారం తెలియడంతో విజయమ్మ రాజమండ్రి నుంచి హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఆమె కేర్ ఆస్పత్రికి చేరుకునే సమయానికే శోభ కన్ను మూయడంతో కన్నీరు మున్నీరయ్యారు. తన కూతురులాంటి శోభ మరణం భరించలేనిదని విలపించారు. తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించిన విజయమ్మ బుధవారం రాత్రి రాజమండ్రిలో బస చేశారు. గురువారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆమె ‘వైఎస్సార్ జనభేరి’ చేపట్టాల్సి ఉంది. ఈ కార్యక్రమం వాయిదా వేశారు. పులివెందుల నుంచి షర్మిల, భారతి నంద్యాలలో శోభానాగిరెడ్డితో కలసి వైఎస్సార్ జనభేరి నిర్వహించిన షర్మిల బుధవారం రాత్రి పులివెందుల చేరుకున్నారు. ఆమె గురువారం అనంతపురం జిల్లా కదిరిలో పర్యటించాల్సి ఉంది. అలాగే పులివెందులలో జగన్ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి వైఎస్ భారతి వేంపల్లె మండలంలో పర్యటించాల్సి ఉంది. శోభానాగిరెడ్డి ప్రమాదవార్త తెలియడంతో వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఒకే వాహనంలో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. శోభా నాగిరెడ్డి, -
ప్రమాదం జరిగిన తీరిదీ..
బుధవారం సాయంత్రం 4.40 గంటలు: నంద్యాలలో షర్మిల వైఎస్సార్ జనభేరి సభలో పాల్గొనేందుకు శోభా నాగిరెడ్డి అవుట్లాండర్ కారులో (నంబర్ ఏపీ21 ఏఎఫ్ 0001) ఆళ్లగడ్డ నుంచి 45 కి.మీ. దూరంలోని నంద్యాలకు వచ్చారు. రాత్రి 9.30: జనభేరి సభ ముగిసింది. రాత్రి 10.35: శోభానాగిరెడ్డి నంద్యాలలో భోజనం చేసి ఆళ్లగడ్డకు బయలుదేరారు. ఆమె కారు ముందు సీటులో కూర్చున్నారు. వెనుక సీటులో ఇద్దరు గన్మెన్లు కూర్చున్నారు. కారు వెంట రెండు ఎస్కార్టు వాహనాల్లో ఏడుగురు చొప్పున ఉన్నారు. రాత్రి 11.20: ఆళ్లగడ్డకు ఐదు కిలోమీటర్ల దూరంలోని గూబగుండం మిట్ట వద్ద రోడ్డుపై ఆరబోసిన ధాన్యం (వడ్లు) రాశికి అడ్డంగా పెట్టిన రాళ్లను తప్పించబోయి డ్రైవర్ కారును ఎడమవైపు తిప్పడంతో నాలుగు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ప్రధాన రోడ్డు నుంచి 100 మీటర్ల దూరం వరకు పోయి కారు ఆగిపోయింది. ప్రమాద సమయంలో కారు వేగం గంటకు 120 కిలోమీటర్లు ఉంది. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో శోభా నాగిరెడ్డి ముందున్న అద్దంలో నుంచి ఎగిరి కింద పడ్డారు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి 11.30: కారు వెనుక వస్తున్న మరో వాహనంలోని అనుచరులు (వీరు నంద్యాలలోని షర్మిల జనభేరి సభకు వెళ్లి వస్తున్న వారు) ప్రమాదాన్ని గుర్తించి ఆళ్లగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన 10 నిమిషాల తర్వాత ఎస్కార్ట్ వాహనాలు చేరుకున్నాయి. రాత్రి 11.40: ప్రథమ చికిత్స అనంతరం శోభా నాగిరెడ్డిని అంబులెన్స్లో నంద్యాలకు తీసుకెళ్లారు. రాత్రి 12.35: నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అక్కడ దాదాపు 3 గంటల పాటు వైద్యులు సేవలందించినా ఫలితం లేకపోయింది. గురువారం తెల్లవారుజామున 2.50: మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించారు. ఉదయం 5.30: బీచ్పల్లి వద్ద అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్ నుంచి వచ్చిన మరో వాహనంలోకి మార్చారు. ఉదయం 7.10: హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఉదయం 11.05: వెంటిలేటర్పై వైద్య సేవలందించిన వైద్యులు చివరకు శోభా నాగిరెడ్డి మరణించినట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. - కర్నూలు, సాక్షి -
ఆళ్లగడ్డకు చేరుకున్న శోభ పార్దీవదేహం
-
నంద్యాలలో సందర్శనార్ధం శోభ పార్దీవదేహం
-
ఆటగదరా శివా...
-
శోభానాగిరెడ్డి మృతిపై వైసీపీ నేతల దిగ్భ్రాంతి
-
శోభానాగిరెడ్డి మరణంపై నాయకుల దిగ్భ్రాంతి
-
శోభా నాగిరెడ్డి కన్నుమూత.
-
స్పృహ కోల్పోయిన భూమా నాగిరెడ్డి
హైదరాబాద: వైఎస్ఆర్ సీపీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హఠాన్మరణం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శోభానాగిరెడ్డి మరణవార్త తెలియగానే ఆమె భర్త భూమా నాగిరెడ్డి కేర్ ఆస్పత్రిలో స్పృహ కోల్పోయారు. వైద్య సిబ్బంది సపర్యలు చేయడంతో ఆయన కోలుకున్నారు. తన భార్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందన్న వాస్తవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోక విషాదంలో మునిగిపోయారు. ఇక భూమా దంపతుల ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. తల్లి మృతదేహాన్ని చూసి వారు భోరున విలపించారు. తమ తల్లి మరణాన్ని తట్టుకోలేక శోక సంద్రంలో మునిగిపోయారు. మిగతా కుటుంబ సభ్యులు కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. భూమా శోభానాగిరెడ్డి మరణంతో కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
శోభానాగిరెడ్డి హఠాన్మరణంపై గవర్నర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హఠాన్మరణంపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శోభానాగిరెడ్డి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శోభానాగిరెడ్డి మరణవార్త విని వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, మాజీ సీఎం కిరణ్, బీజేపీ నేత కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి, నటుడు రాజా హూటాహుటిన కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. * శోభానాగిరెడ్డి మృతి పట్ల టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సంతాపం తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలి హోదాలో ఎమ్మెల్యేగా నిర్మాణాత్మకంగా వ్యవహరించారని అన్నారు. * మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తణుకు ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల రాధయ్య, గన్నవరం అభ్యర్థి దుట్ట రాంచదర్రావు... శోభానాగిరెడ్డి మరణం పట్ల సంతాపం తెలిపారు. * శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా హిందూపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థి నవీన్నిశ్చల్ ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. * శోభానాగిరెడ్డి మరణ వార్త విని వైఎస్ఆర్సీపీ నేత కొణతాల రామకృష్ణ విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. * శోభానాగిరెడ్డి మృతికి నిజామాబాద్ వైఎస్సార్ సీపీ నేతలు అంతిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిద్ధార్థరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. * శోభానాగిరెడ్డి మృతి పట్ల రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోభానాగిరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. * శోభానాగిరెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ అధికార ప్రతినిధి పద్మజా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. * శోభానాగిరెడ్డి మృతి పట్ల కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు కోనేరు ప్రసాద్, పార్థసారధి, కార్యకర్తలు ప్రగాఢ సంతాపం తెలిపారు. * శోభానాగిరెడ్డి మృతి పట్ల విశాఖ వైఎస్సార్ సీపీ శ్రేణులు సంతాపం ప్రకటించాయి. దక్షిణ అభ్యర్థి కోలా గురువులు ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. -
శోభా నాగిరెడ్డి కన్నుమూత
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ అగ్రనేత శోభా నాగిరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 11.05 గంటలకు ఆమె మరణించారు. ఈ విషయాన్ని కేర్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్నీరు మున్నీరయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు అయిన శోభా నాగిరెడ్డి చురుకైన నేత. ఆమె 1968 నవంబర్ 16న ఆళ్లగడ్డలో జన్మించారు. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె అయిన శోభ ఇంటర్ వరకు చదివారు. 1986లో ఆమెకు భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది. 1996 నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోదఫా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున రాయలసీమలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాత్రమే. అది కూడా చిరంజీవి ప్రభావం వల్ల కాకుండా, తమ కుటుంబానికి ఉన్న పరపతితోనే ఆమె గెలిచారు. -
శోభా నాగిరెడ్డి పరిస్థితి విషమం: హెల్త్ బులెటిన్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి (43) పరిస్థితి చాలా విషమంగా ఉందని కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఉదయం 10.30 గంటల తర్వాత హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. నిపుణులైన వైద్యులు పరీక్షలు చేస్తున్నారని, ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. సీటీ స్కాన్, ఎమ్మారై తదితర పరీక్షలు చేశారు. పక్కటెముకలు విరిగి ఛాతీలోకి చొచ్చుకెళ్లినట్లు తెలిసింది. మెడమీద కూడా గాయాలయ్యాయి. మల్టిపుల్ ఇంజ్యురీస్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హృదయస్పందన, బీపీ, పల్స్ రేట్లు నార్మల్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉందని చెప్పారు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోగులు త్వరగా చికిత్సకు స్పందించరని, మరికొంత సమయం గడిస్తే తప్ప ఎలా స్పందిస్తున్నారన్న విషయం నిర్ధరించలేమని అన్నారు. రాత్రి ప్రమాదం జరిగి, తెల్లవారుజామున ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనపడకపోవడం మాత్రం ఆందోళనకరంగా ఉంది. -
కాసేపట్లో శోభానాగిరెడ్డి పరిస్థితిపై హెల్త్ బులెటిన్
-
కేర్ హాస్పిటల్ కు పలు నాయకులు
-
సోమరాజు ఆధ్వర్యంలో శోభానాగిరెడ్డికి చికిత్స
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభానాగిరెడ్డిని కాపాడేందుకు కేర్ ఆస్ప్రత్రి ఛైర్మన్ డాక్టర్ సోమరాజు పర్యవేక్షణలో మూడు బృందాలు పనిచేస్తున్నాయి. ఆర్థో, న్యూరో, క్రిటికల్ కేర్ బృందాలు ఆమెకు చికిత్స చేస్తున్నాయి. ప్రస్తుతం సీటీ స్కాన్ తీశారు. పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన తర్వాతే ఏ చికిత్స అందిస్తారో తెలుస్తుంది. పరీక్షలన్నీ పూర్తయ్యి, చికిత్స ప్రారంభం అయిన తర్వాత మాత్రమే తాము మీడియాకు అప్డేట్ ఇవ్వగలమని వైద్యులు చెప్పారు. మొత్తం చికిత్స అంతా కేర్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు పర్యవేక్షణలోనే జరుగుతోంది. అయితే 48 గంటల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఏ విషయమైనా చెప్పగలమని వైద్యులు అంటున్నారు. ఆమె మెడకు తీవ్ర గాయం అయ్యిందని, కంటి పైభాగంలో కూడా గాయం అయ్యిందని చెబుతున్నారు. వాహనం బాగా వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగి, వాహనం అద్దాలు పగిలి శోభానాగిరెడ్డి రోడ్డుపై పడటంతో బలమైన గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఆమెకు తగిలిన గాయాల కారణంగా.. క్రిటికల్ కేర్ వైద్యులు ప్రధానంగా ఆమెను కంటికి రెప్పలా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థో టీంలో ముగ్గురు, న్యూరో టీంలో ముగ్గురు నలుగురితో పాటు క్రిటికల్ కేర్ విభాగంలోని ఓ పెద్ద బృందం ఆమకు చికిత్స అందిస్తోంది. దాదాపు మరో గంట సమయంలో హెల్త్ బులెటిన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలా ఉందో మాత్రం తాము చెప్పలేమని వైద్యులు అంటున్నారు. అయితే ఆమెకు ఇంటర్నల్ బ్లీడింగ్ (అంతర్గత రక్తస్రావం) జరుగుతోందని మాత్రం తెలిసింది. -
నేలకొరిగిన ‘పులి’
భాయ్సాబ్ ఇకలేరు.. నరేంద్ర మృతితో అన్ని పార్టీల నేతల దిగ్భ్రాంతి తరలివచ్చిన ఆయా పార్టీల ప్రముఖులు అబిడ్స్,చార్మినార్,గోల్నాక,న్యూస్లైన్: పులి నేలకొరిగింది. ఆయన పేరు చెబితే ప్రత్యర్థుల గుండెల్లో దడపుట్టించే టైగర్ నరేంద్ర కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆలే నరేంద్రకు భార్య లలితతోపాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ఆలె భాస్కర్రాజ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. చిన్న కుమారుడు జితేంద్ర బీజే వైఎం గ్రేటర్ అధ్యక్షుడు, గౌలిపురా కార్పొరేటర్గా ఉన్నారు. కుమార్తె సబితకు వివాహమైంది. నరేంద్రకు నలుగురు సోదరులు, నలుగురు అక్కాచెల్లెలున్నారు. ఆయన మరణవార్త తెలుసుకొని అన్ని పార్టీల నేతలు ఆస్పత్రికి తరలివచి భౌతికకాయానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. పాతబస్తీలో విషాదచాయలు : నరేంద్రమృతితో ప్రధానంగా పాతబస్తీలో విషాదచాయలు అలుముకున్నాయి. నాంపల్లి కేర్ ఆస్పత్రి నుంచి అంబులెన్స్లో ఆయన పార్ధివదేహాన్ని మదీనా, చార్మినార్, శాలిబండల మీదుగా గౌలిపురాలోని ఆయన నివాసానికి ర్యాలీగా తీసుకొచ్చారు. పాతబస్తీలోని ప్రధాన కూడళ్లలో ఆయన చిత్రపటాలు, నల్లజెండాలు ఉంచి సంతాపం తెలిపారు. అంబర్పేటతో విడదీయరాని బంధం : అప్పటి హిమాయత్నగర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆలె నరేంద్రకు అంబర్పేటతో విడదీయరాని అనుబంధం ఉంది. పేదల పెన్నిధిగా పేరొందిన ఆయన ఇకలేరని తెలిసి పలువురు నాయకులు దిగ్భాంతికి గురయ్యారు. తొలిసారి 1983లో హిమాయత్నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కార్మిక నాయకుడిగా కూడా ఉన్న నరేంద్ర నియోజకవర్గానికి చెందిన పలువురికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పెట్టించారు. 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వి.హనుమంతరావు చేతిలో పరాజయం పాలయ్యారు. 1994లో బీజేపీ నుంచి పోటీచేయగా 67 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కృష్ణాయాదవ్ చేతిలో ఓడిపోయారు. నాటినుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. నరేంద్రనగర్ : అంబర్పేట డివిజన్లో ఆలె నరేంద్ర పేరు మీద ఒక బస్తీ ఏర్పాటైంది. ప్రస్తుతం దాన్ని నరేంద్రనగర్గా పిలుస్తున్నారు. ఈ బస్తీలోనే నరేంద్రనగర్ కమ్యూనిటీహాల్ కూడా ఉంది. -
'టైగర్' ఆలే నరేంద్ర కన్నుమూత
-
'టైగర్' ఆలే నరేంద్ర కన్నుమూత
బీజేపీ సీనియర్ నేత ఆలే నరేంద్ర తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా నరేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. రాష్ట్ర రాజకీయాల్లో 'టైగర్' పేరుతో సుపరిచితులు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని బంధువులు తెలిపారు. ఆయనకు భార్య లలిత, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తే ఉన్నారు. 1946 ఆగస్టు 21 తేదిన హైదరాబాద్ పాతబస్తిలోని ఆలియాబాద్ జన్మించారు. ఆయన కుమారుడు ఆలే జితేంద్ర జీహెచ్ ఎంసీ కార్పోరేటర్ గా సేవలందిస్తున్నారు. హిమయత్ నగర్ శాసన సభకు తొలిసారి ఎన్నికైన నరేంద్ర బీజేపీలో పలు పదవులను చేపట్టారు. మొత్తం మూడుసార్లు హిమాయత్ నగర్ నుంచి గెలుపొందారు. ప్రత్యేక రాస్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ సాధన సమితి పేరుతో పార్టీని నిర్వహించారు. ఆతర్వాత కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ సాధన సమితిని విలీనం చేశారు. నకిలీ పాస్ట్ పోర్టు కుంభకోణం కేసును సాకుగా చూపించి 2007లో నరేంద్రను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆతర్వాత 2011 జూన్ 27 తేదిన తిరిగి బీజేపీలో చేరారు. యూపీఏ-1 ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ది శాఖామంత్రిగా సేవలందించారు. 13, 14వ లోకసభలో మెదక్ లోకసభ నుంచి ప్రాతినిధ్యం వహించారు. పాతబస్తీ అనే చిత్రంలో విలన్ గా కనిపించారు. ఆలే నరేంద్ర మృతికి బీజేపీ నేతలు, సీనియర్ రాజకీయ వేత్తలు, తెలంగాణవాదులు సంతాపం ప్రకటించారు. -
కేటీఆర్కు స్వల్ప అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఆయనకు స్వల్పస్థాయిలో ఛాతీలో నొప్పి వచ్చింది. నిద్రలో ఒక్కసారిగా నొప్పి రావడంతో ఆందోళన చెందిన ఆయన వెంటనే కుటుంబసభ్యులతో కలసి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు, డాక్టర్ కృష్ణమోహన్లతో కూడిన వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఇది గుండెకు సంబంధించిన నొప్పికాదని గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చిన నొప్పి అని వైద్యులు నిర్ధారించారు. ఈ సందర్భంగా పదిమంది వైద్యులతో కూడిన బృందం దాదాపు ఏడుగంటలపాటు ఆయన్ను ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించింది. అంతా సర్దుకోవడంతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆ సమయంలో కేటీఆర్ తండ్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్, న్యూస్లైన్: వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టడంతో ఓ ఎం.ఫార్మసీ విద్యార్థి మృతి చెందగా మరో నలుగురు విద్యార్థులు గాయాలపాలైన సంఘటన శుక్రవారం హైదరాబాద్లోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... చిత్తూరు జిల్లాకు చెందిన అర్తల రామ్మూర్తి (28) నగరంలోని కేర్ ఆస్పత్రిలో పనిచేస్తూ, బాటసింగారంలోని ఎస్ఎల్సీ కళాశాలలో ఎం.ఫార్మసీ చదువుతున్నాడు. శుక్రవారం మొదటి సంవత్సరం పరీక్షకు హాజరై తోటి విద్యార్థులు కోదండ రాముడు, తిమోదిన్లతో కలిసి పల్సర్ బైక్(ఏపీ09సీఎల్ 8070)పై నగరం వైపు వస్తున్నాడు. ముషీరాబాద్లో నివాసి బాబు కుమారుడు ఇంటర్ విద్యార్థి నరేష్, రాంనగర్లోని ప్రై వేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సుప్రియలు బైక్(ఏపీ03ఏజెడ్ 4916)పై వస్తూ అబ్ధుల్లాపూర్ గండిమైసమ్మ వద్ద మలుపు తిరుగుతున్నారు. నగరం నుంచి వేగంగా వస్తున్న ఇన్నోవా కారు (ఏపీ37బీపీ 0001) అదుపుతప్పి డివైడర్కు అవతలి వైపు దూసుకెళ్లి రెండు బైకులను ఢీ కొట్టింది. దీంతో బైక్పై ఉన్న రామ్మూర్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో బైక్పై ఉన్న నరేష్, సుప్రియలు తీవ్రంగా గాయపడ్డారు. రామ్మూర్తి బైక్పై ఉన్న తిమోదిన్, కోదండ రాముడుకు గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం హయత్నగర్లోని సన్రైజ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నరేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మరో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ఆదిత్య ఫిషరీస్ ప్రై వేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీకి చెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కినేని నాగేశ్వరరావు జ్ఞాపకాలు
-
డాక్టర్ రామారెడ్డికి క న్నీటి వీడ్కోలు
అనపర్తి, న్యూస్లైన్: ప్రముఖ వైద్య నిఫుణుడు, శ్రీనివాసా నర్సింగ్హోమ్ అధినేత డాక్టర్ పోతంశెట్టి రామారెడ్డి (రాము డాక్టర్) అంత్యక్రియలు శుక్రవారం ఉదయం స్థానిక హిందూ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆయన కుమారుడు డాక్టర్ జానకి రామారెడ్డి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. రామారెడ్డి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. రాము డాక్టర్ మృతదేహం గురువారం అర్ధరాత్రి దాటాక ఇక్కడి ఆయన స్వగృహానికి చేరుకుంది. అప్పటికే ఆయన అభిమానులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆయన మృతదేహాన్ని చూసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆప్రాతం శోకసంద్రమైంది. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు రాము డాక్టర్ భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అంతిమ యాత్ర ఉదయం ఆరు గంటలకు ఆయన స్వగృహం వద్ద ప్రారంభమై శ్రీనివాసా నర్సింగ్హోమ్కు చేరింది. అక్కడ అభిమానుల దర్శనార్థం కొద్దిసేపు డాక్టర్గారి భౌతిక కాయాన్ని ఉంచారు. అక్కడ నుంచి అంతిమ యాత్ర హిందూ శ్మశానవాటికకు 11 గంటలకు చేరుకుంది. అంతిమ యాత్రలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే పీ విష్ణువర్థన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గనేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, డాక్టర్ టీ సత్యనారాయణరెడ్డి, డాక్టర్ ఏఎస్ఎన్ మూర్తి, డాక్టర్ టీరామగుర్రెడ్డి, డాక్టర్ జీఎస్ఎన్రెడ్డి, డాక్టర్ టీ నవీన్, డాక్టర్ జగన్మోహనరెడ్డి, డాక్టర్ కర్రి సాయి వెంకట కృష్ణారెడ్డి, రాయవరం ఏరియా రైసుమిల్లర్సు అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. సత్యనారాయణరెడ్డి, నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ప్రతినిధి టి. సుధాకరరెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు కర్రి ధర్మారెడ్డి, గ్రామ సర్పంచ్ జి. బాపిరాజు, జీబీఆర్ విద్యా సంస్థల అధిపతి తేతలి ఆదిరెడ్డి, నల్లమిల్లి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎన్. వీర్రాఘవరెడ్డి, చిర్ల వీర్రాఘవరెడ్డి, వర్తక సంఘం మాజీ అధ్యక్షుడు సత్తి విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురి సంతాపం డాక్టర్ రామారెడ్డి మృతి పట్ల సనాతన ధర్మపరిరక్షణ సమితి అధ్యక్షుడు రెడ్డి సురేష్ శర్మ, ఘంటసాల ఆరాధన కమిటీ అధ్యక్షుడు దుర్భ శ్రీరామ్మూర్తి, పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మిరియాల వీర్రాజు, పీవీఎన్ సూర్యనారాయణ, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు తమలంపూడి రామారెడ్డి(ఇంజనీర్), తేతలి త్రిమూర్తులు రెడ్డి, నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, ఎన్సీఆర్ మురళి తదితరులు సంతాపం తెలిపారు. ఆస్పత్రులు, వ్యాపార, విద్యా సంస్థల మూసివేత రామారెడ్డి ఆకస్మిక మృతికి సంతాప సూచకంగా అనపర్తిలో శుక్రవారం ఆస్పత్రులు, వ్యాపార, విద్యా సంస్థలు, హోటళ్లు మూసివేశారు. -
బొత్సకు స్వల్పస్థాయిలో బ్రెయిన్ స్ట్రోక్
సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. మాట తడబడటం, నీరసంగా ఉన్నట్టు అనిపించడంతో ఉదయం 11 గంటల సమయంలో ఆయన నేరుగా బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రికి వెళ్లారు. వెంటనే ఎంఆర్ఐ, ఇతర పరీక్షలు నిర్వహించారు. మెదడులో రక్తం గడ్డ (క్లాట్-మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్) కట్టడంతో స్వల్ప స్థాయిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో బొత్సను వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కేర్కు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ సోమరాజు, నరాల సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ బి.చంద్రశేఖర్రెడ్డి పర్యవేక్షణలో బొత్సకు వైద్యసేవలు అందిస్తున్నారు. బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డిశ్చార్జి ఎప్పుడు చేయాలనేది నిర్ణయించనున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీఎం కిరణ్కుమార్రెడ్డి పరామర్శ కేర్లో చికిత్సపొందుతున్న బొత్సను మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పరామర్శించారు. బొత్స ఆరోగ్య పరిస్థితి, ఆయనకు అందిస్తున్న వైద్యసేవల గురించి డాక్టర్ సోమరాజును అడిగి తెలుసుకున్నారు. -
బొత్సకు బ్రెయిన్ ఇన్ఫెక్షన్!
-
బొత్సకు బ్రెయిన్ ఇన్ఫెక్షన్!
హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయన బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బొత్స సత్యనారాయణ బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక చికిత్సల అనంతరం బొత్సకు మెదడులో రక్తం గట్టకట్టినట్లు వైద్యలు నిర్థారించారు. డాక్టర్ సోమరాజు ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా రెండున్నర నెలల తర్వాత రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. అయితే అస్వస్థత కారణంగా బొత్స ఈ భేటీకి దూరంగా ఉన్నారు. -
నిశ్శబ్దంతో పాటు అపోహలనూ ఛేదించండి
హెచ్ఐవీపై అపోహలూ, వాస్తవాలు... హెచ్ఐవీ కంటే భయంకరమైనవి, అంతకంటే ప్రాణాంతకమైనవి ఎన్నో వ్యాధులు ఉన్నాయి. కానీ బహుశా వాటి పట్ల కూడా లేని ఎన్నో భయాలు, ఇంకెన్నో ఆందోళనలూ, మరెన్నో అపోహలు హెచ్ఐవీ పట్ల ఉన్నాయన్నది నికార్సయిన సత్యం. నిజానికి హెచ్ఐవీ అన్నది పూర్తిగా నియంత్రించదగ్గ వ్యాధిగా మారి చాలా రోజులైంది. ఉదాహరణకు డయాబెటిస్ను పూర్తిగా తగ్గించలేకున్నా మందులు వాడుతూ ఎప్పటికీ అదుపులో ఉంచగలిగినట్లే... హెచ్ఐవీకి కూడా మందులు వాడుతూ జీవితాంతం అదుపులో ఉంచుకుంటూ, పూర్తి జీవితకాలం బతకవచ్చు. అయినప్పటికీ దాని పట్ల ఉన్న అనేక అపోహల కారణంగా జీవితంలో ఎప్పటికీ తగ్గించలేని వివక్ష హెచ్ఐవీ రోగుల పట్ల ఉంది. నేడు ప్రపంచ హెచ్ఐవీ దినం సందర్భంగా హెచ్ఐవీ పట్ల ఉన్న అనేక అపోహలూ, వాస్తవాలపై కథనం. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ) అని పిలిచే ఈ వైరస్ మన వ్యాధి నిరోధక వ్యవస్థను దెబ్బతిస్తుంది. ఈ వైరస్ మన వ్యాధి నిరోధక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఏ చిన్న వ్యాధినీ నిరోధించలేని స్థితిని కలిగితే ఆ దశను ‘ఎయిడ్స్’ అంటారు. ఇది సురక్షితం కాని సెక్స్ వల్ల, వ్యాధిబారిన పడ్డ వారి రక్తాన్ని ఎక్కించడం వల్ల, తల్లి నుంచి బిడ్డకు అనే మూడు మార్గాల ద్వారానే వ్యాపిస్తుంది. ఇతరత్రా ఎలాంటి మార్గాల ద్వారా అది వ్యాపించదు. అయినప్పటికీ హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగుల పట్ల ఎంతో వివక్ష కొనసాగుతోంది. ఉదాహరణకు వారితో కరచాలనం చేయడానికి సైతం ఒప్పుకోలేనంతగా అపోహలు మనలో వ్యాపించి ఉన్నాయి. హెచ్ఐవీ/ఎయిడ్స్ పట్ల ఉన్న అనేక అపోహలూ, వాస్తవాలను తెలుసుకుందాం. అపోహ: మన మధ్య హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులు ఉంటే చాలు... ఆ వ్యాధి మనకు సంక్రమిస్తుంది. వాస్తవం: అది కేవలం అపోహ మాత్రమే. హెచ్ఐవీ అన్నది వ్యాధి ఉన్నవారితో సెక్స్ చేయడం, వారి రక్తాన్ని స్వీకరించడం ద్వారా తప్ప మరింకే మార్గంలోనూ వ్యాపించదు. హెచ్ఐవీ రోగులు ఉన్న ప్రాంతంలో మనం శ్వాసించడం వల్ల గాలి ద్వారా అది మనకు సంక్రమించదు. వారిని హత్తుకున్నా, కరచాలనం చేసినా అది మనకు రాదు. హెచ్ఐవీ రోగులు వాడిన టాయిలెట్ సీట్లపై మనం కూర్చున్నా, లేదా వారు ముట్టుకున్న డోర్ నాబ్, హ్యాండిల్స్ను ఆ తర్వాత మనం వాడినా ఎయిడ్స్ రాదు. వారితో కలిసి భోజనం చేసినా హెచ్ఐవీ వ్యాప్తి చెందదు. అపోహ: హెచ్ఐవీ ఉన్న రోగిని కుట్టిన దోమ మళ్లీ మనల్ని కుడితే మనకు వ్యాధి వస్తుంది. వాస్తవం: ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. నిజానికి ఒక హెచ్ఐవీ రోగిని దోమ కుట్టాక, అది మనల్ని కుడితే, అది తాగిన రక్తాన్ని మనలోకి ఎంతమాత్రమూ ఎక్కించదు. అది మన రక్తాన్ని పలచబార్చడం కోసం కేవలం తన లాలాజలాన్ని మాత్రం ఎక్కించి, ఆ తర్వాత మళ్లీ మన రక్తం తాగుతుంది. ఇలా దోమ ద్వారా ఎయిడ్స్ వ్యాపించిన కేసు ఇప్పటికి ఒక్కటి కూడా నమోదు కాలేదు. అపోహ: మనం హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ రోగిని చూడగానే అతడికి వ్యాధి ఉన్నట్లు గుర్తించగలం. వాస్తవం: ఇది ఎంత మాత్రమూ నిజం కాదు. ఎందుకంటే ఎయిడ్స్ రోగుల లక్షణాలూ అందరిలోనూ ఒకేలా ఉండవు. అయితే హెచ్ఐవీ సోకిన తర్వాత, అది మనలో వ్యాధినిరోధకశక్తిని పూర్తిగా నశింపజేసే ఎయిడ్స్ దశకు చేరడానికి ఎంతోకాలం పడుతుంది. అప్పటివరకూ (ప్రత్యేకంగా వ్యాధి నిర్ధారణకు చేయించాల్సిన రక్తపరీక్ష చేయించుకుంటే తప్ప) ఎవరికైనా వ్యాధి ఉన్న సంగతే తెలియదు. అపోహ: హెచ్ఐవీ సోకగానే అది వేగంగా ఎయిడ్స్ దశకు తీసుకెళ్తుంది. వాస్తవం: హెచ్ఐవీ సోకగానే అది ఎయిడ్స్ దశకు చేరదు. నిజానికి హెచ్ఐవీ సోకిన తర్వాత చికిత్స తీసుకుంటూ, డాక్టర్ చెప్పిన మార్గదర్శకాలనూ, నిబంధనలనూ పాటిస్తూ మందులు వాడుతుంటే అది ఎప్పటికీ ఎయిడ్స్ దశకు చేరకపోవచ్చు కూడా. ఒకవేళ హెచ్ఐవీ సోకిన వారు వాడాల్సిన యాంటీరిట్రోవైరల్ మందులు తీసుకునే చికిత్స తీసుకోకపోతే కొన్నేళ్ల తర్వాత మాత్రమే అది ఎయిడ్స్ దశకు చేరుతుంది. కాబట్టి యాంటీరెట్రోవైరల్ మందులు వాడుతూ ఉంటే వారు ఎప్పటికీ ఎయిడ్స్ బారిన పడరు. అపోహ: హెచ్ఐవీ అన్నది కేవలం హోమోసెక్సువల్ అలవాటు ఉన్నవారికీ, సెక్స్ వర్కర్లకూ, మాదకద్రవ్యాల(డ్రగ్స్)ను నరంలోకి తీసుకునే వారికి మాత్రమే వస్తుంది. కాబట్టి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అంటే ఒకరికి హెచ్ఐవీ సోకిందంటే వారు పైన పేర్కొన్న వర్గాలకు మాత్రమే చెందుతారని అర్థం. వాస్తవం: పై విషయం అర్ధ సత్యం మాత్రమే. పైన పేర్కొన్న మూడు వర్గాలూ హెచ్ఐవీకి అత్యధిక రిస్క్ ఉన్నవారే అయినప్పటికీ మిగతావారంతా సురక్షితం అని కాదు అర్థం. ఒకవేళ మనం పైన పేర్కొన్న మూడు వర్గాలకు చెందకపోయినా, పొరబాటున ఎవరిదైనా కలుషితమైన రక్తం (హెచ్ఐవీ ఇన్ఫెక్టెడ్ బ్లడ్) ఎక్కించిన పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన వ్యక్తి, పైన పేర్కొన్న మూడు వర్గాలకు చెందకపోయినా హెచ్ఐవీ సోకవచ్చు. అపోహ: ఒకవేళ హెచ్ఐవీ సోకితే... కొంతకాలం దానికి సంబంధించిన మందులు వాడాక వాటిని మానేయవచ్చు. వాస్తవం: ఇది వాస్తవం కాదు. నిజానికి హెచ్ ఐవీకి వాడే మందులు చాలా ప్రభావితమైనవి. వాటివల్ల వచ్చే కొన్ని సైడ్ఎఫెక్ట్స్ కారణంగా వాటిని కొంతకాలం డాక్టర్లు ఆపేస్తే ఆపవచ్చు. కానీ అలా ఆపడం అన్నది వ్యాధి మళ్లీ పుంజుకోడానికి దోహదపడవచ్చు. అందుకే డాక్టర్ల సలహా లేకుండా మందులు వాడటం ఆపకూడదు. అపోహ: ఓరల్ సెక్స్ సురక్షితం. కాబట్టి దాని ద్వారా హెచ్ఐవీ రాదు. వాస్తవం: ఓరల్ సెక్స్ ద్వారా హెచ్ఐవీ వ్యాపించడానికి అవకాశాలు తక్కువే అయినా, పూర్తిగా సురక్షితమని చెప్పడానికి లేదు. ఎందుకంటే వ్యాధి సోకిన వారిలోగాని లేదా వారి పార్ట్నర్లో గాని నోటిలో ఏవైనా గాయాలున్నా, ఎదుటివారి రహస్యాంగాల్లో ఏవైనా కనిపించనంత చిన్న గాయాలు, పుండ్లు ఉన్నా... వాటి ద్వారా హెచ్ఐవీ వ్యాపించడానికి అవకాశాలు ఉన్నాయి. అపోహ: హెచ్ఐవీ అన్నది కేవలం సెక్స్ ద్వారానే వ్యాపిస్తుంది. వాస్తవం: ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. హెచ్ఐవీ వ్యాప్తికి సెక్స్ ఒక కారణం. అంతేగాని సెక్స్ ద్వారా మాత్రమే అది వ్యాప్తి చెందదు. ఉదాహరణకు ఆసుపత్రిలో హెచ్ఐవీ సోకిన వారికి చేసిన ఇంజెక్షన్ సూది గుచ్చుకోవడం, పచ్చబొట్టు వేయడానికి వారికి ఉపయోగించిన సూదులనే మళ్లీ ఇతరులకు ఉపయోగించడం, తల్లికి హెచ్ఐవీ ఉంటే... ఆ చనుబాలు తాగడం వల్ల బిడ్డకు రావడం వంటి కారణాలతోనూ హెచ్ఐవీ రావచ్చు. కాబట్టి హెచ్ఐవీ సోకిన ప్రతివారికీ అది సామాజికంగా అనుమతించని సెక్స్ వల్లనే వచ్చిందని భావించడం సరికాదు. అలా వారిపట్ల వివక్షతో కూడిన ధోరణిని ప్రదర్శించడమూ సరికాదు. అపోహ: కొన్ని వైద్యవిధానాల్లో హెచ్ఐవీని తగ్గించడానికి మందులు ఉన్నాయి. వాస్తవం: ఇప్పటికి ఏ వైద్యవిధానంలోనూ హెచ్ఐవీని పూర్తిగా తగ్గించి, నయం చేసే మందు ఇంకా అందుబాటులో లేదు. అపోహ: గర్భనిరోధానికి వాడే డయాఫ్రమ్స్, సర్వికల్ క్యాప్స్, స్పాంజెస్, స్పెర్మిసైడ్స్, డెపో ప్రోవేరా, నార్ప్లాంట్, లేదా గర్భనిరోధక పిల్స్ అన్నవి హెచ్ఐవీని కూడా నిరోధిస్తాయి. వాస్తవం: పైన గర్భనిరోధక సాధనాలన్నీ కేవలం అవాంఛిత గర్భాన్ని రాకుండా చేసేవే. అంతేగాని సెక్స్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను, హెచ్ఐవీని పూర్తిగా నిరోధించిన దాఖలాలు లేవు. కాకపోతే పైవి వాడుతున్న సందర్భాల్లోనూ పురుషులు కండోమ్ వాడటం వల్ల ఇతర సెక్స్వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు (ఎస్టీడీ)లతో పాటు హెచ్ఐవీని వ్యాప్తిచెందకుండా అరికట్టవచ్చు. అయితే పెళ్లికాక ముందు బ్రహ్మచర్యం పాటించడం, పెళ్లయ్యాక కేవలం జీవిత భాగస్వామికే పరిమితం కావడం అన్నవి హెచ్ఐవీని నిరోధించడానికి మంచి మార్గాలు. తస్మాత్ జాగ్రత్త..! అపోహ: ముద్దులతో హెచ్ఐవీ వ్యాప్తి చెందదు. వాస్తవం: ముద్దులతో హెచ్ఐవీ వ్యాప్తి చెందదన్నమాట వాస్తవమే అయినా పూర్తిగా నమ్మదగినది కాదు. హెచ్ఐవీ వైరస్ శరీర ద్రవాలలో ఉంటుందన్నమాట వాస్తవం. కాబట్టి లాలాజలంలోనూ ఉండటానికి అవకాశం ఉంది. అయితే లాలాజలం వల్ల వ్యాప్తి చెందే అవకాశం తక్కువ. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే పొడి ముద్దుల వల్ల హెచ్ఐవీ వ్యాప్తి చెందే అవకాశం లేదు. కాని ఒకవేళ లాలాజల మార్పిడి చాలా ఎక్కువగా జరిగేలా గాఢమైన చుంబనాలు జరిపినా, లేదా పార్ట్నర్ నోటిలో ఏవైనా కనిపించనంత చిన్న కురుపులు, గాట్లు ఉన్నా హెచ్ఐవీ వ్యాప్తిచెందేందుకు అవకాశం ఉంది. కాబట్టి గాఢ చుంబనాలకు బదులు పొడిముద్దులకు పరిమితం కావడం మంచిది. నిర్వహణ: యాసీన్ భవిష్యత్తులో వ్యాక్సిన్ రూపొందితే..? అపోహ : భవిష్యత్తులో హెచ్ఐవీకి వ్యాక్సిన్ కనుగొంటే, అప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నవారికి పొరబాటున హెచ్ఐవీ వచ్చే అవకాశం ఉండదా? వాస్తవం: కొన్ని వ్యాక్సిన్లలో అత్యంత బలహీనంగా ఉన్న వ్యాధికారక క్రిమిని వాడటం వల్ల అలా రూపొందించిన పోలియో వంటి వ్యాక్సిన్ల ద్వారా కొందరికి ఆ వ్యాధి సోకి ఉన్నందున కొందరిలో ఇలాంటి సందేహం రావడం సహజం. కానీ హెచ్ఐవీ వ్యాక్సిన్ రూపొందితే అలా జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే... ఇందులో హెచ్ఐవీ తరహాలో కనిపించే దాని నకలును వాడతారు తప్ప... వాస్తవంగా హెచ్ఐవీ కారక వైరస్ను కాదు. ఉదాహరణకు ఫొటోస్టాట్ కాపీ ఒరిజినల్ కాలేనట్లే... ఈ హెచ్ఐవీ నకలు కాపీ వ్యాధికి కారణం కాబోదు. వ్యాక్సిన్ రూపొందించే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 30,000 మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే ఇందులో ఏ ఒక్కరికీ హెచ్ఐవీ సోకలేదు. ఇంకా జీవితం ఉంది..! అపోహ: హెచ్ఐవీ సోకినవారికి ఇక జీవితం శూన్యం. వాస్తవం: హెచ్ఐవీని తొలుత గుర్తించిన రోజుల్లో అది సోకిన కొందరు మృత్యువాత పడ్డారు. కానీ హెచ్ఐవీపై నియంత్రణ సాధించగల యాంటీ రెట్రోవైరల్ మందుల ఆవిష్కారం తర్వాత హెచ్ఐవీ రోగులు సైతం అందరిలాగే దీర్ఘకాలం బతుకుతున్నారు. ఎప్పటిలాగే తమ పనులు తామే చేసుకోవడం, అందరిలాగే జీవించడం సాధ్యమైంది. హెచ్ఐవీ వైరస్ను కలిగి ఉండటం తప్ప... ఇంక వారి సామాజిక జీవితంలో ఎలాంటి అవరోధమూ లేనంత నార్మల్గా బతకడం సాధ్యమే. కాబట్టి పై మాట పూర్తిగా అపోహ మాత్రమే. డాక్టర్ గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
శరీరానికే వైకల్యం... చెదరనివ్వకు మనోబలం
పక్షవాతం ఎంత ప్రమాదకరమైనదంటే... ఇది వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరు శాశ్వతంగా అంగవైకల్యం బారిన పడుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు పక్షవాతం బారిన పడుతున్నారు. ఇవీ పక్షవాతం తీవ్రతకు అద్దం పట్టే అంకెలు. ఒకసారి పక్షవాతం బారిన పడితే ఇక వారు జీవితాంతం పక్క మీద పడీ, పక్కవాళ్ల మీద ఆధారపడీ జీవించాల్సిన దుస్థితి అనుకుంటారందరూ. అందుకే గుండెపోటుకూ భయపడనివారు, పక్షవాతం అంటే వణికిపోతుంటారు. అయితే మనోబలం చెడనివ్వకపోవడం, చిరునవ్వు చెరగనివ్వకపోవడాలే దీనికి అసలైన చికిత్సలు. అంతకంటే పెద్ద చికిత్స, సమర్థమైన చికిత్స నివారణే. పైగా ఈ నివారణ చాలా సులభం కూడా. ఈ నెల 29న ప్రపంచ పక్షవాత దినం (వరల్డ్ స్ట్రోక్ డే) సందర్భంగా పై అంశాలపై అవగాహన కలిగించడం కోసమే ఈ కథనం. పక్షవాతం వస్తే శాశ్వతంగా అంగవైకల్యం కలగడానికి ఒక కారణం ఉంది. ఏదైనా కణం దెబ్బతిన్నా లేదా చనిపోయినా ఆ కణం స్థానంలో కొత్త కణాలు పెరిగే అవకాశం ఉంది. కానీ మెదడు కణాలు మాత్రం అలా కాదు. అవి ఒకసారి నశించాయంటే ఇక ఆ నష్టం శాశ్వతం. అందుకే పక్షవాతం వచ్చి, కాళ్లూ చేతులు చచ్చుబడిపోతే అవి సాధారణ స్థితికి రావడం ఒక పట్టాన అసాధ్యం. అందుకే పక్షవాతం లక్షణాలు కనిపించగానే రోగిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. ఒక కుటుంబంలో ఎవరైనా, ఏదైనా వ్యాధికి గురైతే అది వారిని మాత్రమే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కానీ పక్షవాతానికి గురైతే మాత్రం అది మొత్తం కుటుంబ సభ్యులనందరినీ ప్రభావితం చేస్తుంది. అందరికీ ఇక్కట్లను కలగజేస్తుంది. గతంలో ఒక వయసు దాటినవారు పక్షవాతానికి గురయ్యేవారు. కానీ ఇప్పుడు యుక్తవయసులోని వారు కూడా దీని బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, జన్యుపరమైన అంశాలు ఇందుకు కారణం. పక్షవాతానికి కారణాలు: మన శరీరంలోని ప్రతి అవయవానికీ రక్తం నిరంతరం సరఫరా అవుతుండాలి. ఇక మెదడు విషయంలోనైతే అది మరింత అవసరం. ఏదైనా కారణం వల్ల మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే అక్కడి కణాలు మరణించడం జరుగుతుంటుంది. రక్తసరఫరాలో అంతరాయానికి ప్రధానంగా రెండు రకాల కారణాలున్నాయి. మొదటిది... రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టి అది ప్రవాహానికి అడ్డుపడటం. దాదాపు 80 శాతం పక్షవాతం కేసుల్లో ఇదే కారణం. ఇక ఒక్కోసారి రక్తనాళాలు చిట్లడం వల్ల రక్తం బయటకు ప్రవహించడంతో మెదడులోని కొన్ని కణాలకు రక్తసరఫరా అందకపోవడం. దాదాపు 20 శాతం కేసుల్లో పక్షవాతానికి ఈ కండిషన్ కారణమవుతుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా మెదడులోని ఆ రక్తనాళాలు సరఫరా చేసే భాగానికి తగినపోషకాలు, ఆక్సిజన్ అందక ఆ ప్రాంతంలోని కణాలు నశిస్తాయి. దాంతో అవి నియంత్రించే శరీర భాగాలు చచ్చుబడిపోతాయి. లక్షణాలు: పక్షవాతంలోని లక్షణాలు మెదడులో రక్తసరఫరా ఆగిన చోటుపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మెదడులోని కాళ్లూ, చేతులను నియంత్రించే భాగాలకు రక్తసరఫరా ఆగితే ఆ భాగాలు చచ్చుబడతాయి. అలాగే ముఖం, నోరు, కన్ను, ఒక్కోసారి శరీరానికి ఇరువైపులా ఉన్న భాగాలు ప్రభావితం కావచ్చు. దీనివల్ల మాట పడిపోవడం, నిలకడగా/స్థిమితంగా నిలవలేకపోవడం, చూపుకోల్పోవడం, స్పృహకోల్పోవడం కూడా జరగవచ్చు. దాదాపు 90 శాతం కేసుల్లో అకస్మాత్తుగా శరీరంలోని ఒకవైపు సగభాగంపై నియంత్రణ కోల్పోవడం ద్వారా దీని లక్షణాలు బయటపడతాయి. దాంతో పక్షవాతం సోకిన వ్యక్తుల్లో ఒకవైపు శరీర భాగాలు చచ్చుబడిపోవడం మామూలే. అకస్మాత్తుగా ఇలా జరగడాన్ని తప్పనిసరిగా ‘పక్షవాతం’ (స్ట్రోక్)గానే పరిగణించాలి. (నిర్దిష్టంగా అది పక్షవాతం కాదని కచ్చితంగా తెలిసే వరకూ అది పక్షవాతమేనని వైద్యశాస్త్రం పేర్కొంటోంది). మనిషిలో ఒకవైపు శరీర భాగాలు చచ్చుబడిపోవడం వల్ల అతడు నిరాశ, నిస్పృహల్లోకి కూరుకపోవడం, ఫిట్స్ రావడం, కొన్ని శరీరభాగాల్లో నొప్పి, మూత్రం/మలంపై నియంత్రణ కోల్పోవడం, ఎదుటివారితో కమ్యూకేషన్కు అంతరాయం కలగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అయోమయం వంటి లక్షణాలూ ఉంటాయి. ఫలితంగా కుటుంబ సభ్యుల సంబంధాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. దారితేసే అంశాలు: భారతదేశంలో పక్షవాతానికి దారితీసే పరిస్థితుల్లో హైబీపీ (రక్తపోటు) చాలా సాధారణమైనది / ప్రధానమైనది. ఈ పరిస్థితికి పొగతాగడం, స్థూలకాయం, డయాబెటిస్, ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, గుండెజబ్బులు, మితిమీరిన ఆల్కహాల్ అలవాటు, మానసిక ఒత్తిడి, శారీరకంగా తగినంత వ్యాయామం లేకపోవడం, కొద్దిమేరకు కుటుంబ చరిత్ర వంటివి పక్షవాతానికి దారితీసే పరిస్థితుల్లో ముఖ్యమైనవి. నిర్ధారణ: పక్షవాతాన్ని సీటీ స్కాన్ పరీక్ష లేదా ఎమ్మారై (బ్రెయిన్) ద్వారా నిర్ధారణ చేయవచ్చు. సీటీ స్కాన్, ఎమ్మారై ద్వారా పక్షవాతం వల్ల ప్రభావితమైన మెదడులోని ప్రాంతాలను గుర్తించవచ్చు. అలాగే రక్తస్రావం జరిగినా లేదా రక్తనాళాల్లో రక్తపు గడ్డలు అడ్డుపడినా ఆ పరీక్షలో తెలుస్తుంది. దాన్ని బట్టే చేయాల్సిన చికిత్స/కోలుకోగలిగే అవకాశాల (ప్రోగ్నోసిస్)ను నిర్ధారణ చేయవచ్చు. ఒకసారి పక్షవాతం వచ్చిందని నిర్ధారణ అయ్యాక, దానికి కారణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం సీబీపీ, రక్తంలో చక్కెర పాళ్లు (బ్లడ్ షుగర్), క్రియాటినిన్ వంటి రక్షపరీక్షలు, ఈసీజీ, టూ డి ఎకో వంటి గుండె పరీక్షలు, డాప్లర్ నెక్ వెసెల్స్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలు, మూత్ర పరీక్ష వంటివి చేయాల్సి ఉంటుంది. రక్తంలో ఒక రకం ప్రొటీన్లయిన హోమోసిస్టిన్ వంటి వాటిని అంచనా వేసే పరీక్ష, ప్రో-కోయాగ్యులెంట్ ఫాక్టర్స్ (రక్తం గడ్డకట్టడానికి దోహదపడే అంశాల) పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది. ఇలా నిర్దిష్టంగా పక్షవాతానికి కారణాన్ని కనుగొంటే దాన్ని బట్టి చికిత్స చేయడం సులభం. ఒక్కోసారి పక్షవాతానికి సంబంధించిన కొన్ని లక్షణాలు తాత్కాలికంగా కనబడితే... త్వరలోనే మరింత తీవ్రస్థాయిలో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని తెలుసుకోడానికి అది సూచనగా పనిచేస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వారిలో 30 శాతం కంటే ఎక్కువమందిలో ఏడాదిలోపే మరింత తీవ్రంగా మళ్లీ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. చికిత్స: పక్షవాతం వచ్చిన వారికి థ్రాంబోలైటిక్ థెరపీ అనే చికిత్సను అందజేస్తారు. ఈ చికిత్సప్రక్రియలో టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ (టీపీఏ) అనే ఇంజెక్షన్ ఇస్తారు. అది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఉన్న చోట ఆ రక్తపు గడ్డను విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో రక్తపు గడ్డ అడ్డుతొలగి, మళ్లీ మెదడులోని ఆ భాగానికి రక్త సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. అయితే పక్షవాతం లక్షణాలు కనిపించాక ఎంత త్వరగా ఈ ఇంజెక్షన్ ఇస్తే నష్టం అంత తక్కువగా ఉంటుంది. పక్షవాతం లక్షణాలు కనిపించాక కనీసం నాలుగున్నర గంటలలోపే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. కోలుకోవడం వేగంగా జరగడంతో పాటు, దుష్ర్పభావాలు తక్కువగా ఉంటాయి. అయితే ఒకసారి పక్షవాతం రావడం అంటూ జరిగితే ఇక రెండోసారి రాకుండా నివారించడమే దీనికి చికిత్సగా పరిగణించవచ్చు. (మొదటిసారి వచ్చిన పక్షవాతం నష్టనివారణ కోసం చేయాల్సిన చికిత్స అంటూ పెద్దగా ఉండదు). ఇందులో భాగంగా రక్తాన్ని పలచబార్చే మందులైన ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటివి ఇవ్వడం, రక్తంలో కొవ్వులు పేరుకోకుండా వాడే స్టాటిన్స్ వంటి మందులు వాడటం... చికిత్సలో భాగంగా ఇస్తారు. ఒకసారి పక్షవాతం కనిపిస్తే పైన పేర్కొన్న మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. అయితే రోగికి హైబీపీ, డయాబెటిస్ వంటివి ఉంటే ఆ మందులు కూడా వాడటం అవసరం. ఒకసారి గుండె సమస్యలు లేదా మెదడుకు రక్తాన్ని చేర్చే కెరోటిడ్ లేదా వర్టిబ్రల్ రక్తనాళాల్లో ఏదైనా సమస్యలు గుర్తిస్తే... పక్షవాతాన్ని నివారించేందుకు వీలుగా మందులు వాడాల్సింది. ఒకవేళ ఆ రక్తనాళాల్లో 70 శాతం కంటే ఎక్కువ అడ్డంకి (బ్లాక్) ఉంటే స్టెంటింగ్ లేదా శస్త్రచికిత్స అవసరమవుతుంది. పక్షవాతం బాధితుల పరిస్థితిని మెరుగుపరచడానికి ఫిజియోథెరపీ, స్పీచ్థెరపీ వంటివి చాలావరకు ఉపయోగపడతాయి. నివారణ: పక్షవాతం విషయంలో చికిత్స గురించి ఆలోచించడం కంటే నివారణ ఎంతో మేలు. ఇది చిన్నప్పట్నుంచే మొదలు కావాలి. నివారణ మార్గాలు కూడా చాలా సులభం. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఆహారంలో కొవ్వులు/ నూనెలు /మసాలాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఒకసారి అన్నం పెట్టుకున్న తర్వాత పైనుంచి ఉప్పు వేసుకోవడం అలవాటును మానుకోవాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు వంటి పోషకాహారాలను తీసుకోవాలి. కూరల్లో పసుపు ఎక్కువగా వాడటం పక్షవాతం నివారణకు బాగా మేలు చేస్తుంది. శరీరానికి తగినంత శ్రమ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి. తాజా అధ్యయనాల ప్రకారం వంటకు ఆలివ్ ఆయిల్ వాడటం, ముదురు రంగులో ఉండే చాక్లెట్లు పక్షవాతం నివారణకు ఉపయోగపడతాయని తేలింది. ఒకసారి పక్షవాతం వచ్చాక దాన్ని నయం చేసుకునేందుకు అనేక ప్రత్యామ్నాయ వైద్యవిధానాలను అనుసరించడం మన దేశంలో చాలా ఎక్కువ. అయితే అవేవి పెద్దగా సత్ఫలితాలను ఇవ్వవు. గుండెజబ్బుల వంటివి ఉన్నప్పుడు మొదట్నుంచీ రక్తాన్ని పలుచబార్చే మందుల్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల పక్షవాతాన్ని చాలావరకు సమర్థంగా నివారించుకోవచ్చని గుర్తుంచుకోవాలి. పక్షవాతానికి గురైన తర్వాత ఆ శరీర భాగానికి మసాజ్ వంటివి మన దేశంలో ఎక్కువ. అయితే వాటి వల్ల ఉండే ఉపయోగం పరిమితమే అని గుర్తుంచుకొని, నిరాశకు గురికాకుండా/మానసికంగా కుంగిపోకుండా ఉండాలి. ఒకసారి పక్షవాతానికి గురయ్యాక కోలుకోవడం లేదా నయం కావడం మెదడులో దెబ్బతిన్న భాగం ఏ మేరకు కోలుకుంటుందన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక వయసు దాటాక గుండెజబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు ఉన్న పెద్దవారు ఆ మందుల్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే నివారణ సాధ్యం. - నిర్వహణ: యాసీన్ ఈ పరిస్థితి మారడమే ఇప్పటి అవసరం... రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి దాదాపు 40,000 మంది బ్రెయిన్స్ట్రోక్కు గురవుతున్నారు. అయితే దురదృష్టవశాత్తు కేవలం వంద మందికి లోపే టీపీఏ చికిత్స తీసుకోగలుగుతున్నారు. అందులోనూ 80 శాతంమందికి పైగా కేవలం హైదరాబాద్లోనే ఈ చికిత్స పొందగలుగుతున్నారు. ఇక మిగతా ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతిలో అడపాదడపా మాత్రమే ఈ చికిత్స అందుతోంది. దీనికి ప్రధాన కారణం బ్రెయిన్స్ట్రోక్కు ఇవ్వాల్సిన ఈ చికిత్సపై పెద్దగా అవగాహన లేకపోవడమే. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి చీఫ్ న్యూరోఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
అక్షర శిఖరం అస్తమయం
అనారోగ్యంతో కన్నుమూసినరావూరి భరద్వాజ రచనల్లో కష్టజీవులకు పట్టం క ట్టిన అక్షర తపస్వి జ్ఞాన్పీఠ్ సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు నేడు హైదరాబాద్లో అంత్యక్రియలు జగ న్మోహన్రెడ్డి సహా పలువురు ప్రముఖుల సంతాపం సాక్షి, హైదరాబాద్: అక్షర కర్షకుడి శ్వాస ఆగిపోయింది. అట్టడుగు బతుకులను సాహిత్యమయం చేసిన అపురూప కలం నిలిచిపోయింది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ(87) ఇకలేరు. శుక్రవారం రాత్రి ఇక్కడి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో ఆయన తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. మధుమేహం, అధిక రక్తపోటు, మెడవద్ద ఫ్య్రాక్చర్, గుండె, కిడ్నీల వైఫల్యం, కడుపులో ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రావూరి రాత్రి 8.35 గంటలకు మృతిచెందారు. ఈ నెల 14న ఆస్పత్రిలో చేరిన ఆయనను ఐదు రోజులు ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచారు. రావూరికి నలుగురు కుమారులు రవీంద్రనాథ్, గోపీచంద్, బాలాజీ, కోటీశ్వరరావు ఉన్నారు. కుమార్తె పద్మావతి ఇటీవలే మృతి చెందారు. సతీమణి కాంతం 1986లోనే కన్నుమూశారు. రావూరి కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేసి, భౌతిక కాయాన్ని విజయనగర్ కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. శనివారం మధ్యాహ్నం 12గంటలకు హుమాయూన్ నగర్లోని దేవునికుంట హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జీవనయానం దేశ సాహిత్యరంగంలో అత్యున్నత పురస్కారమైన ‘జ్ఞానపీఠ్’ వరించిన ఆరు నెలలకే రావూరి కన్నుమూయడం పాఠకులను కలచివేసింది. రచనే శ్వాసగా జీవించిన రావూరి 1927 జూలై 5న కృష్ణాజిల్లా నందిగామ తాలూకా మొగులూరులో జన్మించారు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. ఆయనపై ప్రముఖ రచయిత చలం ప్రభావం ఎక్కువగా ఉండేది. రావూరి రెండవ ప్రపంచ యుద్ధంలో టెక్నీషియన్గా పని చేశారు. కడుపు నింపుకోవడానికి ఫ్యాక్టరీల్లో, ప్రింటింగ్ ప్రెస్సుల్లో కూలిపని చేశారు. స్వాతంత్య్రానికి ముందు ‘జమీన్రైతు’ పత్రికలో పాత్రికేయుడిగా చేరారు. 1959లో ఆల్ ఇండియా రేడియాలో స్క్రిప్ట్ రైటర్గా చేరి 1987లో ఆ సంస్థలోనే పదవీ విరమణ చేశారు. అక్షరయానం రావూరి చిన్నప్పుడే చదువు మానేసినా జీవితాన్ని మాత్రం జీవితాంతం వరకు చదివారు. కుగ్రామంలో జన్మించిన ఆ అక్షర తపస్వి లైబ్రరీల్లో జ్ఞానదాహాన్ని తీర్చుకున్నారు. పస్తులు, ఆణాకానీ ఉద్యోగాల మధ్యే రచయితగా అడుగులు వేశారు. తన చుట్టూ ఉన్న పీడిత ప్రజల కష్టనష్టాలను అక్షరాలకెక్కిం చారు. నవలలు, కథలు, పిల్లల కథలు విస్తృతంగా రాశారు. 140కిపైగా రచనలు చేశారు. వీటిలో 43 కథాసంపుటాలు, 19 నవలలు, 7 నవలికలు ఉన్నాయి. కాయకష్టం చేసుకునే మూమూలు మనుషుల జీవితాలను ఆర్ద్రంగా కళ్లకు కట్టిన ‘జీవన సమరం’ రావూరి కలం సత్తా ఏంటో చాటింది. దీనికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అ వార్డు దక్కింది. సినీ జీవితంలోని చీకటి వెలుగులను అద్భుతంగా చిత్రిం చిన ‘పాకుడురాళ్లు’, ‘కాదంబరి’ తదితర రచనలు ఆయనకు పేరు ప్రఖ్యాతులను తెచ్చా యి. 2012 ఏడాదిగాను పాకుడురాళ్లు నవలను జ్ఞానపీఠ్ పురస్కారం వరిం చింది. విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్ సి.నారాయణరె డ్డిల తర్వాత ఈ పురస్కారాన్ని అందుకున్న తెలుగు రచయిత రావూరే. రావూరి ఇటీవల ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్నారు. రావూరిని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ, నాగార్జున వర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. గవర్నర్, సీఎం, బొత్స సంతాపాలు రావూరి మృతికి గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సంతాపం తెలిపారు. రావూరి మరణం సమాజానికి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, డీకే ఆరుణ , టీడీపీ అధినేత చంద్రబాబు, మండలి బుద్ధ ప్రసాద్, విద్యావేత్త చుక్కా రామయ్య, డాక్టర్ సీ నారాయణరెడ్డి, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు తదితరులు కూడా జోహార్లు అర్పించారు. ఆయన రచన మట్టి పరిమళం: జగన్మోహన్రెడ్డి అక్షర దిగ్గజం రావూరి భరద్వాజ మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశ సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ రావూరి ఇంటి తలుపుతట్టిన ఆరు నెలలకే ఆయన దైవంలో ఐక్యం అయ్యారని సంతాప సందేశంలో పేర్కొన్నారు. ‘రావూరి అక్షరం.. వాన చినుకు మట్టిబెడ్డను తాకితే ఆ మట్టి వెదజల్లే పరిమళం. ఆయన రచ న అధోజగత్తు గుండె చప్పుడు. ఆయనకు రచన ఒక వ్యాపకం కాదు, దీక్ష. ఆయన జీవితం నిష్టతో కూడిన సందేశం. జ్ఞానపీఠ్ను స్వీకరించిన కొద్ది రోజులకే ఆయన భౌతికంగా కనుమరుగవడం బాధాకరం. రావూరి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన కుటుంబానికి సానుభూతిని తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. -
మోపిదేవిని పరామర్శించిన జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావును పరామర్శించారు. మోపిదేవి అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జగన్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పలుకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కుటుంబీకులతో కూడా జగన్ మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ సలహాదారు సి.సి.రెడ్డిని కూడా పరామర్శించారు. మంగళగిరికి చెందిన పార్టీ నేత మున్నంగి గోపిరెడ్డి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తల్లి ఎన్.ధనమ్మ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని వారి వద్దకు కూడా జగన్ వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించి త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జగన్ను చూడటానికి పెద్ద ఎత్తున జనం తోసుకొచ్చారు. చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి కోసం వచ్చిన సందర్శకులు జగన్తో కరచాలనం చేయడానికి, పలుకరించడానికి పోటీలుపడ్డారు. పలువురు రోగులు తమ కష్టాలను జగన్తో చెప్పుకున్నారు. జగన్వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, బొబ్బిలి రంగారావు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్లు కూడా మోపిదేవి, గోపిరెడ్డిలను పరామర్శించారు. -
మోపిదేవి వెంకటరమణను పరామర్శించిన జగన్
-
కేర్ ఆస్పత్రిలో మోపిదేవికి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: చంచల్గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను పోలీసులు సోమవారం బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులుగా ఆయన తీవ్ర వెనునొప్పి, అధిక రక్తపోటుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రెండు వారాల క్రితం ఆయనకు కేర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికలను అందజేశారు. ఈ క్రమంలో మోపిదేవి ఆరోగ్య పరిస్థితిపై వైద్య నివేదికలను సమీక్షించేందుకు ఆయనను కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం తిరిగి జైలుకు తరలించారు.