-
పాల కల్తీకి చెక్
సాక్షి, అమరావతి: వినియోగ దారులకు నాణ్యమైన, సురక్షితమైన పాలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం రాష్ట్రంలో సహకార పాలడెయిరీల్లో డెన్మార్క్ టెక్నాలజీతో కూడిన అత్యాధునిక మిల్క్ ఎనలైజర్స్ను ఏర్పాటు చేయనుంది. పాలల్లో ఉండే కొవ్వు, ఘనపదార్థాలు, నీళ్ల శాతమే కాదు.. ఆరోగ్యానికి హాని చేసే ఎలాంటి కల్తీ పదార్థాలనైనా పసిగట్టే అవకాశం రానుంది. రోజుకు 4.22కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి.. రాష్ట్రంలో 27లక్షల రైతుకుటుంబాల వద్ద 46లక్షల ఆవులు, 62లక్షల గేదెలున్నాయి. వాటి ద్వారా రోజుకు 4.22 కోట్ల లీటర్ల పాలఉత్పత్తి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.34 కోట్ల లీటర్ల పాల వినియోగమవుతుండగా, 2.88 కోట్ల లీటర్లు మార్కెట్కు వస్తున్నాయి. దాంట్లో 21.7 లక్షల లీటర్ల పాలను సహకార పాల డెయిరీలు సేకరిస్తుండగా, 47.5 లక్షల లీటర్ల పాలను ప్రైవేటు డెయిరీలు సేకరిస్తున్నాయి. 2.19 కోట్ల లీటర్లు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద మార్కెట్కు వస్తున్నాయి. పాలల్లో ప్రధానంగా కొవ్వు పదార్థాలు 4 శాతం, పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్స్) 4.7 శాతం, మాంసకృత్తులు(ప్రొటీన్స్) 3.3 శాతం, నీరు 88 శాతం ఉంటాయి. ఆవు పాలల్లో 69 కిలో కేలరీలు, గేదె పాలల్లో 100 కిలో కేలరీల శక్తి ఉంటుంది. ప్రధానంగా గేదె పాలల్లో కొవ్వు 5.5శాతం, ఎస్ఎన్ఎఫ్ (ఘనపదార్థాలు) 8.7 శాతం, ఆవు పాలల్లో కొవ్వు 3.2 శాతం, ఎస్ఎన్ఎఫ్ 8.3 శాతం ఉంటే మంచి పోషక విలువలున్న పాలుగా పరిగణిస్తారు. కల్తీ లేని పాల సరఫరాయే లక్ష్యం ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే పాలల్లో స్వచ్ఛత ఎంతన్నది ప్రశ్నార్ధకంగా మారింది. రంగు, రుచి, చిక్కదనం కోల్పోకుండా ఉండేందుకు పాలల్లో వివిధ రకాల రసాయనాలను కలిపి కల్తీకి పాల్పడుతుంటారు. మరికొంతమంది రసాయనాలతో కృత్రిమ పాలను తయారు చేస్తుంటారు. పాలల్లో ప్రధానంగా అమ్మోనియం సల్ఫేట్, డిటర్జెంట్, గ్లూకోజ్, మాల్టోస్, మెలమైన్, ఉప్పు, సోడియం కార్బోనేట్, సోడియం సిట్రేట్, సార్బిటాల్, స్టార్చ్, సుక్రోజ్, యూరియా, వెజిటబుల్ ఆయిల్, ఫార్మాల్డిహైడ్ వంటి కల్తీ పదార్థాలను వాడుతుంటారు. ప్రస్తుతం పాలకేంద్రాల్లో ఉండే మిషనరీ ద్వారా పాలల్లో కొవ్వు, ఘనపదార్థాలు, నీటి శాతాన్ని మాత్రమే గుర్తించగలుగుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ లేబొరేటరీల బలోపేతం ప్రభుత్వ డెయిరీల్లో క్వాలిటీ కంట్రోల్ లేబొరేటరీలను బలోపేతం చేయడం ద్వారా కల్తీ పాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని రాజమండ్రి, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార పాలడెయిరీల్లో హై ఎండ్ ఎక్విప్మెంట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కొక్కటి రూ.84లక్షల అంచనా వ్యయంతో పోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ఫ్రారెడ్ (ఎఫ్టీఐఆర్) టెక్నాలజీ కలిగిన మిల్క్ ఎనలైజర్స్ (మిల్క్ స్కానర్స్)ను ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.5.44 కోట్లు ఖర్చు చేసింది. వీటిద్వారా కొవ్వు, ప్రొటీన్స్, లాక్టోస్, ఘన పదార్థాలు, ఎస్ఎన్ఎఫ్ వంటి వాటితో పాటు 24 పారామీటర్స్లో కల్తీ పదార్థాలుగా గుర్తించిన వాటి శాతాన్ని కూడా పసిగడుతుంది.కాగా, పాలసేకరణ, రవాణాలో విస్తృత తనిఖీలు చేపట్టేందుకు వీలుగా పశుసంవర్ధక శాఖాధికారులకు అధికారాలిచ్చారు. ప్రతివారం ఆకస్మిక తనిఖీలు చేస్తూ పాల శాంపిల్స్ను సేకరించి మిల్క్ ఎనలైజర్స్ ద్వారా కల్తీని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. -
హెరిటేజ్ మేనేజర్ కల్తీ దందా
దెందులూరు: వెన్నశాతం పెరిగేందుకు పాలను కల్తీ చేస్తున్న ఉదంతమిది. హెరిటేజ్ కంపెనీ మేనేజర్ మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు పాల్పడుతుండడం గమనార్హం. పాలల్లో వెన్నశాతం పెరిగేందుకు సన్ఫ్లవర్ ఆయిల్, యూరియా తదితర వస్తువులను కలుపుతున్నారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తతంగానికి దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామం వేదికైంది. శనివారం దెందులూరు పోలీస్స్టేషన్లో భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. హెరిటేజ్ కంపెనీ (సూరప్పగూడెం) యూనిట్ మేనేజర్ మంగారావు, దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుత్తుల హరిమీరారావు సహకారంతో పాలకల్తీకి తెరతీశారన్నారు. విషయం తెలుసుకున్న దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి, దెందులూరు కానిస్టేబుళ్లు కొత్తపల్లి గ్రామంలో పాలకల్తీ జరుగుతున్న గుత్తుల హరిమీరారావు ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారన్నారు. కల్తీ పాలు ఎంతకాలం నుంచి జరుగుతుంది, ఏయే కంపెనీలకు సరఫరా చేస్తున్నారు, ఎంతమేర కల్తీ జరుగుతుంది, సూత్రదారులు, పాత్రదారులు ఎవరు, ఆర్థిక సహకారం ఎవరందిస్తున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. సంఘటనా స్థలంలో యూరియా, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు, కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడు గుత్తుల హరిమీరారావును అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. -
పాలకేంద్రం ముసుగులో కల్తీపాలు
ప్రకాశం, గుడ్లూరు: పాల కేంద్రం ముసుగులో కల్తీపాలు తయారు చేసి అమ్ముకుంటూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న యువకుడిని ఎస్ఐ సంపత్కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగూర్మీరా గురువారం వలపన్ని పట్టుకున్నారు. అనంతరం నిందితుడి నుంచి కల్తీ పాల పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో కలకలం రేపుతున్న ఈ సంఘటన రావూరులో వెలుగు చూసింది. ఎస్ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మిరియం ప్రభాకర్ పాలకేంద్రం నడుపుతున్నాడు. డబ్బులు ఎక్కువ సంపాదించాలనే అత్యాశతో ఆరు నెలలు నుంచి ఇంట్లో కల్తీపాలు తయారు చేయడం ప్రారంభించాడు. కల్తీ పాలు తయారీకి అవసరమైన పాలపొడి, నూనె ప్యాకెట్లు, యూరియా, ఉప్పు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పశుపోషకుల వద్ద 30 లీటర్లు మంచి పాలు కొనుగోలు చేసి వాటికి తగిన మోతాదులో పాలపొడి, ఉప్పు, యూరియా, నూనె, నీళ్లు కలిపి 100 లీటర్లు చేస్తాడు. ఆ కల్తీపాలు కావలిలోని స్వీట్ దుకాణాలు, టీ షాపులకు సరఫరా చేస్తున్నాడు. ఇలా రోజుకు 200 లీటర్ల కల్తీపాలు తయారు చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు. కల్తీపాలు తయారీ సమచారం అందుకున్న ఎస్ఐ సంపత్కుమార్.. విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగూర్మీరాకు చేరవేశారు. అనంతరం ఇద్దరూ తమ సిబ్బందితో కలిసి రావూరులో ప్రభాకర్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో నిల్వ ఉంచిన 200 లీటర్ల కల్తీపాలు, 11 బస్తాల పాలపొడి, 250 ప్యాకెట్ల ప్రీఢం సన్ప్లవర్ ఆయిల్, యూరియా బస్తాలు, వేయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్కు తరలించారు. ఫుడ్ఇన్స్పెక్టర్ నాగూర్మీరా మాట్లాడుతూ కల్తీపాలను ప్రమాదకర కెమికల్స్ను ఉపయోగించి తయారు చేస్తే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కల్తీ పాలు ఉపయోగిస్తే కా>్యన్సర్తో పాటు ఊపిరి తిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కల్తీపాలు గృహాలకు కాకుండా స్వీట్, టి. దుకాణాలకు మాత్రమే సరఫరా చేయడంతో వారు పెద్దగా తనిఖీలు చేయరని భావించి ప్రభాకర్ ఈ మార్గాన్ని ప్రభాకర్ ఎన్నుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎస్ఐ, ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు రైటర్ డానియేలు, పోలీస్ సిబ్బంది ఖాదర్బాషా, కృష్ణ, శ్రీనివాసులు ఉన్నారు. -
కల్తీ పాల వ్యవహారంపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: కల్తీ పాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ‘పాలు కాదు.. పచ్చి విషం’శీర్షికతో సాక్షి పత్రికలో గత ఏడాది డిసెంబర్ 12న ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా (పిల్) పరిగణనలోకి తీసుకుంది. సాక్షి కథనాన్ని చదివిన నల్లగొండకు చెందిన పాఠకుడు కె.నర్సింహారావు లేఖ రూపంలో కల్తీ విషయాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. కాగా, ఈ వ్యాజ్యంలో పశు సంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి, డెయిరీ డెవలప్మెంట్ లిమిటెడ్ ఎండీ, ఫుడ్ సేఫ్టీ లేబొరేటరీ చీఫ్ పబ్లిక్ అనలిస్ట్ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 30న ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ గ్రేటర్ హైదరాబాద్లో సాక్షి బృందం పర్యటించి పలు కంపెనీల పాల ప్యాకెట్ల శాంపిల్స్ను సేకరించింది. వాటిని నాచారంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆహార పరీక్షా కేంద్రంలో పరీక్షలు చేయించింది. ఈ పాలు హానికరమని, ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలను పాలల్లో కలుపుతున్నారని పరీక్షల్లో తేలింది. ‘ఇలాంటి పాలను వినియోగిస్తే టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటరైటిస్.. వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉంది’అని సాక్షి కథనంలో వచ్చిన అంశాలను పిటిషనర్ తన లేఖలో పేర్కొన్నారు. -
హైదరాబాద్ లో కల్తీపాల కేంద్రాలు
- దాడులు నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్: నగరంలోని జవహర్నగర్ పీఎస్ పరిధిలోని యాప్రాల్లో కల్తీ పాలకేంద్రంపై సోమవారం ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కల్తీ పాలు తయారు చేస్తున్న ఒకరిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 80 లీటర్ల పాలు, 3 పాల ప్యాకెట్లు, ఖాళీ పాల ప్యాకెట్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
Advertisement