16కు చేరిన మరణాల సంఖ్య
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో గత నెలలో చోటు చేసుకున్న కల్తీ పాల ఘటనలో శుక్రవారం మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కడలి కృష్ణారావు (75), డెల్టా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెడ్డి అనంతలక్ష్మి (55) పరిస్థితి విషమించి మరణించారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. ఇంకా ఐదుగురు అత్యవసర చికిత్స పొందుతున్నారు.


