
దానా తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు వెళ్లే 86 రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు ఇరుక్కుపోయి నానా తిప్పలు పడుతున్నారు

స్టేషన్ ప్లాట్ఫారాలు, వెయిటింగ్ హాల్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, టికెట్ కౌంటర్ ప్రాంగణాలన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి

కొన్ని రైళ్లు మాత్రమే నడుస్తుండడంతో వాటి కోసం ప్రయాణికులు ఎగబడుతున్నారు. జనరల్, రిజర్వేషన్ అన్న తేడా లేకుండా అన్ని బోగీలు ప్రయాణికులతో నిండిపోతున్నాయి

చివరికి వాష్రూమ్లు కూడా ఖాళీగా లేవు. ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే తాపత్రయంతో ప్రజలు ఈ పరిస్థితుల్లోనూ ప్రయాణిస్తున్నారు

ఫొటోలు: సాక్షిఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
















