ప్రపంచకప్‌ విజేతలకు ఘన స్వాగతం

India U-19 World Cup winning team returns to grand reception - Sakshi

సాక్షి, ముంబై : న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీలో అదరగొట్టి ట్రోఫీని సొంత చేసుకున్న భారత కుర్రాళ్లు సోమవారం స్వదేశానికి చేరారు. వీరికి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పృ‍థ్వీషా నేతృత్వంలోని యువ జట్టు భారత్‌కు నాలుగోటైటిల్‌ అందించిన విషయం తెలిసిందే. యువ క్రికెటర్లకు  స్వాగతం పలికేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ముంబై అంతర్జాతీయ విమానం కిక్కిరిసిపోయింది.

ఈ సందర్భంగా ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సమిష్టి కృషి వల్లే ప్రపంచకప్‌ సాధించామన్నారు. అందరూ బాగా రాణించడంతో మా కష్టానికి ఫలితం దక్కిందని, యువ క్రికెటర్లకు మంచి భవిష్యత్‌ ఉందని కితాబిచ్చారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top