రియాద్‌ జైలులో 300 మంది భారతీయులు | 300 members in riyad jail | Sakshi
Sakshi News home page

రియాద్‌ జైలులో 300 మంది భారతీయులు

Aug 2 2016 12:02 AM | Updated on Sep 4 2017 7:22 AM

రాయికల్‌ : సౌదీలోని ఆర్థికమాద్యం తీవ్రంగా ఉండటంతో అక్కడి పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. సౌదీలోని రియాద్, జెద్ద, దమామ్, వంటి ప్రాంతాల్లో ఎక్కువగా సోదాలు న్విహిస్తున్నారు. అకామ (వర్క్‌ పర్మిట్‌) గడువు ముగిసిన కార్మికులు కన్పిస్తే జైలులో పెడుతున్నారు. రియాద్‌ జైలులో 300 మంది భారతీయులుండగా వారిలో 100 మంది తెలంగాణవాదులు ఉన్నారు.

  • 100 తెలంగాణవాదులు
  • రెండు నెలలుగా నరకయాతన
  • ప్రభుత్వం పట్టించుకోని ప్రభుత్వాలు
  • రాయికల్‌ : సౌదీలోని ఆర్థికమాద్యం తీవ్రంగా ఉండటంతో అక్కడి పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. సౌదీలోని రియాద్, జెద్ద, దమామ్, వంటి ప్రాంతాల్లో ఎక్కువగా సోదాలు న్విహిస్తున్నారు. అకామ (వర్క్‌ పర్మిట్‌) గడువు ముగిసిన కార్మికులు కన్పిస్తే జైలులో పెడుతున్నారు. రియాద్‌ జైలులో 300 మంది భారతీయులుండగా వారిలో 100 మంది తెలంగాణవాదులు ఉన్నారు. రెండు నెలలు గడుస్తున్నప్పటికీ వీరిగురించి పట్టించుకునే నాథుడే లేకపోయాడు. ఒకే గదిలో 300 మందిని ఉంచడంతోపాటు భోజనం సరిగా లేకపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా భారత ఎంబసీ అధికారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జైలులో ఉంటున్న కార్మికులను విడిపించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
    సౌదీలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభంతో జెద్దలోని పలు కంపెనీల నుంచి 10 వేల మంది భారతీయులను ఉద్యోగం నుంచి నిర్ధాక్షిణ్యంగా తొలగించడంతోపాటు ఆయా కంపెనీలకు చెందిన కార్మికులకు సుమారు ఏడు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు వారి పాస్‌పోర్టులు కంపెనీ యజమానుల వద్ద ఉండటంతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కనీసం తినడానికి తిండి ఉండడానికి నివాసం కూడా లేకపోవడంతో ఆరుబయటనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల విదేశాంగ మంత్రి సుశ్మాస్వరాజ్‌ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన విదేశాంగ మంత్రి సౌదీలోని కార్మికులకు భోజన వసతి కల్పించడంతో పాటు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సోమవారం భారత ఎంబసి అధికారులు కార్మికులకు భోజన వసతి సైతం కల్పించి క్యాంపులో భారత కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఏఏ రాష్ట్రాలకు చెందిన వారు ఏఏ కంపెనీల్లో పనిచేస్తున్నారు, ఎన్ని వేల వేతనాలు కావాలనే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ఈ నివేదికను కేంద్ర విదేశాంగ మంత్రితో పాటు సౌదీ అధికారులతో చర్చించారు. కార్మికులకు స్వదేశానికి తీసుకువచ్చేలా భారతప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ అక్కడి భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే.సింగ్‌ను పంపించడంతో పాటు ఎప్పటికప్పుడు సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement