లేడీస్‌ హాస్టల్లో విద్యార్థినీల ఆందోళన | Students Agitation In Vishwodaya Engineering College Ladies Hostel | Sakshi
Sakshi News home page

లేడీస్‌ హాస్టల్లో విద్యార్థినీల ఆందోళన

Aug 1 2018 12:25 PM | Updated on Jul 11 2019 6:33 PM

Students Agitation In Vishwodaya Engineering College Ladies Hostel - Sakshi

వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆందోళన నిర్వహించారు.

కావలి : నెల్లూరు జిల్లా కావలిలోని విశ్వోదయ ఇంజనీరింగ్‌ కళాశాల లేడీస్‌ హాస్టల్లో విద్యార్థినీలు బుధవారం ఆందోళనకు దిగారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆందోళన నిర్వహించారు. వారం రోజులుగా మేనేజ్‌మెంట్‌కు తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి మీడియా కళాశాల దగ్గరకు వివరణ కోరేందుకు వెళ్లగా యాజమాన్యం అడ్డుకుంది. కళాశాలలోకి రాకుండా గేట్లు వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement