-
ఆందోళనలు, అరెస్టులు
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అరెస్ట్ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, ఢిల్లీ రాష్ట్ర మంత్రులు బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు, నిరసనలతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో ఆందోళనకు దిగిన ఆప్ నేతలను పోలీసులు అరెస్ట్చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆప్, బీజేపీ ప్రధాన కార్యాలయాలు ఉన్న పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ సమీప ఐటీఓ ఇంటర్సెక్షన్ కూడలి వద్దకు ఆప్ నేతలు, కార్యకర్తల పెద్ద సంఖ్యలో చేరుకుని మోదీ సర్కార్ వ్యతిరేక నినాదాలు చేశారు. ‘అరవింద్ మీరు సంఘర్షణను కొనసాగించండి. మేం మీకు తోడుగా ఉంటాం’ అని నినదించారు. ట్రాఫిక్ స్తంభించడంతో ధర్నాకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నంచేశారు. అక్కడే ఆందోళనకు దిగిన ఢిల్లీ రాష్ట్ర మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లో వేరే చోట్లకు తరలించారు. దీంతో తమ నేతలను విడుదలచేయాలంటూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలుచేశారు. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు పారామిలటరీ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ను విధించారు. ఐటీవో స్టేషన్ను సాయంత్రందాకా ఢిల్లీ మెట్రో రైల్ మూసేసింది. ఈడీ ప్రధాన కార్యాలయం, బీజేపీ ఆఫీస్ల వద్ద భారీగా బలగాలను మొహరించారు. ‘‘తప్పుడు కేసులతో నిన్న సీఎంను అరెస్ట్చేశారు. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే’’ అంటూ మంత్రులు ఆతిశీ, సౌరభ్ మండిపడ్డారు. కస్టడీలో కేజ్రీవాల్కు రక్షణేది: ఆతిషి ధర్నాకు ముందు మంత్రి ఆతిషి పత్రికాసమావేశంలో మాట్లాడారు. ‘‘సీఎం హోదాలో కేజ్రీవాల్ చుట్టూ నిరంతరం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు ఈడీ కస్టడీలో కేంద్రం ఆయనకు అంతటి భద్రత కల్పిస్తోందా? ఆయన భద్రతకు జవాబుదారీ ఎవరు? ఈడీ ఆఫీస్ లాకప్లోకి ఎవరెవరు వస్తున్నారు? అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లపై కేంద్రం ప్రకటన చేయాలి’ అని ఆతిషి డిమాండ్ చేశారు. -
కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. పార్టీ పిలుపుమేరకు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల ప్రధాని మోదీ దిష్టి బొమ్మల దహనం, రాస్తారోకోలు, ధర్నాలతో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు నిరసన తెలిపాయి. ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల శనివారం తెల్లవారుజాము నుంచే పార్టీ ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్తో పాటు సిరిసిల్ల, సిద్దిపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వనపర్తి, నల్లగొండ తదితర చోట్ల నిరసనలు మి న్నంటాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ ఆగ్ర హం వ్యక్తంచేసింది. లోకసభఎన్నికల ముందు బీఆర్ ఎస్ను మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచనతో కుట్ర పన్నుతున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నిరసనలో అపశృతి సిరిసిల్ల: కవిత అరెస్ట్ను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో శనివారం చేపట్టిన ధర్నాలో భాగంగా ప్రధాని మోదీ ఫ్లెక్సీపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఈ క్రమంలో కోడం సాయి (30) అనే యువకుడికి మంటలంటుకున్నాయి. వెంటనే మంటలార్పి అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇదే ఆందోళన కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మహిళా ఎంపీపీలు పరస్పరం ఘర్షణపడి ఒకరినొకరు కొట్టుకోబోయారు. నేతలు వారిని వారించారు. -
Parliament security breach: భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: లోక్సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి పొగపెట్టిన ఘటనను తీవ్రమైన అంశంగా ప్రధాని మోదీ ఆదివారం అభివరి్ణంచారు. గత బుధవారం జరిగిన ఈ ఘటనపై ఓ హిందీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తొలిసారిగా స్పందించారు. ‘‘పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశమే. ఈ ఘటన నన్నెంతగానో బాధించింది. దీనిపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు చేస్తూ అనవసర వాదులాటకు దిగడం వ్యర్థం. ఈ చొరబాటు వెనుక ఉన్న శక్తుల గుట్టుమట్లు బయటపెడతాం. ఇవి పునరావృతం కాకుండా ఉమ్మడిగా పరిష్కారం కనుగొందాం’’ అని సూచించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లలో ముఖ్యమంత్రులైన వారు కొత్తవాళ్లు కాదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. సుప్రీంకోర్టు నేపథ్యంలో 370ను ఎవరూ ఎప్పటికీ తిరిగి అమల్లోకి తేలేరన్నారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేయబోతోంది. ఇకనైనా విపక్ష పారీ్టలు తమను ప్రజలు ఎందుకు గెలిపించట్లేదనే ఆత్మావలోకనం చేసుకుంటే మంచిది’ అని సూచించారు. ప్రధాని పారిపోతున్నారు: కాంగ్రెస్ లోక్సభలో భద్రతా వైఫల్యంపై చర్చించకుండా ప్రధాని పారిపోతున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిందితులకు లోక్సభలోకి పాస్లిచ్చింది బీజేపీ ఎంపీ కావడమే ఇందుకు కారణమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. కాలిన ఫోన్లు స్వా«దీనం లోక్సభలో కలకలం ఘటనలో నిందితుల తాలూకు కాలిన ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఘటన సూత్రధారి లలిత్ ఝా బసచేసిన రాజస్తాన్లోని నాగౌర్లో అవి లభించాయి. వాటిని కాల్చేయడంతో సాక్ష్యాధారాల ధ్వంసం సెక్షన్లను ఎఫ్ఐఆర్కు జతచేశారు. ఈ ఘటనలో సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, లలిత్ ఝా, మహేశ్ కుమావత్లను అరెస్ట్ చేసి కఠిన ఉపా చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం తెలిసిందే. లోక్సభ ఛాంబర్లో మనోరంజన్, సాగర్శర్మ, పార్లమెంట్ ప్రాంగణంలో నీలం దేవి, అమోల్ షిండే పొగ గొట్టాలు విసిరి కలకలం రేపడం తెలిసిందే. సంబంధిత వీడియోలను వైరల్ చేయాలంటూ లలిత్ తన మిత్రుడు సౌరవ్కు పంపాడు. తర్వాత రాజస్థాన్లోని నాగౌర్లో తమ ఫోన్లను తగలబెట్టాడు. ఢిల్లీ వచ్చి లొంగిపోయాడు. -
కాంగ్రెస్కు అసంతృప్తుల కాక
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మూడో జాబితాపై కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. జాబితాలో పేర్లు లేని ఆశావహులు, వారి అనుచరులు ఆందోళనలు చేపట్టారు. అటు గాంధీభవన్, ఇటు రేవంత్రెడ్డి నివాసం వద్ద ఈ ఆందోళనలు జరిగాయి. జి చిన్నారెడ్డి (వనపర్తి), సంజీవరెడ్డి (నారాయణఖేడ్), కాట శ్రీనివాస్గౌడ్ (పటాన్చెరు), బెల్లయ్య నాయక్ (డోర్నకల్), మానవతా రాయ్ (సత్తుపల్లి)లు తమ అనుచరులతో కలిసి, వ్యక్తిగతంగా తమ నిరసనలు పార్టీ అధిష్టానానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గాం«దీభవన్లోని ప్రధాన గేటులో ఒకదానికి తాళం వేయగా, జూబ్లీహిల్స్లో రేవంత్ నివాసానికి వెళ్లే నాలుగువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. చిన్నారెడ్డి అనుచరుల నిరసన వనపర్తి టికెట్ ఆశించిన చిన్నారెడ్డి అనుచరులు ఉదయం రేవంత్ ఇంటివద్ద ఆందోళనకు దిగారు. తమ నాయకుడికి ఇచ్చిన టికెట్ను మార్చి ఇతరులకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వినతిపత్రం సమర్పించారు. రేవంత్ మాట్లాడుతూ చిన్నారెడ్డి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి గాందీభవన్కు చేరుకున్న చిన్నారెడ్డి అనుచరులు మెట్లపై కూర్చొని తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో చిన్నారెడ్డి జోక్యం చేసుకొని వారిని వారించారు. ఇలావుండగా వనపర్తి టికెట్ దక్కించుకున్న మేఘారెడ్డికి బీ ఫాం అందింది. మంగళవారం గాందీభవన్లో మేఘారెడ్డి సోదరుడు మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్కుమార్ రెడ్డి బీ ఫాం అందజేశారు. కాట వర్గీయుల మండిపాటు పటాన్చెరు టికెట్ ఆశించిన కాట శ్రీనివాస్గౌడ్ అనుచరులు సోమవారం అర్ధరాత్రే స్థానికంగా నిరసనలకు దిగారు. పార్టీ జెండాలను దహనం చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్లో రేవంత్రెడ్డి ఇంటిని, గాం«దీభవన్ను ముట్టడించారు. రేవంత్ ఆలంపూర్ పర్యటనకు వెళ్లిన తర్వాత ఆయన నివాసం వద్దకు వచ్చిన శ్రీనివాస్గౌడ్, అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీలో కొత్తగా చేరిన నీలం మధుకు టికెట్ ఎలా ఇస్తారంటూ లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకొని వారిని అక్కడి నుంచి పంపించారు. అనంతరం వారు గాందీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. పారాచూట్లకు టికెట్లు అమ్ముకున్నారంటూ రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు రామచంద్రాపురంలోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పటాన్చెరు టికెట్ను అమ్ముకున్నారని ఆరోపించారు. అధినాయకత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో శ్రీనివాస్గౌడ్కు ఫోన్ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ టికెట్ విషయంలో భరోసా ఆందోళన విరమించారు. కాగా నారాయణఖేడ్ టికెట్ ఆశించి భంగపడిన సంజీవరెడ్డి అనుచరులు కూడా గాందీభవన్ వేదికగా ఆందోళనకు దిగారు. ఖేడ్లోనూ నిరసన వ్యక్తం చేశారు. టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్యకూ వెనుకాడను తెలంగాణ కాంగ్రెస్ ఎస్టీ విభాగం చైర్మన్గా ఉన్న తనకు టికెట్ కేటాయించకపోవడంపై బెల్లయ్య నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్, డోర్నకల్లలో ఎక్కడా టికెట్ ఇవ్వకుండా మోసం చేశారంటూ గాంధీ బొమ్మ ఎదుట దీక్షకు దిగారు. తనకు అవకాశం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడనని హెచ్చరించడంతో పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. బరిలోకి దిగేది ఖాయం: మానవతారాయ్ సత్తుపల్లి విషయంలో నిర్ణయాన్ని 24 గంటల్లోగా మార్చుకొని తనకు పార్టీ బీఫాం ఇవ్వకపోతే 9, 10 తేదీల్లో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఓయూ విద్యార్థి నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కె మానవతారాయ్ హెచ్చరించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొంటూ రేవంత్రెడ్డికి లేఖ రాశారు. భీం భరత్కు ఎట్టకేలకు బీ ఫాం చేవెళ్ల టికెట్ను భీం భరత్కు ఇస్తామని ప్రకటించిన అధిష్టానం బీ ఫాం మాత్రం ఇవ్వలేదు. దీంతో రెండు మూడురోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఆయన మంగళవారం పార్టీ పెద్దలను కలిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే బీఫాం అందజేయడతో గందరగోళానికి తెరపడింది. దామోదర వర్సెస్ జగ్గారెడ్డి మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి మధ్య విభేదాలు పొడ చూపాయి. పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ నీలం మధు ముదిరాజ్కు దక్కడంలో తన ప్రమేయం ఉందంటూ కాట శ్రీనివాస్గౌడ్ కుటుంబ సభ్యులతో రాజనర్సింహ తనను బద్నాం చేయిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని, దమ్ముంటే రాజకీయంగా తేల్చుకోవాలే తప్ప వ్యక్తిగతంగా డ్యామేజీ చేసేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. మరోవైపు తన అనుచరులు కాట శ్రీనివాస్గౌడ్, సంజీవరెడ్డిలకు టికెట్లు దక్కకపోవడంపై రాజనర్సింహ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తన నియోజకవర్గం మునిపల్లి మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. -
‘నీట్’ నుంచి మినహాయించేదాకా ఉద్యమిస్తాం
చెన్నై: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) నుంచి తమిళనాడును మినహాయించేదాకా తమ ఉద్యమం ఆగదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేల్చిచెప్పారు. ‘నీట్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార డీఎంకే నేతృత్వంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను, ఆందోళనలు నిర్వహించారు. నిరాహార దీక్షలు సైత చేపట్టారు. నీట్ రద్దు అనేది రాజకీయపరమైన డిమాండ్ కాదని, అందిరికీ సమాన అవకాశాలు లభించాలన్నదే తమ ఉద్దేశమని స్టాలిన్ చెప్పారు. ఈ పరీక్ష నుంచి తమిళనాడు మినహాయించేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఈ ధర్నాలో పాల్గొనాలని విపక్ష ఏఐఏడీఎంకేకు స్టాలిన్ సూచించారు. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే నీట్ను తీసుకొచ్చానని ఏఐఏడీఎంకే నేత, మాజీ సీఎం పళనిస్వామి గుర్తుచేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement