పాస్టర్‌ హత్య: భూ వివాదామే కారణం.. | Police: Land Dispute Caused To Pastor Murder | Sakshi
Sakshi News home page

పాస్టర్‌ హత్య: భూ వివాదామే కారణం..

Nov 28 2019 7:10 PM | Updated on Nov 28 2019 7:15 PM

Police: Land Dispute Caused To Pastor Murder - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో జరిగిన పాస్టర్‌ సత్యనారాయణ రెడ్డి హత్య కేసును మాదాపూర్‌ పోలీసులు చేధించారు. అనంతపురంలో చర్చి నిర్వహిస్తున్న పాస్టర్‌ సత్యనారాయణ ఈ నెల 22న కొండాపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు భూ వివాదమే కారణమైనట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం మీడియా సమావేశంలో  డీసీపీ వెంకటేశ్వర్‌ రావు వెల్లడించారు. 

పోలీసుల వివరాల ప్రకారం...పాస్టర్‌ సత్యనారాయణకు మియాపూర్‌ హఫీజ్ పెట్ లో 300 గజాల స్థలం ఉంది. దీనిని హఫీజ్‌పేటకు చెందిన జమిల్‌ కబ్జా చేయడానికి ప్రయత్నించగా మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో జమిల్‌పై మూడు నెలల క్రితం సత్యనారాయణ ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై జమిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సత్యనారాయణరెడ్డిపై కక్ష పెంచుకున్న జమిల్‌ తన స్నేహితులతో కలిసి సత్యనారాయణను శుక్రవారం (నవంబర్‌ 22) హతమార్చాడు. కాగా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement