లోయలో పడిన అయ్యప్ప భక్తుల వాహనం.. | Sakshi
Sakshi News home page

లోయలో పడిన అయ్యప్ప భక్తుల వాహనం..

Published Wed, Jan 9 2019 11:00 AM

Ayyappa Devotees Car Accident At Kerala - Sakshi

తిరువనంతపురం: తమిళనాడులో జరిగిన అయ్యప్ప స్వామి భక్తుల రోడ్డు ప్రమాదం మరువక ముందే మరో ఘటన జరిగింది. అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులతో వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటన కేరళలలో చోటుచేసుకుంది . బుధవారం ఉదయం సంభవించిన ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరికొంత మంది తీవ్రంగా  గాయపడ్డారు.

వైఎస్సార్‌ కడప జిల్లా చిన్న మండెం మండలంకు చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు కృష్ణ, క్షతగాత్రులు గోపాలు, కృష్ణయ్య, వెంకటమ్మలుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడ్డవారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా తమిళనాడు చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన పదిమంది అయ్యప్పభక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement