రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి,15మందికి గాయాలు | 2 killed, 15 injured in separate road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి,15మందికి గాయాలు

Aug 8 2013 10:42 AM | Updated on Aug 30 2018 3:56 PM

రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరో 15మంది గాయపడ్డారు

హైదరాబాద్ : రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరో 15మంది గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్దులు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. డీసీఎం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

కాగా చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం పిత్తవార్లపల్లిలో ఆటో బోల్తాపడిన సంఘటనలో తొమ్మిదిమంది గాయపడ్డారు. మరో ఇద్దరి  పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement