ఉండవల్లిలో ఉద్రిక్తత.. బాబు సర్కార్‌ విధ్వంసకాండ! | Clash Between Farmers And CRDA Officials At Undavalli | Sakshi
Sakshi News home page

ఉండవల్లిలో ఉద్రిక్తత.. బాబు సర్కార్‌ విధ్వంసకాండ!

Jul 11 2026 11:24 AM | Updated on Jul 11 2026 11:41 AM

Clash Between Farmers And CRDA Officials At Undavalli

సాక్షి, గుంటూరు: ఉండవల్లిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరావతి ప్రాంతంలో బాబు సర్కార్‌ విధ్వంసకాండ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. రాజధాని పేరుతో అధికారులు బలవంతపు భూసేకరణకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా పచ్చటి పంటలను ధ్వంసం చేశారు. 

వివరాల మేరకు.. శనివారం ఉదయం సీఆర్‌డీఏ సిబ్బంది.. జేసీబీల సాయంతో తమ పంటలను ధ్వంసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. రైతులను బలవంతంగా లాక్కెళ్లారు. మహిళా రైతులు అని కూడా చూడకుండా.. పోలీసులు వారిని ఈడ్చుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ భూములను అన్యాయంగా లాక్కుంటున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. ఇక, అంతకుముందు.. సీఆర్‌డీఏ అధికారులు భూసేకరణ పేరుతో రైతుల ఇంటికే వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్లడం గమనార్హం. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement